Home Blog Page 236

రాజమౌళి తో సినిమా చేసి లాస్ అయిన ప్రొడ్యూసర్... కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడుగా...

SS Rajamouli
SS Rajamouli

SS Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన తను చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో మొదటి సక్సెస్ ని అందుకున్న ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో వరుసగా 12 విజయాలను తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి డైరెక్షన్ చేసిన ‘సై’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఆవుల గిరి ఆ సినిమాతో నష్టాన్ని చవిచూశాడని తనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ముఖ్యంగా సై సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా కమర్షియల్ గా ఆ సినిమాకి రావాల్సినంత కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. దానివల్ల ఆయన కొంతవరకు డబ్బులను కూడా కోల్పోయాననే చెప్పాడు. ఇక ఆ తర్వాత క్రమంలో ఆయన ఒకటి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసి సినిమా ఇండస్ట్రీ తనకు అచ్చి రాదనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు.

ప్రస్తుతం ఆయన సినిమాలను ప్రొడ్యూస్ చేయకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ గా నిలిచినప్పటికి ప్రొడ్యూసర్లకు కూడా విపరీతంగా లాభాలను తీసుకొచ్చి పెట్టాయి.

సై సినిమా విషయంలో మాత్రమే ఆ లెక్క తప్పింది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం ఆ మూవీ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా చెబుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న ఏదైనా సినిమా చేస్తే ఆ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టి వర్క్ చేస్తుంటాడు.

అలాగే ప్రేక్షకుల్లో ఆ సినిమా తాలూకు ఇంటెన్షన్ క్రియేట్ చేయడానికి విపరీతమైన ప్రమోషన్స్ కూడా చేపడుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విశేషమైన బజ్ క్రియేట్ అవుతుంటుంది…ఇక ప్రస్తుతం వారణాసి తో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…

కేసీఆర్ పరిస్థితి గాలి వానలో.. వాన నీటిలో.. కేటీఆరేనా ఇలా మాట్లాడుతున్నది..

KTR Comments
KTR Comments

KTR Comments: రాజకీయ నాయకులు వాస్తవాలు చెబుతున్నప్పుడు వాటికి కాస్త షుగర్ కోటెడ్ వేయాలి. కచ్చా మ్యాంగో లాగా చెబితే మాత్రం ఈ సోషల్ మీడియా కాలంలో వేరే విధంగా జనాల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని రకాల కవరింగ్స్ ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు. పైగా నేటి కాలంలో ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది.

రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా అధిక హోదా ఉన్న నాయకులు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. జనాలకు వచ్చారనే ఉత్సాహంతో.. కార్యకర్తలు కల ముందు కనిపిస్తున్నారని ఆనందంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. ఆ తర్వాత జరిగే పర్యవసనాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేటి కాలంలో అయితే రాజకీయ నాయకులు నాలుక మీద అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు వేరే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. దానివల్ల అసలు టాపిక్ పక్కకకు వెళ్లి.. వేరే విషయం చర్చలోకి వస్తోంది. దీనివల్ల అభాసుపాలు కావడం నేతల వంతు అవుతోంది.

ఈ జాబితాలో ఇప్పుడు కేటీఆర్ చేరిపోయారు. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇటీవల ఆయన లైన్ తప్పినట్టు కనిపిస్తోంది. ఆ మధ్య వరంగల్ లో ఒక సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ.. కొద్దిరోజుల్లో ఆయన కూర్చున్న కూర్చుని లాగి పడ దెం*** తే అని అన్నారు. ఇది ఎంత సంచలనం కావాలో అంత సంచలనమైంది. దీంతో కేటీఆర్ మీద ఉన్న అభిప్రాయం కాస్త చాలామందిలో తగ్గిపోయింది. ఇప్పుడిక కేటీఆర్ హైదరాబాదులో జరిగిన ఓ మీటింగ్లో తన తండ్రి పార్టీని నిలబెట్టడానికి పడిన కష్టాన్ని వివరించే క్రమంలో.. ఒకప్పుడు కెసిఆర్ పరిస్థితి పార్టీని పెట్టినప్పుడు “గాలి వానలో.. వాన నీటిలో” అన్నట్టుగా ఉండేదని వ్యాఖ్యానించారు. దీని ముందు ఏం జరిగింది.. దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే కెసిఆర్ మీద కేటీఆర్ ఒక్క నెగిటివ్ వర్క్ మాట్లాడినా సరే అది వేరే విధంగా వెళుతూ ఉంటుంది. వాడుకునే వాళ్ళు దానిని 100 విధాలుగా ఉపయోగించుకుంటారు. అందువల్ల కేటీఆర్ లాంటి నాయకులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

నేటి సోషల్ మీడియా కాలంలో బురద చల్లడమే అసలు సిసలైన రాజకీయం లాగా నడుస్తోంది. అలాంటప్పుడు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఏదైనా విషయాలు చెబుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. షుగర్ కొటెడ్ మందులాగా జనాల్లోకి ఎక్కించాలి. లేకపోతే ఇదిగో ఇలా అభాసుపాలు కావాల్సి వస్తుంది. కేటీఆర్ కావాలని అలా అన్నప్పుడు.. కాంగ్రెస్ నాయకులు లేదా బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా ఆయన మాట్లాడినా మాటలను మార్చుకుంటారు. అంతేకాదు తమకు నచ్చినట్టుగా వాడుకుంటారు.

వైభవ్ సూర్య వంశీ ఎంత పని చేశావురా.. రాజస్థాన్ పుట్టి ముంచావుగా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: గెలిస్తే చాలు.. పంజాబ్, కోల్కతా ఇంటికి వెళ్ళిపోతాయి. దర్జాగా రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఈ మ్యాచ్ ఎంత కీలకమో తెలుసు. ఎలా ఆడాలో కూడా తెలుసు. ఎలా ఆడితే పరుగులు వస్తాయి కూడా తెలుసు. పైగా అతడికి భీకరమైన ట్రాక్ రికార్డు ఉంది. సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసిన చరిత్ర కూడా ఉంది. అలాంటి వ్యక్తి తేలిపోయాడు. కీలకమైన దశలో తలవంచాడు. ప్రత్యర్ధి ఉచ్చును అంచనా వేయలేకపోయాడు. చివరికి నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయాడు.

ఇదంతా కూడా ఆదివారం నాడు ముంబై వేదికగా రాజస్థాన్ తలపడిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ ఆట తీరు గురించి.. అసలు సూర్యవంశీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వికారంగా బ్యాటింగ్ చేశాడు. బంతులను అనేక విధాలుగా వేయించుకొని అదరగొట్టాడు. దీంతో ముంబై జట్టుతో జరిగే మ్యాచ్లో అతడు అదరగొడతాడని అందరూ అనుకున్నారు. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కున్న అతడు కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. నమన్ దీర్ బౌలింగ్లో దీపక్ చాహర్ పట్టిన క్యాచ్ కు వెనుతిరిగి వెళ్ళిపోయాడు.

