Home Blog Page 53

జగన్- కేటీఆర్.. తెరవెనుక ఏదో జరుగుతోందబ్బా..

YS Jagan Mohan Reddy, KTR

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ఐటి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ కు ఒకరికి పరస్పరమైన అభిమానం ఉంది. దీనిని బహిరంగంగానే వారిద్దరూ వ్యక్తం చేస్తూ ఉంటారు. వారిద్దరు ఒకరు ఒకరు అత్యంత గౌరవంగా సంబోధించుకుంటూ ఉంటారు. ఒకరి గురించి మరొకరు గొప్ప విషయాలు చెప్పుకుంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. జగన్ అంత ఎత్తునుంచి బంగి జంప్ ఎలా చేశారో అర్థం కావడం లేదని.. ఈసారి కలిస్తే కచ్చితంగా అడుగుతానని అన్నారు. అంతకుముందు వీరిద్దరూ బెంగళూరులో ఆ ప్రైవేట్ కార్యక్రమంలో కలిశారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు.

వారిద్దరు కలుసుకొని మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన విషయాలను అటు నమస్తే తెలంగాణ.. ఇటు సాక్షి గొప్పగానే చెప్పుకున్నాయి. గొప్పగానే రాశాయి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. సాక్షి పేపర్ పెద్దగా నెగిటివ్ వార్తలు రాయలేదు. 2014లో గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో చేరినప్పుడు కూడా సాక్షి పెద్దగా వ్యతిరేక వార్తలు రాలేదు. జగన్ నాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారంతా కూడా గులాబీ పార్టీలోకి చేరిపోయారు. దీనికి తోడు నాడు కెసిఆర్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రగతి భవన్ వచ్చారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు. 2023లో భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టింది. కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఏపీలో పర్యటించారు. నాడు మంత్రిగా ఉన్న రోజా ఇంటికి వెళ్లారు. ఆమె పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు. నాడు కెసిఆర్ వెంట కవిత కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏపీ రాష్ట్రంలో పనిచేస్తామని.. ఏపీ రాష్ట్రం రూపురేఖలు మార్చుతామని కెసిఆర్ అన్నారు.

ఈ ప్రకారం కేసీఆర్ కుటుంబానికి.. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సర్ నిబంధన మీద అవగాహన కల్పించడానికి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. జగన్, కేటీఆర్ ఫోటోలను పక్కపక్కన ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ ఫోటోలు గులాబీ పార్టీ, వైఎస్ఆర్ సీపీ మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి మీడియా ఈ చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తామని. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండు పర్యాయాలు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీ, వైసీపీల మధ్య సంబంధాలు కుదిరినట్టు బహిరంగంగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష పొత్తు కాక పోయినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల కార్యకలాపాలను దగ్గరుండి పరిశీలిస్తున్న కొంతమంది వ్యక్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

'గాడ్ ఆఫ్ వార్' ఆ ఫ్లాప్ చిత్రానికి రీమేకా..? ఈ త్రివిక్రమ్ జన్మలో మారడు..

Trivikram NTR new movie update
Trivikram NTR new movie update

NTR God of War : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘గాడ్ ఆఫ్ వార్’. త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరో గా ఎన్టీఆర్ నటించబోతున్నారా ?, లేదా అల్లు అర్జున్ నటించబోతున్నారా ? అని ఇంతకాలం సోషల్ మీడియా లో పెద్ద చర్చ నే నడిచింది. అయితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ నే నటించబోతున్నారని నేడు అధికారికంగా ఖరారు అయ్యింది. స్వయంగా ఎన్టీఆర్ ఈ విషయాన్ని నిర్ధారిస్తూ కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కార్తికేయ స్వామి చేతిలో ఉండే ఆయుధాన్ని చాలా క్రియేటివ్ గా DNA అర్థం వచ్చేలా పొందుపరుస్తూ ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇది చాలాసేపు గమనించిన తర్వాత ఫ్యాన్స్ కి కూడా అర్థం అయ్యింది.

అయితే ఇన్ని రోజులు అభిమానులు , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రం గా ఊహించుకున్నారు. కార్తికేయ స్వామి జీవిత చరిత్ర మీదనే చిత్రం మొత్తం ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ లోగో ని గమనిస్తే , ఇది సెమి ఫాంటసీ చిత్రం అనేది అర్థం అవుతోంది. కార్తికేయ స్వామి DNA ని హీరో పాత్రకు బదిలీ చేస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ సినిమా అని అంచనా వేస్తున్నారు. గతం లో ఇదే కాన్సెప్ట్ తో తమిళ హీరో సూర్య ‘7th సెన్స్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమా తెలుగు లో కమర్షియల్ గా హిట్ అయ్యినప్పటికీ, తమిళం లో మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఓవరాల్ గా కమర్షియల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడంలో విఫలం అయ్యింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే , బోధి ధర్మ DNA ని హీరో పాత్రకు ఎక్కిస్తారు , అతను మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన చైనా దేశం ఆటలను అరికట్టుతారు.

‘గాడ్ ఆఫ్ వార్’ లో కూడా అదే కాన్సెప్ట్ ని ఇరికించారు. దీంతో ఈ చిత్రం ‘7 th సెన్స్’ కి రీమేక్ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రం అని నమ్మబట్టే , అభిమానులతో పాటు , ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ విన్నాక , ఆ ఆసక్తి కాస్త తగ్గింది. భవిష్యత్తులో మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ పై ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

హుటాహుటిన ముంబై ఆస్పత్రికెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..ఆందోళనలో ఫ్యాన్స్..

Pawan Kalyan Health
Pawan Kalyan Health

Pawan Kalyan Health : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆయన రివ్యూ మీటింగ్ లో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురి అవ్వడం , వెంటనే హాస్పిటల్ కి తరలించి ముక్కు కి సర్జరీ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ , మరోసారి పాలన పరంగా ఫుల్ యాక్టీవ్ అవ్వడమే కాకుండా, పార్టీ ని కూడా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. వీటితో పాటు కోట్లాది సినీ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న ‘ఓజీ 2’ చిత్రం చేయడం కోసం కూడా ఆయన రెడీ అయిపోయారు. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న సమయం లో మరోసారి ఆయన వైద్య పరీక్షల కోసం ముంబై కి వెళ్లడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా తన భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం అవ్వడం వల్ల, రెండు భుజాలకు చెందిన కండరాలు పూర్తిగా చిట్లిపోయాయి. ఈ కారణం చేత ఆయన ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా కూడా ఆయన క్యాబినెట్ మీటింగ్ లో ఎక్కువసేపు కూర్చోలేక మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భం కూడా ఒకటి ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసమే నేడు ఆయన ముంబై కి వెళ్లాల్సి వచ్చింది.

కాసేపటి క్రితమే ముంబై కి చేరుకున్న పవన్ కళ్యాణ్, కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ కి వెళ్లనున్నారు. ఆయనకు తోడుగా సతీమణి అన్నా లెజినోవా కూడా వచ్చింది. భవిష్యత్తులో రాజకీయ పరంగా ఎన్నో కార్యక్రమాలు , యాత్రలు చేయాల్సి ఉంది , అదే విధంగా వృత్తి పరంగా సినిమాలను కూడా ప్రారంభించే సమయం వచ్చేసింది , నవంబర్ నుండి ఓజీ 2 షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్య పరంగా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ హాస్పిటల్ కి వచ్చారని , అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మాటామంతి కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. రీసెంట్ గానే ఈ కార్యక్రమాన్ని కాకినాడ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం వ్యాపించనుంది.

'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'ఆనందం' హీరోయిన్.. రెమ్యూనరేషన్ ఏంటంటే..

Rekha-Vedavyas

Bigg Boss 10 Telugu :   ‘బిగ్ బాస్’ సందడి మొదలైంది. వచ్చే నెల 25 నుండి స్టార్ మా ఛానల్ లో ‘అగ్నిపరీక్ష 2’ మొదలు కానుంది. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. అదే విధంగా సెలబ్రిటీల ఎంపిక కూడా చాలా సాలిడ్ గా ఉండబోతుంది. ఎప్పుడు లేని రేంజ్ లో ఈసారి బాగా పేరు మోసిన సెలబ్రిటీలను ఒక పది మందిని చూడబోతున్నాము. అందులో ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రేఖ కూడా ఉంది. ఈమె పేరు చెప్తే మీరు వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు , కానీ ఆమెని చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టగలరు. మన చిన్నతనం లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ‘ఆనందం’ సినిమాని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, ఈ చిత్రం లో హీరోయిన్ ఈమెనే.

కన్నడ సినీ పరిశ్రమ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, అక్కడ రెండు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత మన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దృష్టిలో పడింది. ఆయన వెంటనే ఈమెని తన ‘ఆనందం’ చిత్రం లో హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు లో ఈమె ‘జాబిల్లి’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘మన్మధుడు’, ‘దొంగోడు’, ‘అనగనగా ఓ కుర్రాడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి’, ‘నాయుడమ్మ’, ‘నిన్న నేడు రేపు’, ‘జీనియస్’, ‘అలా ఇలా ఎలా’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. కన్నడ లో రెగ్యులర్ గా హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ రోల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఇంత కాలం తన కెరీర్ ని సాగించింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ఒక పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఈమె ‘బిగ్ బాస్ 10’ లో పాల్గొంటారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ కి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. అన్ని కెమెరాల ముందు , అంతమంది తో పోటీపడి టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేస్తాను. కానీ నాకు ఆ రియాలిటీ షో కి వెళ్లేంత ధైర్యం అయితే లేదు. ఒక గెస్ట్ గా వెళ్ళమంటే వెళ్తాను కానీ , కంటెస్టెంట్ గా అయితే నా వల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతం లో ఇలా చెప్పిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఈమె కూడా అంతే , బిగ్ బాస్ టీం ఈమెని త్వరలోనే సంప్రదిస్తారు , మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ ఇస్తే మాత్రం ఈమె కచ్చితంగా ఈ షో లో పాల్గొంటుంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రేఖ వస్తుందో లేదో చూడాలి.

టీమిండియా పై చారిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ కీలక నిర్ణయం..ఇదేం ట్విస్ట్ రా అయ్యా

India Vs Ireland
India Vs Ireland

India Vs Ireland: టీమ్ ఇండియా లాంటి అత్యంత బలమైన జట్టు మీద సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. అందులోనూ టి20 ఫార్మాట్లో గెలవడం అంత సులభం కాదు. కానీ దీనిని చేసి చూపించింది ఐర్లాండ్ జట్టు. ఏకంగా రెండు టీ20 మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించి ట్రోఫీ అందుకుంది. దక్షిణాఫ్రికా నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు ఏ జట్టు వల్ల కానిది ఐర్లాండ్ జట్టు చేసి చూపించింది.

ఐర్లాండ్ జట్టు ఈ విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మీద విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కెప్టెన్ అయ్యర్ వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.”అవకాశం రాకపోతే సో కాల్డ్ ఆర్మీ ద్వారా విమర్శలు చేయిస్తారు. అవకాశం వచ్చిన తర్వాత ఇలా చేతులెత్తేస్తారు. ఇటువంటి ఆటగాళ్లను నమ్ముకుని జట్టు పగ్గాలు అప్పగిస్తే.. నిండా ముంచేస్తారు. అసలు ఇటువంటి వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడతారు.
. క్రికెట్లోకి ఎందుకు వస్తారు.. మేనేజ్మెంట్ కు బుర్ర లేదు. ముందుచూపు అంతకంటే లేదని” నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐర్లాండ్ జట్టు చారిత్రాత్మకమైన విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మీద ట్రోఫీని అందుకున్న తర్వాత.. వాస్తవానికి ఆ జట్టు ప్లేయర్లు ఆకాశం చివరి అంచులో తేలిపోతున్నారు. ప్రపంచాన్ని జయించినంత గొప్పగా వేడుకలు చేసుకుంటున్నారు. కానీ ఐర్లాండ్ జట్టు కోచ్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారత జట్టు మీద గెలిచిన తర్వాత అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని సగటు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఐర్లాండ్ జట్టు కోచ్ గా హెన్రిచ్ మలాన్ కొనసాగుతున్నారు. 2022లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు ఆయనకు పదవీకాలం ఉంది. అయితే ఇంకా ఒక సంవత్సరం ఆయనకు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ.. తన కోచ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సి ఉందని.. దాని కంటే ముందుగానే తాను జట్టు నుంచి వెళ్ళిపోతున్నానని ఆయన పేర్కొన్నారు. కొత్త కోచ్ గా గ్యారీ విల్సన్ నియమితులవుతారని తెలుస్తోంది. ఐర్లాండ్ జట్టు ఈ స్థాయిలో విజయం సాధించినప్పటికీ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం పట్ల మలాన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఓలా కంపెనీకి రూ.45,000 ఫైన్.. అసలు ఈవీలకు ఏ వారంటీ ఉంటుంది.. ఎలా ఫిర్యాదు చేయాలి..

Ola Electric
Ola Electric

Ola Electric: ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిలో సమస్యలు రావడం సాధారణం. కానీ కొన్ని కంపెనీలు వీటి పరిష్కారానికి వారంటీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత వినియోగదారులు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఓ సమస్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వినియోగదారుడికి వచ్చింది. అయితే అతడు కంపెనీని సంప్రదిస్తే పట్టించుకోకపోవడంతో కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు భారీగా జరిమానా విధించింది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఎం మురళీ మోహన్ అనే న్యాయవాది 2022 అక్టోబర్ లో ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేశాడు. దీనిపై 3 ఏళ్ల వారంటీని ఇచ్చారు. అయితే కొన్ని రోజులకే స్కూటర్ డిక్ లాక్ పాడైపోయింది. దీంతో అతడికి తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అతడు మెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించినా పట్టించుకోలేదు. ఆ తరువాత ఆయన 2025లో లీగల్ నోటీసులు పంపాడు.

ఈ నోటీసులపై నిర్లక్ష్యంగా ఉండడంతో కన్జ్యూమర్ కోర్టు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి రూ. 45,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వాహనదారుల్లో కొత్త భరోసాను నింపింది. డిక్కీ లాక్ వంటి చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేసినందుకు, వారంటీ పరిధిలో ఉన్నా సేవలు అందించనందుకు కోర్టు ఈ విలక్షణ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో, అసలు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి వారంటీలు లభిస్తాయి? వినియోగదారుల కోర్టును ఎలా ఆశ్రయించాలి?

ఎలక్ట్రిక్ వాహనాలకు లభించే ప్రధాన వారంటీలు
సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వారంటీ విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. అందుకే కంపెనీలు దీనికి ప్రత్యేకంగా 3 నుండి 8 సంవత్సరాల వరకు లేదా ఒక నిర్దిష్ట కిలోమీటర్ల పరిమితి వరకు వారంటీ ఇస్తాయి.వాహనాన్ని నడిపించే ఎలక్ట్రిక్ మోటార్, పవర్ కంట్రోలర్ వంటి సాంకేతిక భాగాలకు సాధారణంగా 3 సంవత్సరాల వరకు వారంటీ లభిస్తుంది.

స్కూటర్ బాడీ, లైట్లు, డిజిటల్ స్క్రీన్, వైరింగ్, లాకింగ్ సిస్టమ్స్ వంటి ఇతర భాగాలకు కంపెనీని బట్టి ఒకటి నుండి 3 సంవత్సరాల ప్రాథమిక వారంటీ ఉంటుంది. (అనంతపురం కేసులో ఓలా S1 ప్రో వాహనానికి 36 నెలలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ ఉంది).

కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయడం ఎలా? స్పష్టమైన మార్గదర్శకాలు
కంపెనీలు వారంటీ నిబంధనలను ఉల్లంఘించినా, లోపభూయిష్టమైన సేవలు అందించినా వినియోగదారులు కింది పద్ధతుల్లో చట్టపరంగా ముందుకెళ్లవచ్చు:

లీగల్ నోటీసు పంపడం:
సమస్య వచ్చినప్పుడు మొదట సర్వీస్ సెంటర్‌ను, ఈమెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించాలి. అక్కడ స్పందన లేకపోతే, ఒక లీగల్ నోటీసును రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా కంపెనీకి పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్లే హక్కు లభిస్తుంది.

నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు:
వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం e-Daakhil (ఇ-దాఖిల్) పోర్టల్ (www.edaakhil.nic.in) ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదా స్థానిక జిల్లా వినియోగదారుల కమిషన్‌లో నేరుగా పేపర్లు సమర్పించవచ్చు.

కోర్టును ఆశ్రయించాలి?
నష్టపరిహారం విలువ రూ. 50 లక్షల లోపు ఉంటే స్థానిక జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయాలి. వివాద విలువ రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు ఉంటే రాష్ట్ర రాజధానిలోని స్టేట్ కమిషన్‌ను ఆశ్రయించాలి.

జతచేయాల్సిన పత్రాలు:
ఫిర్యాదు చేసే సమయంలో వాహన కొనుగోలు బిల్లు (Invoice), వారంటీ కార్డు, సర్వీస్ సెంటర్‌కు తిరిగినట్లు చూపే జాబ్ కార్డ్స్, కంపెనీకి పంపిన ఈమెయిల్స్, లీగల్ నోటీసు కాపీ మరియు దానికి సంబంధించిన రశీదులను ఆధారాలుగా జతచేయాలి.

లక్షా 20 వేలకు బంగారం ధరలు తగ్గుతాయా..! ఇప్పుడు అమ్మొచ్చా..కొన్నిరోజులు ఆగాలా..

Gold Price
Gold Price

Gold Price: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక భద్రమైన పెట్టుబడి కూడా. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. బంగారం ధరలు గత ఏడాది కాలంలో రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు పెరగడానికి కారణం ఏంటీ? ఇప్పుడు బంగారం విక్రయిస్తే లాభాలేనా?

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు సుమారు 50 టన్నుల బంగారాన్ని విక్రయించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఇంత పెద్ద మొత్తంలో కుటుంబాలు బంగారాన్ని అమ్మడం ఇటీవల కాలంలో అరుదైన పరిణామం.

గత ఏడాది నుంచి అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు మంచి లాభాల్లోకి వచ్చారు. అయితే ఇటీవల ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో, ఇప్పుడే విక్రయిస్తే లాభాలను ఖరారు చేసుకోవచ్చని భావించి బంగారాన్ని అమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనినే మార్కెట్ భాషలో ‘ప్రాఫిట్ బుకింగ్’ అంటారు.

బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పటికే చాలా ఎత్తుకు చేరుకున్నాయి. ఇకపై గతంలా వేగంగా పెరిగే అవకాశం తక్కువగా ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అందుకే ధరలు మరింత తగ్గకముందే విక్రయించి నగదు చేతికి తెచ్చుకోవాలని చాలామంది నిర్ణయించుకుంటున్నారు. కొన్ని మార్కెట్ అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కొందరు విశ్లేషకులు అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ బలాబలాలు వంటి అంశాలపై ఆధారపడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని కూడా చెబుతున్నారు. అంటే ఇవి కేవలం అంచనాలు మాత్రమే, ఖచ్చితమైన ధరలను ఎవరూ ముందుగా చెప్పలేరు.

ధరలు అనుకూలంగా ఉండటంతో పాటు, విద్య, వైద్యం, గృహ కొనుగోలు, వ్యాపార అవసరాలు వంటి కారణాలతో కూడా కుటుంబాలు బంగారాన్ని విక్రయిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో బంగారం సులభంగా నగదుగా మారే ఆస్తి కావడంతో, మంచి ధర లభిస్తున్న సమయంలో దానిని విక్రయించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం.. కేవలం ధరలు పెరిగాయనే కారణంతో మొత్తం బంగారాన్ని విక్రయించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. బంగారం ఇప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిగా, ద్రవ్యోల్బణానికి రక్షణగా పరిగణించబడుతోంది. అందువల్ల మార్కెట్ అంచనాల ఆధారంగా కాకుండా, ఆర్థిక సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మరింత శ్రేయస్కరం.

జూలైలో ఈ రాశుల వారికి అదృష్ట దారులు.. ఏదంటే అది అవడం ఖాయం..

July 2026 Horoscope
July 2026 Horoscope

July 2026 Horoscope: వచ్చే జూలై నెలలో గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉండనున్నట్లు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గురుడు, బుధుడు, శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధి, ఉద్యోగ అవకాశాలు, వివాహ యోగం, అధికార లాభాలు, చేపట్టిన పనుల్లో విజయం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చని గుర్తుంచుకోవాలి.

మేష రాశి:
మేష రాశి వారికి జూలై నెల శుభఫలితాలను అందించే అవకాశముంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

మకర రాశి:
మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన కాలంగా ఈ నెల మారే అవకాశముంది. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. సొంత ఇల్లు, వాహనం వంటి విషయాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. సమాజంలో గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది.

కన్య రాశి:
కన్య రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా మంచి ఫలితాలు దక్కే అవకాశముంది. పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా అధికారుల నుంచి గుర్తింపు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కూడా ఉపశమనం లభించవచ్చు.

