Vijayawada Jeep Fight Over Girlfriend: ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. సన్నిహితంగా ఉండేవారు. పైగా బడా బాబుల పిల్లలు. ఈ తరుణంలో అమ్మాయి కోసం ఇరువురు విభేదించుకున్నారు. గొడవలకు దిగారు. బహిరంగంగా రోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే ప్రయత్నం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహిత కుటుంబాలకు చెందిన వారిగా పోలీస్ విచారణలో తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్ననే గురువారం రాత్రి విజయవాడ నగరంలో రెండు జీపులు ఎదురెదురుగా పలుమార్లు ఢీకొట్టుకునే ప్రయత్నం చేశాయి. అందులో ఒక వాహనం చక్రం ఊడి పడడంతో అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. అయితే ఇదంతా మత్తులోనే జరిగినట్లు పోలీస్ విచారణలో తేలింది.
* స్నేహితులే శత్రువులుగా మారి..
విజయవాడ నగరంలో రోహిత్, ఓం అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. దాదాపు వారిద్దరూ 20 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారే. నగరంలో పేరు మోసిన వ్యాపార కుటుంబాలకు చెందినవారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న తరుణంలో రోహిత్ కోసం ఆయన గర్ల్ ఫ్రెండ్ వద్ద ఓం తప్పుగా చెప్పాడు అనేది రోహిత్ అనుమానం. తన గురించి ఎందుకు తప్పుగా చెప్పావు అంటూ రోహిత్ ఫోన్ చేసి ఓం ను అడిగాడు. మొన్న గురువారం ఉదయం నుంచి వారి మధ్య ఫోన్లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఓం దమ్ముంటే తన వద్దకు రావాలి అంటూ సవాల్ చేశాడు. దీంతో గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన వాహనంలో వచ్చాడు రోహిత్. వస్తూ వస్తూనే ఇద్దరు వాహనాలను ఢీ కొట్టించారు. వాహనాలతోనే ఫైట్ జరిపారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి రోహిత్ తన వాహనంతో పారిపోయాడు. ఓం మాత్రం దొరికిపోయాడు.
* ఒకరికి పాజిటివ్..
జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఓం మత్తు పదార్థాలు తీసుకుని ఉంటాడని అనుమానించారు. నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా ఒక ఇంజక్షన్ సిరంజితో పాటు ఎలక్ట్రిక్ సిగరెట్ దొరికింది. రోహిత్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మాత్రం నెగిటివ్ వచ్చింది.వారి ఇళ్లల్లో తనిఖీ చేశారు. అయితే ఎక్కడ ఏం పట్టుబడలేదు. కానీ వారి ఫోన్లలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు జోగి రమేష్ కు చెందిన సన్నిహిత కుటుంబాల పిల్లలుగా తెలుస్తోంది. అయితే విజయవాడలో ఇటువంటి కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వ మూలాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.






















భక్తుడికి.. భగవంతుడికి మధ్య నేను అగరుబత్తిని కాను.. బండ్ల గణేష్ పై చిరు సెటైర్.. నవ్వుకున్న పవన్...
Pawan Kalyan Bandla Ganesh Funny Moment: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అడపాదడప సినిమాలను చేస్తు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పాలంటే అది కేవలం బండ్ల గణేష్ కు మాత్రమే సాధ్యమవుతుందనే విషయం మనందరికి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను దూరంగా పెట్టాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.
కానీ ఎట్టకేలకు వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘మెగా 158’ సినిమా ఓపెనింగ్ రోజున పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక అతనితో పాటు బండ్ల గణేష్ కూడా ఆ ఈవెంట్ కి వచ్చాడు. అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు బండ్ల గణేష్ ఫోటో దిగుతున్న సందర్భంలో చిరంజీవి ని కూడా ఆ ఫోటోలో ఇన్వాల్వ్ కావాలని బండ్ల గణేష్ పిలవడంతో చిరంజీవి నవ్వులు పూయించే ఒక కామెంట్ అయితే చేశాడు.
ఇంతకీ చిరంజీవి ఏమని కామెంట్ చేశాడు అంటే మీరిద్దరూ ఫోటో దిగుతుంటే ‘నేనెందుకయ్య మీ మధ్య దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం అగరబత్తిలాగా ‘ అంటూ ఒక కామెడీ పంచ్ పేల్చాడు. ఆయన కామెడీ టైమింగ్ కి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. నిజానికి బండ్ల గణేష్ మైక్ పట్టుకున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ తన దేవుడు అని చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్…
తనను కెరియర్ పరంగా సెట్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ ఏ కాబట్టి అతని మీద తనకు ఎప్పుడు కృతజ్ఞత ఉంటుందని అలాగే పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ పలు సందర్భాల్లో చెప్పాడు. దాన్ని ఉద్దేశించే చిరంజీవి ఆ కామెంట్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో ప్రతి ఒక్కరు ఆ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు…