Home Blog Page 190

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా 'పతాంజలి'!

Patanjali investment in Uttarandhra
Patanjali investment in Uttarandhra

Patanjali investment in Uttarandhra: ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పెట్టుబడులను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. సింగిల్ విండోలో అనుమతులు, భూ కేటాయింపులు కూడా జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు పతాంజలి సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తోంది. అది వచ్చిన మరుక్షణం తమ కార్యకలాపాలు మొదలు పెట్టాలని భావిస్తోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రకు ఒక గేమ్ చేంజర్ గా నిలవనుంది పతాంజలి ఉత్పత్తుల సంస్థ.

దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల్లో..
దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల్లో పతాంజలి అగ్రగామిగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం పతాంజలి సంస్థ విన్నపం మేరకు విజయనగరం జిల్లా కొత్తవలసలో దాదాపు 171 ఎకరాల భూమిని కేటాయించింది. దాదాపు 370 కోట్ల రూపాయలతో పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయాలని భావించింది. తద్వారా ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే అప్పట్లో ప్రతిపాదనల దశ దాటింది. కానీ ఇంతలో అధికారం మార్పిడి జరిగింది ఏపీలో. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతాంజలి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు.

మరోసారి ప్రతిపాదనలు..
తాజాగా పతాంజలి మరోసారి తమ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే కొత్తవలస ప్రతిపాదిత స్థలంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పింది. ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు వస్తాయని భావిస్తోంది. 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేస్తోంది పతాంజలి. ఆయుర్వేద వైద్యాన్ని మరింత అభివృద్ధి చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి అంశాలను మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులకు, సాధారణ రైతులకు సంబంధించిన పంటలకు గిట్టుబాటు కలిగే అవకాశం ఉంది. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయన్నమాట.

సీజ్‌ఫైర్‌ అంటే యుద్ధం ఆపడం కాదట.. ట్రంప్‌ కొత్త నిర్వచనం!

Trump Warning Iran Deal
Trump Warning Iran Deal

Trump new definition of ceasefire: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సీజ్‌ఫైర్‌ జరిగింది. దీంతో ఇరువైపులా యుద్ధం ఆగిపోయింది. కాంబోడియా, థాయ్‌లాండ్‌ మధ్య ఆలయం కోసం యుద్ధం జరిగింది. తర్వాత ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్‌ కుదిరింది. యుద్ధం ఆగింది. తాజాగా అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధం జరిగింది. తర్వాత పాకిస్తాన్‌ చొరవతో సీజ్‌ఫైర్‌ కుదిరిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే సీజ్‌ఫైర్‌ అంటే యుద్ధం ఆపడం కాదట. కొత్త నిర్వచనం చెప్పి మళ్లీ ఒక్కసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. డొనాల్డ్‌ ట్రంప్‌. సీజ్‌ఫైర్‌(కాల్పుల విరమణ) అంటే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, కేవలం తీవ్రత తగ్గుతుంది అని ట్రంప్‌ వెల్లడించారు. దీంతో ఆయన శాంతి భావనను తన స్వంత శైలిలో మార్చేశారు.

ట్రంప్‌ చెప్పిన కొత్త నిర్వచనం ఏమిటి?
ఇటీవలి ఇరాన్‌–ఇజ్రాయెల్‌–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌ ఒక రిపోర్టర్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలా అన్నారు. ‘‘ఆ ప్రాంతంలో సీజ్‌ఫైర్‌ అంటే పూర్తి విరామం కాదు. అది తక్కువ తీవ్రతతో కాల్పులు జరపడం.’’ఈ ఒక్క వాక్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సంప్రదాయకంగా ‘సీజ్‌ఫైర్‌’ అంటే కాల్పులు పూర్తిగా ఆగిపోవడం, శాంతి చర్చలు మొదలవడం అని అర్థం. కానీ ట్రంప్‌ దానిని ‘‘నియంత్రిత యుద్ధం’’గా మార్చేశారు.

ట్రంపును ఆటాడుకుంటున్న నెటిజన్లు..
ట్రంప్‌ చెప్పిన కొత్త నిర్వచనం సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు:‘‘ట్రంప్‌ ప్రకారం ప్రపంచంలో ఎక్కడా నిజమైన సీజ్‌ఫైర్‌ ఉండదు. రోజూ యుద్ధాలే ఉంటాయి, కేవలం తీవ్రత మారుతుంది.’’ అని కొందరు, ‘‘ఇకపై యుద్ధం అంటే ఏమిటి? సీజ్‌ఫైర్‌ అంటే ఏమిటి? రెండూ ఒకటే అని ట్రంప్‌ చెప్పేశారు.’’
‘‘శాంతి ప్రవచనాలు చేస్తూ యుద్ధాలు కొనసాగించడానికి కొత్త సాకు ఇచ్చారు.’’ అని మరికొందరు, కామెంట్‌ చేశారు.

ట్రంప్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయం..
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల్లో ఒప్పందాలు జరిగినా, పూర్తి శాంతి సాధించడం చాలా కష్టం. రెండు వైపులా చిన్న చిన్న దాడులు, ఎదురుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్‌ దీనిని ‘‘తక్కువ తీవ్రత యుద్ధం’’గా అభివర్ణించి, దీన్ని సాధారణీకరించారు. ఈ వాదనలో కొంత వాస్తవం ఉంది. అనేక యుద్ధాలు (ఉక్రెయిన్, గాజా, సిరియా మొదలైనవి) పూర్తి ఆగకుండా తక్కువ తీవ్రతలోనే కొనసాగుతున్నాయి. కానీ దీన్ని అధికారికంగా ‘‘సీజ్‌ఫైర్‌’’ అని పిలవడం శాంతి ఆశలను బలహీనపరుస్తుంది. ఇది యుద్ధాన్ని సాధారణీకరించి, శాంతిని అసాధ్యం చేసే లాజిక్‌గా కనిపిస్తోంది.

సీజ్‌ఫైర్‌ను ‘‘తక్కువ తీవ్రత యుద్ధం’’గా నిర్వచించడం ద్వారా యుద్ధం శాశ్వతం కావడానికి మార్గం సుగమం చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజమైన శాంతి అంటే కాల్పులు పూర్తిగా ఆగడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం. తక్కువ తీవ్రత కాల్పులు కేవలం ‘‘నియంత్రిత హింస’’ మాత్రమే. అది శాంతి కాదు. ట్రంప్‌ ఈ మాటలు చెప్పిన సమయం కూడా ముఖ్యం. ప్రపంచం ఇప్పటికే బహుళ యుద్ధాలతో అలసిపోయి ఉంది. ఇలాంటి సమయంలో నాయకులు శాంతికి కొత్త ఆశలు కల్పించాలి కానీ, కొత్త సాకులు ఇవ్వకూడదు. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది.

క్యాబినెట్ సమావేశం నుంచి ఒక్కసారిగా పవన్.. ఏమైంది?

Pawan Kalyan Fans Protest
Pawan Kalyan Fans Protest

Pawan Kalyan Health Updates: ఏపీ క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర నీరసంతో కళ్ళు తిరిగిన లక్షణాలతో కనిపించారు. వెంటనే సీఎం చంద్రబాబు అనుమతితో మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వచ్చేసారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయినా క్షణం తీరిక లేకుండా ఉండడంతో అస్వస్థతకు గురయ్యారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నా మంత్రివర్గ సమావేశాన్ని కీలకంగా భావించి ఆయన హాజరయ్యారు. కానీ కాస్త తీవ్ర అస్వస్థత ఎదురు కావడంతో మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. పవన్ అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకొని జనసైనికులు ఆందోళనకు గురయ్యారు.

రోజు వారి కార్యక్రమాలతో బిజీ..
గత కొద్దిరోజులుగా పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయంగా బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. హైదరాబాదులో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అటు నుంచి వచ్చి అమరావతిలో తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురయ్యారు. ఆయనకు బీపీ హెచ్చు తగ్గులు కారణంగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తన పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించడంతో ఆయన అనుమతి మేరకు మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు..

అధికారిక కార్యక్రమాలు రద్దు..
క్యాబినెట్ భేటీలో అస్వస్థతకు గురి కావడంతో పవన్ నేరుగా తన నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన వ్యక్తిగత వైద్య బృందం పరీక్షలు చేపట్టింది. డిహైడ్రేషన్ మూలంగానే అలా జరిగిందని నిర్ధారించింది. పవన్ కళ్యాణ్ కు వెంటనే సెలైన్ బాటిల్ కూడా పెట్టారు. అయితే పవన్ అస్వస్థత విషయం తెలుసుకున్న జనసైనికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం ఏదీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ ఎప్పుడు?!.. తప్పు వారిదే అంటున్న కుమారుడు!

Bolla Brahmanaidu arrest news
Bolla Brahmanaidu arrest news

Bolla Brahmanaidu arrest news: హైదరాబాద్ భూకుంభకోణంలో వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు బయటకు వచ్చింది. దాదాపు 1,000 కోట్ల భూమికి ఆయన స్కెచ్ వేశారని.. ఏకంగా ప్రభుత్వ జీవోలు మార్చేసారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అయితే ఇది వెలుగులోకి వచ్చి రోజులు దాటుతున్న ఆయన అరెస్టు జరగలేదు. తెలంగాణ సర్కారులో కీలక వ్యక్తులు ఆయనను కాపాడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముందస్తు బెయిల్ వచ్చేవరకు ఆయన అరెస్టు ఉండదన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన కుమారుడు గిరిబాబు ఏకంగా మీడియా ముందుకు వచ్చి తన తండ్రి తప్పు లేదని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎల్లో మీడియా సృష్టిగా తేల్చి పడేశారు. వాస్తవానికి ఈ కుంభకోణాన్ని బయటకు తీసింది తమ బంధువులేనని చెప్పుకొచ్చారు. ఒకవైపు బ్రహ్మనాయుడు అరెస్టు జరగకపోగా… ఆయన కుమారుడు ఏకంగా ఒక వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.

గులాబీ పార్టీ హయాంలో..
వినుకొండ ఎమ్మెల్యేగా ఉండేవారు బొల్లా బ్రహ్మనాయుడు. అయితే అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది తెలంగాణలో. అక్కడ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. పరస్పర రాజకీయ సహకారం ఉండేది వారిద్దరికీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో సైతం అధికార పార్టీ నాయకులుగా చలామణి అయ్యేవారు. ఆ సమయంలో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా హైదరాబాదులో పాల్పంచుకునే వారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్రహ్మనాయుడు గండిపేటలో 1000కోట్ల విలువైన 12 ఎకరాల భూమిని ప్రభుత్వ జీవోలను మార్చి.. కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా గులాబీ పార్టీ హయాంలో జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడు బ్రహ్మనాయుడు ను కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపాడుతోంది ఎవరు అనేది కొత్త ప్రశ్న.

అప్పట్లో మంచి పేరు.
బ్రహ్మనాయుడుకు మంచి పేరు ఉండేది. నష్టాల్లో ఉన్న తిరుమల డైరీ ని లాభాల బాట పట్టించిన నేత. వైసీపీలోకి వెళ్లిన తర్వాత బ్రహ్మనాయుడు చుట్టూ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. హైదరాబాదులో 1000 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారన్న ఆరోపణ బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఐదేళ్ల వైసిపి హయాంలో ఏపీలో ఆయన చాలా రకాలుగా అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా ఎల్లో మీడియా సృష్టి అని ఆయన కుమారుడు గిరిబాబు తేల్చి చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా బ్రహ్మానాయుడును అరెస్టు చేసే ప్రయత్నం చేయడం లేదు. పరారీలో ఉన్నట్లు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఆయనకు ముందస్తు బెయిల్ దక్కే వరకు అరెస్టు చేయరన్న పొలిటికల్ వర్గాల్లో ఉంది. అంతలా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెన్నుదన్ను లభిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దండు.. పుతిన్‌ ప్రతిష్టకు సవాల్‌!

Ukraine drone attacks on Russia
Ukraine drone attacks on Russia

Ukraine drone attacks on Russia: ఒకవైపు అమెరికా–ఇరాన్‌ వార్‌ మళ్లీ మొదలైంది. ఈ వార్‌ కొనసాగినన్ని రోజులు రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ కాస్త తగ్గినట్లు కనిపించింది. ఇరువైపులా దాడులు ఆగాయి. కానీ యుద్ధం మాటునే ఉక్రెయిన్‌ రష్యాపై భారీ దాడికి ప్లాన్‌ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఒక్క రాత్రిలోనే యుద్ధ చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది. వేయి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి రష్యా రెండో అతి పెద్ద నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని కీలక చమురు టర్మినల్‌పై దాడి చేసింది. అక్కడి నౌకాస్థావరంపై కూడా తీవ్ర విధ్వంసం చేసింది. జూన్‌ 3, 2026 ఉదయం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ చమురు టర్మినల్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడి చేశాయి. బాల్టిక్‌ సముద్రం తీరంలోని రష్యా అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన ఈ టర్మినల్‌ సంవత్సరానికి 1.25 కోట్ల టన్నుల చమురు ఎగుమతి సామర్థ్యం కలిగి ఉంది. దాడి వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగి దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కప్పేసింది. అదే సమయంలో కోల్టిన్‌ ద్వీపం సమీపంలోని క్రోన్‌స్టాడ్‌ నౌకాస్థావరంపై కూడా డ్రోన్లు దాడి చేశాయి. అక్కడ రష్యా బాల్టిక్‌ నౌకాదళానికి చెందిన ‘బోయికీ’ గైడెడ్‌ మిస్సైల్‌ కార్వెట్‌ డ్రై డాక్‌లో దెబ్బ తిన్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి.

అంతర్జాతీయ సదస్సు వేళ..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ పుట్టిన నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ ఫోరం రష్యా దావోస్‌గా పిలువబడే అతి పెద్ద అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ప్రారంభం కాబోతున్న వేళ ఈ దాడులు జరిగాయి. విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయడం, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పుతిన్‌ సొంత నగరంలో, అతని ప్రతిష్టకు ప్రతీకగా భావించే ఈ సదస్సు సమయంలో జరిగిన ఈ దాడి రష్యాకు తీవ్రమైన ఇబ్బంది కలిగించింది. ఈ దాడులు ఖాళీగా జరగలేదు. ఒక రోజు ముందు (జూన్‌ 2) రష్యా ఉక్రెయిన్‌పై భారీ డ్రోన్‌–క్షిపణి దాడి చేసి 22 మంది పౌరులను చంపి, 138 మందిని గాయపరిచింది. కీవ్, డ్నిప్రో వంటి నగరాల్లో భయానకం సృష్టించిన ఆ దాడికి ఉక్రెయిన్‌ ఇచ్చిన సమాధానం ఇది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన సోషల్‌ మీడియాలో ‘‘మా దీర్ఘ–పరిధి దాడులు రష్యా యుద్ధ యంత్రాంగాన్ని లోతట్టు నుంచి కూడా తాకుతున్నాయి’’ అని స్పష్టంగా చెప్పారు.

రష్యా స్పందన..
తాజా దాడిపై రష్యా స్పందించింది. రక్షణ మంత్రిత్వ శాఖ 354 డ్రోన్లను కూల్చేశామని ప్రకటించింది. అయితే ఈ సంఖ్యలు ఎంతవరకు నిజం అనేది వేరు విషయం. ఉక్రెయిన్‌ డ్రోన్లు లక్ష్యాలను తాకడం ద్వారా రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలోని లోపాలు మరోసారి బయటపడ్డాయి.

వ్యూహాత్మక ప్రాముఖ్యత…
ఈ దాడులు రెండు ముఖ్యమైన సందేశాలు ఇస్తున్నాయి.. ఉక్రెయిన్‌ ఇక రక్షణాత్మక యుద్ధం చేయడం లేదు. ఆక్రమణకు సమానంగా దాడి చేసే సామర్థ్యం సంపాదించింది. రష్యా భూభాగం ఇక సురక్షితం కాదు. పుతిన్‌ సొంత నగరం, ఆయుధ కార్మికులు, చమురు ఎగుమతి కేంద్రాలు అన్నీ లక్ష్యాలు అయ్యాయి. ప్రస్తుతం ఇరాన్‌ సంక్షోభం కారణంగా అమెరికా ఉక్రెయిన్‌కు పాట్రియోట్‌ వ్యవస్థలు సరఫరా చేయడంలో వెనుకబడుతోంది. దీంతో రష్యా బాలిస్టిక్‌ క్షిపణి దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్‌కు ఇబ్బంది ఎదురవుతోంది. అయినప్పటికీ, డ్రోన్‌ సాంకేతికతలో ఉక్రెయిన్‌ సాధిస్తున్న పురోగతి యుద్ధ సమీకరణాలను మార్చేస్తోంది. ఈ పరిణామాలు యూరప్‌ దేశాలు, నాటోకు ఒక స్పష్టమైన సవాలు. ఉక్రెయిన్‌కు మరింత ఆధునిక రక్షణ వ్యవస్థలు, దీర్ఘ–పరిధి ఆయుధాలు అందించాల్సిన అవసరం తీవ్రంగా ఉంది.

ఈ దాడులు యుద్ధాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రష్యా లోపలి ప్రాంతాలు ఇక సురక్షితం కావని ఉక్రెయిన్‌ నిరూపించింది. పుతిన్‌ యొక్క ‘‘ప్రత్యేక సైనిక ఆపరేషన్‌’’ ఇప్పుడు రష్యా సొంత భూభాగంలోనూ యుద్ధంగా మారుతోంది. ఇది ఎంతవరకు ముందుకు సాగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వచ్చే వారాల్లో స్పష్టమవుతుంది.

మరోసారి అస్వస్థత కి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. క్యాబినెట్ మీటింగ్ నుండి వాకౌట్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan health update: ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలంలో నిత్యం అనారోగ్యానికి గురి అవుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈమధ్యనే ఆయన ముక్కుకి ఆపరేషన్ కూడా జరిగింది. అందుకు నెల రోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్ , వరుసగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూ, పార్టీ మీటింగ్స్ ని కూడా నిర్వహిస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మరోసారి తీవ్రమైన అవస్థతకు గురైనట్టు తెలుస్తోంది. నేడు సచివాలయం లో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ కి హాజరైన పవన్ కళ్యాణ్ , మధ్యలోనే లేచి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. కారణం ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి కలగడమే అని తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం నుండి వాకౌట్ అయిన ఆయన , నేరుగా మంగళగిరి కి వెళ్లినట్టు తెలుస్తోంది.

అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ అస్వస్థత తీవ్రత ఎంత వరకు ఉంది అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు , పవన్ కళ్యాణ్ కి వచ్చినది సాధారణమైన వెన్ను నొప్పి , ఆయనకు ఇది ఎప్పటి నుండో ఉన్న సమస్య అంటూ చెప్పుకొస్తున్నారు జనసేన పార్టీ సన్నిహితులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇన్ని సార్లు అస్వస్థతకు గురవ్వడం గతంలో ఎప్పుడు జరగలేదు. పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి అనేక ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన పాదయాత్ర వంటివి చేయలేకపోయాడని , ఒకవేళ పాదయాత్ర చేసుంటే సోలో గానే సీఎం అయ్యేవాడని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇన్ని ఆరోగ్య సమస్యల మధ్య పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అభిమానుల్లో కలుగుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ కాదు.. ఇండియాలో భారీ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అతనే..

Rajamouli and Sandeep Reddy
Rajamouli and Sandeep Reddy

Rajamouli and Sandeep Reddy: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే సినిమాలను కూడా చేయగలుగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలందరు ఆయా దర్శకుల వెంటపడుతున్నారు. ఇండియాలో ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లను పక్కన పెడితే ఇప్పుడు మరొక దర్శకుడు ఆ లిస్టులో చేరిపోయాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే ఆదిత్య ధర్ కావడం విశేషం… ఆయన చేసిన ‘దురంధర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసింది. ఆయన చాలా తక్కువ రోజుల్లోనే బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే సినిమాని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ ప్రతి ఒక్కరు అతన్ని కొనియాడుతున్నారు.

ఇక రాజమౌళి సందీప్ రెడ్డి వంగ లను పక్కన పెట్టి మరి ఆదిత్య ధర్ చాలా గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన చేసిన ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ దశా దిశా ను కూడా మార్చాయి.

బాలీవుడ్ లో చాలా రోజుల నుంచి సక్సెసు లైతే రావడం లేదు. కానీ దురంధర్ రెండు పార్ట్ లతో భారీ విజయాన్ని అందించి బాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే అక్కడున్న బాలీవుడ్ మాఫియా ఒప్పుకోవడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా అతను తన టాలెంట్ తో చాలావరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనాలను క్రియేట్ చేశాడనే చెప్పాలి…

ఇప్పటివరకు దర్శకులందరు వాళ్ల సత్తా ఏంటో చూపిస్తూ వచ్చారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం డిఫరెంట్ వే లో దేశం కోసం సినిమాలు చేసి పేక్షకులందరిని మెప్పించాడు… ఇక ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపిస్తుండటం విశేషం…

మోహన్ బాబు అందరినీ తిడతాడు అంటారు కానీ నాకు లైఫ్ ఇచ్చాడు అంటున్న స్టార్ డైరెక్టర్..

BVS Ravi on Mohan Babu
BVS Ravi on Mohan Babu

BVS Ravi on Mohan Babu: సినిమా ఇండస్ట్రీ లో కలెక్షన్ కింగ్ గా గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. కెరియర్ స్టార్టింగ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆయన హీరోగా అవతరించి భారీ విజయాలను సాధించాడు. తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఆయన గత కొద్దిరోజులుగా ఖాళీగానే ఉంటున్నాడు. తన కొడుకుల సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక దాంతో పాటుగా అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో కూడా మోహన్ బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ రెండు పాత్రలతో ఆయన మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మోహన్ బాబు పేరు చెప్తే చాలు చాలామంది అతనికి చాలా కోపం ఉంటుది.

చాలామందిని తిడతాడు, కొడతాడు అంటూ చాలా రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు మాత్రం పైకి కనిపించేంత కఠినమైన వ్యక్తి కాదని ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన బీవీఎస్ రవి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

తను గోపీచంద్ ను హీరోగా పెట్టి చేసిన ‘వాంటెడ్’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మోహన్ బాబు రవి ఇంటికి ఒక పెద్ద పండ్ల బుట్ట తో పాటు 5 లక్షల రూపాయలతో ఉన్న ఒక చెక్కును కూడా గిఫ్ట్ గా పంపించారట. ఆ చెక్కును తీసుకొని తన కొడుకుకి ఒక మంచి కథ రాయమని సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

‘దేనికైనా రెడీ’ అనే కథను రెడీ చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వీళ్ళందరికి మంచి గుర్తింపైతే వచ్చింది. మొత్తానికైతే మోహన్ బాబును అందరు విలన్ గా చూస్తారు. కానీ అతను నిజంగా హీరోనే అంటూ బివిఎస్ రవి తనను మోహన్ బాబు ఎలా ఆదుకున్నాడు అనే విషయాలను గుర్తు చేసుకున్నాడు…

అల్లు అర్జున్ రాకా కోసం 50 కోట్లు పెట్టి ఫైట్ తీస్తున్నారా..?

Allu Arjun
Allu Arjun

Allu Arjun 50 crore fight sequence: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియాలో ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయగలుగుతుంది అనే కాన్ఫిడెంట్ తో అల్లు అర్జున్ ఐతే ఉన్నాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో అలీ అర్జున్ ఉన్నాడు. ఇక ఇంతకుముందు ఆయన షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. అయినప్పటికి ఆ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమా లాగా నే ఉంది అంటూ కొన్ని విమర్శలను మూటగట్టుకుంది. దాంతో ఇప్పుడు విజువల్ వండర్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో అట్లీ డిఫరెంట్ సినిమానైతే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో అట్లీ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. అల్లు అర్జున్ మరో మెట్టు పైకి ఎక్కుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఆయన సాధించబోయే విజయాలు వేరే రేంజ్ లో ఉండబోతున్నాయనే విషయాలైతే తెలుస్తున్నాయి. ‘పుష్ప 2’ మూవీతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు అట్లీ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేయగలుగుతుందా? లేదా అనే ఒక అంచనాలో తనున్నాడు.

అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు 50 కోట్లు పెట్టి ఒక భారీ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకోవడం అట్లీ ఈ సినిమాని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడం అన్ని తొందర తొందరగా జరిగిపోతున్నాయి. అంత బాగానే ఉంది కానీ అట్లీ ఈ మూవీతో అల్లు అర్జున్ నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

మొన్నటి దాకా సంజీవ్ గోయంక మీద.. ఇప్పుడేమో విరాట్ వైపు.. లలిత్ మోడీ ఇలా తగులుకున్నాడేంటి..

Lalit Modi comments on Virat Kohli
Lalit Modi comments on Virat Kohli

Lalit Modi comments on Virat Kohli: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఏమాత్రం తగ్గడం లేదు. ఆర్థిక నేరాల కేసులో విదేశాల్లో ఉంటున్న అతడు మన దేశానికి సంబంధించిన ప్రతి వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు. రకరకాల ఇంటర్వ్యూలలో సంచలన విషయాలను బయటకు చెబుతున్నాడు. తద్వారా అతడు నిత్యం మీడియాలో చర్చకు దారి తీస్తున్నాడు.

మొన్నటి దాకా లక్నో యజమాని సంజీవ్ గోయంక మీద లలిత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అతడు బుద్ధిలేని వ్యక్తి అంటూ.. మూర్ఖుడు అంటూ విమర్శలు చేశాడు. అంతేకాదు, అతడు ఐపీఎల్ లో జట్టు యజమానిగా ఉండేందుకు పనికిరాడు అని స్పష్టం చేశాడు. ఇటీవల కాలంలో లక్నో జట్టు సరిగ్గా ఆడ లేకపోవడంతో.. ఆ లోపాలు కూడా సంజీవ్ ఖాతాలోనే వేశాడు లలిత్.

లలిత్ ఇప్పుడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మీద పడ్డాడు. పరుగుల యంత్రం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. విరాట్ కోహ్లీ ఆ మధ్య ఒక మ్యాచ్ ఆడేందుకు వెళ్లాడు. అక్కడ అతడి ఆటోగ్రాఫ్ కోసం ఒక బాలుడు ఎదురు చూశాడు. ఆటోగ్రాఫ్ కోసం విరాట్ కోహ్లీ కలిస్తే అతడు ఇవ్వకుండా వెళ్లిపోయాడు.. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో ఆ చిన్నారి విపరీతంగా ఏడ్చాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు లలిత్ ప్రస్తావించాడు.

ఆటోగ్రాఫ్ విరాట్ కోహ్లీ ఇవ్వకపోవడంతో ఆ చిన్నారి విపరీతంగా ఏడ్చాడని ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ వ్యాఖ్యానించాడు. “విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో ఆ బాలుడు ఒకసారిగా ఆవేదనకు గురయ్యాడని.. అతడు తీవ్రంగా ఏడ్చాడని.. లలిత్ పేర్కొన్నాడు. ఆ బాలుడిని వెతికి మరి పట్టుకొని.. ఐపీఎల్ సీజన్ వన్ ఆటగాళ్లు మొత్తం సంతకం చేసిన స్పెషల్ బ్యాట్ ను ఇంటికి పంపించారు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి.. ఆ పిల్లాడితో చాలాసేపు మాట్లాడానని” లలిత్ పేర్కొన్నాడు. లలిత్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.

ఇటీవల కాలంలో ఐపీఎల్ గురించి చేదు వాస్తవాలను లలిత్ బయటపెడుతున్నాడు. ఐపీఎల్ రేటింగ్స్ పెంచడానికి ఏం చేస్తాం.. ఆటగాళ్ల విషయంలో ఎటువంటి ప్రణాళికల రూపొందిస్తాం.. మైదానం బయట జరిగే సంఘటనలకు ఎలాంటి స్క్రిప్ట్ రూపొందిస్తాం.. వాటి విషయాలను లలిత్ ఇటీవల వెల్లడించాడు. దీంతో ఐపీఎల్ గురించి.. అందులో జరిగే కోట్ల వ్యాపారం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత లలిత్ అసలు విషయాలు చెప్పడంతో ఐపీఎల్ గురించి అసలు వాస్తవాలు బయటికి తెలుస్తున్నాయి.

ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నీళ్లు ఎందుకు ఇవ్వకూడదు?

First aid guidelines
First aid guidelines

First aid guidelines: రోడ్డు ప్రమాదం, ఎత్తు నుంచి పడిపోవడం లేదా తీవ్రమైన గాయాల తర్వాత బాధితుడు ‘దాహంగా ఉంది.. నీళ్లు ఇవ్వండి’అని అడిగినా.. వెంటనే నీరు ఇవ్వొద్దని వైద్యులు సూచిస్తుంటారు. దీనికి ముఖ్యమైన కారణం ప్రాణాపాయం పెరగకుండా చూడటమే. గాయపడిన వ్యక్తి బయటకు సాధారణంగానే కనిపించినా, లోపల తీవ్రమైన గాయాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నీళ్లు తాగించడం వల్ల కొన్ని ప్రమాదకరమైన సమస్యలు తలెత్తవచ్చు. అసలు ఈ సమయంలో నీరు ఎందుకుఇవ్వొద్దు..?ఇస్తేఏం జరుగుతుంది?

స్పృహ సరిగా లేకపోతే ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం
ప్రమాదం తర్వాత కొంతమందికి తలకు దెబ్బ తగిలి స్పృహ పూర్తిగా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నీరు తాగిస్తే అది అన్నవాహికలోకి వెళ్లాల్సింది బదులు శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనినే ‘ఆస్పిరేషన్’ అంటారు. ఇలా నీరు ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా శ్వాస ఆడకపోవడం వంటి ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు.

లోపలి గాయాలు ఉంటే పరిస్థితి మరింత క్లిష్టం
ప్రమాదాల తర్వాత కడుపు, పేగులు లేదా ఇతర అంతర్గత అవయవాలకు గాయాలు కావచ్చు. బయటకు కనిపించకపోయినా లోపల రక్తస్రావం జరుగుతుండవచ్చు. అటువంటి పరిస్థితిలో నీళ్లు తాగడం వల్ల వాంతులు, అసౌకర్యం పెరగవచ్చు. అలాగే వైద్యులు గాయాల తీవ్రతను అంచనా వేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

అత్యవసర శస్త్రచికిత్స అవసరమైతే సమస్య
ప్రమాద బాధితుడికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. శస్త్రచికిత్సకు ముందు సాధారణంగా కడుపు ఖాళీగా ఉండాలని వైద్యులు కోరుతారు. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చిన సమయంలో కడుపులో ఉన్న నీరు లేదా ఆహారం తిరిగి గొంతులోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీస్తుంది.

షాక్‌లో ఉన్నప్పుడు నీరు పరిష్కారం కాదు
తీవ్ర రక్తస్రావం వల్ల కొందరు ‘షాక్’ స్థితిలోకి వెళ్తారు. ఈ సమయంలో వారికి దాహం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ నీళ్లు తాగించడం వల్ల రక్తపోటు లేదా రక్తనష్టం సమస్యలు సరిచేయలేవు. ఆసుపత్రిలో వైద్యులు అవసరమైతే సలైన్, ఐవీ ద్రావణాలు లేదా రక్తం ద్వారా చికిత్స అందిస్తారు.

ఫస్ట్ ఎయిడ్‌లో ఏం చేయాలి?
ప్రమాద బాధితుడికి స్పృహ సరిగా ఉందో లేదో ముందుగా పరిశీలించాలి. శ్వాస తీసుకుంటున్నాడో లేదో చూడాలి. మెడ లేదా వెన్నెముకకు గాయమై ఉండొచ్చని అనుమానం ఉంటే కదిలించకూడదు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలి. బాధితుడి పెదవులు ఎండిపోతే కొద్దిగా తడి గుడ్డతో తుడవొచ్చు కానీ నేరుగా నీరు తాగించకపోవడం మంచిది.

హోండా కంపెనీకి మే సక్సెస్ నెల.. ఎందుకో తెలుసా..

Honda May sales success
Honda May sales success

Honda May sales success: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI)కి 2026 మే విజయవంతమైన నెలగా గడిచింది. ఈ కంపెనీ ఈ నెలలో దేశీయంగా మొత్తం 5.18 లక్షల‌కు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది మే 2025లో నమోదైన 4.65 లక్షల యూనిట్లతో పోల్చితే గణనీయంగా పెరుగుదల అనుకోవచ్చు. వార్షిక ప్రాతిపదికన చూస్తే… 12 శాతం వృద్ధి రికార్డు అయింది.

అయితే ఈ వృద్ధికి అనేక కారణాలు ఉన్నాయి. హోండా స్థిరమైన బ్రాండ్ నమ్మకం, రీ సేల్స్ వినియోగదారులను బాగా ఆకర్షించింది. కంపెనీ రూపొందిస్తున్న విభిన్న మోడళ్ల ఉత్పత్తితో పాటు ఇంజిన్ పర్ఫార్మెన్స్ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి సహాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ప్రోత్సాహక ప్యాకేజీలు, ఫైనాన్సింగ్ ఆఫర్లు కూడా ఆకట్టుకున్నాయి.

ఎగుమతులలోనూ హోండా కంపెనీ 24 శాతం వృద్ధిని సాధించింది. 2026 మేలో కంపెనీ విదేశాలకు పంపిన ద్విచక్ర వాహనాల ఎగుమతులు సుమారు 59 వేల యూనిట్లకు చేరగా.. ఇది 2025 మేలోని సుమారు 47 వేల యూనిట్లుగా ఉంది. ఈ ఎగుమతి పెరుగుదల హోండా ఉత్పత్తుల విదేశీ ఆమోదం, అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండ్ గా ఉండడమే.

భవిష్యత్తును దృష్టిలోఉంచుకొని కంపెనీ ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ వేసుకున్నట్లు సమాచారం. ఉత్పత్తుల నవీకరణలు, మార్కెట్,స్పెసిఫిక్ మోడళ్లను విడుదల చేయడం, అలాగే ఎగుమతులలో మరింత విస్తరణ ద్వారా గ్లోబల్ మార్కెట్లలో ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది.

2026 మేలో HMSI యొక్క 5.18 లక్షల దిగుబడి మరియు ఎగుమతుల్లో 24 శాతాల వృద్ధి కంపెనీకి స్థానికంగా , అంతర్జాతీయంగా బలమైన పోటీతత్వాన్ని ఇస్తోంది. వినియోగదారుల ఆధారిత డిమాండ్, సరఫరా సరళి నిర్వహణ సామర్థ్యం వంటివి ప్రణాళికంగాముందుకు వెళితే గమ్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.

విరాట్, రోహిత్.. ఏదో అనుకుంటే ఇలా జరిగిపోయింది.. ఇప్పుడు టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి..

Virat Kohli and Rohit Sharma latest news
Virat Kohli and Rohit Sharma latest news

Virat Kohli and Rohit Sharma latest news: 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఆడతారని అందరూ అనుకుంటున్నారు. పైగా వారిద్దరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. మిగతా బ్యాటర్ల కంటే ఎక్కువగా పరుగులు చేస్తున్నారు. తాజా ఐపిఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ తన జోరు చూపించాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం అనుకున్న దానికంటే గొప్పగా ఆడలేకపోయినప్పటికీ.. తన స్థాయిలో మాత్రం మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడప్పుడు గాయాల బారిన పడటంతో అతడు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

త్వరలో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. 2027 వన్డే విశ్వసమరం జరగనుంది. ఈ సిరీస్ టీమిండియా కు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం ప్లేయర్లను మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇందులో కోహ్లీకి అవకాశం లభించలేదు. రోహిత్ శర్మ కూడా ఆడేది అనుమానంగానే ఉంది.. ఈనెల 13 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. టీమిడియాకు గిల్ నాయకత్వం వహిస్తాడు. విరాట్ లేకుండా.. రోహిత్ కనిపించకుండా ఈ సిరీస్ నడుస్తుందని ఇప్పటికే జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ హ్యామ్ స్ట్రింగ్ గాయం వల్ల ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల అతడు ఒక మ్యాచ్లో గాయపడ్డాడు. అందువల్లే మైదానంలోకి రాలేదు. ఫైనల్ మ్యాచ్లో మాత్రం స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. చురుకుగా ఫీల్డింగ్ చేశాడు. ఆఫ్గనిస్తాన్ జట్టుతో సిరీస్ కోసం అతడిని ఎంపిక చేయకపోవడం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ అభ్యర్థన మేరకు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని కొంతమంది.. అతడిని 2027 వరల్డ్ కప్ కోసం ఆడించాలి కాబట్టి ఇప్పుడు రెస్ట్ ఇస్తున్నారని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ ఇలాంటి ఆటగాడు జట్టులో లేకుండా.. మ్యాచ్ చూడడం అంత ఈజీ కాదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

విరాట్ కోహ్లీ టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కొద్ది రోజులకే టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగాడు. అతడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆ మధ్య ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ దుమ్మురేపాడు. రోహిత్ కూడా సత్తా చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ లేకుండా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ టీమ్ ఇండియా ఆడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కీలకమైన మార్పులు చేస్తున్న ప్రశాంత్ నీల్...

NTR Dragon
NTR Dragon

NTR Dragon movie latest updates: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాంతో సినిమా యొక్క వరల్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రేక్షకులకు చాలా క్లారిటిగా తెలిసింది. కాబట్టి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధిస్తాడు అంటూ ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక మీదట కూడా ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ ఫుల్ గా నిలపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తోడుగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులను కూడా చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మీద హైప్ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఆ హైప్ మ్యాచ్ చేయాలంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ఎన్టీఆర్ అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత సాలిడ్ సబ్జెక్టుని డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి తను కూడా ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే మాత్రం ఈ సినిమాని ప్రశాంత్ నీల్ చాలా ఎక్సైటింగ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరమైతే ఉంది.

ఇక దానికోసమే సినిమాలో కొన్ని మార్పులు చేర్పులైతే చేస్తున్నారట. ఇక దానికి జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి సినిమాకు సంబంధించిన మార్పులు చేర్పులను దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

రవితేజ కి లైఫ్ ఇచ్చిన దర్శకుడు.. అతనితో మరో సినిమా చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే..?

Ravi Teja Krishna Vamsi Controversy
Ravi Teja Krishna Vamsi Controversy

Ravi Teja Krishna Vamsi Controversy: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చిన్న చితక పాత్రలు చేశాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే రేంజ్ కి వెళ్లిపోయాడు. ఇక ఒకానొక సందర్భంలో రవితేజతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపించారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే రవితేజ ఇండస్ట్రీకి రావడానికి తనకు బాగా హెల్ప్ చేసిన దర్శకుడు ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదట.

కారణం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కృష్ణవంశీ కావడం విశేషం… కృష్ణవంశీ దగ్గర నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం, ఖడ్గం లాంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక అలాంటి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక కృష్ణవంశీ రవితేజల మధ్య గత కొన్ని రోజులకు కొన్ని విభేదాలు అయితే వస్తున్నాయట. అందువల్లే కృష్ణ వంశీ రవితేజ గురించి మాట్లాడడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక తనతో సినిమా విషయానికి వస్తే అతనితో సినిమా చేసే ప్రసక్తే లేదు అంటూ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటి అయితే ఇచ్చాడు.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందని అందరు అనుకున్నప్పటికి అది అంత పెద్దగా బిల్ట్ కాలేదు. నిజానికి రవితేజ కి అవకాశం ఇచ్చింది కృష్ణవంశీ అతన్ని హీరోగా నిలబెట్టింది కూడా కృష్ణవంశీ నే కావడం విశేషం… రవితేజ కృష్ణ వంశీ మధ్య దూరంగా పెరగడానికి కారణమేంటి అనే విషయంలో చాలా మంది చాలా రకాల ప్రశ్నలైతే లేవనెత్తుతున్నారు…

మహేష్ బాబు మొదటి సారి ఆ అడ్వెంచర్ చేస్తున్నాడా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu Adventure Stunt: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లను వాడకుండా కొన్ని అడ్వెంచర్ సన్నివేశాలనైతే చేస్తుంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చాలా సినిమాల్లో డూప్ లేకుండా రియాలెస్టిక్ సన్నివేశాలను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘వన్ నేనొక్కడినే ‘ సినిమాలో ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్ మీదకి జంప్ చేసే సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా తను ఒక్కడే స్వయంగా చేశాడు. అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక అలాంటివే కాకుండా హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా కోసం ఆయన హార్స్ రైడింగ్ తో పాటు హార్స్ మీద నుంచి జంప్ చేసే సన్నివేశాన్ని కూడా తనే రియల్ గా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సన్నివేశంలో మహేష్ బాబు నిజంగా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తాడంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. డూప్ లేకుండా మహేష్ బాబు ఒరిజినల్ గా చాలా అద్భుతంగా స్టంట్ చేశాడంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని ప్రశంసలైతే దక్కుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుడిని పెద్దగా అలరించడం లేదు.

కాబట్టి వారణాసి మూవీతో ఏకంగా పాన్ వరల్డ్ లోకి తను ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఆయన ప్రపంచస్థాయి సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి వెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మొత్తానికైతే వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. కాబట్టి ఈ సినిమాతో రాజమౌళి పెను సంచలనాలను క్రియేట్ చేస్తాడు అనేది చాలా క్లారిటిగా తెలుస్తుంది…

చిరంజీవి - బాబీ మూవీలో ఐటెం సాంగ్ ను తీసేస్తున్నారా..? కారణమేంటంటే..?

Chiranjeevi Bobby Movie Item Song Removed
Chiranjeevi Bobby Movie Item Song Removed

Chiranjeevi Bobby Movie Item Song Removed: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక కొత్త సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ కమర్షియల్ హంగులతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే చేశారు…అది ఈ సినిమాలో చిరంజీవి 50 సంవత్సరాలకు పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఒక పెయిన్ ఫుల్ క్యారెక్టర్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే సినిమాలో ఐటెం సాంగ్ ఉండకూడదని చిరంజీవి బాబీ నిర్ణయించుకున్నారట. మొదట ఐటెం సాంగ్ పెడదామని అనుకున్నప్పటికి సినిమా వెళుతున్న ఫ్లో కి ఐటెం సాంగ్ అడ్డంకి గా మారుతుందని అనుకున్నారట. అది చాలావరకు జనాల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని వల్లే ఆ సాంగ్ ని తీసేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఐటెం సాంగ్ ఉంటుందనుకొని ఆ తర్వాత దాన్ని తీసేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సినిమా అనేది ప్రేక్షకుడికి చాలా దగ్గరగా ఉండాలి.

అలాంటప్పుడు దానిని వాళ్ళు ఓన్ చేసుకొని సినిమాని రిపీటెడ్ గా చూసే అవకాశాలైతే ఉంటాయి. అలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం బీ,సీ సెంటర్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం కావాలనే ఐటెం సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదు. నిజానికి సినిమా చూసే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అవుతుంది.

కాబట్టి ఈ విషయాల్లో కొంతమంది సినిమా మేకర్స్ ఇప్పుడిప్పుడు కొంతవరకు జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. ఇక ఆ క్రమంలోనే చిరంజీవి బాబీ ఇద్దరు కూడా ఈ సినిమా నుంచి ఐటెం సాంగ్ తొలగించేసి ఒక మంచి పని చేశారనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ అయితే జరుపుకుంటుంది.

ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాబీ సన్నాహాలు చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందే ‘వాల్తేరు వీరయ్య ‘ అనే సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే…