Home Blog Page 242

ప్రియురాలు కోసం జీపులతో ఫైట్.. బెజవాడలో రెచ్చిపోయిన ప్రియులు.. చివరకు ట్విస్ట్

Vijayawada Jeep Fight Over Girlfriend
Vijayawada Jeep Fight Over Girlfriend

Vijayawada Jeep Fight Over Girlfriend: ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. సన్నిహితంగా ఉండేవారు. పైగా బడా బాబుల పిల్లలు. ఈ తరుణంలో అమ్మాయి కోసం ఇరువురు విభేదించుకున్నారు. గొడవలకు దిగారు. బహిరంగంగా రోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే ప్రయత్నం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహిత కుటుంబాలకు చెందిన వారిగా పోలీస్ విచారణలో తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్ననే గురువారం రాత్రి విజయవాడ నగరంలో రెండు జీపులు ఎదురెదురుగా పలుమార్లు ఢీకొట్టుకునే ప్రయత్నం చేశాయి. అందులో ఒక వాహనం చక్రం ఊడి పడడంతో అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. అయితే ఇదంతా మత్తులోనే జరిగినట్లు పోలీస్ విచారణలో తేలింది.

* స్నేహితులే శత్రువులుగా మారి..
విజయవాడ నగరంలో రోహిత్, ఓం అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. దాదాపు వారిద్దరూ 20 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారే. నగరంలో పేరు మోసిన వ్యాపార కుటుంబాలకు చెందినవారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న తరుణంలో రోహిత్ కోసం ఆయన గర్ల్ ఫ్రెండ్ వద్ద ఓం తప్పుగా చెప్పాడు అనేది రోహిత్ అనుమానం. తన గురించి ఎందుకు తప్పుగా చెప్పావు అంటూ రోహిత్ ఫోన్ చేసి ఓం ను అడిగాడు. మొన్న గురువారం ఉదయం నుంచి వారి మధ్య ఫోన్లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఓం దమ్ముంటే తన వద్దకు రావాలి అంటూ సవాల్ చేశాడు. దీంతో గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన వాహనంలో వచ్చాడు రోహిత్. వస్తూ వస్తూనే ఇద్దరు వాహనాలను ఢీ కొట్టించారు. వాహనాలతోనే ఫైట్ జరిపారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి రోహిత్ తన వాహనంతో పారిపోయాడు. ఓం మాత్రం దొరికిపోయాడు.

* ఒకరికి పాజిటివ్..
జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఓం మత్తు పదార్థాలు తీసుకుని ఉంటాడని అనుమానించారు. నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా ఒక ఇంజక్షన్ సిరంజితో పాటు ఎలక్ట్రిక్ సిగరెట్ దొరికింది. రోహిత్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మాత్రం నెగిటివ్ వచ్చింది.వారి ఇళ్లల్లో తనిఖీ చేశారు. అయితే ఎక్కడ ఏం పట్టుబడలేదు. కానీ వారి ఫోన్లలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు జోగి రమేష్ కు చెందిన సన్నిహిత కుటుంబాల పిల్లలుగా తెలుస్తోంది. అయితే విజయవాడలో ఇటువంటి కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వ మూలాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.

భక్తుడికి.. భగవంతుడికి మధ్య నేను అగరుబత్తిని కాను.. బండ్ల గణేష్ పై చిరు సెటైర్.. నవ్వుకున్న పవన్...

Pawan Kalyan Bandla Ganesh Funny Moment
Pawan Kalyan Bandla Ganesh Funny Moment

Pawan Kalyan Bandla Ganesh Funny Moment: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అడపాదడప సినిమాలను చేస్తు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పాలంటే అది కేవలం బండ్ల గణేష్ కు మాత్రమే సాధ్యమవుతుందనే విషయం మనందరికి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను దూరంగా పెట్టాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.

కానీ ఎట్టకేలకు వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘మెగా 158’ సినిమా ఓపెనింగ్ రోజున పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక అతనితో పాటు బండ్ల గణేష్ కూడా ఆ ఈవెంట్ కి వచ్చాడు. అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు బండ్ల గణేష్ ఫోటో దిగుతున్న సందర్భంలో చిరంజీవి ని కూడా ఆ ఫోటోలో ఇన్వాల్వ్ కావాలని బండ్ల గణేష్ పిలవడంతో చిరంజీవి నవ్వులు పూయించే ఒక కామెంట్ అయితే చేశాడు.

ఇంతకీ చిరంజీవి ఏమని కామెంట్ చేశాడు అంటే మీరిద్దరూ ఫోటో దిగుతుంటే ‘నేనెందుకయ్య మీ మధ్య దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం అగరబత్తిలాగా ‘ అంటూ ఒక కామెడీ పంచ్ పేల్చాడు. ఆయన కామెడీ టైమింగ్ కి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. నిజానికి బండ్ల గణేష్ మైక్ పట్టుకున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ తన దేవుడు అని చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్…

తనను కెరియర్ పరంగా సెట్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ ఏ కాబట్టి అతని మీద తనకు ఎప్పుడు కృతజ్ఞత ఉంటుందని అలాగే పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ పలు సందర్భాల్లో చెప్పాడు. దాన్ని ఉద్దేశించే చిరంజీవి ఆ కామెంట్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో ప్రతి ఒక్కరు ఆ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు…

వైసిపి పేటీఎం.. తేల్చి చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్!

Professor Nageshwar YCP Paytm Comments
Professor Nageshwar YCP Paytm Comments

Professor Nageshwar YCP Paytm Comments: ప్రొఫెసర్ నాగేశ్వర్.. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వినిపించే మాట ఇది. అత్యుత్తమ రాజకీయ విశ్లేషకుడిగా చెరగని ముద్ర ఆయన సొంతం. ఏదైనా అంశంపై విశ్లేషించారంటే అందులో ఉన్న లోటు పాట్లను ఇట్టే చెబుతారు. ఎవరిని నొప్పించే పరిస్థితి ఉండేది కాదు. క్లాస్ రూమ్ లో పాటలు చెబితే విద్యార్థులు శ్రద్ధగా వినేవారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవారు. టీవీ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొంటే ఎంతగానో ఆసక్తిగా చూసేవారు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యారు అంటే ఆయన స్టామినా అటువంటిది. ఏ పార్టీ వారితోనైనా మంచి అనుబంధం కొనసాగించడం ఆయనకే సొంతం. దశాబ్దాలుగా రాజకీయ విశ్లేషణలో చెరగని ముద్ర అయినది. కానీ ఇటీవల ఆయన విశ్లేషణలో భాగంగా వెల్లడించిన అంశాలపై క్షమాపణలు చెప్పారు. బే షరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

* రాజకీయ వివాదం..
కొద్ది రోజుల కిందట ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన అంశాన్ని బయటపెట్టారు. తన విశ్లేషణలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారని.. తన పార్టీకి చెందిన సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ భేటీలో పాల్గొన్నారని.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారని.. అందుకు అమిత్ షా తిరస్కరించారని.. చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్.. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ తేల్చారని.. క్లాస్ కూడా పీకారని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఏపీ రాజకీయాల్లో ఇదో కుదుపుగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై జనసేన తో పాటు టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో నాగేశ్వర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి.

* సోషల్ మీడియాలో ప్రచారంపై..
ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేటీఎం అంటూ ప్రచారం మొదలైంది. ఇంకోవైపు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదయింది. 24 గంటల లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పోలీస్ కేసుతో చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని జనసేన హెచ్చరించింది. దీంతో ఓ టీవీ ఛానల్ ద్వారా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అయినా సరే సోషల్ మీడియాలో నాగేశ్వర్ కు వ్యతిరేకంగా ప్రచారం ఆగడం లేదు. ఈ తరుణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నాగేశ్వర్. గతంలో ఇదే చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తనకు మద్దతు తెలిపారని.. గతంలో పవన్ కళ్యాణ్ తటస్థులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తనను ప్రత్యేకంగా పిలిచారని.. బిజెపి అగ్ర నేతలు అంత టచ్ లో ఉంటారని.. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనను మొన్నటికి మొన్న వ్యతిరేకించానని.. అటువంటి తనపై పేటీఎం ముద్ర వేయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఒక యుద్ధంతో పోల్చిన ఆయన.. కచ్చితంగా దీనికి సమాధానం చెబుతానని హెచ్చరించడం విశేషం.

బీచ్ లో అందాల సౌరభం..చూసి తట్టుకోవడం కష్టమే

Ruhi Singh Beach Look
Ruhi Singh Beach Look

తెలంగాణ మండిపోతుంటే ఏపీలో ఫుల్లు వాన.. ఇదేం విచిత్రం

Andhra Pradesh Heatwave
Andhra Pradesh Heatwave

Telangana Heatwave: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలు తీవ్రత అలానే ఉంది. ఆపై వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే తెలంగాణలో వర్షం జాడలేదు. ఏపీలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి సాయంత్రం వరకు.. తరువాత వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడం విశేషం. అయితే తెలంగాణ మాత్రం నిప్పుల కొలిమిగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 47 డిగ్రీలు దాటుతోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అలానే ఉంది. దీంతో ప్రజలు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఏపీలో కూడా అదే తీవ్రతతో ఎండలు కాస్తున్నా.. వర్షాలు కురుస్తుండడం మాత్రం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

* చాలా చోట్ల వర్షాలు..
ఏపీలో చాలా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడింది. విశాఖ నగరవ్యాప్తంగా వర్షం పడగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. నెల్లూరు నగరంలో కూడా వర్షం పడింది. ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో ప్రజలు సేదతీరారు. అనంతపురం జిల్లాలో కూడా వర్షం పడింది. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, చిత్తూరు జిల్లాలో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం తో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యంలో సైతం ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.

* ఎండల తీవ్రత అధికం
..
మరోవైపు ఏపీవ్యాప్తంగా ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. నిన్న 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది కొన్ని ప్రాంతాల్లో.. ఈరోజు ఏపీలో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం 13 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదయింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రవడగాలులు, 221 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. అయితే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది. అందుకే రైతులు, రైతు కూలీలు, పశువుల పెంపకం దారులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, స్తంభాల వద్ద నిల్చో వద్దని సూచిస్తోంది. అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుండడం గమనార్హం.

లోకేష్ పనికి కడప జిల్లా ప్రజలు ఫిదా!

Lokesh Helping Student
Lokesh Helping Student

Nara Lokesh Kadapa Tour: మంత్రి నారా లోకేష్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన సామాన్య జనాలతో మమేకం అవుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది. ఆయనలో ఉన్న నాయకత్వాన్ని తెలియజేస్తోంది. ఆయన మంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పాలనలోను విప్లవాత్మక మార్పులు చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారు. మరోవైపు రాజకీయంగాను రాటు దేలుతున్నారు. అయితే తాజాగా అయిన కడప పర్యటనకు వెళ్లారు. కడప అంటే తెలుసు కదా రాజశేఖర్ రెడ్డి కుటుంబ అడ్డా. అటువంటి చోట కూడా నారా లోకేష్ కు అక్కడి ప్రజలు ఎంతగానో స్వాగతం పలికి.. ఆత్మీయంగా కలిసి పోయారు. నారా లోకేష్ సైతం వారితో మమేకం అయిన తీరు మాత్రం అదుర్స్.

