spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada Jeep Fight Over Girlfriend: ప్రియురాలు కోసం జీపులతో ఫైట్.. బెజవాడలో రెచ్చిపోయిన ప్రియులు.....

Vijayawada Jeep Fight Over Girlfriend: ప్రియురాలు కోసం జీపులతో ఫైట్.. బెజవాడలో రెచ్చిపోయిన ప్రియులు.. చివరకు ట్విస్ట్

Vijayawada Jeep Fight Over Girlfriend: ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. సన్నిహితంగా ఉండేవారు. పైగా బడా బాబుల పిల్లలు. ఈ తరుణంలో అమ్మాయి కోసం ఇరువురు విభేదించుకున్నారు. గొడవలకు దిగారు. బహిరంగంగా రోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే ప్రయత్నం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహిత కుటుంబాలకు చెందిన వారిగా పోలీస్ విచారణలో తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్ననే గురువారం రాత్రి విజయవాడ నగరంలో రెండు జీపులు ఎదురెదురుగా పలుమార్లు ఢీకొట్టుకునే ప్రయత్నం చేశాయి. అందులో ఒక వాహనం చక్రం ఊడి పడడంతో అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. అయితే ఇదంతా మత్తులోనే జరిగినట్లు పోలీస్ విచారణలో తేలింది.

* స్నేహితులే శత్రువులుగా మారి..
విజయవాడ నగరంలో రోహిత్, ఓం అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. దాదాపు వారిద్దరూ 20 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారే. నగరంలో పేరు మోసిన వ్యాపార కుటుంబాలకు చెందినవారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న తరుణంలో రోహిత్ కోసం ఆయన గర్ల్ ఫ్రెండ్ వద్ద ఓం తప్పుగా చెప్పాడు అనేది రోహిత్ అనుమానం. తన గురించి ఎందుకు తప్పుగా చెప్పావు అంటూ రోహిత్ ఫోన్ చేసి ఓం ను అడిగాడు. మొన్న గురువారం ఉదయం నుంచి వారి మధ్య ఫోన్లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఓం దమ్ముంటే తన వద్దకు రావాలి అంటూ సవాల్ చేశాడు. దీంతో గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన వాహనంలో వచ్చాడు రోహిత్. వస్తూ వస్తూనే ఇద్దరు వాహనాలను ఢీ కొట్టించారు. వాహనాలతోనే ఫైట్ జరిపారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి రోహిత్ తన వాహనంతో పారిపోయాడు. ఓం మాత్రం దొరికిపోయాడు.

* ఒకరికి పాజిటివ్..
జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఓం మత్తు పదార్థాలు తీసుకుని ఉంటాడని అనుమానించారు. నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా ఒక ఇంజక్షన్ సిరంజితో పాటు ఎలక్ట్రిక్ సిగరెట్ దొరికింది. రోహిత్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మాత్రం నెగిటివ్ వచ్చింది.వారి ఇళ్లల్లో తనిఖీ చేశారు. అయితే ఎక్కడ ఏం పట్టుబడలేదు. కానీ వారి ఫోన్లలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు జోగి రమేష్ కు చెందిన సన్నిహిత కుటుంబాల పిల్లలుగా తెలుస్తోంది. అయితే విజయవాడలో ఇటువంటి కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వ మూలాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper