Home Blog Page 41

త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి రాజమౌళి సంబంధం ఏంటంటే..?

Trivikram Srinivas Dream Project
Trivikram Srinivas Dream Project

Trivikram Srinivas Dream Project: మాటల మాంత్రికుడిగా గుర్తింపును సంపాదించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన సినిమాల్లో మాటలతో గారడీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అయ్యాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ అనే మైథాలాజికల్ సినిమా కూడా చేస్తున్నాడు. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రీసెంట్ గానే ఇచ్చారు. మొత్తానికైతే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఒక సినిమా అయితే పెట్టుకున్నాడట… మహాభారతంలోని కురుక్షేత్రాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. అది తన డ్రీం ప్రాజెక్టు అని కూడా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. మహాభారతం మొత్తం కాకుండా ఓన్లీ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే తను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు అవసరం అవుతారని తను భావిస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రాజమౌళి సైతం మహాభారతం సినిమాని చేయడం తన డ్రీమ్ అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.

ఇక మధ్యలో త్రివిక్రమ్ కూడా మహాభారతాన్ని బేస్ చేసుకొని ఒక సినిమాను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వీళ్లిద్దరిలో ఎవరు ఆ సినిమా చేస్తారు. ఒకవేళ ఇద్దరు చేస్తే అందులో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇద్దరు దర్శకులు కూడా ఒకే సినిమాను వాళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎవరు ముందుగా సినిమాని తెరకెక్కిస్తారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరు కాంప్రమైజ్ అవుతారా? అసలేం జరగబోతుంది…

స్పిరిట్ షూటింగ్ టైమ్ లో రవితేజ కొడుకు మీద సందీప్ వంగ సీరియస్ అయ్యాడా..? కారణమేంటంటే...

Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన సంపాదించుకున్న పాపులారిటి మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. ఆయనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు చాలామంది హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు వీళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ప్రభాస్ ఇలాంటి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.

ఇక ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దగ్గర రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో మహధన్ భూపతి రాజు మీద ఫైర్ అయ్యాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ మహధన్ ఒక్కడి మీదనే అరవలేదట. టీమ్ లో ఉన్న కొంతమంది చేసిన కొన్ని తప్పుల వల్ల చిన్న డిస్టబెన్సేస్ వచ్చాయట. దానివల్ల సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ టీమ్ లో ఉన్న అందరి మీద అరిచాడట.

ఇక అందులో త్రివిక్రమ్ కొడుకు రవితేజ కొడుకు కూడా ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు అనేవాడు తనకు అనుకూలంగా వర్క్ చేయకపోతే ఎవరి మీద అయిన అరుస్తాడు. ఎందుకంటే అది కోట్లలో జరిగే వ్యాపారం అలాగే క్రియేటివిటీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావాన్ని చూపించే ప్రమాదమైతే ఉంది…

తమిళనాడులో శివాజీ–టిప్పు సుల్తాన్‌ పోస్టర్ల వివాదం.. హిందూ సంఘాల ఆగ్రహంతో విజయ్‌ సర్కార్‌ అలర్ట్‌!

Tamil Nadu Shivaji Tipu Sultan Poster Controversy
Tamil Nadu Shivaji Tipu Sultan Poster Controversy

Tamil Nadu Shivaji Tipu Sultan Poster Controversy: తమిళనాడు అంటేనే భాషాభిమానం. ప్రాతీయ అభిమానం ఎక్కువ. ఉత్తరాది భాషలను చిన్నచూపు చూస్తారు. అయితే అక్కడి వారికి ఛత్రపతి శివాజీ అంటే అభిమానం. తాజాగా మొహర్రం పండుగ సందర్భంగా కొందరు వ్యక్తులు వివాదాస్పద పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో ఛత్రపతి శివాజీ మహారాజు టిప్పు సుల్తాన్‌ పాదాల వద్ద ఉన్నట్లు చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రాలు అనేక ప్రాంతాల్లో అంటించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శివాజీని అత్యంత గౌరవించే తమిళ ప్రజలు ఈ చిత్రీకరణను అవమానంగా భావించారు. హిందూ సంఘాలు వెంటనే నిరసనలు తెలిపాయి. ప్రభుత్వం అప్రమత్తమై పోస్టర్లు తక్షణం తొలగించాలని ఆదేశించింది. అధికారులు వాటిని తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

చరిత్రతో సంబంధం లేకపోయినా..
ఛత్రపతి శివాజీ మహారాజు, టిప్పు సుల్తాన్‌ పూర్తిగా వేర్వేరు కాలాలకు చెందిన వ్యక్తులు. శివాజీ మరణించిన 70 సంవత్సరాల తర్వాతే టిప్పు సుల్తాన్‌ జన్మించారు. ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు ఎదుర్కొన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో శివాజీని టిప్పు సుల్తాన్‌ పాదాల వద్ద చిత్రీకరించడం ద్వారా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి చిత్రీకరణలు చరిత్రను రాజకీయ లేదా మతపరమైన ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి ఉపయోగపడతాయని చాలా మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో శివాజీపై ప్రత్యేక అభిమానం..
తమిళనాడులో శివాజీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ పేరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజుపై ఉన్న గౌరవం వల్లే పెట్టుకున్నారు. శివాజీ గణేశన్‌ చారిత్రక పాత్రల్లో నటించినందున ఆయన్ను ‘శివాజీ’ అని పిలవడం మొదలైంది. దీంతో తమిళ ప్రజల్లో శివాజీ మహారాజు పట్ల భక్తి, గౌరవం ఇంకా పెరిగింది. శివాజీని హిందూ వీరుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా భావించే వారు అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి వారి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పోస్టర్లు వేయడం సున్నితమైన విషయం.

హిందూ సంఘాల నిరసన..
వివాదాస్పద పోస్టర్లపై హిందూ సంఘాలు వెంటనే రంగంలోకి దిగి పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి పోస్టర్లు తొలగించాలని ఆదేశించింది. అధికారులు వాటిని తొలగించడంతో పెద్ద ఎత్తున ఘర్షణలు జరగకుండా నివారించగలిగారు. ఇలాంటి సున్నితమైన సందర్భాల్లో ప్రభుత్వాలు త్వరగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. ఇది చట్టం, శాంతి రక్షణకు మంచి ఉదాహరణగా నిలిచింది.

రాజకీయ లబ్ధి కోసమేనా..
ఈ సంఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారా లేక మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నమా అన్న చర్చ జరుగుతోంది. శివాజీ, టిప్పు సుల్తాన్‌ ఇద్దరూ వేర్వేరు కాలాల వారు. వారి మధ్య ఎలాంటి నేరుగా సంబంధం లేదు. అయినప్పటికీ ఒకరిని మరొకరి పాదాల వద్ద చిత్రీకరించడం ద్వారా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. అలాంటి చర్యలు సమాజంలో అనవసరమైన విభజనను సృష్టిస్తాయి. హిందూ, ముస్లిం సమాజాల మధ్య శతాబ్దాలుగా ఉన్న సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. నిజమైన చరిత్ర అధ్యయనం చేసి, వాస్తవాల ఆధారంగా గౌరవం చూపడం మాత్రమే దీర్ఘకాలిక సామరస్యానికి దారి తీస్తుంది. పోస్టర్లు, బ్యానర్లు, సోషల్‌ మీడియా ద్వారా ఇలాంటి వక్రీకరణలు చేయడం నేరం. అందుకే విజయ్‌ సర్కార్‌ త్వరగా చర్యలు చేపట్టింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి మరింత అప్రమత్తత అవసరం. మత పండుగలు శాంతియుతంగా జరగాలి, ఇతరుల భావోద్వేగాలను గౌరవించాలి. చరిత్రను గౌరవించడం అంటే దాన్ని వక్రీకరించకుండా, వాస్తవాలతో మాత్రమే మాట్లాడడం.

సమాజంలో శాంతి, సామరస్యం నిలబెట్టుకోవాలంటే చరిత్రను రాజకీయ ఆయుధంగా మార్చకూడదు. వాస్తవాల ఆధారంగా గౌరవం, అవగాహన పెంచుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం కూడా మత ఉద్రిక్తతలు పెంచేవారిపై కఠిన చర్యలు చేపట్టాలి.

సుకుమార్ తన శిష్యులను డైరెక్టర్లుగా మార్చడమే టార్గెట్ గా పెట్టుకున్నాడా..?

Sukumar
Sukumar

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది… ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే అతని దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన తన అసిస్టెంట్ డైరెక్టర్లను సైతం దర్శకులుగా మార్చే బాధ్యతను తనే ఎత్తుకున్నాడు. ఇప్పటికే బుచ్చిబాబు ను దర్శకుడిగా పరిచయం చేసి తనను టాప్ డైరెక్టర్ గా మార్చాడు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు ముగ్గురు దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు…

మొత్తానికైతే సుకుమార్ దగ్గర దర్శకత్వం విభాగంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా టాప్ డైరెక్టర్స్ గా మరి వాళ్ళ సత్తా చాటుతుండటం విశేషం… బుచ్చిబాబుతో పాటు శ్రీకాంత్ ఓదెల సైతం దసర సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇక ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యులకు మంచి క్రేజ్ ఉంది.

ఆయన దగ్గర పని చేసి దర్శకులుగా మారడానికి ఇంకా కొంతమంది సిద్ధమవుతున్నారు… నిజానికి ఏ దర్శకుడు కూడా తన శిష్యులను డైరెక్టర్స్ గా చేసి వాళ్లకు కూడా ఒక లైఫ్ ఇవ్వాలని ఆలోచించడు. ఎంతసేపు తన సినిమాకి అసిస్టెంట్ గా చేసిన వాళ్ళని వాడుకున్నామా తన సినిమా సక్సెస్ సాధించిందా? లేదా అనే రీతిలోనే ఆలోచిస్తారు గాని వాళ్ళ శిష్యులను కూడా దగ్గరుండి మరి దర్శకులుగా మార్చాలనే ఒక ఆలోచనైతే సుకుమార్ కే వచ్చింది.