* వ్యవసాయ క్షేత్రం సందర్శన..
జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు మంత్రి నారా లోకేష్. ప్రోటోకాల్ పక్కన పెట్టి ద్వారకానాథ్ రెడ్డి అనే రైతు క్షేత్రాన్ని పరిశీలించారు. చాలా సమయం అక్కడే గడిపారు. రైతు దంపతులు ఆత్మీయంగా లోకేష్ కు స్వాగతం పలికారు. తాము చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి లోకేష్ కు వివరించారు. ప్రతి వివరాన్ని తెలుసుకున్నారు నారా లోకేష్. యువ రైతుకు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు కడప జిల్లాలో లోకేష్ పై బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇదే జిల్లాకు చెందిన వారైనా.. తమ వాడు అని కడుపులో పెట్టుకున్నా.. లోకేష్ మాదిరిగా ఆత్మీయత చూపిన సందర్భాలు లేవని అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు.

* జగన్ తో పోలిక..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే కడప జిల్లాలో ప్రత్యేక గౌరవం. దానికి కారణం జగన్ కాదు. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కాదు. వన్ అండ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి. పేదల కోసమే ఆయన వైద్య వృత్తి తీసుకున్నారు. ప్రజలతో మమేకమై పని చేసేవారు. వారికి ఆప్యాయత పంచేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరిగా వ్యవహరించిన సందర్భం లేదు. అయితే రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని ఆరాధించారు కడప జిల్లా ప్రజలు. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థులను సైతం అలానే చూసేవారు. ఈ క్రమంలో చంద్రబాబుపై భిన్నాభిప్రాయం ఉండేది. లోకేష్ పై సైతం వేరు వేరు అభిప్రాయాలు ఉండేవి. కానీ గత రెండేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు, పాలనా సంస్కరణలు చూస్తున్నారు. అయితే లోకేష్ కడప జిల్లాకు వచ్చి సామాన్యులతో మమేకం అవుతున్న తీరు అక్కడి ప్రజలను ఆకట్టుకుంటుంది. గతంలో జగన్ ఎన్నడూ ఇటువంటి వి చెయ్యలేదని.. తాము గుండెల్లో పెట్టుకోవడమే కానీ.. అంటూ పెదవి విరుస్తున్నారు కడప ప్రజలు. లోకేష్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.

100కు 102 మార్కులా? ఎవడ్రా ఇది దిద్దింది.. పాస్ చేసింది..

Odisha CHSE 102 Marks Issue
Odisha CHSE 102 Marks Issue

Odisha CHSE 102 Marks Issue: సాధారణంగా ఒక పరీక్షలో వందకు వంద మార్కులు సాధించడమే గొప్ప విషయంగా భావిస్తాం. దాదాపు ఇది సాధ్యం కాదు. కనీసం ఒక్క మార్క్ అయినా తేడా ఉంటుంది. కానీ ఓ చోట ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక విద్యార్థికి వందకు ఏకంగా 102 మార్కులు వచ్చాయి. ఈ ఘటన విద్యాశాఖలో కలకలం రేపడమే కాకుండా, ఫలితాల తయారీలో ఉన్న లోపాలను ఎత్తిచూపింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? దీనిపై ఎలాంటి చర్చ సాగుతోంది.

ఒడిశా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (CHSE)ఇటీవల 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో విశ్వజీత్ అనే విద్యార్థికి ఇంగ్లీష్ సబ్జెక్టులో ఏకంగా 102 మార్కులు వచ్చాయి. ఈ సంఖ్యను చూసిన ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వందకు వంద మార్కులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పరిమితిని మించి మార్కులు రావడంతో ఇది ఎలా సాధ్యమైందనేది పెద్ద చర్చకు దారితీసింది.

ఈ ఫలితాలు బయటకు రాగానే విద్యా వ్యవస్థలోని వాల్యుయేషన్ పద్ధతులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వేల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన బోర్డు పరీక్షల్లో ఇంతటి నిర్లక్ష్యం ఎలా జరుగుతుంది? అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మూల్యాంకనం, మార్కుల నమోదు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల విద్యార్థుల శ్రమ వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు, ఇది పూర్తిగా సాంకేతిక తప్పిదమేనని స్పష్టం చేశారు. మార్కులను కంప్యూటరైజ్ చేసే క్రమంలో జరిగిన ‘సాఫ్ట్‌వేర్ గ్లిచ్’ వల్లే ఈ పొరపాటు దొర్లిందని వారు పేర్కొన్నారు. మానవ తప్పిదం కంటే కూడా, డేటా ఎంట్రీ లేదా సిస్టమ్ లోపం వల్లనే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు.

ఈ పొరపాటును గుర్తించిన వెంటనే సదరు విద్యార్థికి సరైన మార్కులను కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది, వారం రోజుల్లోనే సవరించిన మార్కుల జాబితాను జారీ చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

నుంచి కొత్త ఫోన్లు.. డిస్ ప్లే మాములుగా ఉండదు..

Xiaomi 17T Series
Xiaomi 17T Series

Xiaomi 17T Series: xiaomi కంపెనీ కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడంలో ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా 17T సిరీస్ ను మొదటిసారిగా రెండు వేర్వేరు సైజుల ఫ్లాగ్షిప్ డిస్ప్లే వెర్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువస్తోంది . ఈ సిరీస్‌లో స్టాండర్డ్ Xiaomi 17T, Xiaomi 17T Pro అనే రెండు మోడల్స్ ఉంటాయి. ఈ మొబైల్స్ లో ట్రిపుల్ కెమెరా ఉండడంతో పాటు వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఫీచర్లు ఉండనున్నాయి. అయితే ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి? వీటి వివరాల్లోకి వెళితె..

షియోమీ 17T సీరిస్ లో భాగంగా Xiaomi 17T 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్ ను అందిస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌ని కలిగి ఉంటుంది. అయితే 17T Pro మరింత పెద్దగా 6.83-అంగుళాల AMOLED స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్ తో నాణ్యమైన డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ అధిక 144Hz రిఫ్రెష్ రేట్‌ని ఆఫర్ చేస్తుంది.