మీన రాశి:
మీన రాశి వారికి జూలై నెలలో అనేక శుభయోగాలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. వివాహ యోగం ఉన్నవారికి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడిపే వీలు ఉంటుంది. ఆర్థికంగా కూడా ఊరట లభించే సూచనలు ఉన్నాయి.

మిథున రాశి:
మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఇది అనుకూల సమయం కావచ్చు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి జూలై నెలలో అదృష్టం బలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా పురోగతి కనిపించవచ్చు.

ప్రతీ విమర్శకు స్పందిస్తే మానసిక సమస్య.. మరేం చేయాలి..

Mental Health
Mental Health

Mental Health: ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉంటున్నాయి. అయితే ప్రతి విమర్శకు వెంటనే స్పందించడం లేదా ప్రతి ఒక్కరినీ ఒప్పించే ప్రయత్నం చేయడం వల్ల మన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ప్రతి పరిస్థితికి స్పందించడం కాదని.. అవసరమైన సందర్భంలో మాత్రమే స్పందించడం అసలైన మెచూరిటీ అని అంటున్నారు. అసలు ఈ మెచుర్యూటీ వచ్చిన వాళ్లు ఎలా ఉంటారు? ఏ విధంగా ఉంటే మానసిక సమస్యలు ఉండవు?

సమాజంలో చాలా మంది వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. అయితే ఎవరో చేసిన ప్రతి వ్యాఖ్యకు లేదా విమర్శకు సమాధానం చెప్పాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మార్చడం సాధ్యం కాదు. కొందరు ఒక విషయం ఎలా ఉన్నా.. విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి సందర్భాల్లో వాదనకు దిగడం కంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. మన సమయం, శక్తిని విలువైన పనుల కోసం వినియోగించడం తెలివైన నిర్ణయం.

ప్రపంచంలో ప్రతి తప్పును మనమే సరిచేయాలని ప్రయత్నించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంపై స్పందించడం లేదా అందరినీ మార్చాలని ప్రయత్నించడం సాధ్యం కాదు. మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం, మిగతావాటిని వదిలేయడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.

ఎక్కువగా వాదనలు చేసే క్రమంలో సంబంధాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మౌనం పాటించడం, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం గొప్ప విజయం. నిజమైన పరిణతి అంటే మన అహంకారాన్ని పక్కన పెట్టి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం. గెలుపు అనేది ఎప్పుడూ మాటల్లోనే కాదు, మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా ఉంటుంది.

జీవితంలో విమర్శలు, అపార్థాలు, అడ్డంకులు తప్పవు. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే లక్ష్యాల నుంచి దూరమవుతాం. కొన్నిసార్లు వాటిని పట్టించుకోకుండా మన పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోవడమే ఉత్తమ నిర్ణయం. విజయం సాధించిన చాలా మంది వ్యక్తులు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించారని నిపుణులు చెబుతున్నారు.

నిజమైన మెచ్యూరిటీ అంటే కోపం వచ్చిన వెంటనే స్పందించడం కాదు. పరిస్థితిని అర్థం చేసుకుని, ఏది అవసరమో అదే చేయడం. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా వాటిలో ఉపయోగకరమైన అంశాలు ఉంటే స్వీకరించడం, అవసరం లేని వాటిని వదిలేయడం పరిపక్వతకు నిదర్శనం.

ఆప్‌ ఆధ్యాత్మిక బాట వెనుక అసలు కథ ఏమిటి..

Aam Aadmi Party
Aam Aadmi Party

Aam Aadmi Party: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం రాష్ట్రంలోని 22 పట్టణాల్లో ప్రతీ సోమవారం సాయంత్రం “ఏక్ శామ్ శివ్ కా నామ్” కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్యక్రమాల్లో శివుని పేరిట భజనలు, పూజలు నిర్వహించి, ధార్మిక సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. “జై శ్రీరాం”, “హర హర మహాదేవ్” నినాదాలు ఇచ్చి, ప్రభుత్వ నిధులతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అమృత్‌సర్‌లోని వాల్మీకి ఆశ్రమం అభివృద్ధి, పాటియాలాలో కాళీమాత ఆలయ నిర్మాణం వంటి ప్రకటనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన కింద సాలాసర్ బాలాజీ, ఖాతూశ్యాం, మథుర-బృందావన్, హృషికేష్-హరిద్వార్, ఆనంద్‌పూర్, అమృత్‌సర్ వంటి క్షేత్రాలకు ప్రజలను తీసుకెళ్లే హామీ ఇచ్చారు.

పార్టీ కన్వీనర్‌ ప్రకటన..
ఈ పథకాలను పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ ఇద్దరూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రజలు “జై శ్రీరాం” అని నినదించగా, నాయకులు “జై సియారామ్” అని చెప్పారు. కేజ్రీవాల్ మాట్లాడుతుండగా సీఎం భగవంత్ మాన్‌ను చూసి ప్రజలు చప్పట్లు కొట్టడం గమనార్హం.

