Home Blog Page 189

రక్త సముద్రం.. ఫారో ఐలాండ్స్‌ 700 తిమింగలాలు హతం!

Faroe Islands whale hunt

Faroe Islands whale hunt : సంస్కృతి సంప్రదాయాలకు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ సంప్రదాయానే మన జీవనానికి, మనుగడకు పునాది. అందుకే కులం, మతం తేడా లేకుండా అందరూ సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు ఇలా అనేక రకాల జీవన శైలులు ఇందులో భాగమే అయితే కొన్ని రకాల జీవన శైలులు ఒళ్లు గగ్గురు పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలోని డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతం ఫారో ఐలాండ్స్‌ అచారం ఒకటి. ఇక్కడ వెయ్యేళ్లుగా కొనసాగుతున్న ఒక ప్రాచీన ఆచారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. ఈ సంప్రదాయం పేరుతో ఇటీవలి ఒక రోజులోనే 700కి పైగా పైలట్‌ వేల్స్‌ (తిమింగలాలు), వైట్‌–సైడెడ్‌ డాల్ఫిన్లను చంపేశారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అయి ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.

వెయ్యేళ్ల సంప్రదాయం..
ఫారో ఐలాండ్స్‌లో ‘గ్రైండడ్రాప్‌’ అనే సంప్రదాయం చాలా కాలం నుంచి ఉంది. దీని కింద పెద్ద సంఖ్యలో తిమింగలాలు, డాల్ఫిన్లను బోట్లతో తీరానికి తీసుకువస్తారు. తర్వాత వాటిని చంపి మాంసం, నూనెను స్థానికుల ఆహారం కోసం పంచుతారు. స్థానికులు దీనిని తమ సంస్కృతి, ఆహార అవసరాలు, సామూహిక జీవన విధానంలో భాగంగా చూస్తారు. వారి ప్రకారం ఇది స్థిరమైన, అవసరమైన సంప్రదాయం. ఈసారి జరిగిన ఘటనమే చివరి వారంలో ఫారో ఐలాండ్స్‌లో మూడు ప్రత్యేక స్థలాల్లో ఈ హంట్‌ జరిగింది. ఒక్క రోజులోనే సుమారు 700కి పైగా తిమింగలాలు డాల్ఫిన్లు చంపబడ్డాయి. తీరం రక్తవర్ణంలోకి మారిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా షాక్‌ను కలిగించాయి.

జంతు ప్రేమికుల ఆగ్రహం..
ఈ ఘటనను జంతు హక్కుల సంఘాలు, పర్యావరణవాదులు తీవ్రంగా స్పందించారు. అనవసరమైన, క్రూరమైన హత్యాకాండంగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ‘‘ఇది సంప్రదాయం కాదు, క్రూరత్వం’’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఆచారం పట్ల అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.

సంప్రదాయం మాటున అనైతికత
ఫారో ఐలాండ్స్‌ ప్రజలు ఈ సంప్రదాయాన్ని తమ సంస్కృతి, ఆత్మగౌరవంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఇది వారి ఆహార భద్రతకు కూడా సంబంధించిన విషయం. అయితే ఆధునిక కాలంలో జంతు సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవుల పట్ల దయ వంటి విలువలు బలంగా మారాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు అత్యంత తెలివైన సముద్ర జీవులు. వాటిని ఇలా సామూహికంగా చంపడం మానవతా దృక్పథంతో సరిపోదని ప్రపంచవ్యాప్త భావన ఏర్పడుతోంది.

ఐలాండ్స్‌ ప్రభుత్వం, స్థానికులు ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్నా, అంతర్జాతీయ ఒత్తిడి, యువతరం ఆలోచనా విధానం మారుతోంది. భవిష్యత్తులో ఈ ఆచారం ఎలా మారబోతోందనేది చూడాలి. ఈ ఘటన మనల్ని ఒక విషయం గుర్తు చేస్తుంది. మనం ఏ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నా, దాని వెనుక ఉన్న క్రూరత్వం, జంతు హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఇది.

చెక్కు చెదరని 'ఓజీ' ప్రీమియర్ షోస్ గ్రాస్.. భవిష్యత్తులో దీని బద్దలు కొట్టేది ఎవరు..?

OG TV Telecast
OG TV Telecast

OG movie premiere shows gross: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా పడితే , రికార్డ్స్ మామూలు రేంజ్ లో ఉండవు అని మొదటి నుండి అందరూ అంటుంటారు. ఆయనకు ఎన్ని ఫ్లాపులు పడినా, మరుసటి సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ ని రప్పిస్తుంటాడు. గడిచిన రెండున్నర దశాబ్దాల నుండి మనం ఇదంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు , ఆ రంగం లోకి వెళ్లిన తర్వాత కచ్చితంగా ఒక సెక్షన్ ఆడియన్స్ కి దూరం అవుతాడు, ఇక ఆయన సినిమాలకు మునుపటి వైభవం ఉండదని చాలా మంది అనుకున్నారు. కానీ నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు ఒక్క సినిమా చేస్తే , ఇప్పటికీ ఆయన సినిమాలకు వసూళ్ల సునామీ వస్తుందని నిరూపించిన చిత్రం ‘ఓజీ’. కేవలం రెండంటే రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఆయన సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు.