17T సీరీస్ లోని రెండు మొబైల్ MediaTek Dimensity 8500 Ultra చిప్‌సెట్‌ని కలిగి ఉంటుంది. దీనికి 12GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్‌ని సపోర్టు చేస్తుంది. అలాగే ఈ మొబైల్ లో 6,500mAh బ్యాటరీ ఉండగా.. 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 17T Pro మరింత శక్తివంతమైన MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌, 7,000mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 100W వైర్డ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ని సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగంలో, రెండు మోడల్స్‌లోనూ Leica Summilux మూడు కెమెరా సెటప్ ను అమర్చారు. ఇవి 50MP మెయిన్ కెమెరా ఉండగా.. 50MP టెలిఫోటో తో పాటు 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా ఉండనుంది . 17T Proలో 50MP Light Fusion 950 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. స్టాండర్డ్ 17T 5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో తో 120x డిజిటల్ జూమ్‌ని సపోర్ట్ చేస్తుంది.

గ్లోబల్ లో ఈ రెండు మొబైల్స్ May 28న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో స్టాండర్డ్ Xiaomi 17T జూన్ 4న లాంచ్ అవుతుంది.కానీ రెండు మోడల్స్ భారతదేశంలో అందుబాటులో ఉంటాయా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు.

అడవికి రాజైనా.. సింహానికి ఈ జంతువులంటే భయం..

Lion Afraid Of Animals
Lion Afraid Of Animals

Lion Afraid Of Animals: అడవికి రాజుగా పేరుగాంచిన సింహం ఎంతో బలమైన జంతువు. కానీ ప్రకృతిలో కొన్ని జంతువులు పరిస్థితులను బట్టి సింహాన్ని కూడా చంపగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి తమ బలం, వేగం, విషం లేదా గుంపుగా దాడి చేసే స్వభావంతో సింహానికి పెద్ద ప్రమాదంగా మారుతాయి. ఇప్పుడు అలాంటి జంతువులు ఏవి? అవి ఎక్కడ ఉంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం.

ఏనుగు (African Elephant):
ఏనుగు భూమిపై అతిపెద్ద భూజంతువు. ఒక పెద్ద ఏనుగు బరువు 5 నుంచి 6 టన్నుల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ ఏనుగులు కోపంగా మారితే సింహాలపై దాడి చేస్తాయి. తమ పిల్లలను రక్షించేందుకు ఏనుగులు గుంపుగా సింహాలను తరిమేస్తాయి. కొన్ని సందర్భాల్లో కాళ్లతో తొక్కి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఆఫ్రికా అడవులు, సవానా ప్రాంతాల్లో కనిపిస్తాయి.

ఖడ్గమృగం(Rhinoceros):
ఖడ్గమృగం చాలా దూకుడు స్వభావం కలిగిన జంతువు. దీని ముక్కుపై ఉండే కొమ్ము అత్యంత ప్రమాదకరం. సింహం దాడి చేసినా ఖడ్గమృగం ఒక్కసారిగా ఎదురుదాడి చేస్తే సింహం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా ఆఫ్రికా, భారతదేశంలోని కొన్ని అడవుల్లో ఉంటాయి.

హిప్పోపోటమస్(Hippopotamus):
హిప్పో నీటిలో ఉండే అత్యంత ప్రమాదకర జంతువుల్లో ఒకటి. దీని దవడ బలం చాలా ఎక్కువ. సింహం నీటి దగ్గర వేటకు వచ్చినప్పుడు హిప్పో దాడి చేస్తే తప్పించుకోవడం కష్టం. ఒక్క కాటు వల్లే భారీ గాయాలు అవుతాయి. ఇవి ఆఫ్రికాలోని నదులు, చెరువుల్లో నివసిస్తాయి.

మొసలి( Nile Crocodile):
నైల్ మొసలి నీటిలో అత్యంత శక్తివంతంగా పోరాడతుంది. నీళ్లు తాగేందుకు వచ్చిన సింహాలపై ఒక్కసారిగా దాడి చేస్తుంది. నీటిలోకి లాగి ముంచి చంపే సామర్థ్యం దీనికి ఉంది. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా నదుల్లో కనిపిస్తాయి.

అడవి ఎద్దు (కేప్ బఫెలో) (African Buffalo):
ఆఫ్రికన్ బఫెలోను ‘బ్లాక్ డెత్ ’ అని కూడా పిలుస్తారు. గుంపుగా తిరిగే ఈ జంతువులు సింహాలపై తీవ్రంగా ఎదురుదాడి చేస్తాయి. కొమ్ములతో పొడిచి సింహాలను చంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఆఫ్రికా గడ్డి భూముల్లో ఎక్కువగా ఉంటాయి.

హైనా గుంపులు (Spotted Hyena):
ఒక హైనా సింహాన్ని చంపడం అరుదు. కానీ పెద్ద గుంపుగా ఉంటే సింహంపై దాడి చేసి చంపగలవు. ముఖ్యంగా బలహీనమైన లేదా గాయపడిన సింహాలను టార్గెట్ చేస్తాయి. ఇవి ఆఫ్రికా అడవులు, గడ్డి మైదానాల్లో కనిపిస్తాయి.

ఈ రాశుల వారికి ఈ రోజు అన్నింటా విజయమే..

Today 23 May 2026 Horoscope
Today 23 May 2026 Horoscope

Today 23 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు జీవితంలో అనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. అకారణంగా ఎవరితో వాదనలకు దిగకుండా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూలమైన వాతావరణఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలు పాలు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉన్నంత మేరకే ఖర్చులు పెట్టాలి. కొందరు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని కారణాలతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొందరు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు వెంటనే పూర్తి చేస్తారు. ఎవరితోనైనా వాదనలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు వ్యాపారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. మానసికంగా నిరాశతో ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో నష్టపోయే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తిపై శుభవార్తలో వింటారు. కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు వెంటనే పూర్తి చేస్తారు. ఇంట్లో రహస్యాలు బయటకు చెప్పకపోవడమే మంచిది. పాత స్నేహితులు కలవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఇతరులకు దానధర్మాలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థుల విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం

Telugu Badi annual celebrations

– విదేశీ నేలపై తెలుగు భాషా వైభవానికి అద్భుత వేదిక

Telugu Badi annual celebrations : అమెరికాలో తెలుగు భాషా పరిరక్షణ, సంస్కృతి పరంపరలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో కొనసాగుతున్న తెలుగు బడి మరో విజయవంతమైన అధ్యాయాన్ని పూర్తి చేసింది. మే 16, 2026న నెబ్రాస్కా తెలుగు సమితి మరియు తానా పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు బడి వార్షికోత్సవం.. గ్రాడ్యుయేషన్ వేడుకలు అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. విదేశీ నేలపై తెలుగు భాష పట్ల చిన్నారుల్లో పెరుగుతున్న అభిమానం ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది.

2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన 62 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు. చిన్నారుల చిరునవ్వులు, తల్లిదండ్రుల ఆనందం, ఉపాధ్యాయుల సంతృప్తి కలిసి సభను భావోద్వేగభరితంగా మార్చాయి.

ఈ సందర్భంగా నెబ్రాస్కా తెలుగు సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మూలాలకు ప్రతిబింబమని అన్నారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో పాటు తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో తప్పకుండా తెలుగులో మాట్లాడాలని సూచించారు. తెలుగు మాట్లాడటం ద్వారా పిల్లలు తమ వారసత్వానికి మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు.

అలాగే నెబ్రాస్కా తెలుగు సమితి, తానా పాఠశాల మధ్య ఏర్పడిన సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఈ బంధాన్ని బలోపేతం చేయడంలో రాజా కాసుకర్తి గారి పాత్ర విశేషమని కొనియాడారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన భాను గారు, శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో తెలుగు బడి ప్రధానోపాధ్యాయులు వేణు మురకొండ గారు కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వారి నాయకత్వం, అంకితభావం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను శ్వేత బొడెపూడి, పావులూరి సత్యనారాయణ, నవీన్ కంటెం మరియు నాగరాజు ముద్దెల్లి గారు విద్యార్థులకు అందజేశారు. తెలుగు భాషను ప్రేమగా నేర్చుకుని ధైర్యంగా మాట్లాడాలని పిల్లలను ప్రోత్సహించారు.

తెలుగు బడి ఉపాధ్యాయులు రాజా, ఉమా, పవిత్ర, దివ్య, సుధీర్, స్వప్న, వీణామాధురి, సువర్ణరేఖ, మౌనిక, సుహిత మరియు తనూజ గారు విద్యార్థుల్లో తెలుగు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో విశేష కృషి చేశారు. వారి సహనం, ప్రేమతో కూడిన బోధనను తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.

సర్టిఫికెట్లను అందుకుంటున్న సమయంలో పలువురు ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు బడి కేవలం భాషను నేర్పించే వేదిక మాత్రమే కాకుండా, పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను చేరవేసే ఒక కుటుంబమని భావోద్వేగంగా తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, విదేశాల్లో పెరుగుతున్న తమ పిల్లలు తెలుగు మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు బడి చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.

సర్టిఫికెట్ల పంపిణీ అనంతరం పిల్లల కోసం ఫేస్ పెయింటింగ్, సరదా ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. శ్వేత గారు పిల్లలకు ఫేస్ పెయింటింగ్ చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపగా, దివ్య, పవిత్ర, మౌనిక గారు నిర్వహించిన ఆటలు చిన్నారులను ఆకట్టుకున్నాయి. పిల్లల కోసం పిజ్జా, స్నాక్స్ మరియు ఇతర అల్పాహారాలను నెబ్రాస్కా తెలుగు సమితి సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

మొత్తంగా ఈ వార్షికోత్సవం కేవలం ఒక విద్యా కార్యక్రమంగా కాకుండా, విదేశీ నేలపై తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది. భావితరాల్లో తెలుగు పట్ల ప్రేమ, గౌరవం, అనుబంధాన్ని పెంపొందిస్తూ, మన భాషా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లేలా చేస్తున్న తెలుగు బడి సేవలు ప్రశంసనీయమని అందరూ అభిప్రాయపడ్డారు.

ఎన్ని గంటలైనా షాపింగ్ చేయండి.. మీ బ్యాగులు మేము మోస్తాం.. ఇది యాపారం

Delhi Shopping Bag Carrier Service
Delhi Shopping Bag Carrier Service

Delhi Shopping Bag Carrier Service: ముంబైలో డబ్బా వాలాలు ఉంటారు. వీరు సైకిళ్లకు క్యారేజీ బాక్సులు కట్టుకొని పెద్దపెద్ద ఆఫీసులకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి రాసిన పేరున్న వ్యక్తికి క్యారేజ్ బాక్స్ ఇచ్చి వస్తారు. ఇలా ఇచ్చినందుకు ప్రతినెల కొంతమేర రుసుము వసూలు చేస్తారు. చదువుతుంటే ఇది చిన్న వ్యవహారం లాగానే ఉంటుంది. కానీ ముంబై నగరంలోనే కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కేవలం క్యారేజి బాక్స్ ఇచ్చి రావడాన్ని చాలామంది ఆదాయ వనరుగా రూపొందించుకున్నారు. దీని ఆధారంగా వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. డబ్బా వాలాలు ముంబై నగరంలో యూనియన్ గా ఏర్పడ్డారంటే అక్కడ వ్యాపార స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముంబైలో డబ్బా వాలాలు కేవలం ఉదాహరణ మాత్రమే.. ఇలా మనిషి అవసరాలు ఆధారంగా సాగే వ్యాపారాలు చాలా ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో ఈ కామర్స్ వ్యాపారం జరుగుతుంది కూడా ఇదే విధంగానే. ఇప్పుడు ఢిల్లీలో ఒక వ్యాపారం మొదలైంది. అది సంచలనం రేపుతోంది.. చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. వాస్తవానికి ఇటువంటి వ్యాపారం ఒకటి ఉంటుందని.. దీనిని వ్యాపారం లాగా చేస్తారని ఎవరూ ఊహించలేదు. చివరికి ఈ వ్యాపారం ఇప్పుడు చాలామందికి ఆదాయ మార్గం.. అంతేకాదు మహిళలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటున్నది.

ఆడవాళ్ళ షాపింగ్ అంటే మగవాళ్ళు ఆమడ దూరం పారిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లు ప్రతి వస్తువును కూడా అత్యంత జాగ్రత్తగా చూసి కొనుగోలు చేస్తారు. దీనికోసం చాలా సమయం పడుతుంది. పైగా డబ్బులు చెల్లించే విషయంలో బేరాలు ఆడుతుంటారు. అలాంటప్పుడు ఎక్కువ సమయం షాపింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది. ఇలాంటి అప్పుడు మగవాళ్ళల్లో సహనం చచ్చిపోతుంది. అందువల్లే షాపింగ్ చేసేటప్పుడు ఆడవాళ్ళతో వెళ్లడానికి ఇష్టపడరు. అయితే ఢిల్లీలో క్యారీ మ్యాన్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటయింది. ఈ కంపెనీ వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసే మహిళలకు, యువతులకు వారి సరంజామాను మోయడానికి కొంతమంది మనుషులను అందుబాటులో ఉంచుతుంది . గంటకు 169 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటుంది. బ్యాగుల బరువు ఆధారంగా వసూలు చేసే ఫీజు మారుతూ ఉంటుంది. అంతేకాదు బ్యాగులు మోసే వ్యక్తులు సరదాగా ఉంటారు. ఆడవాళ్లు షాపింగ్ మొత్తం పూర్తి చేసుకునేదాకా అక్కడే ఉంటారు. ఆ తర్వాత వారి సామాగ్రిని భద్రంగా ఇంటి వద్దకు చేర్చుతారు.

ప్రయాణ ఖర్చులు మొత్తం కస్టమర్లే భరించాల్సి ఉంటుంది. కేవలం వారు బ్యాగులు మాత్రమే మోస్తారు. ఒకవేళ బ్యాగుల బరువు అదనంగా ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ముఖ్యంగా వివాహితలకు.. యువతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్లే ఈ అవకాశాన్ని తీసుకొచ్చామని క్యారీ మ్యాన్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని.. పెద్దగా శ్రమ పడకుండానే డబ్బులు సంపాదించవచ్చని పేర్కొంటున్నారు. ఢిల్లీలో మొదలైన ఈ కంపెనీ కార్యకలాపాలు.. దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఏదైనా అవసరాల ఆధారంగానే వ్యాపారం మొదలవుతుంది. ఆ వ్యాపారం కనుక ఆదరణ పొందితే లాభాల పంట పండుతుంది. ప్రస్తుతం క్యారీ మ్యాన్ కంపెనీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిన్నగా మొదలైన ఈ కంపెనీ అత్యంత తక్కువ సమయంలో విశేషమైన పేరు తెచ్చుకుంది. వచ్చే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.

హైదరాబాద్ లో చిక్కులు లేకుండా స్థలం కొనుక్కుని.. సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..

Hyderabad Real Estate
Hyderabad Real Estate

Hyderabad Commercial Real Estate Growth: పైసా పైసా కూడబెట్టుకుని.. స్థలం కొనుక్కుంటాం. హైదరాబాద్ నగరంలో ఇల్లు కూడా కట్టకుంటున్నామని బంధువులతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ స్థలం అమ్మిన వ్యక్తి మోసం చేస్తాడు. ఆ స్థలాన్ని గతంలోనే మరో వ్యక్తికి అమ్మి.. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి మన ఇబ్బందులు మొదలవుతాయి. పోలీస్ స్టేషన్ల కు వెళ్లాలి. లాయర్లను కలవాలి. ఏన్నో ఏళ్లకు గాని ఆ కేసు పరిష్కారం కాదు. ఈలోగా ఇల్లు కట్టుకోవాలనే మన కల కలగానే మిగిలిపోతుంది.

ఇలాంటి ఇబ్బందులు హైదరాబాద్ నగరంలో చాలా మంది అనుభవించి ఉంటారు. అయితే అలాంటి వాళ్ల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు బంగారం లాటి అవకాశాన్ని తీసుకొచ్చింది. వివాదాలు లేకుండా, స్పష్టంగా యాజమాన్య హక్కులు వచ్చేలా ప్రభుత్వ భూములను విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మాల్కాజ్ గిరి జిల్లాలలో అత్యంత ఖరీదుగా ఉండే ప్రాంతాలలో ఎనిమిది భారీ ప్లాట్లు, ల్యాండ్ పార్సిళ్లను ఈ వేలం విధానంలో అమ్మనుంది. కేపీహెచ్ బీ కాలనీ, కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్న చింతల్, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న రావిర్యాల వంటి ఏరియాలలో ఈ భూములను అమ్మనుంది.

ఈనెల 28న ఈ భూములను విక్రయిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్లు ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. బహుళ వాణిజ్య సముదాయాలు నిర్మించవచ్చు. వేలం విధానంలో కనిష్టంగా 1116 చదరపు గజాల నుంచి 13504 చదరపు గజాల వరకు స్థలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చదరపు గజం కనీస ధర 26 వేలుగా ఉంది. గరిష్టంగా లక్ష రూపాయలు. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో ప్రీ బిడ్ డిపాజిట్ నిర్వహించారు. ప్రీ బిడ్ డిపాజిట్ ప్రాంతాల ఆధారంగా రూ.25 లక్షల నుంచి కోటి వరకు ఉంది. మే 27న సాయంత్రం ఐదు గంటల వరకు ప్రి బిడ్ డిపాజిట్ చెల్లించేందుకు అవకాశం ఉంది. రావిర్యాల ప్రాంతంలో 28న, కేపీహెచ్ బీ, చింతల్ ఏరియాలలో 29న ఈ వేలం నిర్వహిస్తారు.