ఆరు నెలల్లో పంజాబ్‌ ఎన్నికలు..
పంజాబ్‌లో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పట్టణాల్లో హిందువులు గణనీయంగా ఉండటం, గ్రామాల్లో సిక్కులు ఎక్కువగా ఉండటం వల్ల హిందూ ఓట్లను ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కనిపిస్తోంది. ఆప్ తనను తాను సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటూ, ఇప్పుడు స్పష్టంగా హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు..
సాధారణంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు అంటే బీజేపీ గుర్తుకు వస్తుంది. సీఎం అయితే యోగా ఆదిత్యనాథ్‌ గుర్తొస్తారు. కానీ దేశంలో హిందువుల పునరేకీకరణ నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి రావడానికి హనుమాన్ చాలీసా పాడిన ఆప్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కూడా చండీ మంత్రం, హనుమాన్ చాలీసా ఆలపించింది. ఇప్పుడు పంజాబ్‌లో కూడా ఇదే వ్యూహం అనుసరిస్తోంది. అయితే కేజ్రీవాల్ ప్రకటనలు చేయడం, సీఎం భగవంత్ మాన్ వెనకబడి ఉండటం వల్ల పార్టీలో సీఎం, కన్వీనర్ మధ్య సఖ్యత లేదన్న అభిప్రాయం బయటకు వస్తోంది. రామనామం ఓట్లు తెచ్చే అవకాశం ఉందని ఆప్ భావిస్తోంది.

ప్రతి పార్టీ తన ఓటు బ్యాంకు కోసమే..
దేశంలో రాజకీయ పార్టీలు కులం, మతం ఆధారంగా రాజకీయాలుచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం హిందుత్వం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు మైనారిటీలకు మద్దతు ఇస్తూ సెక్యూలరిజం అని చెప్పుకున్న పార్టీలు కూడా ఇప్పుడు హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆప్ తన మొదటి దశలో “సెక్యులరిజం”, “వ్యవస్థ మార్పు” అనే నినాదాలతో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హిందూ మెజారిటీ ఓట్లు అవసరమైన చోట హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.

పంజాబ్‌లో సిక్కు-హిందూ సమతుల్యత ఉంది. పట్టణాల్లో హిందువులు ఎక్కువగా ఉండటం వల్ల వారి ఓట్లు కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు అనివార్యం అని ఆప్ భావిస్తోంది. అయితే ఇది పార్టీ ఆదర్శాలకు విరుద్ధంగా ఉందని విమర్శకులు అంటున్నారు. మొత్తం మీద, ఈ కార్యక్రమాలు ఆప్‌కు హిందూ ఓట్లు తెచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. రాజకీయాల్లో “సెక్యులరిజం” అనేది చాలా సార్లు సందర్భానుసారం మారిపోతుందని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది.

'పెద్ది' 25 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇక కేవలం 2 కోట్లు మాత్రమే తక్కువ..

Peddi 25 Days Collections
Peddi 25 Days Collections

Peddi 25 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 25 రోజులు పూర్తి అయ్యింది. చాలా మంది ఈ చిత్రానికి మొదట్లో వచ్చిన డివైడ్ టాక్ ని చూసి , వీకెండ్ తర్వాత బాగా డౌన్ అయిపోతుందని అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో 25 రోజున కూడా ఈ చిత్రానికి అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ పడ్డాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ లాంగ్ రన్ ఉండడం సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్క ప్రకారం ఈ సినిమాకు 25 వ రోజున 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్రతిష్టాత్మక 150 కోట్ల షేర్ మార్కుని అందుకోగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 348 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 25 రోజుల్లో 54 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం బయ్యర్స్ బ్రేక్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టారు కానీ , భారీ లాభాలను మాత్రం చూడలేకపోయారు. ఇక సీడెడ్ ప్రాంతం లో అయితే 25 రోజులకు కలిపి 21 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర నుండి 23 కోట్ల 6 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్లు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 17 లక్షలు , గుంటూరు నుండి 12 కోట్ల 68 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 30 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 91 లక్షలు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ , నెల్లూరు లో తప్ప, అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయ్యి భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మరోవైపు రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ ప్రాంతాల్లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 75 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 348 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి .

'ఇరుముడి' తో రవితేజ భారీ కం బ్యాక్ గ్యారంటీ.. దుమ్ము లేపుతున్న మొదటి పాట..

Irumudi
Irumudi

Irumudi: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి మాస్ మహారాజ రవితేజ నుండి ఒక భారీ బ్లాక్ బస్టర్ ని ఆశిస్తున్నారు ఆడియన్స్. సరిగ్గా అలాంటి సమయం లోనే ఆయన నుండి ‘ఇరుముడి’ అనే చిత్రం రాబోతుందని అధికారిక ప్రకటన చేశారు. అప్పటి నుండి ఈ సినిమాపై ఏర్పడిన పాజిటివ్ వైబ్స్ మామూలైవి కావు. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నారని అర్థం అయిపోయింది. ఆ పాజిటివ్ వైబ్స్ కి తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలకు ఆడియన్స్ , ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రం నుండి ‘ఇరుముడి కట్టు’ అనే పాట విడుదల అవ్వగా, దీనికి కూడా ఆడియన్స్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యారు.

ఈ పాటలో రవితేజ డ్యాన్స్ స్టెప్పులు చాలా హోమ్లీ గా, సింపుల్ గా ఉన్నాయి. అలా డిజైన్ చేశారు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్. సాంగ్ మొత్తం మంచి వైబ్ తో ఉంది. పాటలో మొదటి 3 నిమిషాలు ఒక ఎత్తు అయితే , చివరి నిమిషం మరో ఎత్తు. థియేటర్స్ లో అభిమానులు , ప్రేక్షకులు కచ్చితంగా పూనకాలొచ్చి ఊగిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వైబ్ ఈ పాటలో ఉంది. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈ పాటని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి. ఎంతో ఎనర్జీ యాక్టింగ్ తో , మాస్ ఫైట్స్ , మాస్ ఎలివేషన్స్ తో ఇన్నాళ్లు రవితేజ కెరీర్ సాగింది. అలాంటి హీరో తో ఇలాంటి రోల్ వేయించాలనే ఆలోచన రావడం లోనే డైరెక్టర్ శివ నిర్వాణ సక్సెస్ అయ్యారు.

పర్ఫెక్ట్ గా తీస్తే మాత్రం ఈ సినిమా తో రవితేజ పాన్ ఇండియా లెవెల్ లో రీ సౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా , ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాతో అందరూ కోరుకునే విధంగా రవితేజ భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడో లేదో చూడాలి.

దశాబ్దాల అంధకారం నుండి వెలుగు దిశగా బెంగాల్

West bengal

bengal citizenship bill : పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మతపరమైన వివక్ష, అక్రమ వలసలు, పౌరసత్వ సమస్యలపై కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర అసెంబ్లీలో నేడు నూతన బీజేపీ సీఎం సువేందు అధికారి ఉమ్మడి పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు ద్వారా పౌరుల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు, అక్రమ వలసల నియంత్రణకు మరింత బలమైన చట్టపరమైన వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు, ప్రతిపక్షాలు ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ వలసల అరికట్టడంతోపాటు బంగ్లా నుంచి వచ్చిన హిందువులకు రక్షణ కల్పించేందుకు ఈ చారిత్రాత్మక బిల్లును బెంగాల్ లో ప్రవేశ పెట్టనున్నారు.

బెంగాల్ అసెంబ్లీలో నేడే ఉమ్మడి పౌరసత్వ బిల్లు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఆంధ్రుల ఆవేదనని ఎగతాళి చేస్తున్న జగన్ మూర్ఖత్వం

Amaravati

Amaravati : ఆంధ్రుల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతోంది. ఆంధ్రుల రాజధాని కల ఇన్నాళ్లకు సాకారం కాబోతోంది. మద్రాస్ ప్రావీన్స్ లోనే ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాస్ ను రాజధానిగా ఇవ్వాలని కోరినా ఫలించలేదు. ఆంద్ర నాడు రాజధాని లేకుండా ఏర్పడింది. కర్నూలులో గుడారాల్లో ఆంధ్రా రాజధానిని నిర్వహించారు. విశాలాంధ్ర భావన రావడంతో తెలంగాణ, ఆంద్రా కలిసి హైదరాబాద్ ను రాజధానిగా చేసుకున్నారు. 2014లో ఆంధ్రా విడిపోయాయి. మళ్లీ రాజధాని లేని ఆంధ్ర ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అనేది కేవలం పరిపాలనా అంశం మాత్రమే కాదు, కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, రాష్ట్ర విభజన తర్వాత వరకు ఆంధ్ర ప్రజలు రాజధాని కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తోంది.

ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని అంశంలో ఆయన వైఖరి ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిందని, ప్రజల ఆవేదనను అర్థం చేసుకోకుండా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. మరోవైపు, జగన్ పార్టీ మాత్రం రాజధాని వికేంద్రీకరణ లక్ష్యంతోనే తమ నిర్ణయాలు తీసుకున్నామని గతంలో స్పష్టం చేసింది.

రాజధాని అంశంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలపై విశ్లేషకులు ‘రామ్’ గారు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ విశ్లేషణను కింది వీడియోలో వీక్షించవచ్చు.

డాలర్‌ బంధాన్ని తెంచుకున్న బొలీవియా.. సడెన్‌గా షాక్‌!

Dollar
Dollar

Bolivia Dollar Peg : ఆఫ్రికా దేశం బొలీవియా తన కరెన్సీని అమెరికన్‌ డాలర్‌తో 15 ఏళ్లపాటు స్థిరంగా కట్టిపెట్టి ఉంచిన విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో స్పష్టం చేస్తోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం, దిగుమతులు మరియు విదేశీ చెల్లింపులకు అవసరమైన డాలర్లను సమకూర్చడం కష్టమవడం ఈ మార్పుకు ప్రధాన కారణాలు.

అధికారిక రేటు, పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌.
ఇటీవలి కాలంలో బొలీవియాలో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకటిగా ఉండగా, బ్లాక్‌ మార్కెట్‌లో డాలర్‌ ధర చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు బ్యాంకింగ్‌ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి అక్రమ మార్కెట్‌ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించి, కరెన్సీని మార్కెట్‌ ఆధారితంగా మార్చాలని నిర్ణయించింది.

బొలివియానో విలువ పడిపోయే అవకాశం..
ఇకపై బొలీవియా కరెన్సీ బొలివియానో విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా నిర్ణయించబడుతుంది. దీంతో బొలివియానో విలువ గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగుమతి వస్తువుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉండటం వంటి స్వల్పకాలిక సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్‌ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఇతర దేశాలు కూడా..
బొలీవియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలో కొత్తది కాదు. అర్జెంటీనా 1990లలో తన కరెన్సీని డాలర్‌తో 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని వదిలేసింది. ఆ తర్వాత దాని కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. అలాగే కజకిస్తాన్‌ 2015లో, ఈజిప్ట్‌ 2016లో తమ కరెన్సీలను మార్కెట్‌ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో నియంత్రణలను సడలిస్తోంది.

డాలర్‌ పెగ్‌ విధానం కొనసాగిస్తున్న దేశాలు..
ఇప్పటికీ సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, హాంకాంగ్‌ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్‌తో స్థిర అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం వల్ల ఈ విధానాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతోంది. భారతదేశం డాలర్‌ పెగ్‌ విధానాన్ని అనుసరించదు. రూపాయి ’మేనేజ్డ్‌ ఫ్లోట్‌’ విధానంలో ఉండటంతో మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే తీవ్రమైన ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుంటుంది.

బొలీవియా తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌ ఆధిపత్యం, వివిధ దేశాల కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.

మొదటి రోజు కంటే 10 వ రోజు ఎక్కువ వసూళ్లు.. చరిత్ర తిరగరాసిన 'మా ఇంటి బంగారం'..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Maa Inti Bangaram Collections : సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ రేంజ్ వసూళ్లు వస్తాయని సమంత మరియు మూవీ టీం కలలో కూడా ఊహించి ఉండరు. కేవలం రీకవరీ అయితే చాలని అనుకున్నారు , కట్ చేస్తే 10 రోజుల్లో బయ్యర్స్ కి మూడింతల లాభాలను తెచ్చి పెట్టింది ఈ చిత్రం. గమ్మత్తు ఏంటంటే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే 10 వ రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువ ఉండడమే. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయిలు రాగా, 10 వ రోజు ఏకంగా 2 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

10 రోజుల్లో నైజాం ప్రాంతం నుండి 12 కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాల నుండి 9 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 21 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 36 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 78 లక్షలు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి 9 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 37 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 75 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

మరో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టగలిగితే , సౌత్ ఇండియా లోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలుస్తుంది. అంతే కాకుండా సమంత కి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ శాశ్వతంగా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి , నైజాం ప్రాంతం నుండే 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం గమనార్హం. ఫుల్ రన్ లో కచ్చితంగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే సత్తా ఈ చిత్రానికి ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఒక పక్షి సంతతిని కాపాడేందుకు.. ఈ మహిళ చేసిన పనికి ప్రధాని మోడీ ఫిదా

Hargila Bird Conservation

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి. అడవులు తగ్గిపోతే.. వాటి ఆధారంగా బతికే పక్షులు కూడా మనుగడ కోల్పోతాయి. చివరికి విలుప్త జాబితాలో చేరిపోతాయి. అందులో ఈ పక్షి కూడా చేరింది. కాకపోతే ఆ పక్షిని కాపాడేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. కొందరు మహిళలు నడుం బిగించి ముందుకు వచ్చారు. తద్వారా ఆ పక్షి మనుగడ మొదలైంది. సంతతి పెరిగింది. వారు చేసిన ఆ పని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫిదా చేసింది.

మనదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలకమైన అస్సాం రాష్ట్రంలో హార్గిలా పక్షులు ఒకప్పుడు విపరీతంగా ఉండేవి. వీటి రూపం విచిత్రంగా ఉండేది. అయితే వీటిని అక్కడి ప్రజలు దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. అందువల్ల వీటిని వేటాడేవారు. ఇవి ఎదురుగా వస్తే కీడు జరుగుతుందని భయపడేవారు. ఈ పక్షులు కదంబం చెట్ల మీద ఎక్కువగా ఉండేవి. ఈ పక్షుల సంతతి పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రజలు కదంబం చెట్లను నరికి వేయడం మొదలుపెట్టారు. ఫలితంగా హర్గిలా పక్షుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. వాస్తవానికి ఈ పక్షులు పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. పైగా ఇవి పారిశుద్ధ్య కార్మికుల పాత్ర పోషిస్తూ ఉంటాయి.

చనిపోయిన జంతువుల కళేబరాల మీద ఇవి వాలిపోతూ ఉంటాయి. కళేబరాల మాంసాన్ని తింటుంటాయి. ఈ విధంగా పర్యావరణానికి మేలు చేకూర్చుతాయి. వీటి సంఖ్య తగ్గిపోవడంతో ప్రముఖ జీవ శాస్త్రవేత్త పూర్ణిమ దేవి ఒక ఉద్యమాన్ని అస్సాంలో మొదలుపెట్టారు.. 2007లో ఆమె దీనిని మొదలుపెట్టారు. హర్గిలా సంతతి పక్షులను వేటాడకుండా అస్సాం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేశారు. కొంతమంది మహిళలను ఎంచుకొని హర్గిలా ఆర్మీ ఏర్పాటు చేయించారు. వారికి ఈ పక్షుల గొప్పతనం గురించి వివరించారు. గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించారు. అంతేకాదు కదంబం మొక్కలను విరివిగా నాటేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోతున్న హర్గిలా సంతతి పెరగడం మొదలైంది. ఇప్పుడు ఆ పక్షులు అక్కడ వేల సంఖ్యకు చేరుకున్నాయి. అంతేకాదు చనిపోయిన జంతువుల కళేబరాలు లేకుండా చేస్తున్నాయి. తద్వారా అస్సాం రాష్ట్రం పరిశుభ్రంగా కనిపిస్తోంది.

పూర్ణిమ దేవి చేసిన సాహసం.. అస్సాం రాష్ట్రంలో హర్గిలా పక్షుల సంతతి పెరగడం వంటి పరిణామాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. అస్సాంలో ఈ మహిళలు చేసిన పని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి వారి వల్లే ప్రకృతి గొప్పగా ఉంటుందని.. పర్యావరణం సకల జంతువులతో వర్ధిల్లుతూ ఉంటుందని పేర్కొన్నారు..