నేటి తరం యూత్ ఆడియన్స్ మొత్తాన్ని ఓజీ మేనియా లో మునిగి తేలేలా చేశాడు . ఈ స్థాయిలో జెన్ జీ యూత్ ని అలరించిన చరిత్ర ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా జరగలేదు. ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. రెండు మూడు భాషలకు సంబంధించిన వసూళ్లు కలుపుకుంటే కానీ , వంద కోట్ల గ్రాస్ రానటువంటి ఈరోజుల్లో, ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ నుండి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది అనేది. ముఖ్యంగా ఈ చిత్రానికి నమోదైన ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లను ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ సినిమా కూడా అందుకోలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా 63 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో విడుదలైన ‘ధురంధర్ 2’ కూడా బ్రేక్ చేయలేకపోయింది. కేవలం 60 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నేడు విడుదలైన ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా ‘ఓజీ’ రికార్డుని బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు, కానీ సగం కూడా రాబట్టలేకపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇలా భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ రెండు సినిమాలు విఫలం అయ్యాయి , ఇప్పుడు ఈ రికార్డు ని భవిష్యత్తులో ఎవరు బద్దలు కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. వచ్చే ఏడాది విడుదల అవ్వబోయే ‘స్పిరిట్’, ‘వారణాసి’ చిత్రాలు ఈ రికార్డు ని కొడుతుందని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

బుచ్చి బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ అయిందిగా.. ఆ స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చిందిగా..

Buchi Babu
Buchi Babu

Buchi Babu next project update: ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు ప్రస్తుతం పెద్ది సినిమాతో మరోసారి తన హవాని కొనసాగిస్తున్నాడు. ఈరోజు రిలీజ్ అయిన పెద్ది సినిమా రిలీజైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు బుచ్చిబాబు ఈ సినిమాతో రామ్ చరణ్ కి ఒక సక్సెస్ ను కట్టబెట్టాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు తన తర్వాత సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన షారుక్ ఖాన్ తో తన తదుపరి సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు.

కాబట్టి అతనికి ఒక కథను కూడా వినిపించారట. షారుక్ ఖాన్ ఆ కథకి ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే పెద్ది సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో షారుక్ ఖాన్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాట్టుగా తెలుస్తుంది.

నిజానికి బుచ్చిబాబుకు ఒక మంచి ఆపర్చునిటి దొరికింది. ఎందుకంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం అందరికి రాదు. అలాంటిది బుచ్చిబాబును ఏరీకోరి మరి అతను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అతనిలో ఏదో ఒక టాలెంట్ అయితే తను గుర్తించే ఉంటాడు. ఇక మొత్తానికైతే ఇప్పుడు పెద్ది సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. కాబట్టి బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్టు మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

అలాగే షారుక్ ఖాన్ తో తన సినిమా ఉండబోతున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తొందర్లోనే రాబోతుంది. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ గా ఎవరు వ్యవహరిస్తున్నారనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే సుకుమార్ వల్లే బుచ్చిబాబు ఈ సినిమాకి కమిటైయినట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా కోసం బుచ్చిబాబు ఎంతలా కష్టపడ్డాడో తన గురువు అయిన సుకుమార్ సైతం అదే రేంజ్ లో కష్టపడి తన శిష్యుడికి ఒక మంచి సినిమాని అందించాలనే ప్రయత్నం చేశాడు. ఇక వీళ్లిద్దరితో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని దారపోశాడనే చెప్పాలి…

సుకుమార్ కథల మీద మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించడం లేదా..? కారణమేంటంటే..?

Mahesh Babu Sukumar movie update
Mahesh Babu Sukumar movie update

Mahesh Babu Sukumar movie update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చే సినిమాల్లో వైవిధ్యమైన కథాంశం ఉంటుందని ప్రేక్షకులందరు నమ్ముతుంటారు. ముఖ్యంగా ఆయన చిన్న చిన్న పజిల్స్ ని ప్రేక్షకులకు ఇస్తాడు. ఒక సీన్ లో అంతర్లీనంగా అవి ఉంటాయి. అవి కొంతమంది సుకుమార్ ని ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా అతని డెప్త్ అర్థమవ్వాలంటే కొంచెం ఐక్యూ ఉండాలి. ఆయన ఏ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తున్నాడు అనేది చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే మాత్రం ఆడియన్స్ లాగే సినిమాని చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే సుకుమార్ తన మార్క్ ఇంటెన్సిటీని అందిస్తూ ప్రేక్షకులందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాడు.

ముఖ్యంగా స్టార్ హీరోలందరికి సక్సెస్ లను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో మహేష్ బాబుకి ఫ్లాప్ ని కట్టబెట్టిన సుకుమార్ ఆ సినిమా మేకింగ్ విషయంలో మాత్రం చాలా వరకు ప్రశంసలను అందుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.

ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ మహేష్ బాబు తోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకొని కారణాలవల్ల అతను పుష్ప సినిమా చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి సుకుమార్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. కానీ ఈ మధ్యకాలంలో సుకుమార్ చెప్పిన కథలేవీ మహేష్ బాబుకు పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించడం లేదు.

కారణం ఏంటంటే మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే కథ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి. అంతే తప్ప నార్మల్ కథతో ముందుకు వెళ్తే వర్కౌట్ అవ్వదని మహేష్ చెప్పారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మరోసారి మహేష్ బాబు తో జతకడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

రామ్ చరణ్ కి ఈసారైనా నేషనల్ అవార్డు వస్తుందా? లేదా మళ్లీ రాజకీయాలు చేస్తారా..!

Ram Charan Remuneration
Ram Charan Remuneration

Ram Charan National Award expectations: సోషల్ మీడియా లో కానీ , బయట కానీ ఎక్కడ చూసిన ఇప్పుడు ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా సరైన సినిమా లేక , థియేటర్స్ కి తాళాలు వేసుకునే పరిస్థితి ఏర్పడడం తో , ఎక్సిభిటర్స్ కి ఏమి చెయ్యాలో తోచక దిక్కు తోచని పరిస్థితిలో , ఎన్నో ఆశలతో పెద్ది చిత్రం కోసం పడిగాపులు కాసారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం విడుదల తర్వాత థియేటర్స్ కిక్కిరిసిపోయాయి , ఎక్కడ చూసినా ట్రేడ్ వర్గాలకు పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ సునామీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ఏ రేంజ్ ప్రశంసలు దక్కాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నిలబడిందంటే అందుకు కారణం రామ్ చరణ్ నటనే అని , ఆయనకు ఈసారి నేషనల్ అవార్డు రావాల్సిందే అని అంటున్నారు.

అయితే రామ్ చరణ్ కి ఈసారైనా నేషనల్ అవార్డు వస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే 2018 వ సంవత్సరం లో ఆయన హీరో గా నటించిన ‘రంగస్థలం’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం లోని రామ్ చరణ్ నటన ఒక బెంచ్ మార్క్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా తమ హీరో బాగా చేస్తే , రంగస్థలం లో రామ్ చరణ్ రేంజ్ యాక్టింగ్ అంటూ పోలుస్తుంటారు , ఆ స్థాయి లో ఆయన నటించాడు. కానీ ఆ నటనకు గుర్తింపుగా నేషనల్ అవార్డు రాలేదు. కానీ అదే ఏడాదిన విడుదలైన విక్కై కౌశల్ ‘URI : ది సర్జికల్ ఎటాక్’ చిత్రం విడుదలైన పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో గా నటించినందుకు గానూ విక్కీ కౌశల్ కి ఈ అవార్డు ని అందించారు.

ఆ సమయం లో నేషనల్ అవార్డు జ్యురి పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రంగస్థలం కి మించిన నటన విక్కీ కౌశల్ URI లో చెయ్యలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రామ్ చరణ్ ని పక్కకి నెట్టి , హిందీ వాడికి ఛాన్స్ ఇచ్చారు; ఇప్పుడు కూడా అదే జరగబోతుందేమో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ధురంధర్ 2 విడుదలైన సెన్సేషన్ సృష్టించింది. అంతే కాదు , ఈ చిత్రం లో రణవీర్ సింగ్ నటన ఊహాతీతం , ఆయనకు నేషనల్ అవార్డు ఇవ్వడం లో ఎలాంటి తప్పు లేదు , కానీ అదే సమయం లో రామ్ చరణ్ కూడా అదే స్థాయి నటన కనబర్చాడు , మరి నేషనల్ అవార్డు జ్యురి సభ్యులు రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ప్రకటిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.

పెద్ది మూవీ మీద నెగెటివిటీ పెరిగిపోతుందా..? ఇదంతా ఎవరు చేయిస్తున్నారు..

Peddi Box Office Collection
Peddi Box Office Collection

Peddi movie negative publicity: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరికెక్కిన పెద్ది సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాను చూసిన చాలామంది ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినప్పటికి సెకండాఫ్ చాలా ఎమోషనల్ గా ఉందని సినిమా సగటు ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి భారీ సక్సెస్ ని కొల్లగొట్టడమే కాకుండా భారీ కలెక్షన్స్ కూడా రాబడుతుందనే ఉద్దేశంతో మేకర్స్ అయితే మొదటి నుంచి పాజిటివ్ గానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి కొన్ని ఏరియాల్లో మిక్స్డ్ టాక్ వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక కావాలనే కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ మరి కొంతమంది మెగా అభిమానులు సైతం వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతకుముందు చాలామంది హీరోలు వాళ్లు చేసిన సినిమాలు మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నా కూడా దానికి నెగెటివ్ ప్రచారం చేయడం అనేది అందరికి అనవాయితిగా మారిపోయింది.

రామ్ చరణ్ గత సినిమా అయిన గేమ్ చేంజర్ సినిమాకి సైతం ప్రీమియర్ షోస్ నుంచే నెగెటివ్ ప్రచారం చేశారు. మొత్తానికైతే ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. మరి పెద్ది సినిమా విషయంలో కూడా అలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు. అయినప్పటికి ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది నిన్న నైట్ ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా మీద చాలామంది పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.

కానీ కొంతమంది కావాలనే నెగెటివ్ గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్లకి ఏం వస్తుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక ఇదంతా చూస్తున్న సినిమా మేధావులు సైతం రామ్ చరణ్ మూవీ రిలీజ్ అవ్వగానే కొంతమంది స్టార్ హీరోలు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…

ఒకే చోటుకు మూడు గ్రహాలు.. భూమికి ఏమైనా ప్రమాదమా..

Three Planets Alignment
Three Planets Alignment

Three Planets Alignment: ఆకాశం మనకు నిర్మలంగానే కనిపిస్తున్నప్పటికీ.. అందులో అనేక రకాల వింతలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే ఈ వింతలు మన కంటికి కనిపించవు. కచ్చితంగా టెలిస్కోప్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పరికరాల ద్వారా చూస్తేనే మనకు అది తెలుస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు నిత్యం ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆకాశంలో జరిగే అద్భుతాల గురించి మనకు తెలుస్తూ ఉంటుంది.

ఆకాశంలో నిత్యం జరిగే వింతల్లో ఈసారి అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఆకాశంలో ఒకేసారి మూడు గ్రహాలు కనువిందు చేయబోతున్నాయి. ఈ నెలలో వచ్చేవారం ఈ వింత చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చేవారం 8, 9 తేదీలలో శుక్ర గ్రహం, బృహస్పతి అత్యంత దగ్గరికి వస్తాయి. ఈ రెండు గ్రహాల మధ్య దూరం ఉన్నప్పటికీ.. మనం భూమి నుంచి చూస్తాం కాబట్టి దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంటాయి. ఈనెల 11న ఈ వింతలోకి బుధ గ్రహం కూడా చేరే అవకాశం ఉంది. బుధ గ్రహం చేరువగా వచ్చినప్పటికీ అది ఎక్కువసేపు కనిపించే అవకాశం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి నుంచి మనం చూస్తూ ఉండడం వల్ల ఆ గ్రహాలు దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుందని.. అది ఖగోళ వింత అని శాస్త్రవేత్తలు అంటున్నారు.. గ్రహాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒకేసారి దగ్గరికి రావడం అత్యంత అరుదు. గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. భూమి దగ్గరికి సూర్యుడి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఎండాకాలంలో మనకు ఆస్థాయిలో వేడి కలగడానికి ప్రధాన కారణం సూర్యుడు భూమికి దగ్గరగా రావడమే. పైగా ఆ సమయంలో సూర్యుడి కిరణాలు భూమి మీద ఏటవాలుగా పడుతూ ఉంటాయి.

గతంతో పోల్చి చూస్తే ఇప్పటి కాలంలో ఖగోళ శాస్త్రం మీద ప్రయోగాలు చేయడం పెరిగింది. అన్ని దేశాలు అంతరిక్షం మీద ప్రధానంగా దృష్టి సారించాయి. ఉపగ్రహాలను పంపించడం.. అంతరిక్షంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయడం.. చంద్రుడి మీద మానవ నివాస యోగ్యానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా.. అనే అంశం మీద ప్రయోగాలు చేయడం వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అందువల్లే అంతరిక్షంలో జరుగుతున్న పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు గ్రహాలు దగ్గరికి రావడం వల్ల భూమికి పెద్దగా ప్రమాదం ఉండదని.. అది సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ అని.. ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే ఈ వింతను చూసేందుకు అత్యంత ఖరీదైన పరికరాల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు.

ఆకాశంలో ఎర్రటి మెరుపులు.. అచ్చం యుగాంతం సినిమా లాగే ఉందిగా..

red lightning in sky

red lightning in sky : ఉన్నట్టుండి ఆకాశం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. భయంకరమైన మేఘాలు ఆవరిస్తాయి. ఉరుములు గర్జన చేస్తూ ఉంటాయి. రకరకాల రంగులలో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్షం మొదలవుతుంది.. ఏకధాటిగా కురుస్తూనే ఉంటుంది. సముద్రాలు పోటెత్తుతూ ఉంటాయి. వరద నీరు ముంచెత్తుతూ ఉంటుంది. చూస్తుండగానే ఊర్లకు ఊర్లు నీళ్లలో కలిసిపోతూ ఉంటాయి. మొత్తంగా ప్రపంచమే మునిగిపోతూ ఉంటుంది.

చదువుతుంటే భయమేస్తోంది కదూ. అదేంటి యుగాంతం స్టోరీని చెబుతున్నారు అనుకుంటున్నారు కదా.. ఈ స్థాయిలో కాకపోయినా ఇలాంటి సంఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. అది కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఆసియా ప్రాంతంలో చైనాకు దగ్గరగా ఉన్న టిబెట్ ప్రాంతంలో ఇటీవల వర్షాలు కురిసాయి. వర్షాలు కురవడం పెద్ద విషయం కాకపోయినప్పటికీ అక్కడ ఆకాశంలో చోటు చేసుకున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి మెరుపులు కనువిందు చేశాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. వీటిని రెడ్ స్ప్రైట్స్ అని పిలుస్తుంటారు. ఇలాంటి మెరుపుల వల్ల వాతావరణం మొత్తం భయానకంగా మారిపోతూ ఉంటుంది. పైగా ఇవి భూమి ఉపరితలానికి దాదాపు 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిని ట్రాన్సియంట్ లూమినస్ అని పిలుస్తుంటారు. విద్యుత్, నైట్రోజన్ అణువులు వెంటనే రియాక్ట్ అయి ఇలాంటి ఎరుపు రంగు లో మెరుపులు రావడానికి కారణం అవుతూ ఉంటాయి.

సాధారణంగా వర్షాలు కురుస్తున్నప్పుడు మెరుపులు ఏర్పడటం సర్వసాధారణం. పైగా అవి తెలుపు రంగులో ఉంటాయి. మెరుపులు కూడా క్షణకాలంలోనే ఏర్పడి మాయమవుతుంటాయి. కొన్ని సందర్భాలలో మేఘాలు పరస్పరం రాపిడి చేసుకున్నప్పుడు మెరుపుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఉరుములు కూడా అధికంగా ఉంటాయి. మెరుపులు ఎరుపు రంగులో ఉండడం వెనుక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. కొండ ప్రాంతమైన టిబెట్ లో ఇవి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే ప్రపంచంలో అనేక రకాలుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం విపరీతంగా వేడెక్కుతోంది. దీనివల్ల మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాల గమనం లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని సూపర్ ఎల్ నీనో అని పిలుస్తున్నారు. దీనివల్ల వర్షాలు సరిగా కురువకపోవడం.. కరువు కాటకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో ఇలా ఉంటే.. ఇక ప్రపంచంలో మిగతా దేశాలలో ఆకస్మిక వర్షాలు.. వంటివి చోటు చేసుకుంటున్నాయి. యుగాంతం మాదిరి పరిస్థితి కాకపోయినప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని ప్రకృతి చెబుతోంది. అందువల్లే ఈ హెచ్చరికలు.

వారానికి వెయ్యి మాత్రమే.. ఇది మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందంటే..

Girl Savings Plan : ఆడపిల్లల కోసం కేంద్రం గొప్ప పథకం.. పెళ్లి సమయానికి రూ.70 లక్షలు పొందొచ్చు..
Girl Savings Plan

weekly savings tips : నెలకు లక్షల్లో వస్తుంది జీతం.. నెల తిరిగేసరికి జేబులో రూపాయి ఉండడం లేదు.. కొన్ని సందర్భాల్లో స్నేహితులను అప్పు అడగాల్సి వస్తోంది.. ఖర్చులకు విపరీతంగా పెరిగిపోయాయి. వేటికి కళ్లెం వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఈఎంఐలు కడుతున్నాను.. క్రెడిట్ కార్డు అప్పులు చెల్లిస్తున్నాను. అయినప్పటికీ ఆర్థికంగా సమస్యలు తప్పడం లేదు..

ఈ బాధ ప్రతి పదిమందిలో 8 మందికి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సంపాదన పెరిగినట్టుగానే ఖర్చులు కూడా విపరీతం కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే చాలామంది అప్పులు చేస్తున్నారు. ఆర్థికంగా వెసులుబాటు సాధించడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటప్పుడే ఈ చిట్కాను పాటిస్తే ఆర్థికంగా ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా వారాంతంలో ఒక సినిమా చూసేందుకు.. రెస్టారెంట్ వెళ్లేందుకు.. తక్కువలో తక్కువ 1000 వరకు ఖర్చవుతుంది. వారాంతంలో ఏ మనిషి అయినా సరే కాస్త ఆట విడుపు కోరుకోవడం సహజం. అయితే అటువంటి వాటిని సాధ్యమైనంతవరకు ఖర్చు లేకుండా ఆస్వాదించే మార్గం చూసుకోవాలి.. ఆ వెయ్యి రూపాయలను అలా దాచి పెడుతూ ఉండాలి. వారానికి వెయ్యి రూపాయల చొప్పున దాచుకుంటే.. నెలకు ఏకంగా నాలుగువేల దాకా మిగులుతాయి. సంవత్సరానికి అది 48 వేల దాకా అవుతుంది. వాటిని అత్యవసరమైన నిధిగా వాడుకోవచ్చు. నెలకు కొంత ఎస్ఐపి లేదా ఆర్డీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ గనుక చేస్తే దీర్ఘకాలంలో లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

ఆర్థికంగా కష్టాలు అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని సానుకూల ధోరణిలో పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించుకోవాలి. ఈ కథనంలో చెప్పినట్టు కాకుండా.. ఇంకా వేరే విధంగా కూడా పొదుపు సాగించవచ్చు. తద్వారా ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అప్పులు చేయాల్సిన అగత్యం అంతకంటే ఉండదు. ఎందుకంటే అప్పు ఎప్పటికైనా ముప్పే. సాధ్యమైనంత వరకు అప్పు లేకుండా.. చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి. ఆడంబరాలకు దూరంగా ఉండాలి. బడ్జెట్ పరిధిలోనే పూర్తయ్యేలా చూసుకోవాలి. అలాగని గిరిగీసి బతకాలని చెప్పడం లేదు.

రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు ఎందుకని?

Rahul Gandhi Prime Minister

Rahul Gandhi Prime Minister : రాహుల్ గాంధీ ఒక పెద్ద జోస్యం చెప్పారు. కళ వచ్చిందో ఏంటో తెలియదు.. సంవత్సరం లోపల రాజకీయ సునామీ వస్తుంది.. మోడీ ప్రధాని పదవి ఊడబోతుంది.. అంతరంగిక తిరుగుబాటు వస్తుంది.. ఆర్థిక సంక్షోభం రావచ్చు.. ఎమర్జెన్సీ రావచ్చు అని హెచ్చరికలు చేశారు. సీబీఐ, ఈసీలు ఇదే అంచనా వేస్తున్నాయని రాహుల్ భయపెట్టే మాటలు మాట్లాడారు. ఇలా గాలికబర్లు చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ కోరిక ఇది అయ్యిండొచ్చు. రాహుల్ మాటల్లో ఏమైనా అర్థముందా? కాంగ్రెస్ కు విధేయంగా ఉండే రామచంద్ర గుహ రచయిత మాట్లాడుతూ.. ‘ఎప్పటికీ మోడీని రాహుల్ గాంధీ ఓడించలేడు. 2008లో పార్లమెంటరీ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ.. 1200 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాడు ఉండేవారు.. ఇప్పుడు 600 మందికి పడిపోయారని రామచంద్ర చెప్పుకొచ్చారు. 20 ఏళ్లలో రాహుల్ మారలేదని.. బాధ్యతలు లేకుండా పరిపక్వత చెందకుండా ఉన్నాడని.. మోడీకి పోటీదారుడు ఎప్పటికీ రాహుల్ కాలేడని రామచంద్ర తెలిపారు.

ఎందుకు రాహుల్ జీవితంలో ప్రధాని కాలేడు? అని ప్రశ్నించుకుంటే.. ప్రధాని కావాలంటే పార్టీ ఎదగాలి.. పార్టీ ఎదగాలంటే ఐదు పెద్ద రాష్ట్రాలు ఆ పార్టీకి అండగా నిలబడాలి. కనీసం నాలుగు మూడు రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్ నిలబడాలి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులలో కాంగ్రెస్ గెలవాలి. కానీ దారుణంగా ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పడిపోయింది.

రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు ఎందుకని? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

నారా లోకేష్ రష్యా వెళ్ళింది ఇందుకా.. ఏపీ ముఖచిత్రమే మారిపోతుందిగా..

Nara Lokesh Russia visit purpose
Nara Lokesh Russia visit purpose

Nara Lokesh Russia visit purpose: పారిశ్రామికంగా ఏపీ సరికొత్త మైలురాళ్లు అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే గూగుల్ నుంచి మొదలు పెడితే పెద్దపెద్ద కంపెనీల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. భారీగా కార్యకలాపాలను సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడితోనే ఏపీ పారిశ్రామిక ప్రస్థానం ఆగిపోవడం లేదు. అంతకుమించి అనేలాగా ఏపీ మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.

పారిశ్రామికంగా ఒక రాష్ట్రం బాగుంటే పెట్టుబడులు బాగా వస్తాయి. ఆ రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తే పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అందువల్లే నారా లోకేష్ దూకుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆయన విదేశాలలో పర్యటిస్తూ.. పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ.. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పిస్తున్నారు. గతంలో దావోస్ లో పర్యటించిన నారా లోకేష్.. అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎం ఓ యు లు కుదుర్చుకున్నారు. ఫలితంగా ఆ కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టింది. రాయలసీమలో వాహనాల తయారీని చేపడుతోంది. గతంలోని రాయలసీమ ప్రాంతంలో కియా పరిశ్రమ ఏర్పాటు అయింది. ఇప్పుడు నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో పేరుపొందిన ఎలిమెంట్ గ్రూప్.. అల్యూమినియం ఉత్పత్తులు తయారుచేసే రూసాల్.. కెమికల్ ఉత్పత్తులు తయారుచేసే రస్కేమ్ వంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వారిని ఆహ్వానించారు.

వారితో సుదీర్ఘ సమయం సమావేశం నిర్వహించిన లోకేష్.. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలమైన పరిస్థితుల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడిల ప్రోత్సాహక అనుమతుల గురించి వివరించారు. ఆ తర్వాత మాస్కో ట్రాన్స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ ను లోకేష్ సందర్శించారు. అక్కడి రవాణా వ్యవస్థ నిర్వహణపై స్థానిక అధికారులను ప్రశంసించారు. ఏపీ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

అంచనాలను దాటేసిన 'పెద్ది' ఓపెనింగ్స్.. మ్యాట్నీ వరకు వచ్చిన గ్రాస్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Peddi opening day collections
Peddi opening day collections

Peddi opening day collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి , అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ ద్వారా మొదలైన ఈ సినిమాకు ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ షోస్ మొదలయ్యాక ఆడియన్స్ నుండి పర్లేదు, యావరేజ్ అనే రేంజ్ టాక్ వచ్చింది. ఓవరాల్ గా ఎక్కడా ఫ్లాప్ టాక్ అయితే రాలేదు. కరువు లో ఉన్న టాలీవుడ్ కి ఈ మాత్రం కంటెంట్ చాలు , దుమ్ము దులిపేస్తుందని అంతా అనుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఇండియా లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి. ఓవర్సీస్ లో యావరేజ్ రేంజ్ ఓపెనింగ్ వచ్చింది. మ్యాట్నీ షోస్ వరకు ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ అందరికీ ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.

దాదాపుగా 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , కేవలం మ్యాట్నీ షోస్ వరకు నమోదు అయ్యాయి. ఇక ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ నుండి ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో మీరే ఊహించుకోవచ్చు. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ దక్కలేదు. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 47 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు ఈ ఒక్క యాప్ నుండే 6 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాకు బుక్ మై షో యాప్ నుండి గంటకు 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో నిన్న మొన్నటి వరకు కల్కి , ది రాజాసాబ్ , పుష్ప 2 చిత్రాలు మాత్రమే ఉండేవి , కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి పెద్ది కూడా చేరిపోయింది.

ఇక ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రామ్ చరణ్ కి సోలో హీరో గా ఇదే మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ సినిమా అనుకోవచ్చు. హిందీ వెర్షన్ కి సంబంధించిన బుకింగ్స్ కూడా బాగా పికప్ అయ్యాయి. ఇదే ఊపు వీకెండ్ వరకు కొనసాగితే మాత్రం , 500 కోట్ల గ్రాస్ వసూళ్లు ఫుల్ రన్ లో కచ్చితంగా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో సినిమాను సెట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్... వర్కౌట్ అవుతుందా..?

Ram Charan and Allu Arjun multistarrer
Ram Charan and Allu Arjun multistarrer

Ram Charan and Allu Arjun multistarrer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి గిరాకీ పెరిగింది. పాన్ ఇండియాలో కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అప్పటినుంచి స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చాలా మంది దర్శకులు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కథలు రెడీ చేసుకుంటున్నారు. కొంతమంది డైరెక్టర్స్ ఇప్పటికే మల్టీ స్టారర్ కథలను రెడీ చేసినప్పటికీ ఆ కథల విషయంలో హీరోలు పెద్దగా సంతృప్తి చెందకుపోవడంతో వాటిని చేయలేకపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లను కలుపుతూ ఒక స్టార్ డైరెక్టర్ ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సందీప్ రెడ్డి వంగ కావడం విశేషం… ప్రస్తుతం ఆయన స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ – అల్లు అర్జున్ లను కలిపి ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.

ఇక ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనడం లో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరిని కలపాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అంటూ చాలామంది కొనియాడుతున్నారు. నిజానికి ఎవడు సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించారు. కానీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఆ మూవీలో అల్లు అర్జున్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ ఎపిసోడ్ వస్తుంది. కాబట్టి ఇద్దరు కలిసి ఒకసారి స్క్రీన్ మీద అయితే కనిపించలేదు. ఇంకా దానికి తోడుగా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కొంచెం విభేదాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

వాటన్నింటిని దాటుకొని సందీప్ రెడ్డి వంగ వీళ్లిద్దరితో సినిమాలు చేసి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఒకవేళ ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం అటు రామ్ చరణ్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశాలైతే ఉన్నాయి…

'అసలు నువ్వు ఎవడివిరా' అంటూ ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడిన నిర్మాత బండ్ల గణేష్..

Bandla Ganesh comments on Prakash Raj
Bandla Ganesh comments on Prakash Raj

Bandla Ganesh comments on Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సెక్యులర్ ముసుగులో హిందువులను , హిందువుల దేవుళ్లను ఎల్లప్పుడూ అవహేళన చేసే సంగతి అందరికీ తెలిసిందే. హిందువుల తరుపున ఎవరైనా ఏదైనా మాట్లాడితే , వాళ్లపై నోరేసుకొని పడిపోవడం ఇతనికి చాలా సరదా. అలా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈయన ఎల్లప్పుడూ నోరు జారుతూనే ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈయనకు ఇప్పటికీ గౌరవం ఇస్తూనే ఉంటాడు. కానీ ప్రకాష్ రాజ్ ఆ గౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అకారణంగా , సమయం , సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడడమే ఇతనికి తెలిసిన విషయం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం అంటుంటారు. అయితే తాజాగా , తెలంగాణ లో జరిగిన రాజకీయ పరిణామాలపై , జనసేన చుట్టూ తిరుగుతున్న రాజకీయాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ మీరొస్తానంటే మేమొద్దంటామా?, రండి దొర , కానీ వచ్చే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. ఒంటరిగా వస్తున్నారా?, లేదా పొత్తుతో వస్తున్నారా?, అది జనాలకు చెప్పి రండి’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘నీకెందుకురా ప్రతీ దాంట్లో వేలుపెడుతావు?, అసలు నువ్వెవడివి?, నీ ఊరు ఏది?, నీ కథ ఏంటి?, ప్రతీ ఊర్లో , ప్రతీ సమస్యలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా?, లేదా ఈ దేశానికీ ప్రధానివా?, ఎక్కడ చూసిన నువ్వే , ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బ్రతుక్కి ఏ పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలాగా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో , తర్వాత ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేద్దువు గానీ ‘ అంటూ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్, నీకు నువ్వే గొప్ప మేధావిని అనుకుంటున్నావు , కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రము లో కనీస ప్రజల మద్దతుని కూడా సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను , దేశ స్థాయి నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదం’ అంటూ మండిపడ్డాడు. బండ్ల గణేష్ స్పందించిన ఈ తీరుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతున్నారు. వింటేజ్ బండ్లన్న ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. గతం లో బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన గోవిందుడు అందరివాడేలే , టెంపర్ చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ చిత్రాల్లోనూ ఆయనకు బలమైన క్యారెక్టర్స్ పడ్డాయి. బండ్ల గణేష్ కి ప్రకాష్ రాజ్ తో ఆ రెండు సినిమాల ద్వారా మంచి అనుబంధం ఏర్పడింది , అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఈ స్థాయిలో మాట్లాడడం అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది.

9 నెలల గర్భంతో శీర్షాసనం.. గర్భిణి యోగా వీడియో వైరల్‌!

Pregnant Woman Yoga Video Viral
Pregnant Woman Yoga Video Viral

Pregnant Woman Yoga Video Viral: యోగా భారతీయ వ్యాయం.. దీర్ఘ కాలిక రోగాలను నయం చేసే శక్తి యోగాకు ఉంది. అందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యోగాను ఓ 9 నెలల గిర్భణి వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిండు గర్భంతో యోగా ఆసనాలు వేసే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గర్భంతో చక్రాసనం, శీర్షాసనం వంటి అత్యంత క్లిష్టమైన యోగా ఆసనాలను సులభంగా చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె శరీర సమతుల్యత, బలం నైపుణ్యం చూసి చాలా మంది ‘‘అద్భుతం’’, ‘‘ప్రేరణ’’ అని ప్రశంసిస్తున్నారు.

ఇంతకీ ఎవరా మహిళ?
వీడియోలో కనిపిస్తున్న ఆ గర్భిణి ఒక ప్రొఫెషనల్‌ యోగా ట్రైనర్‌. గర్భధారణకు ముందు నుంచి సుదీర్ఘకాలం యోగా అభ్యాసం చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భిణి అయినా కొన్ని అడ్వాన్స్‌డ్‌ ఆసనాలను కొనసాగించగలిగింది. అయితే ఇది సాధారణ గర్భిణులందరికీ సాధ్యం కాదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రమాదకరమంటున్న వైద్యులు..
గర్భధారణ సమయంలో శరీరంలో రిలాక్సిన్‌ అనే హార్మోన్‌ పెరిగి కీళ్లు, స్నాయువులు మెత్తబడతాయి. దీంతో బ్యాలెన్స్‌ తగ్గి పడిపోయే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా 8వ, 9వ నెలల్లో శీర్షాసనం, చక్రాసనం వంటి ఇన్వర్షన్‌ (తలక్రిందులు) ఆసనాలు చేయడం వల్ల రక్తపోటు మార్పులు, గర్భాశయంపై అనవసరపు ఒత్తిడి పెరుగుతాయి. బ్యాలెన్స్‌ కోల్పోయి పడడం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సూచనలు అవసరం…
నిపుణుల పర్యవేక్షణ లేకుండా, ముందస్తు సుదీర్ఘ శిక్షణ లేకుండా గర్భిణులు ఇలాంటి అడ్వాన్స్‌డ్‌ యోగా ఆసనాలు చేయకూడదు. ఈ వీడియో గర్భిణీలు శారీరక దృఢతను కాపాడుకోవాలనే సందేశం ఇస్తోంది. యోగా గర్భధారణలో స్ట్రెస్‌ తగ్గడం, శ్వాస నియంత్రణ, శరీర సౌకర్యం కోసం చాలా మంచిది. కానీ అది ప్రెగ్నెన్సీ సేఫ్‌ యోగా మాత్రమే కావాలి. ప్రొఫెషనల్‌ యోగా ట్రైనర్‌ అయినందున ఆమెకు ఇది సాధ్యమైంది. కానీ సాధారణ మహిళలు ఇలాంటి వీడియోలను చూసి స్వయంగా ప్రయత్నించడం ప్రమాదకరం.

గర్భిణులు యోగా చేయాలి.. కానీ సరైన గురువు మార్గదర్శకత్వంలో, డాక్టర్‌ సలహాతో, తమ శరీర స్థితిని బట్టి మాత్రమే. అద్భుతాలు ప్రేరణ ఇవ్వాలి, ప్రమాదాలు కాకూడదు. యోగా కోసం డాక్టర్‌ లేదా సర్టిఫైడ్‌ ప్రీనాటల్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌ సలహా తీసుకోవాలి.

మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇద్దరిలో మంచి నటుడు ఎవరో చెప్పేసిన స్టార్ డైరెక్టర్..

Mahesh Babu and NTR
Mahesh Babu and NTR

Mahesh Babu and NTR: సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటుడు మహేష్ బాబు… రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు… ఇక నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన డిఫరెంట్ వే లో తనను తాను ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిలో గొప్ప నటుడు ఎవరు అంటూ ఇద్దరు హీరోలతో సినిమాలను చేసిన ఒక డైరెక్టర్ ని అడగగా ఆయన ఆశ్చర్యపోయే సమాధానం అయితే చెప్పాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కృష్ణవంశీ కావడం విశేషం…

కెరియర్ మొదట్లో మహేష్ బాబు కృష్ణవంశీతో మురారి అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. మహేష్ బాబు కెరీర్ లో కూడా ఇదొక మూవీగా నడిచిపోయిందనే చెప్పాలి. ఇక అలాగే ఎన్టీఆర్ తో రాఖీ అనే సినిమా చేశాడు. రాఖీ సినిమా సైతం ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబట్టింది.

కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి నటనపరంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రం మరొక మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. అయితే వీళ్ళిద్దరిలో గొప్ప నటుడు ఎవరని కృష్ణవంశీని అడగగా ఆయన దానికి ఇద్దరు మంచి నటులే అంటూ సమాధానం ఇచ్చాడు.

దానికి వివరణ ఇస్తూ మహేష్ బాబు సెటిల్డ్ ఆర్టిస్ట్ అని ఎలాంటి ఎమోషన్ అయిన సరే చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలడని, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక క్యారెక్టర్ ని చాలా వైల్డ్ గా ప్రజెంట్ చేస్తాడు. అలాగే ప్రేక్షకుడి లోపలికి ఇంజక్ట్ చేయగలిగే కెపాసిటి తనకు ఉందని చెప్పాడు. ఓవరాల్ గా ఇద్దరూ మంచి నటులే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్లిద్దరు దొరకడం నిజంగా అదృష్టం అంటూ ఆయన చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది…

తమ్ముడుని తప్పిస్తే ఓకే.. చంద్రబాబుకు కేశినేని నాని విన్నపం

Kesineni Nani appeal to Chandrababu
Kesineni Nani appeal to Chandrababu

Kesineni Nani appeal to Chandrababu: విజయవాడలో కేశినేని సోదరుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటి ఎన్నికల ముందు టిడిపిలో ఉన్న కేసినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒక వ్యూహం ప్రకారం తనను టిడిపి నుంచి బయటకు పంపించి ఎంపీ అయ్యారని సోదరుడు కేశినేని చిన్ని పై నానికి ఆగ్రహం ఉంది. అనవసరంగా టిడిపికి గుడ్ బై చెప్పి ఇబ్బందులు పడ్డానని భావించిన కేసినేని నాని క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే తన ఈ పరిస్థితికి కారణమైన సోదరుడు, ఎంపీ చిన్ని పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చిన్ని అవినీతిని బయట పెడుతున్నారని.. తన అనుచరులపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ కేశినేని నాని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

అనుచరుడిపై కేసు..
ఇటీవల ఎంపీ కేసినేని చిన్ని పై నాని అనుచరుడు తాతినేని రాంబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో అతడి కుటుంబం పై కక్ష కట్టి పోలీసులతో తరచూ ఇబ్బంది పెడుతున్నారని.. అక్రమ కేసులు బనాయించి లేనిపోని ఇబ్బందులు కు గురి చేస్తున్నారు అంటూ కేసినేని నాని సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా ఒక కుటుంబం కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతోందని.. పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేసినేని చిన్ని అక్రమ సంపాదనకు సంబంధించి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారని.. ఆ సొమ్ము చోరీకి గురైనట్లు చెప్పి వారందరిని తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. అయితే కేశినేని చిన్ని పై అవినీతి విషయంలో మరి హైలెట్ చేస్తున్నారు నాని.

మళ్లీ టీడీపీలోకి..
అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరమైన కేసినేని నాని టిడిపి నాయకత్వం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్టీపై కానీ.. ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలు చేయడం లేదు. మరోసారి నాని టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయకత్వం పట్ల ఎంతో ఆకర్షణగా ఉండేవారు నాని. కేవలం తన సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ ఒక్క నిర్ణయంతో తన రాజకీయ కెరీర్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టుకున్నారు. అందుకే చిన్నిని తప్పిస్తే మళ్లీ తాను టిడిపిలో యాక్టివ్ అవుతానని సంకేతాలు పంపుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.