రావిర్యాల ప్రాంతంలో ప్లాట్ నంబర్ 1 నుంచి నాలుగు వరకు విస్తీర్ణం 1116 నుంచి 13504 చదరపు గజాల వరకు 26 వేల నుంచి 49 వేల వరకు ధర నిర్ణయించారు.

కేపీహెచ్ బీ కాలనీ, చింతల్లో ఫేజ్ 1,2 ప్లాట్లు ల్యాండ్ పార్సిల్ 1, 2, కోసం 2,420, 5,898,10,890,3,388 చదరపు గజాలకు రూ, 90 వేలు, రూ.70 వేలు, రూ. 40 వేలుగా ధరను నిర్ణయించారు.
image.png

నిన్న రెరా చైర్మన్ సత్యనారాయణ.. నేటి విద్యా కమిషన్ చైర్మన్ మురళి.. ఎందుకు రాజీనామాలు చేశారు.. ఏం జరుగుతోంది..

Akunuri Murali Resignation Reasons
Akunuri Murali Resignation Reasons

Akunuri Murali Resignation Reasons: సాధారణంగా ప్రభుత్వంలో అధికారులు రాజీనామా చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. రాజీనామా కోణాన్ని మీడియా లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటుంది. అసలు విషయాన్ని బయటపడుతూ ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత ఆరోగ్యం బాగా లేకపోతే లేదా ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదురైతే అధికారులు రాజీనామా చేస్తారు. ఒక స్థాయి అధికారులకు ప్రభుత్వంలో అండదండలు బాగా ఉంటాయి. ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయాలు ఉంటాయి కాబట్టి జీతభత్యాలు కూడా అంతకుమించి అనే స్థాయిలో ఉంటాయి. మంచి హోదా కూడా ఉంటుంది కాబట్టి అధికార దర్పాన్ని కూడా బ్రహ్మాండంగా అనుభవించవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రాజీనామా చేశారంటే కచ్చితంగా అనుమానించాల్సిందే. పైగా సర్వీస్ కూడా ఉన్నప్పుడు ఇటువంటి రాజీనామా వ్యవహారాలను సాధారణంగా చూడకూడదు.

భారత రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో ఈ విషయం ఒక సంచలనం. ఆ తర్వాత ఆయన ఏపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యా కమిషన్ చైర్మన్గా పని చేశారు. అక్కడ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలలను అభివృద్ధి చేసి.. సరికొత్త సౌకర్యాలు కల్పించారు. డ్రాప్ అవుట్లు తగ్గేలా చూశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేశారు.. తద్వారా ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెరిగాయి. విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించారు. అది నచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మురళికి విద్యా కమిషన్ చైర్మన్గా పదవి కల్పించారు. ఇది క్యాబినెట్ ర్యాంకు హోదా పదవి.

ఇటీవల తెలంగాణ విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పుల గురించి మురళి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. అందులో ప్రభుత్వ టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని పెంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పదవ తరగతి, ఇంటర్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే పదో తరగతి విద్యను కాస్త ప్లస్ 2 గా మార్చి.. తమిళనాడు, కేరళ స్థాయిలో విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మురళి సమర్పించిన నివేదిక తెలంగాణ రాజకీయాలలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి మురళి నివేదికను నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.. ఈ నివేదిక పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. మురళి నివేదిక వల్ల ప్రభుత్వ టీచర్లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన కలిగిందని సమాచారం. అప్పటినుంచి మురళి, ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది.

కొంతకాలంగా మురళి కూడా తన మీద వస్తున్న విమర్శల పట్ల నిరాశ లో ఉన్నారని తెలుస్తోంది. అందువల్లే ఆయన తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన పంపించారు.. మురళి కంటే ముందు రెరా చైర్మన్ సత్యనారాయణ కూడా తన పదవికి రాజీనామా చేశారు.. వాస్తవానికి రెరా అనేది అత్యంత డిమాండ్ ఉన్న విభాగం. ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి గుండెకాయ లాంటిది. ఈ పదవిలో సత్యనారాయణ ను రేవంత్ రెడ్డి ఏరికోరి నియమించారు. తనమీద ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గకుండా సత్యనారాయణ ను నియమించారు. కొంతకాలం పాటు ఆయన కూడా సక్రమంగానే పనిచేశారు. అయితే ఇటీవల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద గులాబీ పార్టీ నెగటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సత్యనారాయణ మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసింది. పైగా ప్రభుత్వ పెద్దల నుంచి అతడికి సహకారం అందకపోవడంతో.. కొన్ని వ్యవహారాలలో ఆయనను కలగజేసుకోకూడదని చెప్పడంతో.. తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేశారు. సత్యనారాయణ రాజీనామాను మర్చిపోకముందే.. ఆకునూరి మురళి రాజీనామా చేయడం.. సంచలనం కలిగిస్తోంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వివరణ ఇస్తుంది.. అనేది చూడాల్సి ఉంది.

హైదరాబాద్.. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కింగ్.. ఎన్ని కోట్ల వ్యాపారమో తెలుసా

Hyderabad Real Estate
Hyderabad Real Estate

Hyderabad commercial real estate : ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. సాధ్యమైనంతవరకు మెరుగైన టెక్నాలజీతో.. తక్కువ మ్యాన్ పవర్ తో పనులు చేయించుకుంటున్నాయి. దీంతో కంపెనీల పెట్టుబడులు చాలా వరకు తగ్గిపోయాయి. కార్పొరేట్ ఆఫీస్ లీజు కూడా నేల చూపులు చూస్తోంది. ఇలాంటి సమయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది హైదరాబాద్.