మరో ఓపెనర్ జైస్వాల్ 25 పరుగులు మాత్రమే చేశాడు. జాక్స్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. జూరల్ 38 పరుగులు చేసి బాష్ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. రియాన్ పరాగ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. శనక 29 పరుగులు చేశాడు. ముంబై జట్టులో దీపక్ చాహర్, జాక్స్, గజన్ ఫర్, భాష్ తలా ఒక వికెట్ సాధించారు.

ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాకర్థమైస్తున్నాడు. బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మను సబ్స్టిట్యూట్ ఆటగాడిగా తీసుకున్నారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఓడిపోతే మాత్రం పంజాబ్, కోల్కతా జట్లకు అవకాశం ఉంటుంది. కోల్కతా జట్టు ఒకవేళ ఢిల్లీ జట్టు మీద విజయం సాధిస్తే.. అప్పుడు నెట్ రన్ రేట్.. కీలకమవుతుంది. మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న జట్టు ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ముంబై జట్టుమీద రాజస్థాన్ గనుక విజయం సాధిస్తే ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది.

పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అంటూ స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్..

Colors Swathi
Colors Swathi

Colors Swathi: యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అప్పట్లో ఝాన్సీ యాంకరింగ్ రంగం లో ఒక వెలుగు వెలిగింది , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటి గా కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఆమె పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరీర్ ని గడుపుతోంది. మరోపక్క ఉదయభాను వంటి వారు కూడా యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కొంతమేరకు సక్సెస్ ని చూసింది. అయితే యాంకరింగ్ రంగం లో సెన్సేషన్ సృష్టించిన సుమ , రష్మీ వంటి వారు యాక్టర్స్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, అనసూయ మాత్రం చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. అయితే యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అయిన ఏకైక నటి కలర్స్ స్వాతి.

అప్పట్లో జెమినీ టీవీ లో ప్రసారమైన ‘కలర్స్’ అనే టీవీ షో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, ఈ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది స్వాతి. ఆ క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె , మొదట్లో కొన్ని క్యారెక్టర్ రోల్స్ లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కలర్స్ స్వాతి, రీసెంట్ గానే ‘పంచతంత్రం’, ‘మంత్ ఆఫ్ మధు’ వంటి చిత్రాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈమధ్య కాలం లో ఈమె తన భర్త వికాస్ వాసు తో విడాకులు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె పెళ్లి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క మాటతో ఆమె తన వైవాహిక జీవితం లో ఎన్ని ఇబ్బందులను ఎదురుకుందో చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. ఈ కాలం లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే, కుక్కల్ని పెంచుకోవడం ఏంటో బెటర్, అవి ప్రేమగా , బ్రతికి ఉన్నంత కాలం మనతోనే సంతోషంగా ఉంటుంది, మోసం లాంటివి చేయడం చేత కాదు అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది స్వాతి. 2018 వ సంవత్సరంలో వికాస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది కలర్స్ స్వాతి. అప్పటికి ఆమె కెరీర్ పరంగా పీక్ రేంజ్ ఉండేది, అలాంటి కెరీర్ ని భర్త కోసం వదిలేసింది, ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా కెరీర్ ని కొనసాగించి ఉండుంటే చాలా పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండేదని అనుకోవచ్చు.

భారతదేశం ఎలా పుట్టింది?

How India Was Formed
How India Was Formed

How India Was Formed: భూమి ఈరోజు కనిపిస్తున్నట్లు కోట్ల సంవత్సరాల క్రితం లేదు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఖండాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ కోట్ల ఏళ్ల భౌగోళిక మార్పుల ఫలితం. భారతదేశం కూడా ఒకప్పుడు ఆసియాలో భాగం కాదు. అది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక భారీ పురాతన ఖండంలో భాగంగా ఉండేది. అక్కడి నుంచి విడిపోయి ఉత్తర దిశగా ప్రయాణించి చివరకు ఆసియాను ఢీకొని హిమాలయాలను సృష్టించింది. ఈ కథ భూమి చరిత్రలోనే అత్యంత అద్భుతమైన భౌగోళిక ప్రయాణంగా చెప్పబడుతుంది. ఆసక్తగా అనిపించే ఆ కథలోకి వెళ్తే..

భూమిపై రెండు మహా ఖండాల కాలం:
సుమారు 55 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఇప్పటి లాంటి ఏడు ఖండాలు లేవు. అప్పట్లో భూమి ప్రధానంగా రెండు మహా ఖండాలుగా ఉండేది. ఉత్తర భాగంలో ఉన్న ఖండాన్ని ‘లారేసియా’ అని, దక్షిణ భాగంలో ఉన్న ఖండాన్ని ‘గొండ్వానా’ అని పిలిచేవారు. ఈ గొండ్వానా ఖండంలోనే ప్రస్తుతం ఉన్న భారతదేశం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, మడగాస్కర్, దక్షిణ అమెరికా కలిసి ఉండేవి. కోట్ల ఏళ్ల పాటు ఈ భూభాగంలో అడవులు, నదులు, జంతువులు విస్తరించాయి.

గొండ్వానా అనే పేరు ఎలా వచ్చింది?
‘గొండ్వానా’ అనే పేరు కూడా భారతదేశంతోనే ముడిపడి ఉంది. మధ్య భారతదేశంలో నివసించే గోండ్ తెగ పేరు మీదే ఈ ఖండానికి ఆ పేరు పెట్టారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్తలు మధ్య భారతదేశంలో ప్రాచీన శిలలను, బొగ్గు నిక్షేపాలను పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని ‘గొండ్వానా ప్రాంతం’గా పిలుస్తుండటంతో, అక్కడి శిలా నిర్మాణాలకు కూడా అదే పేరు పెట్టారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన శిలలు ఇతర ఖండాల్లో కూడా కనిపించడంతో, ఆ పురాతన మహా ఖండాన్ని ‘గొండ్వానా’గా గుర్తించారు.

భూమి లోపల మొదలైన మహా మార్పులు:
కాలక్రమేణా భూమి లోపల ఉన్న వేడి లావా, భౌగోళిక ఒత్తిడులు పెరగడం ప్రారంభమైంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల గొండ్వానా ఖండంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ఒత్తిడి కారణంగా ఒకప్పుడు ఏకంగా ఉన్న గొండ్వానా మూడు ప్రధాన భాగాలుగా విడిపోయింది. ఒక భాగం దక్షిణ అమెరికాగా, మరో భాగం ఆఫ్రికాగా మారగా, మూడో భాగంలో భారతదేశం, మడగాస్కర్, ఆస్ట్రేలియా కలిసి ప్రయాణం ప్రారంభించాయి.

మడగాస్కర్ నుంచి భారతదేశం విడిపోవడం:
సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం , మడగాస్కర్ మధ్య కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భారతదేశం ప్రత్యేక భూభాగంగా విడిపోయి ఉత్తర దిశగా వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో భారతదేశం పశ్చిమ భాగంలో భూగర్భ మార్పుల వల్ల పశ్చిమ కనుమలు ఏర్పడ్డాయి. వీటి తర్వాత భారతదేశ వాతావరణంపై కీలక ప్రభావం చూపించాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే రుతుపవనాలను అడ్డుకుని భారీ వర్షాలు కురిసేలా చేశాయి. అందుకే పశ్చిమ కనుమలు భారతదేశపు ‘వర్ష గోడ’గా కూడా భావిస్తారు.

ఆస్ట్రేలియా కూడా దూరమైంది:
సుమారు 8 కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం, ఆస్ట్రేలియా కూడా విడిపోయాయి. ఆస్ట్రేలియా తూర్పు దిశగా కదలగా, భారతదేశం మాత్రం అత్యంత వేగంగా ఉత్తర దిశగా ప్రయాణించింది. భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, అప్పట్లో భారత ప్లేట్ సంవత్సరానికి 15 నుంచి 20 సెంటీమీటర్ల వేగంతో కదిలింది. ఇది టెక్టానిక్ ప్లేట్లలో అత్యంత వేగంగా కదిలిన ప్లేట్లలో ఒకటిగా గుర్తించబడింది.

డెక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడింది?
భారతదేశం ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న సమయంలో భూమి లోపల భారీ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. లావా వేల కిలోమీటర్ల మేర విస్తరించి గట్టిపడి డెక్కన్ పీఠభూమి ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలు ఈ డెక్కన్ ట్రాప్‌లో భాగంగా ఉన్నాయి. ఈ అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఇదే కాలంలో డైనోసర్ల అంతరించిపోవడానికి కూడా ఈ విస్ఫోటనాలు ఒక కారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆసియాను ఢీకొన్న భారతదేశం
సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఉత్తర దిశగా దూసుకెళ్తున్న భారత ప్లేట్ చివరకు యురేషియన్ ప్లేట్‌ను ఢీకొట్టింది. ఈ ఢీకొన్న సమయంలో సముద్ర అడుగున ఉన్న శిలలు, భూభాగాలు పైకి లేవడం ప్రారంభించాయి. కోట్ల ఏళ్ల పాటు జరిగిన ఈ ఒత్తిడి వల్లే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి అయిన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ భారత ప్లేట్ కదులుతూనే ఉండటంతో హిమాలయాలు ప్రతి సంవత్సరం కొద్దిగా ఎత్తు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారతదేశం భూమిపై అద్భుత ప్రయాణం:
ఒకప్పుడు దక్షిణ అర్ధగోళంలో ఉన్న భారతదేశం, కోట్ల ఏళ్ల ప్రయాణం చేసి ఆసియాలో భాగమైంది. ఈ ప్రయాణమే భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చింది. హిమాలయాలు, డెక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలు, నదులు, వాతావరణం ఈ భౌగోళిక మార్పుల ఫలితాలే. అందుకే భారతదేశం కథ కేవలం ఒక దేశ చరిత్ర కాదు, భూమి పరిణామ క్రమంలో జరిగిన అద్భుత గాథగా భావిస్తారు.

షార్లెట్‌లో కర్నూలు డీఐజీ డా. ప్రవీణ్ కోయకు ఘన సన్మానం

dr-praveen-koya-felicitation-charlotte-north-carolina-telugu-community

Charlotte Telugu community అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు రేంజ్ డీఐజీ డా. ప్రవీణ్ కోయకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం షార్లెట్ తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మకమైన భావోద్వేగభరితమైన సందర్భంగా నిలిచింది.

2026 మే 17వ తేదీ ఆదివారం జరిగిన ఈ వేడుకలో, తొలిసారిగా ఒక ఐపీఎస్ అధికారిని షార్లెట్ తెలుగు కుటుంబాలు ఘనంగా సత్కరించడం విశేషంగా నిలిచింది. నార్త్ కరోలినాలోని తెలుగు వర్గాలకు ఇది గర్వకారణమైన మైలురాయిగా మారింది.

ఈ కార్యక్రమాన్ని TAGCA, TTA, TANA మరియు NRI TDP Charlotte సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. సాయంత్రం జరిగిన ఈ సమావేశానికి 109 మందికి పైగా తెలుగు కుటుంబాలు హాజరై, డా. ప్రవీణ్ కోయకు అపూర్వమైన అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు.

సమాజ సేవలో, పోలీస్ విభాగంలో డా. ప్రవీణ్ కోయ అందిస్తున్న సేవలను కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ వేడుకను షార్లెట్ తెలుగు సమాజ చరిత్రలో చిరస్మరణీయ అధ్యాయంగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అంతటి విరాట్ కోహ్లీ అతడిని చూసి ఆగిపోయాడు.. అతడు అడిగింది చేసి వెళ్ళాడు.. వైరల్ వీడియో

Virat Kohli viral video

Virat Kohli viral video : విరాట్ కోహ్లీ.. టీమిండియాలో ఒక సమ్మోహన శక్తి. బ్యాటింగ్ బాగా చేస్తాడు. ఫీల్డింగ్ అదరగొడతాడు. మైదానంలో ఆవేశంగా ఉంటాడు. రెచ్చగొడితే రెచ్చిపోతాడు. గెలికితే వెంటపడి ఇబ్బంది పడతాడు. సమకాలీన క్రికెట్లో అతడు ఒక అగ్గి బరాట. అందువల్ల విరాట్ కోహ్లీ జోలికి వెళ్లాలంటే మిగతా ప్లేయర్లు భయపడతారు. చివరికి ఇండియన్ ప్లేయర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు.

విరాట్ కోహ్లీలో కోపం మాత్రమే కాదు శాంతం కూడా ఉంటుంది. అతడు ప్రశాంతంగా ఉంటే మంచి మంచి విషయాలు చెబుతాడు. యంగ్ ప్లేయర్లకు సలహాలిస్తుంటాడు. అవసరమైతే క్రికెట్ బ్యాట్లు.. బూట్లు పంపిస్తుంటాడు. విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా.. ఆతిథ్య రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. అతడికి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటి కాలంలో క్రికెట్లో విరాట్ కోహ్లీతో సోషల్ మీడియాలో పోటీపడే మరో ఆటగాడు లేడు అంటే అతడి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విరాట్ కోహ్లీకి అభిమానుల దళం అధికంగా ఉంటుంది. అతడిలాగా ఆడాలని.. అతడి మాదిరిగా అగ్రిసివ్ గా ఉండాలని చాలామంది అనుకుంటారు. యూత్ విరాట్ కోహ్లీని ఒక ఐకాన్ లాగా భావిస్తుంటారు. అతనితో ఫోటోలు దిగాలని.. ఆటోగ్రాఫ్ లు తీసుకోవాలని భావిస్తుంటారు. కాకపోతే విరాట్ కోహ్లీతో ఫోటోలు దిగడం.. ఆటోగ్రాఫ్ లు తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అతడి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మైదానంలో కంచెలు బద్దలు కొడితే తప్ప అతడిని చేరుకోవడం కష్టం. ఒకవేళ చేరుకున్న సరే.. సెక్యూరిటీ సిబ్బంది చేతిలో దెబ్బలు తినాల్సిందే.

ఇటీవల విరాట్ కోహ్లీ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఉప్పల్ వచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. తోటి ప్లేయర్లతో కలిసి జట్టు బస్సులో బయలుదేరడానికి వెళ్ళాడు. అయితే విరాట్ కోహ్లీ కోసం ఒక బాలుడు తన కుటుంబంతో అక్కడ ఎదురు చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ రాగానే ఒకసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ విరాట్ కోహ్లీని కోరాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆ బాలుడిని వద్దని వారించారు. ఆ బాలుడి తాపత్రయాన్ని చూసిన విరాట్ కోహ్లీ సెక్యూరిటీ సిబ్బందిని ఆపాడు. ఆ బాలుడిని తన వద్దకు రమ్మని పిలిచాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తన అభిమాన ఆటగాడిని చూశాను అనే ఆనందంలో ఆ బాలుడు విరాట్ కోహ్లీ కాళ్లకు నమస్కరించాడు. విరాట్ కోహ్లీ కూడా ప్రతి నమస్కారం చేశాడు. దీంతో ఆ బాలుడి ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది

తప్పు చేసి సారీ చెప్పాలంటే మెచ్యూరిటీ ఉండాలి...అది రామ్ చరణ్ లో పుష్కలంగా ఉందా..?

Ram Charan Bollywood re entry
Ram Charan Bollywood re entry
Ram Charan apology : తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ పాపులారిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…’త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఈ హీరో ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా భూపాల్ లో నిర్వహించిన ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనడమే కాకుండా తన అభిమానులను సైతం కలుసుకున్నాడు. అలాగే ఈవెంట్ కి చాలామంది ప్రేక్షకులు వచ్చి ఈవెంట్ ని సక్సెస్ ఫుల్ గా నిలిపారు. ఇక ఈ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన బుమ్రా ను ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ మాట్లాడాడు. ఇక రామ్ చరణ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తన తప్పును తెలుసుకొని బుమ్రా చాలా మంచి బౌలర్ నాకు పేర్లు సరిగ్గా గుర్తులేక తను ఫుట్ బాల్ ప్లేయర్ అని చెప్పను అనే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. అది చూసిన ప్రతి ఒక్కరు  రామ్ చరణ్ వ్యక్తిత్వం చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు.
కొంతమంది హీరోలు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకొని సారీ చెప్పడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు హీరోలు ఎవరూ కూడా ఇలాంటి ఒక మిస్టేక్ జరిగితే తొందరగా రెస్పాండ్ అయి సారీ చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు.
కానీ రామ్ చరణ్ మాత్రం ఈవెంట్ ముగిసిన వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి మనం స్టార్స్ అనే గర్వం ఉండకూడదు… రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాబట్టే ఆయనను చాలా మంది ఇష్టపడుతుంటారు. రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.
ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక బుచ్చిబాబు సైతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపడానికి చాలా కసరత్తులైతే చేశాడు. ఇక ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…

క్వెట్టా పై దాడి శాంపిల్ మాత్రమే.. బలూచిస్థాన్ వద్ద తుపాకీ పట్టిన శివంగులు.. పాకిస్తాన్ రోజులు లెక్కబెట్టుకోవడమే

Balochistan Liberation Army
Balochistan Liberation Army

Balochistan Liberation Army: పాకిస్తాన్ దేశానికి గుండెకాయ లాంటి ప్రాంతం క్వెట్టా. మిగతా దేశంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఇక్కడ మాత్రం కాస్త వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. పైగా సైనికులను ఈ ప్రాంతం మీదుగా ఉన్న రైలు మార్గాల ద్వారా పాకిస్తాన్ పరిపాలకులు వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. అయితే ఇలా తరలిస్తున్నప్పుడు పాకిస్థాన్ పాలకులు చాలావరకు గోప్యత పాటిస్తూ ఉంటారు. బయటికి సమాచారం వెళ్లకుండా అత్యంత జాగ్రత్త పడుతుంటారు.

పాకిస్తాన్ సైన్యం రైలులో వెళ్తుందని సమాచారాన్ని తెలుసుకున్నారు బలూచిస్తాన్ ఆర్మీ నిర్వాహకులు. వెంటనే ఆ రైలులో ప్రవేశించారు. అయితే సైన్యం ప్రయాణిస్తోంది ఆ రైలులో కాదు. అయినప్పటికీ ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 23 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఒకరకంగా ఈ దాడి ద్వారా పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబ్రరేషన్ ఆర్మీ.

అయితే కేవలం ఈ తరహా దాడులతోనే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆగడం లేదు. కొంతకాలంగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం.. పంజాబ్ రాష్ట్రంలో భాగమైన తమ ప్రాంతానికి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తూ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటాలు చేస్తోంది. దాడులకు పాల్పడుతుంది. పాకిస్తాన్ సైన్యంతో యుద్ధాలు చేస్తోంది. ప్రాణ నష్టం సంభవించినప్పటికీ.. ఆస్తి నష్టం చోటుచేసుకుంటున్నప్పటికీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అయితే పాకిస్తాన్ దేశంలో మహిళల మీద వివక్ష ఉంటుంది. అటువంటి పరిస్థితి తమ మహిళలకు రావద్దని.. తమ మహిళలు అన్ని రంగాలలో ముందుంటారని నిరూపిస్తూ..బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు అతివలకు కూడా ఈ ఉద్యమంలో సింహభాగం దక్కేలా చూస్తున్నారు. అందువల్లే వారిని కూడా యుద్ధ విద్యలో శిక్షణ పొందే విధంగా చేస్తున్నారు.

యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చేటప్పుడు అక్కడికి ఒక్క మగ వ్యక్తి కూడా రావడం లేదు. అదంతా కూడా అక్కడి మహిళా కమాండర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.. రహస్య ప్రాంతాలలో మహిళలకు తుపాకులు ఉపయోగించడంలో షైనాజ్ శిక్షణ ఇస్తున్నారు.. స్వాతంత్ర్యం కోసం మగవాళ్ళు మాత్రమే కాదని.. తాను కూడా పోరాడుతామని ఆమె చెబుతున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో రేయి పగలు అని తేడా లేకుండా ఆమె మహిళలకు తుపాకులను ఉపయోగించడంలో అందిస్తున్న శిక్షణ అద్భుతంగా ఉంది.. అటు మగవాళ్ళు.. ఇటు ఆడవాళ్లు ముకుమ్మడిగా దాడులు చేస్తే పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే క్వెట్టా ప్రాంతంలో జరిగిన దాడి జస్ట్ ఉదాహరణ మాత్రమేనని.. అంతకుమించినవి జరుగుతాయని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దేశానికి హెచ్చరికలు పంపుతోంది

ఇరాన్‌తో ట్రంప్‌ ఒప్పందం.. మధ్యప్రాచ్యంలో కొత్త అధ్యాయం?

Donald Trump
Donald Trump

Trump Iran Deal: ఇరాన్‌తో యుద్దం మొదలు పెట్టి ఇజ్జత్‌ తీసుకున్న ట్రంప్‌ ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముగించేందుకు తంటాలు పడుతున్నారు. చర్చల పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారు. అయితే పాకిస్తాన్‌ చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందం దాదాపు ఖరారు అయిందని ప్రకటించారు. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఆశావాదాన్ని కలిగించింది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్, బహ్రెయిన్‌ వంటి ప్రముఖ దేశాల నేతలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయని ఆయన తెలిపారు. హార్ముజ్‌ జలసంధిని తెరవడం ఈ ఒప్పందంలో కీలక అంశమని వెల్లడించడం గమనార్హం. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో విడిగా మాట్లాడినట్లు కూడా పేర్కొన్నారు.

ఒప్పందం వెనుక ప్రాముఖ్యత
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ శక్తి మార్కెట్‌కు ఎంతో కీలకం. చమురు రవాణా ఈ మార్గం గుండానే సాగుతుంది. మూడు నెలలుగా ఇరాన్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ జలసంధి మూసివేత భయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలచివేసింది. ఇప్పుడు దానిని తెరవడం ద్వారా చమురు, గ్యాస్‌ సరఫరాలు సాఫీగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఈ ఒప్పందం ఇరాన్‌ను మళ్లీ ప్రధాన రాజకీయ–ఆర్థిక వేదికపైకి తీసుకురావడంతో పాటు, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి ప్రయత్నాలకు బాటలు వేస్తుందని ఆశించవచ్చు. అరబ్‌ దేశాలు, తుర్కియే, పాకిస్తాన్‌ వంటి దేశాలను ఒకే వేదికపైకి తెచ్చడం ట్రంప్‌ యొక్క దౌత్య విజయంగా చెప్పవచ్చు.

భారత్‌కు రిలీఫ్‌..
ఖతార్, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు ఈ అభివృద్ధి సానుకూలం. హార్ముజ్‌ సంక్షోభం తగ్గితే ఇంధన ధరలు స్థిరపడతాయి, సరఫరా గొలుసులు సాఫీ అవుతాయి. ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపడితే చాబహార్‌ పోర్టు, ఇతర ఇంధన సహకారాలకు కూడా కొత్త అవకాశాలు వస్తాయి. అయితే, ఇజ్రాయెల్‌తో జరిగిన విడి చర్చలు ఈ ఒప్పందం సమగ్రమైనదని సూచిస్తున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలపై సమతుల్య విధానం అనుసరించాల్సి ఉంటుంది.

ఒప్పందం సవాళ్లు..
ఒప్పందం దాదాపు ఖరారైనా, తుది వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. గతంలో ఇలాంటి అనేక ప్రయత్నాలు మధ్యలోనే చీకట్లో కలిసిపోయాయి. ఇరాన్‌ లోపలి రాజకీయ శక్తులు, ఇజ్రాయెల్‌ ఆందోళనలు, అమెరికా లోపలి వ్యతిరేక గళాలు ఈ ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు. అంతేకాకుండా, ఈ ఒప్పందం దీర్ఘకాలం నిలిచి, నిజమైన శాంతిని తీసుకురావాలంటే అన్ని పక్షాలు రాజీలకు సిద్ధపడాలి. కేవలం ఆర్థిక లాభాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రాంతీయ స్థిరత్వం దిశగా ముందుకు సాగాలి.

ట్రంప్‌ ప్రకటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, సహకార యుగం మొదలవుతుందని ఆశలు రేపుతోంది. హార్ముజ్‌ జలసంధి తెరవడం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్‌ స్థిరత్వం సాధ్యమవుతుంది. భారత్‌ వంటి దేశాలకు ఇది శక్తి భద్రతకు బలం చేకూర్చే అవకాశం ఉంది. అయితే, ఈ ఆశావాదం వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. తుది ఒప్పందం ఎంత సమగ్రంగా, అమలు చేయదగ్గదిగా ఉంటుందన్నది కీలకం.

ట్రంప్‌పై వరుస దాడులు.. కుట్రా లేదా ద్వేషమా?

Donald Trump Attacks
Donald Trump Attacks

Donald Trump Attacks: డొనాల్డ్‌ ట్రంప్‌.. అగ్రదేశం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయ్యాడు. ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడిచింది. పాలన తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంటా, బయట ఆయన నిర్ణయాలు ఎవరికీ నచ్చడం లేదు. ఏడాది పాలనకే అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన అధ్యక్షుడిగా ట్రంప్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మరోవైపు ట్రంప్‌పై దాడులు కూడా జరుగుతున్నాయి. ఏడాదిలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళనను రేపుతోంది. ఏప్రిల్‌ 25న వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్‌ డిన్నర్‌లో జరిగిన దాడి తర్వాత కొద్ది కాలంలోనే మరో ఘటన జరగడం భద్రతా వ్యవస్థల సామర్థ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలోకి చొరబడిన సాయుధుడిని సీక్రెట్‌ సర్వీస్‌ హతమార్చిన ఘటన కూడా ఈ సిరీస్‌లో భాగమే.

తాజా ఘటన ఇలా..
వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్‌ డిన్నర్‌లో జరిగిన దాడి అధ్యక్షుడు హాజరైన కార్యక్రమంలోనే జరగడం ఈ దాడుల తీవ్రతను సూచిస్తోంది. ఫిబ్రవరి ఘటనలో ట్రంప్‌ అక్కడ లేకపోవడం ఒక్కటే అప్పట్లో పెద్ద నష్టాన్ని నివారించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ట్రంప్‌–ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై 58 మిలియన్‌ డాలర్ల బౌంటీ ప్రకటించాలని చర్చిస్తున్నట్లు వచ్చిన రిపోర్టులు అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ వరుస ఘటనలు ఒక సాధారణ ట్రెండ్‌ కాదు. రాజకీయ ధ్రువీకరణ, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న తీవ్రమైన ద్వేషం, అంతర్జాతీయ శత్రుత్వాలు కలిసి ఒక ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది.

కుట్రా? వ్యవస్థాగత వైఫల్యమా?
ఈ దాడుల వెనుక కుట్ర ఉందా అన్న అనుమానం సహజం. ముఖ్యంగా ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతలు, గతంలో జరిగిన సంఘటనలు ఈ సందేహాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా ఏ విదేశీ శక్తి ప్రమేయం బయటపడలేదు. చాలాసార్లు ఇలాంటి దాడులు ఒంటరి వ్యక్తులు చేసే ‘లోన్‌ వుల్ఫ్‌’ అటాక్‌లుగా బయటపడతాయి. కానీ వరుసగా మూడు ఘటనలు జరగడం సాధారణం కాదు. అమెరికాలో రాజకీయ హింస పెరగడం దీర్ఘకాలిక సమస్య. ట్రంప్‌ వ్యక్తిత్వం, వారి విధానాలు అనేక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ఇది వ్యక్తులను హింసాత్మక చర్యలకు పురికొల్పుతున్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా, ఆయుధాల సులభ లభ్యత, సామాజిక మాధ్యమాల్లో ఉద్రిక్తతలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.

భద్రతా సవాళ్లు…
క్రెట్‌ సర్వీస్‌తో సహా అమెరికా భద్రతా ఏజెన్సీలు ఎంతో అప్రమత్తంగా ఉన్నా, ఈ వరుస ఘటనలు వారి వ్యవస్థలో కొన్ని లోపాలను బయటపెడుతున్నాయి. అధ్యక్షుడి భద్రత అనేది దేశం జాతీయ భద్రతకు సమానం. ఈ ఘటనలు భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించి, మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి.

ట్రంప్‌పై వరుస దాడులు అమెరికా రాజకీయ వ్యవస్థలోని లోతైన విభజనను, హింసా సంస్కృతి పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయి. ఇవి కుట్ర కావచ్చు లేదా వ్యక్తిగత ద్వేషం నుంచి పుట్టిన చర్యలు కావచ్చు. కానీ కారణం ఏదైనా ఇలాంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ నాయకుల భద్రతకు ముప్పు. అమెరికా ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, రాజకీయ విభేదాలను సంభాషణ ద్వారా పరిష్కరించే వాతావరణాన్ని సృష్టించాలి. లేనిపక్షంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం ఉంది.

సిబిల్ స్కోరు ఇలా ఉంటే తక్కువ వడ్డీ రేట్లు..

CIBIL Score:
CIBIL Score:

CIBIL Score: ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వ్యక్తిగత రుణాలు, హోం లోన్లు, వాహన రుణాలు మంజూరు చేసే ముందు ఎక్కువగా పరిశీలించే అంశం సిబిల్ స్కోర్. ఇది ఒక వ్యక్తి గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఎలా చెల్లించాడో తెలిపే క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అయితే ఈ సిబిల్ స్కోరును భట్టే ఆ వ్యక్తికి ఆఫర్లు, లోన్లు మంజూరు అవుతాయి. ఎలాంటి సిబిల్ స్కోరు ఉంటే ఎంత రుణం మంజూరు అవుతుంది? తక్కవ సిబిల్ స్కోరు ఉంటే ఏమవుతుంది?

సాధారణంగా 750 నుంచి 900 మధ్య సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు సులభంగా మంజూరు అవుతాయి. వీరిని బ్యాంకులు తక్కువ రిస్క్ కస్టమర్లుగా పరిగణిస్తాయి. అందువల్ల తక్కువ వడ్డీ రేట్లతో పాటు ఎక్కువ లోన్ మొత్తం కూడా మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫీజులు కూడా తగ్గించే అవకాశముంటుంది. 650 నుంచి 750 మధ్య స్కోర్ ఉన్నవారికి కూడా రుణాలు వస్తాయి. అయితే వీరిపై బ్యాంకులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. అందువల్ల వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. లోన్ మంజూరుకు అదనపు పత్రాలు లేదా గ్యారంటీ కోరే అవకాశమూ ఉంటుంది.

550 నుంచి 650 మధ్య సిబిల్ స్కోర్ ఉన్నవారికి పరిస్థితి కాస్త కఠినంగా ఉంటుంది. ఈ రేంజ్‌లో ఉన్నవారు గతంలో EMIలు ఆలస్యంగా చెల్లించడం లేదా క్రెడిట్ కార్డు బకాయిలు పెరగడం వంటి కారణాలతో బ్యాంకుల దృష్టిలో రిస్క్ కస్టమర్లుగా కనిపిస్తారు. అందువల్ల లోన్ మంజూరు అవకాశాలు తగ్గిపోతాయి.

300 నుంచి 450 మధ్య స్కోర్ ఉంటే చాలా బ్యాంకులు నేరుగా లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తీవ్రమైన క్రెడిట్ సమస్యలను సూచిస్తుంది. గతంలో రుణాలు చెల్లించకపోవడం, డిఫాల్ట్ అవడం లేదా బకాయిలు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండటం వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి.

సిబిల్ స్కోర్ బాగుండాలంటే ఏం చేయాలి?
సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలంటే ముందుగా EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. ఒక్కసారి కూడా డ్యూ డేట్ మిస్ అయితే అది స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించకుండా 30% లోపే వినియోగించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అవసరం లేకుండా వరుసగా ఎక్కువ లోన్లకు అప్లై చేయడం కూడా సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ప్రతి అప్లికేషన్ సమయంలో బ్యాంకులు క్రెడిట్ చెక్ చేయడంతో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. పాత క్రెడిట్ కార్డులను అకస్మాత్తుగా మూసేయకుండా కొనసాగించడం కూడా ప్రయోజనకరం. దీని వల్ల క్రెడిట్ హిస్టరీ బలంగా కనిపిస్తుంది.

యూత్ జర చదవండి.. ఇగో వైఫైలా ఉంటే.. ఇదిగో ఇలా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తది..

Vijayawada Road Incident
Vijayawada Road Incident

Vijayawada Road Incident: ఇటీవల విజయవాడ నగరంలో ఒక యువతీ విషయంపై ఇద్దరూ యువకులు మనస్పర్ధలు గురయ్యారు. ఫలితంగా వారిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోయాయి. ఒకరి మీద మరొకరు పగ పెంచుకున్నారు. చివరికి అంతం చేసుకునే స్థాయి దాకా వెళ్లారు. గడచిన గురువారం రాత్రి హై టెన్షన్ రోడ్డులో అత్యంత దారుణంగా తమ వాహనాలతో ఢీకొట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో ఓం, రోహిత్ సాయి అనే వ్యక్తులు కలిసిపోయారు. ఇది కాస్త ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. తత్వం బోధపడిన ఆ ఇద్దరు.. అనంతరం పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.

వ్యక్తిగత అహానికి వెళ్ళిపోయాం.. ఇరుక్కుపోయాం.. అనవసరంగా పరువు తీసుకున్నామని బాధపడ్డారు. చిన్నపాటి వ్యవహారాలను సరిదిద్దుకొని ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. అమ్మాయి విషయంలో గొడవల వల్ల వీరిద్దరూ కొద్దిరోజులుగా మాట్లాడుకోవడం లేదు.. ఓం విశాఖపట్నంలో బీబీఏ పూర్తి చేశాడు. ఇతడి తండ్రికి జేజే ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ వ్యవహారాలను హోమ్ చూసుకుంటున్నారు. ఇక లింగమనేని రోహిత్ సాయి అనే యువకుడు తాడేపల్లి ప్రాంతంలో బి బి ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడి తండ్రికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంది. ఈ ఘటన జరిగినప్పుడు రోహిత్ సాయి, ఓం తోపాటు వారి స్నేహితుడు కూడా ఉన్నారు. ఓం వెహికల్ లో మోహిత్, సిద్ధార్థ అనే యువకులను ఎక్కించుకున్నాడు. నేరుగా హెచ్డి లైన్ రోడ్లోకి వచ్చాడు. రోహిత్ గూడా తనకు అత్యంత దగ్గర స్నేహితుడైన మహమ్మద్ ఆఫాన్ ను అనయకుడిని ఎక్కించుకున్నాడు. వీరిద్దరూ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో స్నేహితుల ప్రమేయం లేదని పోలీసుల విచారణలో తేలింది.

ఘటన జరిగిన అనంతరం వారిద్దరి రక్తనమునాలను పోలీసులు పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అందులో ఏమైనా మత్తు పదార్థాలు తీసుకున్నారా.. అనే అంశంపై పోలీసులు కూపిలాగారు. ఇందులో ఓం మత్తు పదార్ధాలు తీసుకున్నట్టు తేలింది. రోహిత్ సాయి విషయంలో మాత్రం ఎటువంటి పాజిటివ్ ఫలితం రాలేదు.. అనంతరం భూమి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో శక్తికి ఉపయోగించే మాత్రలు.. ఇతర చూర్ణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వాహనాలు కూడా హాకీ కర్రలు.. ఇనుప రాడ్లు కనిపించాయి.. అయితే రోహిత్ సాయి సహనం కోల్పోయి కొండలరావు అనే వ్యక్తిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. అతడి ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు సాక్ష్యంగా తీసుకున్నారు. అయితే వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.

పాకిస్తాన్ కు దిమ్మతిరిగేలా చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఏకంగా 22 మంది..ఇది మామూలు దెబ్బ కాదు..

Baloch Liberation Army
Baloch Liberation Army

Baloch Liberation Army: ఇన్నాళ్లపాటు భారత్ లో మతకల్లోలాలు రేపింది. చేతకాని ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో దాడులు చేసింది. భీకరమైన ప్రాణ నష్టానికి కారణమైంది. అంతేకాదు సరిహద్దుల్లో రక్తపుటేర్లు ప్రవహించేలా చేసింది. అంతేకాదు మన దేశానికి సంబంధించిన అనేక విషయాలలో వేలు పెట్టి.. అమెరికాతో అంటకాగి ఇబ్బంది పెట్టేది.

ఇంతటి దుర్మార్గమైన పాకిస్తాన్ ఆటలు ఇప్పుడు సాగడం లేదు. మనదేశంలో బలమైన ప్రభుత్వం ఉండడంతో ఉగ్రవాద కార్యకలాపాలలో ముందడుగు పడటం లేదు. పైగా పాకిస్తాన్ దేశంలో గుర్తుతెలియని అజ్ఞాత సాయుధ దళాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. ఉగ్రవాదులను అత్యంత సమీపంలో నుంచి కాల్చేస్తున్నాయి. అజ్ఞాత సాయుధ దళాలకు తోడుగా ఇప్పుడు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద బలూచిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి విడగొట్టి తమను భారత దేశంలో కలపాలని.. లేదా సొంత దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే పాకిస్తాన్ కూడా ఆర్మీ ని బలూచిస్థాన్ మీదికి ప్రయోగిస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. అయితే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దాడులు చేస్తోంది.

తాజాగా క్వెట్టా చమన్ గేట్ దగ్గరలో ఒక ప్యాసింజర్ రైలు లక్ష్యంగా చేసుకొని. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో మొత్తం 23 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు. ఇందులో ఎక్కువగా చిన్నారులు.. మహిళలు ఉన్నారు. అధికారులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్తాన్ దేశానికి భారీగా నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఆ దేశ ఆర్మీ పెషవర్ ప్రాంతానికి వెళ్తుందనే సమాచారంతో ఈ దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.

బాంబు పేలుడు వల్ల ఘోరమైన నష్టం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భవనాల అద్దాలు పగిలి పోయాయి. కిటికీలు విరిగిపోయాయి. రైల్వే ట్రాక్ దగ్గరగా ఉన్న అనేక వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒక భోగికి మంటలు కూడా అంటుకున్నాయి.

నిన్న అధ్యక్షుడు ట్రంప్ మీద.. నేడు వైట్ హౌస్ దగ్గర.. అమెరికాలో భద్రత లేదా

US Security Concerns
US Security Concerns

US Security Concerns: చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే తెలిసిపోతుంది. ప్రత్యర్థి దేశాలు దాడులు చేయడం కాదు.. దాడులు చేసేందుకు రూపకల్పన చేస్తున్న సరే తెలిసిపోతుంది. ఒక రకంగా అమెరికా చుట్టూ భద్రత అనేది దుర్భేద్యం లాగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగినా సరే అక్కడి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

అయితే అమెరికా మీద ఇప్పటివరకు ఇటువంటి అభిప్రాయాలు మాత్రమే ఉండేవి. పైగా రక్షణ వ్యవస్థగా ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మాదిరిగా డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందించింది. పెంటగాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా రక్షణ వ్యవస్థకు భారీగా నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా రక్షణ కోసం దండిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ అమెరికాలో భద్రత గురించి సరికొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అమెరికాలో అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. శనివారం ఒక వ్యక్తి వైట్ హౌస్ చెక్ పాయింట్ వద్ద సెక్యూరిటీ అధికారులపై కాల్పులకు దిగాడు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ విషయాలను వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా ఎవెన్యూ దగ్గరలో వైట్ హౌస్ చెక్పోస్ట్ వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు. సెక్యూరిటీ అధికారులను లక్ష్యంగా చేసుకుని పైరింగ్ మొదలు పెట్టాడు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. తిరిగి కాల్పులు మొదలుపెట్టారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో ఉండడం విశేషం.

ఇటీవల ట్రంప్ మీద కూడా కాల్పులు జరిగాయి. ఆయన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఓ వ్యక్తి అందులోకి వచ్చాడు. కాల్పులు జరిపాడు. అయితే ఆ ఘటనలో ట్రంప్ ను ఆయన అంతరంగీక సిబ్బంది కాపాడారు.. వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనకు మర్చిపోకముందే వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని ఇలా చేయడం పట్ల అమెరికాలో భద్రత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సర్పంచ్ సాబ్ కు 26.75 కోట్లు.. అందుకోసమే ఖర్చు పెట్టాం.. అసలు విషయం చెప్పిన పాంటింగ్

Ricky Ponting And Shreyas Iyer
Ricky Ponting And Shreyas Iyer

Ricky Ponting And Shreyas Iyer: ఈ ఐపిఎల్ సీజన్ ప్రారంభంలో వరుసగా విజయాలు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది పంజాబ్ జట్టు. పంజాబ్ జట్టుకు సారధిగా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా పంజాబ్ జట్టును అతడు ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇప్పుడు అయ్యర్ శనివారం నాటి లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ చేశాడు. తన జట్టుకు అవసరమైన సందర్భంలో విజయం అందించాడు. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు.

అయ్యర్ సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో అతడి మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లపాటు పంజాబ్ జట్టు కు వరుస ఓటములు ఎదురైన నేపథ్యంలో అయ్యర్ మీద విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే అతడు వాటన్నిటిని సానుకూలంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తన జట్టుకు అద్భుతమైన విజయం అందించడమే కాదు.. సూపర్ సెంచరీ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

అయ్యర్ సెంచరీ మీద ఆ జట్టు కోచ్ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. అతడు మెరుపు వేగంతో పరుగులు తీస్తాడు. పైగా జట్టును కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. ఆపద్బాంధవుడు అనే పాత్రకు అతడు బలమైన ఉదాహరణ. అందువల్లే అతడిని వేలంలో 26.75 కోట్లకు కొనుగోలు చేశాం.. అయ్యర్ పరిణతి ఉన్న ఆటగాడు. ఎమోషన్స్ కొన్ని సందర్భాలలో దాచుకుంటాడు. మరికొన్ని సందర్భాలలో వ్యక్తం చేస్తుంటాడు. సహచర ఆటగాళ్ల మీద సహనాన్ని కలిగి ఉంటాడు. వారు ఎటువంటి ఆట తీరు ప్రదర్శించినప్పటికీ ఏమాత్రం ఆగ్రహానికి గురికాడు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ సరే జట్టు మీద నిందలు మోపలేడు. అతడు నీ జాతీయ జట్టులో చూడబోతుండడం ఆనందాన్ని కలిగిస్తోందని” పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

పంజాబ్ జట్టు తరఫున సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా అయ్యర్ కొనసాగుతున్నాడు. 2020లో కేఎల్ రాహుల్.. 2011లో గిల్ క్రిస్ట్ ఈ ఘనత అందుకున్నారు.

ఐపీఎల్ లో లక్ష్యాన్ని సాధించే క్రమంలో సెంచరీ చేసిన నాలుగవ సారథిగా అయ్యర్ నిలిచాడు. ఈ జాబితాలో సెహ్వాగ్, కోహ్లీ, సంజు ముందు స్థానంలో ఉన్నారు.

గడిచిన సీజన్ నుంచి లక్నో జట్టు మీద పంజాబ్ నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది.. తద్వారా సరికొత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది.

పంజాబ్ గెలిచింది.. రాజస్థాన్.. కోల్కతా ఏం చేస్తాయో..

IPL Playoff Race
IPL Playoff Race

IPL Playoff Race: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.. నాలుగో స్థానం కోసం పంజాబ్, కోల్కతా, రాజస్థాన్ జట్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించడంతో.. ఆ జట్టు కాస్త ముందడుగు వేసింది. అయితే రాజస్థాన్.. కోల్కతా జట్లకు కూడా అవకాశం ఉండడం.. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచులు ఆడే అవకాశం ఉండడంతో.. ఏదైనా జరగవచ్చని క్రికెట్ విశేషకులు అంచనామిస్తున్నారు.

లీగ్ దశలో ఆదివారం నాడు రెండు కీలకమైన మ్యాచులు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ల్లో గెలిచిన వారికి నాలుగో బెర్త్ దక్కుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.. నాలుగో బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, కోల్కతా జట్లు సిద్ధంగా ఉన్నాయి. పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు
.. రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లు.. కోల్కతా ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి..

ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ గనుక ముంబై ఇండియన్స్ మీద విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాల అవసరం లేకుండానే నాలుగో స్థానాన్ని దక్కించుకుంటుంది. అప్పుడు రాజస్థాన్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. ఫలితంగా చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా కోల్కతా, పంజాబ్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ ఒకవేళ గనుక రాజస్థాన్ ఓటమిపాలైతే.. పంజాబ్, కోల్కతా చెట్లకు అవకాశాలుంటాయి. అప్పుడు ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో కోల్కతా గెలవాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు పంజాబ్ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా + 0.309 ఉంది. ఇలాంటప్పుడు పంజాబ్ జట్టును అధిగమించాలంటే కోల్కతా అత్యంత భారీ విజయం సొంతం చేసుకోవాలి. ఢిల్లీ జట్టు మీద భారీ అంతరంతో కోల్కతా గెలిస్తే ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. నెట్ రన్ రేట్ కూడా+0.011 ఉంటుంది.

కోల్కతా జట్టు బెటర్ నెట్ రన్ రేట్ సాధించాలంటే ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు 200 పైగా పరుగుల టార్గెట్ విధించాలి. ఆ తర్వాత 77 పరుగుల అంతరంతో విజయం సాధించాలి.

ఒకవేళ కోల్కతా టార్గెట్ ఫినిష్ చేయడానికి దిగినప్పుడు 200కు పైగా పరుగుల టార్గెట్ ను కేవలం 12.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. అప్పుడు పంజాబ్ జట్టు వెనక్కి వెళ్ళిపోతుంది.. కోల్కతా ముందుకు వస్తుంది.. ఇవన్నీ జరగాలంటే ముంబై ఇండియన్స్ జట్టు మీద రాజస్థాన్ ఓడిపోవాలి. ఒకవేళ గెలిస్తే పంజాబ్.. కోల్కతా బ్యాగులు సర్దుకుని ఇంటికి పోవాలి.