అందుకే ఆయన అటు దర్శకుడిగా రాణిస్తూనే ఇటు గొప్ప గురువుగా కూడా పేరు సంపాదించుకుంటున్నాడు…ఇక రాబోయే సినిమాలతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

అనిల్ రావిపూడి కొత్త మూవీలో నటించనున్న రాజమౌళి... క్యారెక్టర్ ఏంటి ఇంత కామెడీగా ఉంది...

Anil Ravipudi
Anil Ravipudi And SS Rajamouli

Anil Ravipudi And SS Rajamouli: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. రాజమౌళి తర్వాత వరుసగా సక్సెస్ లను సాధిస్తున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోలిద్దరిని ఎలా వాడుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో రాజమౌళిని సైతం భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉందట. ఆ పాత్ర రాజమౌళి చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళిని కలిసి ఆ క్యారెక్టర్ గురించి చర్చించిన అనిల్ తొందరలోనే రాజమౌళి ఈ మూవీ చేస్తున్నాడు అంటూ ఒక అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి అనిల్ సైతం సినిమా షూటింగ్ మొత్తాన్ని అయిపోగొట్టిన తర్వాత చివరిలో రాజమౌళి పోర్షన్ షూట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడడట.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకున్నాడు. కాబట్టి రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకు సరిపడా ఒక మంచి క్యారెక్టర్ అయితే అనిల్ రావిపూడి డిజైన్ చేశారట.

ఆయన పాత్ర సినిమాలో 5 నిమిషాల పాటు కనిపిస్తుందని కూడా అనిల్ రావిపూడి తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మంచి నటుడు కాబట్టి అనిల్ తన చేత కామెడీ చేయించాలని డిసైడ్ అయ్యాడట. రాజమౌళి కామెడీ ఎలా పండిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్న మలయాళం ప్రేక్షకులు... బన్నీ అలా చేస్తాడని అనుకోలేదు...

Allu Arjun
Allu Arjun

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలందరు టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. పాన్ ఇండియాలో మన హీరోలను మించిన నటులు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మన హీరోలు వాళ్ళ స్టార్ డమ్ ను వాడుకుంటూ గొప్ప సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇండియా వైడ్ గా ఉన్న ప్రేక్షకులందరిని అలరిస్తూ వాళ్లందరిని మైమరిపింప చేస్తున్నారు. ఇక దానికి తోడుగా అన్ని ఇండస్ట్రీ లలో ఉన్న ప్రేక్షకులు కూడా మన వాళ్ళు చేసే సినిమాలకు మన హీరోలకి అభిమానులుగా మారిపోతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కెరియర్ మొదటి నుంచి తెలుగుతోపాటు మలయాళం ఇండస్ట్రీలో చాలా మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలు అక్కడ మంచి విజయాలు సాధించాయి. ఇక ఈ క్రమంలోనే అతన్ని అక్కడ ‘మల్లు అర్జున్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అలాంటి అల్లు అర్జున్ మీద మలయాళం ప్రేక్షకులు కొంతవరకు సీరియస్ అవుతున్నారట.

కారణమేంటి అంటే అల్లు అర్జున్ కి తెలుగు తర్వాత అంత మంచి మార్కెట్ ని క్రియేట్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది మలయాళం ఇండస్ట్రీ అనే చెప్పాలి. మరి అలాంటి ఇండస్ట్రీలో ఇప్పటివరకు తను ఒక్కటి కూడా స్ట్రెయిట్ మలయాళం సినిమా చేయలేదని ఎప్పటినుంచో తన దగ్గర అలాంటి ప్రస్తావన వచ్చినా కూడా ప్రతిసారి దాన్ని దాటవేస్తున్నాడు అంటూ అక్కడి ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.

ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి మలయాళంలో ఉన్న దర్శకులతో సినిమా చేస్తే బాగుంటుందని ఎంతసేపు తెలుగు, తమిళ్ దర్శకులతోనే సినిమాలు చేయడం సబబు కాదని వాళ్లు సోషల్ మీడియా వేదికగా వల్ల అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక దీని మీద అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు తొందరలోనే మలయాళం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లతో సినిమాలను సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

భర్తలను ఎలా ఖతం చేయాలి.. దీనిపై పుస్తకాలు రాస్తున్నారు.. మహిళలు చదువుతున్నారు.. ఏం సొసైటీ రా బై

Pune Businessman Case
Pune Businessman Case

Pune Businessman Case: మగాళ్ళ బతుకు ఎంత దారుణంగా మారిపోయింది అంటే.. కట్టుకున్న భార్య చేతిలో సేఫ్టీ లేదు. కట్టుకోబోయే భార్య దగ్గర భద్రత లేదు. ప్రేమికురాలిని నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడ స్పాట్ పెట్టారో తెలియదు. ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో తెలియదు. ఎలా వేసేస్తారో కూడా తెలియదు.. ఒకటా రెండా.. ఎన్నో సంఘటనలు.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. జైలు శిక్షలు పడుతున్నాయి. మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితి మారడం లేదు. మారే అవకాశం కనిపించడం లేదు.

ఇటీవల పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడిని కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి అంతం చేసింది. అత్యంత ఎత్తైన కోట నుంచి కిందికి తోసి చంపేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు.. కాబోయే భార్యలు కూడా చాలా డేంజర్ అని.. వాళ్లతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన నిరూపించింది.

ఓ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలు ఓ పుస్తకం చదువుతోంది. ఆ పుస్తకం అట్ట మీద భర్తను ఎలా చంపాలి అని రాసి ఉంది. పైగా ఆ పుస్తకం భారీగా అమ్ముడుపోయింది కూడా. నేటి కాలంలో యూ ట్యూబ్ ను చూసి చాలామంది హత్యలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు భర్తలను ఎలా చంపాలో భార్యలు పుస్తకాలు చూసి తెలుసుకుంటున్నారు.

గత ఏడాది ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘు వంశీ తన భార్య చేతిలో హతమయ్యాడు. అతడిని మేఘాలయ విహారయాత్రకి తీసుకెళ్లిన భార్య.. తన ప్రియుడితో చంపించేసింది. ఈ సంఘటన గత ఏడాది దేశాన్ని ఉలిక్కి పడేవిధంగా చేసింది. ఇప్పుడు దానిని మించిపోయింది పూనే వ్యాపారవేత్త కేసు. వాస్తవానికి ఇలా మహిళలు ఎందుకు మారిపోతున్నారు.. ఏకంగా పుస్తకాలు చదివి భర్తలను ఎందుకు అంతం చేస్తున్నారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఒకవేళ నచ్చకపోతే వేరుగా ఉండవచ్చు.. విడాకులు కూడా తీసుకోవచ్చు. నచ్చిన వ్యక్తులతో జీవించవచ్చు. ఈ సౌలభ్యం మన రాజ్యాంగం అందించింది. కానీ వీటిని ఉపయోగించుకోకుండా.. అత్యంత దారుణాలకు పాల్పడడం. ఘోరాలకు ఒడికట్టడం అత్యంత పాపమని మానసిక విశ్లేషకులు అంటున్నారు.

ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక!

Andhra Pradesh Weather
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. మరోవైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై మొదటి వారం గడుస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో సర్వత్రా ఆందోళన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. శుక్రవారం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. జూలై 4 నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐదో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు విస్తరించే ఛాన్స్ కనిపిస్తోంది. వర్షం జాడ లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ ఫై ఆశలు వదులుకున్నారు రైతులు. వర్ష సూచన ఉందని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* ఆలస్యంగా రుతుపవనాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలో ప్రవేశించాయి. వాటి విస్తరణ కూడా మంద గమనంలో ఉన్నాయి. ఎల్ నినో ప్రభావం కూడా అధికంగా ఉంది. దీంతో వర్షాలు ఆశించిన స్థాయిలో పడడం లేదు. అయితే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడనుంది. రాజస్థాన్ వైపు పయనించవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, ఉత్తర భారత దేశంలో వర్షాల జోరు బాగా పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

* ఉత్తరాంధ్రకు హెచ్చరిక..
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. గురువారం రోజంతా ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలు పంపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి అని కూడా తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి ఢిల్లీ ఎం సి ఆర్ పరిధిలో భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఉపశమనం పొందారు . ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ వర్షాలు ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

సాంబ సార్.. మీ పచ్చ జర్నలిజం వర్ధిల్లాలి..

Samba Siva Rao TV5
Samba Siva Rao TV5

Samba Siva Rao TV5: మీడియా అనేది బాకాలు ఊదే వ్యవస్థగా మారిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇది ఇంకా చాలా దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలకు మౌత్ పీసుల మాదిరిగా మీడియా దిగజారిపోయింది. ఒక వార్త ప్రసారం అవుతోంది అంటే మీది ఏ పార్టీకి అనుకూలమైన భజన ఛానల్ అనే పరిస్థితి ప్రజల్లో వచ్చేసింది. మీడియా యాజమాన్యాల రాజకీయరంగుల వల్ల ప్రజలకు వాస్తవం అనేది తెలవకుండా పోతుంది. ఎవరికివారు భజన చేయడంలో పోటీపడుతున్నారు. యాజమాన్యాలు అలా ఉన్నాయంటే.. యాజమాన్యాల కింద పనిచేసే వారు మరింత ఘోరంగా తయారయ్యారు.

ఆయా చానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు పార్టీలకు డప్పు కొట్టడంలో.. భజన చేయడంలో ఒక స్థాయిని కూడా దాటిపోయారు. తాము చదువుతున్నది వార్తలనని.. లక్షల మంది జనం చూస్తున్నారని సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. చివరికి ఈ భజన కార్యక్రమం ఎక్కడ దాకా దిగజారింది అంటే.. సగటు కార్యకర్త కూడా బాధపడేలాగా.. ఎన్నడు ఈ స్థాయిలో తమ నాయకుడిని ఈ స్థాయిలో భుజాల మీద మోయలేని విధంగా మారిపోయింది.

ఓ చానల్లో పనిచేసే జర్నలిస్టు ఓ పార్టీకి భజన చేస్తుంటారు. ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఆ పార్టీకి మౌత్ పీస్ లాగా ఉంటుంది. ఆ చానల్ యజమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన దేవస్థానానికి చైర్మన్. అంతకుముందే ఆ ఛానల్ ఆ పార్టీకి వీర లెవెల్లో భజన చేసేది. ఇప్పుడు ఆయన దేవస్థానానికి చైర్మన్ కావడంతో ఆ భజన మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ లలో అయితే ఆ జర్నలిస్ట్ పసుపు దండకం చదువుతూ ఉంటాడు. ఒంటికి పసుపు రంగు పూసుకొని పోతురాజు మాదిరిగా కొట్టుకుంటూ ఉంటాడు.

అతడు ఇచ్చే ఎలివేషన్లు కేజిఎఫ్ సినిమాను కూడా దాటిపోయి ఉంటాయి. అసలు ఇటువంటి వ్యక్తులను జర్నలిస్టులు అనాలా.. దీనిని జర్నలిజం అని చెప్పుకోవాలా.. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఏముంటుంది. న్యూట్రల్ గా వ్యవహరించాల్సిన మీడియా ఇలా డప్పు కొట్టే వ్యవస్థ లాగా మారిపోవడం.. జర్నలిస్టులు ఇలా పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్న దుర్మార్గం.. ఇంతకంటే హీనం ఇంకొకటి ఏముంటుంది.. ఇంతకంటే డౌన్ ఫాల్ ఇంకొకటి ఉంటుందా.. దీనిని పాత్రికేయం అని ఎలా అంటారని.. విశ్లేషకులు చెబుతున్నారు. సమాజంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో.. అన్ని పార్టీలకు అనుకూలంగా మీడియా చానల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీడియా నుంచి నిష్పక్షపాతం వ్యవహరించడం.. ఎడారిలో నీటి కోసం వెతకడం లాంటిదేనని విశ్లేషకుల మాట.

'రావు బహదూర్' మహేష్ చేయాల్సిన సినిమానా ? సీక్రెట్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్...

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన రావు బహదూర్ సినిమా రేపు రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే రావు బహదూర్ సినిమా మొదట పెద్ద స్కేల్ లో రాసుకొని దానిని మహేష్ బాబుతో చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేసుకున్నారట. మహేష్ బాబు కి సైతం కథ వినిపించినప్పుడు ఆ క్యారెక్టర్ లో నటించడానికి మహేష్ కి ఇంట్రెస్ట్ వచ్చినప్పటికి అది తన ఇమేజ్ కి తగ్గ కథ కాదేమో అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఈ స్టోరీ ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

కానీ ఈ కథని ఏదైనా చిన్న హీరోతో చేయమని దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తే తనే ప్రొడ్యూస్ చేస్తానని కూడా మహేష్ చెప్పడంతో దర్శకుడు వెంకటేష్ మహా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తనకి మొదటి నుంచి మంచి ఫ్రెండ్ అయినా సత్యదేవ్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేశాడు. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

మొత్తానికైతే మహేష్ బాబు ఈ సినిమాతో టాప్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ఇప్పుడు ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరో పాన్ ఇండియా దర్శకుడితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రావు బహదూర్ సినిమా రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా తన కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగిలిపోతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన కూడా సక్సెస్ లు దక్కించుకోలేకపోతున్న సత్యదేవ్ ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

మీ పిల్లల్ని శ్రీ చైతన్యకి పంపిస్తున్నారా.. ఓసారి ఈ వీడియో చూడండి

Sri Chaitanya Central Kitchen
Sri Chaitanya Central Kitchen

Sri Chaitanya Central Kitchen: ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ విద్యాలయాలలోకి తరలిస్తారు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి అక్కడికి పంపిస్తుంటారు. పైగా ఆ విద్యాలయాలలో చదివించడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు
. మా వాడు ఫలానా కాలేజీలో చదువుతున్నాడు.. మేము అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నామని గొప్పగా చెబుతుంటారు.

తల్లిదండ్రుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ విద్యాలయాలు అడ్డగోలుగా ధనార్జనకు పాల్పడుతున్నాయి. అగ్గిపెట్టెల లాంటి భవనాలలో విద్యార్థులకు చదువులు చెబుతున్నాయి. గాలివీయదు. ఆడుకోవడానికి చోటు ఉండదు. కనీసం స్వేచ్ఛగా తిరగడానికి స్థలం కూడా ఉండదు. ఇక ఇటువంటి చోట పిల్లలకు వసతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కార్పొరేట్ విద్యాలయాలలో వంటలు ఉండే ప్రదేశాలు ఎలా ఉంటాయో గతంలో అనేక సందర్భాల్లో వీడియోల ద్వారా బయటికి వచ్చింది. అధికారుల తనిఖీల్లో కార్పొరేట్ కాలేజీల పన్నాగం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అధికారులు దాడులు చేయడంతో కార్పొరేట్ కాలేజీల కిచెన్ వ్యవహారాలు బయటపడ్డాయి..

ఇటీవల హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లోర్ తడిగా ఉండడాన్ని గమనించారు. వంట చేసే చోటు శుభ్రంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వంట వండడానికి ఉపయోగించే టమాటాలు కుళ్లిపోయాయి. కిచెన్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ఈగలు ఉన్నాయి. చెత్త డబ్బాల మీద మూతలు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల మధ్య పిల్లలకు ఎలా ఆహారం వండి పెడుతున్నారని అధికారులు ప్రశ్నించారు.

శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లోనే ఇలా ఉంటే.. ఇక మిగతా ప్రాంతాలలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఈగలు కూడా విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కిచెన్ పరిసర ప్రాంతాల్ని కనీసం శ్రీ చైతన్య యాజమాన్యం శుభ్రంగా ఉంచకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం ఇలా చేయడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రేవంత్ కట్టిన ఆ 200 కోట్ల క్యాంపు కార్యాలయం కథేంటి..

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వైరం రోజురోజుకు ముదిరి పాకాన పడుతోంది. రేవంత్ విమర్శలు చేయడం.. భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రతి విమర్శలు చేయడం.. పోటాపోటీగా సవాళ్లు విసురుకోవడం.. ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదం సాగుతోంది.

రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి మీద విమర్శల జోరు పెంచారు. ప్రతి సభలోను గణాంకాలతో సహా విమర్శలు చేస్తున్నారు. వీటికి గులాబీ పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇటీవల కేటీఆర్ ఒక కీలక ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 200 కోట్లు ఖర్చుతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రగతిభవన్ ఉందని.. అది అందుబాటులో ఉండగానే రేవంత్ రెడ్డి 200 కోట్లతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం కొత్త భవనం చుట్టూ రక్షణ గోడ నిర్మించడానికి 19 కోట్లు ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.. అంతేకాకుండా ముఖ్యమంత్రి తన సతీమణితో కలిసి కొత్త భవనంలోకి అర్ధరాత్రి పూట గృహప్రవేశం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అంత అర్ధరాత్రి పూట దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.

గతంలో కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా విభాగాలు రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టాయి. అప్పట్లో కూడా గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనం మీద విమర్శలు చేసింది. అసలు ఎందుకు ఈ స్థాయిలో భవన నిర్మించాలో చెప్పాలని డిమాండ్ చేసింది. మళ్లీ ఇప్పుడు కేటీఆర్ రంగంలోకి దిగి గృహప్రవేశం చేశారని రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ భవనం నిర్మించకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పాటికే ఎదురుదాడి చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉందంటే ఏదో జరుగుతోందనే అనుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మావిగన్ సరే.. ఆ వైసీపీ నేతల బాధ అంతా ఇంతా కాదు!

YCP
YCP

YCP: జగన్ మావిగన్ స్టాండ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఆందోళనకు కారణం అవుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్లు చాలామంది అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. ఏకంగా అమరావతి వర్సెస్ మావిగన్ అన్నట్టు వచ్చే ఎన్నికల అజెండాగా డిసైడ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. కనీసం పార్టీలో చర్చించకుండా ఎలా ప్రకటన చేస్తారని సీనియర్ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు తెగ బాధపడుతున్నట్లు సమాచారం. అప్పట్లో విశాఖకు పాలన రాజధానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సీనియర్లను పురమాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నఫలంగా విశాఖను మరిచి మళ్లీ మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో వారు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు అయితే కోపంతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

* పాలనా రాజధానిగా విశాఖ..
విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కచ్చితంగా విశాఖ నుంచి పాలన మొదలు పెడతామని చెప్పుకొచ్చారు. రుషికొండ భవనాలు అందుకోసమే అనేది బహిరంగ రహస్యమే. కానీ ఆ భవనాలు విషయంలో అప్పట్లో స్పష్టత ఇవ్వలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. కానీ పాలనా రాజధానిగా అన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు విశాఖ నుంచి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత కల్పిస్తుంటే అప్పటి టిడిపి, జనసేన నేతలు వ్యతిరేకించారని.. దీనిని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పడంతో.. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు విడమరిచి చెప్పారు. విశాఖకు రాజధాని వస్తే ఈ ప్రాంతమే మారిపోతుందని.. అందుకే ప్రజలు అర్థం చేసుకోవాలని అప్పట్లో గ్రామాలకు వెళ్లి మరి ధర్మాన ప్రసాదరావు ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా సైతం అభివృద్ధి చెందుతుందని.. మన జిల్లా సైతం రాజధాని ప్రాంతమేనని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పుకొచ్చారు.

* వైసీపీ సీనియర్ల కీనుక..
అయితే ఇప్పుడు మూడు రాజధానులను మడతపెట్టి.. మావిగన్ అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. మా స్టాండ్ మావిగన్ అని తేల్చి చెప్పారు. అమరావతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. దీంతో తమతో విశాఖ రాజధానికి మద్దతుగా ప్రచారం చేయించారని.. అటువంటప్పుడు ప్రజలకు ఎలా ముఖం చూపించుకుంటామని వారు ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. అటు అమరావతి రైతులకు వ్యతిరేకమై.. ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు మభ్యపెట్టి మనం చేసేది ఏంటి అని వైసిపి సీనియర్లు అంతర్మధనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్ననే దేవినేని అవినాష్ తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు అని తేల్చి చెప్పారు. ఇంతలోనే అమరావతికి వ్యతిరేకం అని జగన్ ప్రకటించేశారు. మరోవైపు రాయలసీమ నేతలు సైతం జగన్ రాజధాని స్టాండ్స్ పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కులం, మతం, రాజధాని.. ఏపీలో రాజకీయం!

Andhra Pradesh Politics
Andhra Pradesh Politics

Andhra Pradesh Politics: ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి చూస్తే.. వాటి మధ్య సారూప్యత కనిపిస్తోంది. కుల రాజకీయాలు కనిపిస్తున్నాయి. కుల సభలు పెరిగాయి. కులాల మధ్య, మతాల మధ్య విచ్చిన్నానికి ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ కేసు, గోదావరి జిల్లాలో కుల, మత వివాదాలు.. ఆపై జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్పష్టత.. ఇలా వీటన్నింటికీ సారూప్యత ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లి.. వైసిపి రాజకీయ లబ్ది పొందే ఆరాటంగా కనిపిస్తోంది.

* వైసీపీ దూకుడు..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గతం మాదిరిగా వ్యవహరిస్తోంది. ఒకవైపు కుల రాజకీయాలు, ఇంకోవైపు రాజధానిపై కుట్రలు, కొత్త ప్రతిపాదనలతో సిద్ధం అవుతోంది. కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది. అది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమోదంగా లేదు. పైగా ప్రభుత్వ వైఫల్యాలపై కంటే.. తమ పాత రాజకీయాన్ని పదును పెడుతోంది. కాపుల అంశంతో పాటు ఇతర సామాజిక వర్గాల ద్వారా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా రియాక్ట్ కావడం లేదు. దీంతో వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది.

* సాయి కృష్ణ కేసు..
సాయి కృష్ణ కేసుకు సంబంధించి చాలా ఆశించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎంతలా అంటే గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం లో లబ్ధి పొందే మాదిరిగా.. ఇదో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ఆశించింది. అందుకే నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. భారీ ఉద్యమానికి ప్లాన్ చేశారు. కానీ అదే సాయి కృష్ణకు నేరచరిత్ర ఉండడం.. చాలా తీవ్రమైన కేసులు నమోదు కావడం.. వైసిపి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కంటే.. తీవ్ర నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా చూపడంతో కాపు రాజకీయం వర్కౌట్ కాలేదు.

* మత ప్రాతిపదికన..
రఘురామకృష్ణం రాజుకు వ్యతిరేకంగా.. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు గోదావరి జిల్లాలో.. ఒక కులం మాటున.. మతం మాటున నిర్వహించిన సభ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బహిరంగ రహస్యం. ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పై ఘోరంగా మాట్లాడారు. వారందరిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. అయితే పబ్లిక్ లో దీనిపై రియాక్ట్ వేరేలా ఉంది. అటువంటి వారిని అరెస్టు చేయాలన్న డిమాండ్ వచ్చిన తర్వాతనే పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ మాది అంటూ తేల్చి చెప్పారు. ఇలా వరుస పరిణామాలు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించేందుకే ఈ గేమ్ ఆడుతోందని స్పష్టమవుతోంది.

జగన్ పై కేంద్రం సీరియస్!

Jagan
Jagan

Jagan: రాష్ట్రాల రాజధానుల అంశం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం పై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోదు కూడా. అందుకే అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చినా కేంద్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. అయితే వైసిపి వచ్చిన తర్వాత అమరావతి పై స్టాండ్ మారింది. అయినా కేంద్రం కానీ.. ప్రధాని కానీ కలుగజేసుకోలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పై మాత్రం కేంద్ర పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

* అప్పట్లో అలా..
2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం. అప్పట్లో బీజేపీ వైఖరిని విపరీతంగా వ్యతిరేకించారు చంద్రబాబు. దానిని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జగన్. ఎన్డీఏ లో నేరుగా వైసీపీ చేరలేదు కానీ అంతకుమించి ప్రయోజనం, స్వేచ్ఛ లభించింది జగన్మోహన్ రెడ్డికి. అయితే అమరావతి విషయంలో చంద్రబాబుకు క్రెడిట్ దక్కకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి భావన. అందుకే అమరావతి పై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి రాజకీయ కారణాలు అన్నది లేకపోలేదు. ఆపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులపై కలుగజేసుకోకూడదు అనే నిబంధన కూడా ఉంది.

* రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా..
కానీ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది. రైల్వే తో పాటు రోడ్ల ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. 12 ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి భవనాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం అయింది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. ప్రజలు తీర్పు స్పష్టంగా ఇచ్చిన.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. అందుకే కేంద్రం జగన్మోహన్ రెడ్డి తీరుపై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

సుకుమార్ - రామ్ చరణ్ మూవీ మైథాలజికల్ థ్రిల్లర్ గా రాబోతోందా..?మెగా పవర్ స్టార్ ఆ దేవుడిలా కనిపిస్తాడా..?

Ram Charan And Sukumar
Ram Charan And Sukumar

Ram Charan And Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. రీసెంట్ గా ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించకపోయిన కూడా ఆయన కష్టమైతే వృధాగా పోలేదు. ఆయన ఆ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్కడికి కనిపిస్తోంది. సుకుమార్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన విపరీతంగా కష్టపడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఒక మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటివరకు ఉన్న ప్రతి హీరో కూడా మైథిలాజికల్ టచ్ ఉన్న సినిమాలతోనే ముందుకు సాగుతున్నారు. ప్రభాస్ కల్కి మూవీలో కర్ణుడిగా కనిపిస్తే మహేష్ బాబు వారణాసిలో రాముడిగా, గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఎన్టీఆర్ కుమారస్వామి గా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా పరశురాముడి కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. సుకుమార్ సినిమాలో పరుశురాముడి క్యారెక్టర్ చాలా కీలకపాత్ర వహించబోతుందట. దాన్ని బేస్ చేసుకొనే కథలు రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ కొద్దిసేపు పరుశురాముడి క్యారెక్టర్ లో కనిపించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…

పురాణాల్లో పరుశురాముడి కి చాలా మంచి పేరైతే ఉంది. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం రాజా వంశస్థుల యొక్క గర్వాన్ని అణిచివేయడానికి ఆయన ముల్లోకాలు తిరిగి రాజు అనే వాడు లేకుండా ప్రతి ఒక్కరిని నరికి చంపాడు. అలాంటి ఒక వీరత్వం గల రాముడి క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఓవరాల్ గా ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనే విషయం పక్కన పెడితే మైథాలాజికల్ టచ్ తో పరుశురాముడి కథను బేస్ చేసుకొని సినిమా సాగబోతుందట. ఈ మూవీలో రామ్ చరణ్ ఎంతసేపు పరాశరముడిగా కనిపించబోతున్నాడు.

ఈ స్టోరీ మైథాలాజికల్ కథతో ముడిపడి ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలియాలంటే సుకుమార్ ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది. తొందరలోనే సినిమాకి సంబంధించిన కథను కూడా సుకుమార్ రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

'లెనిన్' మూవీ చూసి హిట్టో? ఫట్టో? చెప్పేసిన స్టార్ డైరెక్టర్...

Lenin Movie Collections
Lenin Movie Collections

Lenin Movie: అక్కినేని అఖిల్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి నిరాశను మిగిల్చాయి. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాల పైన అవుతున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ ని సాధించలేదు. ఇక ఈనెల 10వ తేదీన లెనిన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో అఖిల్ ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను శరవేగంగా నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ను కనక మనం చూసినట్లయితే అందులో అఖిల్ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది అనిపించేలా కనిపించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో తన పాత్ర ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాని కొంతమంది సినిమా ప్రముఖులైతే చూశారు. ఇక ఇప్పటికే ఫస్ట్ కాపీ వచ్చేసింది.

కాబట్టి ఈ సినిమాని కొంతమంది సినిమా ప్రముఖుకులకైతే చూపించారు. అందులో కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌత్ ఈ సినిమాని చూశారట. త్రివిక్రమ్ ఈ సినిమా మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

అందులో ఒకటి రెండు చిన్న మార్పులను చెప్పిన త్రివిక్రమ్ ఈ సినిమాతో అఖిల్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తాడు అంటూ కొన్ని కామెంట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ లాంటి హీరో ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు తన మనుగడను ఎలా కొనసాగిస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే లెనిన్ సినిమా తన మీద విమర్శలు చేసేవారికి సమాధానం చెబుతుందంటూ మరికొంతమంది అఖిల్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక లెనిన్ సినిమా అతను అనుకున్న సక్సెస్ ని కట్టబెడుతుందా? తనని స్టార్ హీరోగా మారుస్తుందా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…