కమర్షియల్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ కింగ్ లాగా దూసుకుపోతోంది. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కార్యాలయాల స్థలాల లీజింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా లక్ష నుంచి పదిలక్షల విస్తీర్ణం వరకు విస్తీర్ణం ఉన్న కార్యాలయాలలో ఆయా సంస్థలు తమ పనులు మొదలుపెడుతున్నాయి. భారీ ధరకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్ నగరంలో 69% అభివృద్ధి నమోదయింది. గతంలో ఇది 40 శాతం వరకు ఉండేది. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి లీజింగ్ జరిగింది.

ఈ సంవత్సరం ఈ సమయానికి 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి అది పెరిగింది. అదే కాదు గడిచిన మూడు నెలల్లో ఏకంగా 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల లావాదేవీలు జరిగాయి. ఇందులో భారీ కార్యాలయాల స్థలాల వాటా 75% గా ఉంది. ఇందులో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయాల వాటా 8 శాతం ఉంది. ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. మిడిల్ రేంజ్ లో కార్యాలయాల స్థలాలు 50వేల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశాయి. వీటి వాటా ఏకంగా 17 శాతం ఉంది. ఇక 10 లక్షల చదరపు అడుగుల లీజింగ్ భాగంలో కూడా ఒప్పందం కుదిరింది. దీని వాటా కూడా రెండు నుంచి మూడు శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

ఇటీవల ఉబర్ కంపెనీ గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ విస్తరణ కోసం హైదరాబాద్ ఐటి కారిడార్ పరిధిలోని మీనాక్షి ఎకో పార్కులో ఏకంగా 9.1 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. జనవరిలో వీరుని లీజుకు తీసుకుంది. దాదాపు మొత్తం 10 అంతస్తులో ఈ సంస్థ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ప్రతి నెల దీనికి 5.86 కోట్ల అద్దె చెల్లిస్తోంది. చదరపు అడుగుకు 65 రూపాయల అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం. ప్రతి మూడు సంవత్సరాలకు 15% పెరుగుతుంది. పది సంవత్సరాలపాటు లీజు ఒప్పందం ఉంటుంది. మొత్తంగా 10 సంవత్సరాల వరకు చెల్లించే ఏకంగా 839 కోట్ల వరకు ఉంటుంది..

హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద లీజింగ్ ఒప్పందంలో ఇది ఒకటి. హైదరాబాద్ నగరంలో స్థలాలు విస్తీర్ణంగా ఉండడం.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు సాగించే అవకాశం ఉండడం.. ఐటీ రంగం.. ఫార్మా రంగం అద్భుతంగా ఉండడంతో ఫైనాన్స్.. మొబిలిటీ వంటి రంగాలలో దిగ్గజాలుగా ఉన్న సంస్థలు హైదరాబాద్ నగరం వైపు దృష్టిసారిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాదులో అద్దె తక్కువగా ఉంది. అందువల్లే కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి.

రజినీకాంత్ 'జైలర్ 2' ముందు ప్యారడైజ్ నిలబడుతుందా..?

Jailer-2-Vs-Paradise
Jailer-2-Vs-Paradise

Jailer 2 Vs Paradise: రజనీకాంత్ హీరోగా 2023 సంవత్సరంలో వచ్చిన జైలర్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు జైలర్ 2 సినిమా కూడా వస్తుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సినిమాతో రజనీకాంత్ భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నవాడు అవుతాడు. లేకపోతే మాత్రమే చాలా వరకు వెనకబడిపోయే ప్రమాదమైతే ఉంది…ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ అవుతుంది. రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రజనీకాంత్ మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి… ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నాని ఇప్పుడిప్పుడే మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి అతని సినిమా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ రాబడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికైతే ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్టుగానే సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

నానికి రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ అతని సినిమాతోనే పోటీకి దిగే అవకాశం వచ్చింది అంటే ఆయన చిన్న హీరో నుంచి ఎంత పెద్ద హీరోగా ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో ఇద్దరిలో ఎవరు విజయాన్ని సాధిస్తారు. ఎవరు సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటారనేది తెలియాల్సి ఉంది.

రజనీకాంత్ చేసిన జైలర్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి జైలర్ 2 సినిమా 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగా ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రభాస్ - ప్రశాంత్ వర్మ మధ్య ఏం జరిగింది..? అందుకే ప్రాజెక్ట్ లేటవుతోందా..?

Prabhas Prasanth Varma Movie Delay
Prabhas Prasanth Varma Movie Delay

Prabhas Prasanth Varma Movie Delay: ‘హనుమాన్’ సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ అప్పటినుంచి మరో సినిమా చేయలేదు. ఆ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు తను మరో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా డిలే అవుతుంది. కాబట్టి దానివల్ల లేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఆయన ప్రభాస్ కి ఒక కథనైతే వినిపించాడనే వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఫుల్ నేరేషన్ అయితే ఈ మధ్యకాలంలో ఇచ్చారట. కానీ ప్రభాస్ మాత్రం తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

ఎందుకంటే గతంలో ప్రశాంత్ వర్మ బాలయ్య కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి ఆ సినిమా అనౌన్స్ అయిన తర్వాత మూవీ నుంచి తప్పుకున్నాడు. కాబట్టి తన మీద తనకే నమ్మకం లేదు అందువలన అతనితో సినిమా అనౌన్స్ అయిన తర్వాత అది క్యాన్సల్ అయితే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.

మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయినదే చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి తను తను ప్రూవ్ చేసుకుంటేనే తప్ప తనకు స్టార్ హీరోల డేట్స్ దొరకవనే చెప్పాలి. ప్రభాస్ ప్రశాంత్ వర్మ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే తను కనీసం రెండు సక్సెసులనైన సాధించాల్సిన అవసరమైతే ఉంది…

ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోవడానికి మరో సిక్స్ మంత్స్ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ మిగతా సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశమైతే ఉంది…