Home Blog Page 192

ఈ రాశి వ్యాపారులు ఈరోజు డబ్బు కట్టలు లెక్క పెట్టాల్సిందే..

Today 15 July 2026 Horoscope
Today 15 July 2026 Horoscope

Today 4 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండానే డబ్బు కట్టలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): .ఆ రోజు మీకు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, శాంతంగా ఉండటం ఉత్తమం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పుడతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : చంద్రుడు మీ రాశిలోనే సంచరించడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. శారీరక దృఢత్వంపై ఆసక్తి చూపుతారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు శుభవార్తలు అమ్ముతాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి పెద్దల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఉద్యోగులు ప్రశాంతంగా గడుపుతారు. అధికారుల అండదండలు ఉండడంతో కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. పిల్లలతో సరదాగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేసిన అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడును పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అయితే ఆలోచనపరంగా బలహీనంగా మారుతారు. ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఇది నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులు ప్రత్యర్థులపై కనీసం ఉంచాలి. ఆన్లైన్ పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆన్లైన్ పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాలు ఈరోజు కలిసి రావు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది.

'పెద్ది' ప్రీమియర్ షో రివ్యూ : రామ్ చరణ్ నట విశ్వరూపం.. కానీ సినిమాలో మిస్ అయ్యింది ఏమిటంటే..

Peddi Premiere Show Review
Peddi Premiere Show Review

Peddi Premiere Show Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా మొదలైంది. మొదటి నుండి ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ వెళ్లాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా దాదాపుగా 70 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు వచ్చింది. అంతటి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది , డైరెక్టర్ బుచ్చి బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ అంచనాలను అందుకున్నారా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

ఎలాంటి సౌకర్యాలు లేని విజయనగరం జిల్లా లోని ఒక మారుమూల గ్రామం. కనీసం ప్రయాణం చేయడానికి కూడా వీలు లేని ప్రాంతం. ఆ గ్రామం నుండి రైలు వెళ్తూ ఉంటుంది కానీ , ఆగదు. రైలు ప్రయాణం సౌకర్యం లేకపోవడం వల్ల మెరుగైన వైద్యం అందక ఎంతో మంది గ్రామస్తులు చనిపోతూ ఉంటారు. రైలు సౌకర్యం కోసం అప్పలసూరి (జగపతి బాబు) చేసే ప్రయాణం ఊహాతీతం. రైల్వే ట్రాక్ అవతల నిల్చొని ఎర్ర జెండా ని ఊపుతూ , రైలు ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు , కానీ పట్టించుకునే వాళ్ళు ఉండరు. కనీసం పేరు కూడా లేని ఊరు అది. అయితే ఆ ఊర్లో క్రికెట్ ఆటలో ఆరి తేరిన పెద్ది (రామ్ చరణ్) అనే కుర్రాడు ఉంటాడు. అందరూ అతన్ని ఆట కూలీ లెక్క వాడుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అదే క్రమం లో ఆ ఊరి సర్పంచ్ కూతురు అచ్చియమ్మ(జాన్వీ కపూర్) తో ప్రేమలో పడుతాడు. ఒకరోజు ప్రత్యర్థి పార్టీ కి చెందిన వారు , జాన్వీ కపూర్ ని నిండు సభలో బట్టలు చించి అవమానిస్తారు.

ఆ సమయం లో పెద్ది అచ్చియమ్మ ని అవమానించిన వాళ్ళని చితక్కొడుతాడు. ఆ పగతో వాళ్ళు పెద్ది కి క్రికెట్ ఆటలో ఘోరమైన అవమానం చేస్తారు. కానీ పెద్ది ఆడిన ఆట తీరుని గుర్తించిన గౌర్ నాయుడు (శివరాజ్ కుమార్) అతనికి కుస్తీ పోటీ నేర్పిస్తానని ముందుకు వస్తాడు. కానీ పెద్ది మొదట్లో ఒప్పుకోడు. కట్ చేస్తే ఒకరోజు కొండని దాటుతున్న సమయం లో భారీ వర్షం వస్తుంది. ఆ సమయం లో కొన్ని కొండచరియలు విరిగి, జనాల మీద పడడంతో , ఒక కుర్రాడు చనిపోతాడు. అప్పుడు అప్పలసూరి ఎలా అయినా రైలు ని తమ ఊర్లో ఆపించే ప్రయత్నం గట్టిగా చెయ్యాలని నిర్ణయించుకొని రాజకీయ నాయకులను కలుస్తాడు. కానీ వాళ్ళు అప్పలసూరి ని అవమానించి , చితక్కొట్టి పంపుతారు. దీంతో అప్పలసూరి రైల్వే ట్రాక్ మధ్యలో నిల్చొని ఎర్ర జెండా ని ఊపుతూ రైలు ని ఆపే ప్రయత్నం చేసి చనిపోతాడు. దీంతో పెద్ది తన ఊరికి ఎలా అయినా గుర్తింపు తీసుకొని రావాలనే కసితో , అందుకు తన సొంతంగా ఆడే ఆట ద్వారా వచ్చే గుర్తింపే ముఖ్యం అని భావించి , కుస్తీ నేర్చుకోవడానికి వస్తాడు. ఈ ప్రయాణం లో అతను తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.

విశ్లేషణ :

ఈ చిత్రానికి ప్రధాన బలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. వీళ్లిద్దరు లేకపోతే సినిమా డిజాస్టర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. బలమైన కథకు బలహీనమైన స్క్రీన్ ప్లే తోడైతే , అది పెద్ది అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఆరంభంలో 20 నిమిషాలు చాలా గట్టిగానే వర్కౌట్ అయ్యింది. రామ్ చరణ్ పరిచయ సన్నివేశం , రయ్ రయ్ రారా పాట ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంట్రీ ఆడియన్స్ కి నరకప్రాయం లాగా అనిపిస్తుంది. మంచి టాలెంట్ , అందం ఉన్న నటిని , డైరెక్టర్ బుచ్చి బాబు కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిచయం చేశాడు . ఈమె ఎంట్రీ తర్వాత సినిమా బాగా డౌన్ అవుతుంది , కానీ చికిరి చికిరి పాట నుండి సినిమా మళ్లీ ఊపందుకుంటుంది, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ఎమోషనల్ సన్నివేశం మాస్టర్ క్లాస్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా మనకి ఇంటర్వెల్ పడేలోపు మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది.

కానీ రామ్ చరణ్ ఆట మార్చినప్పటి నుండే ఈ సినిమా కాస్త డౌన్ అవుతుంది. కుస్తీ నేర్చుకొని , నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొనాలనే లక్ష్యం తో ఉంటాడు రామ్ చరణ్. కుస్తీ పోరాట సన్నివేశాలన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి , రామ్ చరణ్ పాపం చాలా కష్టపడి నటించాడు, కేవలం ఈ సన్నివేశాల కోసం ఆయన తన శరీరాన్ని మలుచుకున్న తీరుని చూస్తే సెల్యూట్ చేయాల్సిందే. అయితే కుస్తీ ఫైటింగ్ తోనే ఈ సినిమాని కొనసాగించి ఉండుంటే బాగుండేది. కానీ వైవిద్యం కోసం బుచ్చి బాబు ప్రీ క్లైమాక్స్ లో పెట్టిన మెలిక ఆడియన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఇచ్చే ఎమోషనల్ ప్రసంగం మాత్రం వేరే లెవెల్ లో అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ మరియు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాని నిలబెట్టేసారు. బుచ్చి బాబు స్క్రీన్ ప్లే సరిగా రాసుకొని ఉండుంటే వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఈ చిత్రానికి ఉండేది.

ప్లస్సులు :

–> రామ్ చరణ్ నటన
–> ఏఆర్ రెహమాన్ సంగీతం
–> ప్రీ ఇంటర్వెల్ – ఇంటర్వల్ ఎమోషనల్ సన్నివేశాలు
–> క్లైమాక్స్

మైనస్సులు :

–> స్క్రీన్ ప్లే
–> రొటీన్ స్టోరీ
—> హీరోయిన్ జాన్వీ కపూర్
–> సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

చివరి మాట : ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే , రామ్ చరణ్ అద్భుతమైన నటన కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూసేయొచ్చు, కానీ అంచనాలు తక్కువగా పెట్టుకొని వెళ్తే మంచిది.

రివ్యూ : 2.5/5

పెద్ది.. ఉప్పెన తర్వాత చద్ది!

Peddi Movie Review
Peddi Movie Review

Peddi Movie Review: రివ్యూ: పెద్ది

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్,, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు

సంగీత దర్శకుడు: ఏ.ఆర్. రెహమాన్

ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు

ఎడిటర్: నవీన్ నూలి

దర్శకుడు: బుచ్చిబాబు సానా

నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత పక్కా పల్లెటూరి ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పైగా ఇది’ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కావడంతో’పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. స్పోర్ట్స్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం, జాన్వి కపూర్ లాంటి ప్యాన్ ఇండియా హీరోయిన్, ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ పెద్ద అన్నట్టుండే ఈ కాంబినేషన్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడం పెద్ద విషయమేమీ కాదు. ఇలాంటి స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిందా? బుచ్చిబాబు తన రెండో సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడా? చరణ్ లాంటి స్టార్ హీరోను ఒక హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు ప్రెజెంట్ చేయగలిగాడా అనేది మనం రివ్యూ లో చూద్దాం.

గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా లోకల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అనే ఫీల్ ఇస్తూనే మెల్లిగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పోటీల వరకూ తీసుకెళ్ళే సినిమా ఇది. కొండ కింద ఊరు ఆనే ప్రభుత్వం అస్సలే గుర్తించని ఊరిలో, ప్రజలకు ఐడెంటిటీ అంటూ ఏమీ లేని ప్రజలు ఉండే ఊరిలో పెద్ది (రామ్ చరణ్) క్రికెట్ ఆటలో ఒక కూలీ. అయితే కూలి పనులు చేసుకుంటూనే క్రికెట్ ఆటలో ప్రతిభ కనబరుస్తూ ఉంటాడు. తన ప్రతిభతో విజయనగరం, బొబ్బిలి టీమ్ ల మధ్యలో క్రికెట్ పోటీలు జరిగినప్పుడు ఆట కూలీగా అవతారం ఎత్తుతాడు. అంటే ఎవరు వేలం పాట పాడుకుంటే వారి టీమ్ లో ఆడి ఆ జట్టును గెలిపించే ఒక యువకుడు. ఇలా కొంత కాలం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల అవమానాల పాలు కావలసి వస్తుంది. అప్పుడు కూలీ కోసం అట ఆడకూడదు, ఆట కోసం ఆట ఆడాలి ఆనే గౌరు నాయుడు(శివరాజ్ కుమార్) మాటలకు ప్రభావితుడై కుస్తీ పోటీలలో పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు. క్రికెట్ కు బై బై చెప్పి గౌరునాయుడి దగ్గర కుస్తీలో శిష్యరికం చేయడానికి వెళతాడు. ఇదే సమయంలో తమ గ్రామ గుర్తింపు, గ్రామస్తుల గుర్తింపుకై జీవితాంతం తపన పడిన పోరాటం చేసిన వ్యక్తి అప్పల దాసు(జగపతి బాబు) చేసిన ప్రాణత్యాగం పెద్ది జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. తర్వాత పెద్ది తన గ్రామస్తుల గుర్తింపు, తన గ్రామం గుర్తింపు కోసం ఏం చేశాడు? ఎంత దూరం వెళ్ళాడు అనేది మిగతా కథ. ఈ కథలో ఒక సబ్ ప్లాట్ లాగా అచ్చాయమ్మ (జాన్వీ కపూర్) తో ప్రేమ కథ కూడా ఉంటుంది.

ఇన్ని కోట్ల మంది ఉండే భారత దేశంలో మనకు ఒలింపిక్స్ లో జనాభాకు తగ్గట్టు పతకాలు రావడం లేదు అంటూ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీటింగ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ మీటింగ్ లో ఉండేవారిలో బొమన్ ఇరానీ మాట్లాడుతూ మనకు ఈ సారి రెండు పతకాలు వచ్చాయి అంటాడు. అప్పుడు ఇంత జనాభాకు రెండే పతకాలా.. ఇలా అయితే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ రద్దు చేసి ఆ ఫండింగ్ మిలిటరీకి మళ్లించాల్సి ఉంటుంది అని స్పోర్ట్స్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. దీంతో బొమన్ ఇరానీ ఏం చేస్తే ఇండియాకు పతకాలు వస్తాయి అని వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆంధ్ర ప్రదేశ్ కు వస్తాడు. అక్కడే పెద్ది పాత్ర ఎంటర్ అవుతుంది. బొమన్ ఇరానీ పెద్ది గురించి తెలుసుకుంటూ వెళతాడు. సినిమా క్లైమాక్స్ కు పెద్ది ప్రయాణం గురించి పూర్తిగా తెలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా పెద్ది గురించి, పెద్ది టాలెంట్ గురించి ఎస్టాబ్లిష్ చేయడంతో సరిపోతుంది. ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో బ్రేక్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ హాఫ్ ఆంతా కమర్షియల్ టెంప్లేట్ తో హీరో ఎలివేషన్స్ తో సాగుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప మిగతా అంతా సాదాసీదాగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి స్పోర్ట్స్ డ్రామా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. సెంటిమెంట్ డోస్ కాస్త పెరగడం వల్ల కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపించినా, కొన్ని సన్నివేశాలు కాస్త లెంగ్తీగా అనిపించినా, ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్స్ సినిమాను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తాయి. స్క్రీన్‌ప్లే అక్కడక్కడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగినప్పటికీ, కథనం ఎగుడుదిగుడుగా అనిపించినా ఓవరాల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది.

రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం చరణ్ పడ్డ కష్టం, మేకోవర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. రెజ్లింగ్ సీన్స్‌లో, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు చరణ్ నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. నిజానికి సినిమా చాలా చోట్ల బోరింగ్ అనిపించినా చరణ్ నటన, తన మేకోవర్ వల్ల ఆ లోపాలన్నీ కవర్ అయినట్టు ఉంటాయి. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా బలంగా ఉంది కానీ జాన్వీ కపూర్ పాత్ర మాత్రం ఉన్నా లేకపోయినా ఒకటే. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఇరికించినట్టు అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పేమీ కాదు. పైగా జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా సూట్ కాలేదు. క్యారెక్టరైజేషన్ కూడా బలహీనంగా ఉంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక పెద్ద అసెట్. అయితే ప్రీ క్లైమాక్స్ వరకూ శివరాజ్ కుమార్ పాత్ర బలంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ వచ్చేసరికి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రగా మారిపోతుంది. గ్రామం కోసం తపన పడే వ్యక్తిగా జగపతి బాబు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యే పాత్రలను మాత్రం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.

ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం అద్భుతంగా అయితే లేదు. రెండు పాటలు బాగున్నాయి. మిగతావి యావరేజ్. నేపథ్య సంగీతం విషయానికి వస్తే కొన్ని చోట్ల గొప్పగా ఉంది కానీ కొన్ని చోట్ల మాత్రం చప్పగా ఉంది. ఓవరాల్ గా చెప్తే అత్తెసరు మార్కులే ఇవ్వాలి. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ప్రతి విజువల్ చాలా రిచ్‌గా, సహజంగా ఉంటూ గ్రామీణ అందాలను, యాక్షన్ సీన్స్‌ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకొంత షార్ప్ గా ఉండాల్సింది, సెకండ్ హాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లను కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. మూడు గంటల 9 నిముషాల నిడివి ఎక్కువే అని చెప్పాలి. ఇక రైటింగ్ విషయానికి వస్తే కొన్ని డైలాగులు బాగున్నాయి కానీ స్క్రీన్ ప్లే లోపాల వల్ల సినిమా అంతా ఒక ఫ్లో లో ఉన్నట్టు అనిపించదు. చాలా చోట్ల లాజిక్ లను గాలికి వదిలేశారు. సినిమాటిక్ లిబర్టీ వీలైనంత ఎక్కువ తీసేసుకున్నారు. లాజిక్ లను పట్టి పట్టి చూసే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడం కష్టమే. లాజిక్ లను పక్కన పెట్టి కమర్షియల్ సినిమా ను ఎంజాయ్ చేద్దాం అనేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. రామ్ చరణ్ వన్-మ్యాన్ షో & మేకోవర్

2. ఇంటర్వెల్ బ్యాంగ్ , ప్రీ క్లైమాక్స్ నుంచి చివర వచ్చే షాకింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్

3. రత్నవేలు విజువల్స్

సినిమాలో బాగలేనివి ఇవి:

1. జాన్వి కపూర్ లవ్ ట్రాక్

2. రొటీన్ ఫస్ట్ హాఫ్

3. చాలా చోట్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం

రేటింగ్: 2.5 / 5

ఫైనల్ వర్డ్: పెద్ది కాదు కమర్షియల్ చద్ది!

వందలు కాదు.. చేతిలో వేల కోట్లు.. దేశంలో రిచెస్ట్ సీఎం ఇతనే

Richest Chief Minister In India
Richest Chief Minister In India

Richest Chief Minister In India: ప్రజాసేవ అనేది బూటకం. ఆస్తులు సంపాదించుకోవడమే దాని వెనుక ఉన్న అసలైన పరమార్ధం. మనదేశంలో శాసన వ్యవస్థ కంటే రాజకీయ వ్యవస్థ అత్యంత బలమైనది. అందువల్లే రాజకీయ నాయకులు వ్యవస్థలను మొత్తం శాసిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అధికారుల సైతం రాజకీయ నాయకులు కింద పనిచేయాల్సి ఉంటుంది. మరి చెప్పినదల్లా వినాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి అధికారం గనక దక్కితే.. వారు చెప్పినట్టు అధికారులు తల ఊపాల్సి ఉంటుంది.

అడ్డగోలుగా సంపాదించడం మాత్రమే కాదు.. ఇతర మార్గాల్లో ఆర్జించి.. దానిని ఎన్నికల్లో ఖర్చుపెట్టి.. దర్జాగా పదవులను పొందుతున్నారు కొంతమంది నాయకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన పెట్టుబడి కంటే కొన్ని కోట్ల రేట్లు సంపాదించి వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. దేశంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్స్ గా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు అంటే ఈ విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వెంటనే తెలిసిపోతుంది. ఇక మనదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో అత్యధిక డబ్బు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన రూపంలో లభించింది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఒకసారి కొత్త రికార్డు కూడా సృష్టించారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా నిలిచారు. డీకే దగ్గర దాదాపు 1,413 కోట్ల అసెట్స్ ఉన్నాయి. ఈ ఆ తర్వాత 931 కోట్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ స్థానంలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 648 కోట్లతో మూఢస్థానంలో ఉన్నారు. అయితే దేశంలోనే అత్యధిక ధనవంతులైన ముఖ్య మంత్రులుగా ఉన్నవారు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు కావడం విశేషం.

డీకే కంటే ముందు చంద్రబాబు దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉండేవారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు రెండవ స్థానానికి పరిమితమయ్యారు.

డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుపొందారు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. అప్పటినుంచి ఆయన సోనియాగానికి నమ్మిన బంటుగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. అందువల్లే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మండే ఎండల్లో.. ఇది చల్లటి వార్త..

Southwest Monsoon Kerala
Southwest Monsoon Kerala

Southwest Monsoon Kerala: మామూలు ఎండలు కావు. ఈసారి పాత రికార్డులు బద్దులయ్యాయి. సూర్యుడి దెబ్బకు సరికొత్తగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వడగాలులు తీవ్ర స్థాయిలో వీచాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. మండే ఎండలకు తోడుగా వడ గాలులు కూడా విపరీతంగా వీయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశం కేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. రోహిణి కార్తె కూడా ప్రవేశించడంతో వానదేవుడా వర్షం కురిపించు.. అంటూ దీనంగా వేడుకుంటున్నారు.

ఎల్ ని నో హెచ్చరికలు.. ఇతరత్రా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో.. వానదేవుడు జనాల మీద కరణ చూపించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు రేపు తాకబోతున్నాయి. ఐదో తేదీన రాయలసీమలో ప్రవేశిస్తాయి. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా మొత్తం విస్తరిస్తాయి. జూన్ 15 వరకల్లా ఆంధ్ర ప్రదేశ్ మొత్తం రుతుపవనాలు వచ్చేస్తాయి. రుతుపవనాలు వచ్చినప్పటికీ ఒక వారం పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే ఎండలు బాగా కొట్టాయి కాబట్టి.. వర్షాలు కూడా అదే స్థాయిలో పడతాయి అనే విషయాన్ని చెప్పలేమని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. కేరళ… తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే రాష్ట్రంలో చాలావరకు ఎండలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ.. కొన్ని ప్రాంతాలలో మాత్రం వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భీమిలి ప్రాంతంలో రెండు సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం ఎందుకు బలమైన ఉదాహరణ.

నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వచ్చే మూడు గంటల్లో విజయనగరం.. శ్రీకాకుళం.. జిల్లాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి.. కృష్ణాజిల్లాలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వర్షాలు స్థిరంగా కొనసాగుతాయా.. లేక ప్రారంభంలోనే కురిసి ముఖం చాటేస్తాయా.. అనే ప్రశ్నలకు వాతావరణ శాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఎల్ నీనో ప్రభావం వల్ల నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు కాకుండా… తక్కువ నీటిని వినియోగించుకునే పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

గంగూలీ అంటే అమిత్ షా కు ఎందుకు అంత కోపం.. బెంగాల్ దాదాకు గడ్డు కాలమే..

Sourav Ganguly And Amit Shah
Sourav Ganguly And Amit Shah

Sourav Ganguly And Amit Shah: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఒక్కసారి మనసులో అనుకుంటే చాలు.. అతడు ఎవరైనా సరే సర్దుకోవాల్సిందే. కాకపోతే అమిత్ షా హెచ్చరికలు నేరుగా చేయరు. టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత.. దానికి సంబంధించిన కార్యాచరణ వేగంగా సాగిపోతూ ఉంటుంది. చాప కింద నీళ్లు వచ్చేదాకా కూడా తెలియదు.. చేసింది అమిత్ షా అని.. ఆ తర్వాత అనుకున్నప్పటికీ ఉపయోగముండదు. ఇప్పుడు ఈ పరిస్థితిని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుభవిస్తున్నారు.

గంగూలీ సమర్థవంతమైన ఆటగాడు. టీమిండియాకు.. బెంగాల్ క్రికెట్ కు.. బీసీసీఐకి ఆయన ఎన్నో సేవలందించారు. అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఆమెకు సహకరించారు. కొన్ని సందర్భాలలో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అవి ఏవి నిజం కాలేదు. కాకపోతే మమతా బెనర్జీకి ఆయన పరోక్షంగా సపోర్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఓడిపోయింది. మమతా బెనర్జీ.. ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ చుక్కలు చూస్తున్నారు. వారికి ఇప్పటికే మాస్టర్ స్ట్రోక్లు ఇచ్చేసింది బిజెపి. ఇప్పుడు తర్వాతి టార్గెట్ గంగూలీ.

గంగూలీ కి బిజెపి ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించేసింది. గంగూలికి ఉన్న జెడ్ కేటగిరి భద్రతను వై కేటగిరికి తగ్గించింది. అనేక కారణాల వల్ల 2023లో నాటి మమతా ప్రభుత్వం వై కేటగిరి భద్రతను జెడ్ కేటగిరీగా మార్చేసింది. వై కేటగిరిలో ఉన్నప్పుడు గంగూలికి స్పెషల్ కేటగిరీలో ఉన్న పోలీసు అధికారులు ముగ్గురు సెక్యూరిటీ ఇచ్చేవారు. ముగ్గురు పోలీసులు ఆయన ఇంటికి కాపలాగా ఉండేవారు. 2023 తర్వాత జెడ్ కేటగిరి కింద గంగులకి 8 నుంచి పదిమంది పోలీసులు సెక్యూరిటీ ఇచ్చేవారు.

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెడ్ కేటగిరి సెక్యూరిటీ లో ఉన్న వారందరి జాబితాను పరిశీలించింది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం గంగులికి ఉన్న ముప్పును సమీక్షించింది. ఆ తర్వాత అతడికి జెడ్ నుంచి వై కేటగిరికి భద్రతను మార్చేసింది. అంతేకాదు అతడికి సెక్యూరిటీ కల్పించే సిబ్బంది విషయంలో కూడా కోత విధించేసింది. దీంతో సౌరవ్ గంగూలీ విషయంలో అమిత్ షా అనుకున్నది చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు.. ఆమెకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బిజెపి అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా బెంగాల్ దాదాను పార్టీలోకి రావాలని కమలం నేతలు ఆహ్వానించారు. ఈ వ్యవహారం మొత్తం అమిత్ షా సాగించారు. అయితేనాడు గంగూలీ బిజెపిలోకి రాకపోగా.. మమత ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దానిని మనుసులో పెట్టుకున్న అమిత్ షా ఇప్పుడు ఇలా రివేంజ్ తీర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే గంగూలి మీద అమిత్ షా కు ఎటువంటి కోపం లేదని.. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మా కావ్య పాప నీకేం అన్యాయం చేసింది కమిన్స్ బ్రో.. ఇలా ఎందుకు చేస్తున్నావ్..

Pat Cummins
Pat Cummins

Pat Cummins: అప్పుడెప్పుడో 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2024లో ఫైనల్ దాకా వచ్చింది. మధ్యమధ్యలో మెరుపులు మెరిపించింది. ఈ సీజన్లో 4వ స్థానంలో సరిపెట్టుకుంది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు అంటే ఐపీఎల్లో ఒక రకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆ జట్టుకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ తీసుకొచ్చిన వారిలో ముఖ్యస్థానంలో ఉంటాడు కెప్టెన్ కమిన్స్.

హైదరాబాద్ జట్టుకు ట్రోఫీని అందించాలని కల అతడికి ఎప్పటినుంచి ఉంది. ఈసారి దురదృష్టవశాత్తు అది దూరమైంది. 2024 లో కూడా చివరి దశలో ఒత్తిడికి గురి కావడంతో ట్రోఫీ చేజారిపోయింది. అయితే వచ్చే సీజన్లో మాత్రం గట్టిగానే ఆడతామని.. ఈసారి అద్భుతమైన ప్రదర్శన చేస్తామని కమిన్స్ పేర్కొన్నాడు. దీంతో అతడు జట్టును గొప్పగా మార్చుతాడని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ అభిమానులు.. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య బలంగా అనుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో ఒక రకమైన సందిగ్ధమైన వాతావరణం నెలకొంది.

2027 ఐపీఎల్ కు కమిన్స్ దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించి అతడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు..”వచ్చే ఏడాది కాస్త భిన్నంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఒకదానిని వదులుకోవాల్సి వస్తోంది. అయితే టెస్టులు, వన్డే వరల్డ్ కప్ ను వదులుకునే అవకాశం లేదు. వాటికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చేస్తాను. ఇండియాలో ఆస్ట్రేలియా ఆడే అన్ని టెస్ట్ లలో ప్రాతినిధ్యం వహిస్తే.. యాషెస్ సిరీస్ కు నాకు విశ్రాంతి అవసరం. హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాను. నాకు కొన్ని గాయాలయ్యాయి.. అందుకే ఇప్పుడే ఏది స్పష్టంగా చెప్పలేను” అని కమిన్స్ వ్యాఖ్యానించాడు.

ఈ సీజన్లో ప్రారంభ మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. తాత్కాలిక సారథిగా కిషన్ జట్టును నడిపించాడు. అతడి నాయకత్వంలో హైదరాబాద్ జట్టు మెరుగైన విజయాలు సాధించింది.కమిన్స్ జట్టులో ప్రవేశించిన తర్వాత కూడా విజయాలు సాధ్యమయ్యాయి. అయితే చివరి అంచలో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.

కేటీఆర్ నాకు తమ్ముడు లాంటోడు.. నా గురించి తప్పుగా మాట్లాడి ఉండడు - పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా , ఇలా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించే చర్చ. ఈ స్థాయిలో ఒక ఆంధ్ర నాయకుడు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరగడం గడిచిన 12 ఏళ్ళల్లో ఎప్పుడూ జరగలేదు. జనసేన పార్టీ ని తెలంగాణ లో యాక్టీవేట్ చేయడానికి తాజా రాజకీయ పరిణామాలు దోహదపడ్డాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి నుండి పవన్ కళ్యాణ్ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తే మాత్రం ఆయనకు తెలంగాణ లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెద్ద సంచలనం గా మారింది. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా, బీఆర్ ఎస్ పార్టీ నాయకులూ కూడా స్పందించారు.

నేడు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో , ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఒక సినీ హీరో గా మేమంతా అభిమానిస్తాం , ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గా ఆయనకు ఎంతో గౌరవం ఇస్తాం , మా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ కూడా పెట్టిస్తాను , కానీ మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోము, తెలంగాణ మా అయ్యా జాగీరా అని అంటున్నాడు , అవును , మా అయ్యా జాగీరే , తెలంగాణ రాష్ట్రము నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల అయ్యల జాగీరు, పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు , ఈమధ్యనే ఆయన ఓజీ సినిమా తీసాడు , మా తెలంగాణ రాజకీయాలకు ఓజీ కేసీఆర్, మరో ఓజీ అవసరం లేదు ‘ అంటూ ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారం రేపాయి.

దీనిపై పవన్ కళ్యాణ్ నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి అర్పిస్తూ , ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘కేటీఆర్ గారు ఏమి మాట్లాడాడో నాకు తెలియదు , ఇంకా నేను చూడలేదు , కానీ ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది , అన్నాదమ్ముల అనుబంధం మాది , కచ్చితంగా నా గురించి తప్పుగా అయితే మాట్లాడి ఉండదు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తెలంగాణ లో రాజకీయాలు నడిపేందుకు చూస్తున్నాడని అర్థం అవుతోంది.

కాస్త గ్యాప్ ఇవ్వండి సార్.. ఇలాగైతే మమతా బెనర్జీ బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది..

West Bengal Politics
West Bengal Politics

West Bengal Politics: గ్యాప్ ఏమాత్రం ఇవ్వడం లేదు.. కోలుకునే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలు బయటికి వస్తే గుడ్లతో దాడి చేస్తున్నారు. రాళ్లతో కొడుతున్నారు. టీఎంసీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. చోర్ చోర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతటితోనే ఆగడం లేదు బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలంటూ చెబుతున్నారు. ఇదంతా బెంగాల్లో ప్రజల కోణంలో జరుగుతున్న వ్యవహారం.

భారతీయ జనతా పార్టీ కోణంలో చూస్తే అక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా మొదటి దాకా అధికార పక్షంలో ఉన్న టీఎంసీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి విషయంలోనూ మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల ఆమె పార్టీ నేత జహంగీర్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేశాడు. ఆర్థికపరమైన మోసాలు.. వివిధ రకాలైన కేసులలో ఆమె పార్టీ నాయకులు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు విచారిస్తున్నాయి. కీలకమైన నాయకులను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు.. బంగారం.. ఇతర ఆస్తులను సీజ్ చేశారు.

ఆధార్ కార్డుల జారి.. ఓటర్ కార్డుల జారి.. బంగ్లాదేశ్ ప్రజలకు అందించిన పథకాలు.. పౌరసత్వం ఇలా అనేక విషయాలలో బిజెపి దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే చికెన్ నెక్ రహదారిని కేంద్రానికి అప్పగించింది బిజెపి. అదే కాదు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానికి సహకారం అందిస్తోంది. ఇక్కడితోనే బిజెపి ఆగిపోవడం లేదు. మమత పునాదులను తొలగించే పని చేపడుతోంది.

మమత అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైతే తొక్కి పెట్టిందో.. వారితోనే ఇప్పుడు చెక్ పెట్టిస్తోంది బిజెపి. బెంగాల్ లో మమత బెనర్జీకి ఆమె సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే విధంగా బిజెపి నాయకులు రూపకల్పన చేశారు. ఇటీవల టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రిత ప్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదిస్తూ ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లెటర్ రాశారు. దీంతో బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. అయితే ఇక్కడ రితప్రత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ తమ నాయకురాలని.. ఆమె ఏర్పాటు చేసిన పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని బెనర్జీ చెప్పడం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలో బహిష్కృత నేతను ప్రతిపక్ష నేతగా మార్చిన నేపథ్యంలో.. త్వరలోనే మమతా బెనర్జీని బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ పంపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హెచ్‌–1బీ వీసాకు ఫుల్‌ డిమాండ్‌.. ఫీజు పెంచినా 2 లక్షల దరఖాస్తులు!

H-1B Visa
H-1B Visa

H-1B Visa: అమెరికా ఫస్ట్‌ నినాదంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చారు. ఈమేరకు అనేక చర్యలు చేపట్టారు. అక్రమంగా ఉంటున్నవారిని సొంత దేశాలకు పంపించారు. వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అమెరికా కంపెనీలు స్వదేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా హెచ్‌–1బీ వీసా ధరలను లక్ష డాలర్లకు పెంచారు. అంటే భారత కరెన్సీలో రూ.88 లక్షలు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, ఆశ్చర్యకరంగా దరఖాస్తుదారుల డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 2.86 లక్షల హెచ్‌–1బీ దరఖాస్తులు వచ్చాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) కార్యదర్శి మార్క్‌వేన్‌ ముల్లిన్‌ వెల్లడించారు. వీటిలో రెండు లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు లక్ష డాలర్ల ఫీజు చెల్లించి ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రాసెసింగ్‌ (15 రోజుల్లో) పొందారు. మిగిలినవి సాధారణ ప్రాసెసింగ్‌లో 7.5 నెలలు పడుతున్నాయి.

విదేశీయులను నియంత్రించాలని..
ఫీజు పెంపు వెనుక ఉన్న ఉద్దేశంట్రంప్‌ ప్రభుత్వం ఈ చర్యను ‘‘అమెరికా కార్మికులను రక్షించడం, విదేశీ సస్తమైన లేబర్‌ను నియంత్రించడం’’ అనే లక్ష్యంతో తీసుకుంది. వీసా ద్వారా విదేశీ నిపుణులను భారీ సంఖ్యలో తీసుకురావడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, టెక్‌ కంపెనీలు సులభంగా విదేశీయులను నియమించుకుంటున్నారని ఆరోపించింది. దీన్ని అరికట్టడానికి ఒక రకమైన ‘‘ట్యాక్స్‌ ఆన్‌ ఫారిన్‌ లేబర్‌’’గా ఈ లక్ష డాలర్ల ఫీజును విధించింది. అయితే ఈ ఫీజు దేశం బయటి నుంచి దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. అమెరికాలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులు (ఎఫ్‌–1 ఆప్ట్‌లు) మార్పు చేసుకునేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

70 శాతం మంది అధిక ఫీజు..
భారీగా ఫీజు ఉన్నా 70 శాతం దరఖాస్తుదారులు దానిని చెల్లించారు. ఇది రెండు ముఖ్యమైన విషయాలను స్పష్టం చేస్తోంది. అమెరికా టెక్‌ ఇండస్ట్రీ ఇప్పటికీ భారత్‌తో సహా విదేశీ ప్రతిభపై ఎంతగా ఆధారపడి ఉంది అనేది.
అత్యుత్తమ నైపుణ్యం కలిగిన టాలెంట్‌ను పొందడానికి కంపెనీలు ఏ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నాయి అనేది. భారత్‌ నుంచి వచ్చే హెచ్‌–1బీ దరఖాస్తులు ఎప్పటిలాగే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ రంగాల్లో భారతీయులు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు.

ఈ ఫీజు పెంపు అమెరికా కార్మికులను రక్షించడంలో ఎంతవరకు సఫలమవుతుందో సందేహాలు ఉన్నాయి. ఒకవైపు కంపెనీలు భారీ మొత్తం చెల్లించి కూడా విదేశీ నిపుణులను తీసుకురావడం వల్ల పాలసీ ఉద్దేశం కొంతవరకు విఫలమైనట్లే. మరోవైపు, ఈ ఫీజు వల్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు ఇబ్బంది పడవచ్చు. పెద్ద టెక్‌ జైంట్స్‌ మాత్రం ఈ ఖర్చును సులభంగా భరించగలవు. ఇది దీర్ఘకాలికంగా అమెరికా ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగంపై ప్రభావం చూపవచ్చు. ప్రపంచ స్థాయి ప్రతిభ అమెరికాకు రాకుండా అడ్డుకుంటే, ఆ దేశం టెక్‌ ఆధిపత్యం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

క్రికెట్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మాత్రమే కాదు.. స్మృతి సాలిడ్ షాట్ కు బిసిసిఐ, ఐసీసీ కి ఎక్కడో కాలుతోంది..

Smriti Mandhana Statement
Smriti Mandhana Statement

Smriti Mandhana Statement: నిజమే క్రికెట్ అనేది కమర్షియల్ గేమ్. కాకపోతే దాంట్లో జెంటిల్మెన్ అనే పదాన్ని కొంతకాలంగా ఐసీసీ.. బిసిసిఐ మర్చిపోయాయి. అందువల్ల ఆ గేమ్ కాస్త దారి తప్పుతోంది. డబ్బులపరంగా బాగానే వస్తున్నప్పటికీ.. విలువలు కోల్పోవడంతో ఐసీసీ.. బీసీసీఐ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలంగా మాజీ క్రికెటర్లు.. అభిమానులు మాత్రమే ఈ స్థాయిలో విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి తొలిసారిగా భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న స్మృతి మందాన చేరింది.

స్మృతి తక్కువగా మాట్లాడుతుంటుంది. కానీ ఆమె మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉంటుంది. అందువల్లే ఆమెకు ఈ స్థాయిలో అభిమానుల సపోర్ట్ ఉంది. తాజాగా క్రికెట్ గురించి.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో సరికొత్త చర్చకు దారితీసాయి.

మహిళా టి20 ప్రపంచ కప్ ఈనెల 12 నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 14న బర్నింగ్ హం ప్రాంతంలో టీమిండియా, పాకిస్తాన్ మహిళలు పోటీ పడతారు. ఈ మ్యాచ్ మీద ఐసీసీ.. బిసిసిఐ భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి . టికెట్లు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గురించి స్మృతి మాట్లాడింది.

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో బర్మింగ్ హామ్ ప్రాంతంలో భారత్, పాకిస్తాన్ పోటీపడ్డాయి. అప్పుడు కూడా టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. అయితే ఇప్పుడు కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ గురించి చర్చ నడుస్తోంది. కేవలం ఈ మ్యాచ్ గురించి మాత్రమే కాదు.. మొత్తం మహిళల టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడాలి. ఈ టోర్నీకి విశేషమైన ప్రాధాన్యం కల్పించాలి. అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ మీద బలమైన ఆట తీరు కొనసాగిస్తామనే నమ్మకం ఉందని” మందాన వ్యాఖ్యానించింది.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ ఏ లో ఉంది. తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్తో ఆడుతుంది. జూన్ 17న నెదర్లాండ్స్.. జూన్ 21న సౌత్ ఆఫ్రికా.. జూన్ 25న బంగ్లాదేశ్.. జూన్ 28న ఆస్ట్రేలియా జట్లతో పోటీ పడుతుంది. ఇక తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సిరీస్లో టీమిండియా ఒకదాంట్లో మాత్రమే గెలిచింది.

సూర్య, అయ్యర్ తస్మాత్ జాగ్రత్త.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడు..

Gautam Gambhir Strict Selection Policy
Gautam Gambhir Strict Selection Policy

Gautam Gambhir Strict Selection Policy: భారత క్రికెట్ జట్టుకు శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ కొనసాగినప్పుడు.. కొన్ని విషయాలను పట్టించుకునే వాడు కాదు. ఆటగాళ్లు కొన్ని సిరీస్ లలో విఫలమైనప్పటికీ.. అతడు చూసి చూడనట్టు వెళ్లేవాడు. అవకాశాలు ఇచ్చేవాడు. తద్వారా ప్లేయర్లు కూడా సమర్థవంతంగా ఆడేవారు. దీంతో జట్టుకు విజయాలు సాధ్యమయ్యేవి. అతడు శిక్షకుడిగా ఉన్నప్పుడే టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. 2023 వన్డే క్రికెట్ విశ్వ సమరంలో చివరిదాకా వెళ్ళింది.

రాహుల్ ద్రావిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చాడు. అతడు వచ్చిన తర్వాత జట్టు ప్రయాణం ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మేట్ లో దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆటగాడి గురించి గౌతమ్ గంభీర్ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అతడు శిక్షకుడిగా వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి దూరం జరిగారు. అశ్విన్ అయితే పూర్తిగా క్రికెట్ మొత్తానికి దూరమయ్యాడు. ఆడే విషయంలో.. పరుగులు తీసే విషయంలో.. వికెట్లను పడగొట్టే విషయంలో గౌతమ్ గంభీర్ ఏమాత్రం కాంప్రమైజ్ కాడు. అందువల్లే ఆటగాళ్లు నిత్యం భయపడిపోతూ ఉంటారు.

ఇటీవల టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ లోకి ప్రవేశించింది. ఐపీఎల్ లో కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనను కూడా మేనేజ్మెంట్ తదుపరి సిరీస్ లకు లెక్కలోకి తీసుకుంటుంది. ఇప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్.. అయ్యర్ ముంబై టీ20 లీగ్ లో ఆడుతున్నారు. వీరి ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు.

ముంబై t20 లీగ్ లో ట్రీ యంప్స్ నైట్స్ ఎం ఎస్ ఈ తరఫున రంగంలోకి దిగాడు సూర్య కుమార్ యాదవ్.. నార్త్ ముంబై పాంథర్స్ జట్టు తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ బౌలింగ్లో వైభవ్ మాలికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో నార్త్ ముంబై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం ట్రయాంప్స్ జట్టు 188 పరుగులు మాత్రమే చేసింది.

అయ్యర్ కూడా

ముంబై ఫాల్కన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న అయ్యర్ ఏ ఆర్ సి ఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇతడు శివం దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఫాల్కన్స్ జట్టు 126 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఆందేరి జట్టు కేవలం 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.

ఐపీఎల్ లో అయ్యర్ కొన్ని మ్యాచ్ల్లో గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తేలిపోయాడు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ కూడా కొంత మేర మాత్రమే మెరుపులు మెరిపించాడు.

వైభవ్ సూర్య వంశీకి అన్ని కోట్లు ఇవ్వడంలో అర్థం ఉంది.. ఎందుకంటే..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల వయసులో ఒక బాలుడు ఈ స్థాయిలో ఐపీఎల్ మీద తన ముద్ర వేస్తాడని ఎవరు కూడా కలలో ఊహించరు. ఎందుకంటే ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్లో ఆ స్థాయిలో పరుగులు చేయడం అంత ఈజీ కాదు. కానీ సూర్య వంశీ దానిని చేసి చూపించాడు. అంతేకాదు, పరుగుల వరద ఎలా పారించాలో లైవ్లో చూపించాడు.

వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ నుంచి మొదలు పెడితే ఎమర్జింగ్ ప్లేయర్ వరకు అన్ని అవార్డులు సొంతం చేసుకున్నాడు. దీని ద్వారా కోట్ల డబ్బు సంపాదించాడు. దీంతో చాలామంది సూర్య వంశీ గొప్ప గొప్ప భవనాలు కడుతున్నాడు.. భారీగా ఎదిగిపోయాడు అనుకుంటున్నారు. కానీ సూర్య వంశీ ఉంటున్న ఇల్లు అత్యంత సాదాసీదాగా ఉంది. ఐపీఎల్ లో అతడు సత్తా చూపించిన తర్వాత.. సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్ళిపోయాడు.

బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా తాజాపూర్ లో అతడికి సొంత ఇల్లు ఉంది. ఐపీఎల్ తర్వాత అతడు సొంత ఇంటికి రావడంతో స్థానికులు అతడిని చూసేందుకు వెళ్లారు. అతడితో ఫోటోలు దిగారు. రాజకీయ నాయకుల నుంచి మొదలుపెడితే క్రికెటర్ల వరకు ఈ జాబితాలో ఉన్నారు. అయితే వారు దిగిన ఫోటోలలో సూర్య వంశీ ఇల్లు అత్యంత సాధారణంగా ఉంది. ఆధర్ కూడా మామూలు డ్రెస్ లోనే కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

సూర్య వంశీ కి రాజస్థాన్ యాజమాన్యం ఆ స్థాయిలో డబ్బు ఇవ్వాల్సిందనని వారు చెబుతున్నారు. సూర్య వంశీది మామూలు కుటుంబమని.. అతడు గొప్పగా ఆడటం వల్ల రాజస్థాన్ జట్టు విలువ పెరిగిందని.. రేటింగ్స్ కూడా అధికంగా వచ్చాయని.. అలాంటప్పుడు అతడికి కృతజ్ఞతగా రాజస్థాన్ యాజమాన్యం ఉండాలని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు అభిమానులను కలిసిన తర్వాత సూర్య వంశీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటాడని తెలుస్తోంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న లారెన్స్ కూతురు.. ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదు..

Raghava Lawrence Daughter Debut
Raghava Lawrence Daughter Debut

Raghava Lawrence Daughter Debut: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి ఎన్నో సంచలనాత్మక పాటలను మనకి అందించిన రాఘవ లారెన్స్ నేడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ని డ్యాన్స్ విభాగం నేటి తరం ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసేలా చేసింది రాఘవ లారెన్స్ మాత్రమే. ఆ స్థాయిలో కొరియోగ్రాఫర్ గా ఇండియా లోనే టాప్ 2 లో ఒకరిగా నిలిచాడు లారెన్స్. కొరియోగ్రాఫర్ గా ఐకాన్ గా నిల్చిన ఆయన, ఆ తర్వాత అక్కినేని నాగార్జున ని హీరో గా పెట్టి ‘మాస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత లారెన్స్ కాంచన సిరీస్ కి దర్శకత్వం వహించాడు.

ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా ఒకపక్క హీరోగా, మరో పక్క డైరెక్టర్ గా విజయం సాధించి , ఆల్ రౌండర్ అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరో గా బెంజ్ అనే చిత్రం చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ శిష్యుడు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం తో పాటు ‘కాంచన 4’ కూడా చేస్తున్నాడు , కాళభైరవుడు అనే చిత్రం కూడా లైన్ లో ఉంది. ఇలా హీరోగా ఆయన వరుస చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు లారెన్స్ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్ ని హీరో గా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు తన కూతురు రాఘవి ని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు. అయితే నటిగా మాత్రం కాదు , దర్శకురాలిగా పరిచయం చేయబోతున్నాడు.

సాధారణంగా , ఎంత పెద్ద స్టార్ కొడుకు లేదా కూతురు అయినా డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోవడం ఇప్పటి వరకు జరగలేదు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి , ఆ తర్వాత డైరెక్టర్ గా వెళ్లేవారు. కానీ తన కూతురు రాఘవి ని మాత్రం నేరుగా డైరెక్టర్ గానే పరిచయం చేయబోతున్నాడు లారెన్స్. ఈ చిత్రానికి ఆయన స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు అట. ఇది వరకే రాఘవి కి అమెరికా లో ప్రత్యేకంగా డైరెక్షన్ విభాగం లో కోచింగ్ కూడా ఇప్పించాడట లారెన్స్. మంచి అనుభవం కూడా ఆమె సంపాదించింది. అందుకే ఈ రిస్క్ తీసుకోబోతున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రం లో నటీనటులు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ , మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.

ప్రమాదంలో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్.. అండగా ఏపీ ప్రభుత్వం!

Pandu Master Accident (
Pandu Master Accident

Pandu Master Accident: ప్రముఖ కొరియోగ్రాఫర్, ఢీ జోడి ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓ ప్రోగ్రాం నుంచి వస్తుండగా.. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో బాధపడుతుండగా వాహనాన్ని పక్కకు తీసి ఆపారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆయన ప్రయాణించిన కారు.. ఆయనపై దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పోలీసులు విశాఖ నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అయితే పండు మాస్టర్ ప్రమాదంపై అభిమానులు ఆందోళనతో ఉన్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు సిద్ధపడింది.

* డి ప్రోగ్రాం తో సుపరిచితం..
ఈటీవీ ఢీ ప్రోగ్రాం ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు పండు మాస్టర్. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. బుల్లితెరలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటు కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే.. ఇటు ఈవెంట్లు చేసుకుంటూ తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. ఒకవైపు ఆర్టిస్ట్ గాను రాణిస్తున్నారు. మధ్య మధ్యలో బుల్లితెర ఈవెంట్లకు హాజరవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పండు మాస్టర్ సొంతం. అటువంటి పండు మాస్టర్ ప్రమాదానికి గురయ్యారని తెలుసుకొని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

* స్పందించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు..
పండు మాస్టర్ విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందినవారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వపరంగా వైద్యానికి అందించే సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు శ్రీనివాస్. అయితే ఒక ప్రఖ్యాత కళాకారుడిగా తనకంటూ మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు పండు మాస్టర్. అందుకే అటువంటి కళాకారుడి కోసం ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అయితే ఉదయం నుంచి పండు మాస్టర్ ఆరోగ్యం పై వదంతులు వచ్చాయి. అయితే ఆయనకు ప్రమాదం ఏమీ లేదని.. ఆపరేషన్ తరువాత కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రేవంత్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్.. తెలంగాణలో ఎందుకిలా..

Revanth Reddy Vs Pawan Kalyan
Revanth Reddy Vs Pawan Kalyan

Revanth Reddy Vs Pawan Kalyan: సాధారణంగా రాజకీయాలలో కొందరి మధ్య వైరం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకంటే వారి మధ్య అటువంటి వ్యవహారాలు ఎప్పుడూ చోటు చేసుకోవు కాబట్టి.. ప్రజలు ఆ విధంగా ఆలోచించరు. కానీ తెలంగాణలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి.. ఎవరు ఊహించని విధంగా.. కలలో కూడా అనుకోని విధంగా రాజకీయ వైరం ఏర్పడింది. అది కాస్త ఒక రకమైన సంచలనానికి దారితీసింది. ఇది ఎటువైపు వెళుతుంది.. దేని వైపు దారితీస్తుందో చూడాలి.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల తర్వాత.. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించిన తర్వాత.. ఈ ఎపిసోడ్లోకి కాంగ్రెస్ నాయకులు వచ్చేసారు. ఆ విశ్లేషకుడిని బాధిత పక్షం లాగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. డిమాండ్ చేశారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అంటూ మండిపడ్డారు. ఇక టీఆర్ఎస్ అధినేత్రి పళ్లు రాలుతాయి అంటూ పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ బిజెపి, బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన వ్యక్తి అని.. ఆయన ఒక ప్యాకెజిస్టార్ అంటూ ఆరోపించారు..

ఈ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే హస్తం పార్టీ నాయకులు తనమీద విమర్శలు చేయడం మొదలుపెట్టారో ఆయన నేరుగా రంగంలోకి దిగారు. అంతేకాదు.. తెలంగాణలోని గచ్చిబౌలి ప్రాంతంలో సంధ్య కన్వెన్షన్ హాల్ లో అంతర్గత సమావేశం నిర్వహించుకుంటామని తెలంగాణ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చింది. దీనికి తెలంగాణ పోలీసులు చెప్పిన కారణమేంటంటే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద జనసేన నాయకులు విమర్శలు చేయడం ద్వారా.. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది.. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంగా ఉన్నారు.. అందువల్ల ఈ సమావేశానికి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జన సేన అధినేత తన గృహం నుంచి విలేకరుల సమావేశం నిర్వహించారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. తాను ఇక్కడ పోటీ చేసే విషయం మీద స్పష్టత ఇచ్చారు. పోరాటల పురిటిగడ్డలో ఎందుకు సమావేశంనిర్వహిస్తున్న విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత మీద కవిత ఆరోపణలు చేస్తే ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అందువల్లే ఆమె అలా చేస్తుందనుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే.. దాన్ని కూడా ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి ఆంధ్రా ప్రాంతం మీద.. అక్కడి రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తేనే ఆ పార్టీకి మనుగడ. అదే గనుక లేకపోతే ఆ పార్టీకి తెలంగాణలో కొనసాగింపు ఉండదు.

భారత రాష్ట్ర సమితి నుంచి కవిత వరకు ఏపీ డిప్యూటీ సీఎం మీద విమర్శలు చేశారంటే దాని వెనక ఒక అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ స్థాయిలో జనసేన అధినేత మీద విమర్శలు చేయడం నిజంగా ఆశ్చర్యం. రేవంత్ రెడ్డి ఆదేశాల లేకుండా వారు ఇలా చేశారనుకోవడానికి లేదు. కానీ ఈ ఉద్దేశ్యాలు ఆశించి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విమర్శలు చేస్తుందో అర్థం కావడం లేదు..

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలితేనే ఓట్లు పడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందువల్లే జనసేన అధినేత మీద ఈ స్థాయిలో విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. కానీ హైదరాబాదులో సెటిలర్ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే..ఆంధ్రా వాదం మీద ఆరోపణలు చేస్తే అప్పుడు ఆ ఓట్లు వేరే పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేనాని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు అతడిని టార్గెట్ చేసినట్టు.. కాంగ్రెస్ జాతీయ పార్టీ.. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ ఇలాంటి వైఖరి ఎందుకు తీసుకున్నారు.. భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇవ్వకూడదనా.. పవన్ కళ్యాణ్ వస్తే భారత రాష్ట్ర సమితికి ప్రయోజనం దక్కుతుందనా.. ఈ ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు.. ఒకవేళ ఇదే విధానం కనుక రేవంత్ రెడ్డిది అయితే.. ఆయన ముందుగానే మేల్కొన్నట్టు..

కానీ, గత ఎన్నికల్లో సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితి వైపు మొగ్గు చూపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ రెడ్డి కొనసాగించిన వైఖరి వల్ల వారి ఓట్లు ఎటువైపు వెళ్తాయో చూడాల్సి ఉంది. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న వ్యాఖ్యల ద్వారా గోటితో పోయే వ్యవహారాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చారు. అయితే ఇది ఎక్కడదాకా దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

ఆ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ నోరు మూయించిన గద్దర్ కూతురు.. సంచలనం రేపుతున్న వీడియో..

Gaddar Daughter Vennela
Gaddar Daughter Vennela

Gaddar Daughter Vennela: పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కాకను రేపుతోంది. మండే ఎండాకాలంలో మరింత నిప్పులను రాజేస్తోంది.. పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రతి మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా గద్దర్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయంగా కలకలం రేపాయి.

పవన్ కళ్యాణ్ గద్దర్ బతికున్నప్పుడు ఆయనకు కారు కొనిచ్చాను అని చెప్పారు. ఆయన శరీరంలో బుల్లెట్లు దిగాయని.. తెలంగాణను ప్రేమించిన గద్దర్ విషయంలో తెలంగాణ ప్రాత నాయకులు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని పవన్ కళ్యాణ్ విమర్శించారు..”గద్దర్ గొప్ప గాయకుడు. తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి తెలంగాణ లో ఉన్న నాయకులు ఏ విధమైన గౌరవం ఇచ్చారు.. కనీసం ఆయనకు ఎటువంటి గుర్తింపు కూడా ఇవ్వలేదు కదా. ఆయనకు నేను కారు కొనిచ్చాను. ఆయన నా దగ్గరికి వచ్చేవారు. నాతో ప్రశాంతంగా మాట్లాడేవారని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

గద్దర్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు అన్నట్టుగా వ్యవహరించాయి. అయితే ఈ ఎపిసోడ్లో గద్దర్ కుమార్తె వెన్నెల తెరపైకి వచ్చారు. “తెలంగాణ గడ్డ.. పోరాటాల గడ్డ. పొత్తులతో తెలంగాణ రాలేదు. రాజకీయ పార్టీలతో తెలంగాణ రాలేదు. ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది. గడపగడపకు సాంస్కృతిక వైవిధ్యాన్ని తీసుకెళ్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఎంతమంది పిల్లలు తమ శరీరాలను బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అస్తిత్వ పోరాటమని” వెన్నెల వ్యాఖ్యానించారు.

“తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీర్.. ఇందులో అనుమానం లేదు. మా నాన్న కు పవన్ కళ్యాణ్ అభిమాని. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్న ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటాల వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ తెలంగాణ గడ్డమీద తెలంగాణ ప్రజలకు మాత్రమే హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రజలు మాత్రమే ఇక్కడ పరిపాలించాలి. పాలన సాగించాలని” వెన్నెల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మీద పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. గద్దర్ గురించి పదేపదే మాట్లాడిన నేపథ్యంలో.. వెన్నెల స్పందించడం విశేషం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద కాంగ్రెస్ నాయకులతోపాటు గులాబీ పార్టీ.. ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. గద్దర్ గురించి పవన్ పదే పదే ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన కుమార్తె కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడించుకుంటారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి ఆ స్థాయిలో మాట్లాడితే.. ఆయనకు వెన్నెల ద్వారా కౌంటర్ ఇప్పించడం సంచలనం గా మారింది. దీనిపై జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.