Big offer for TDP: ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. రెండో పెద్ద పార్టీ కూడా. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీని కూడా టిడిపి అందించగలిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. ఇప్పటికే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టును తెలుగుదేశం పార్టీకి కేటాయించింది కేంద్రం. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. రేపు ఎన్డీఏ పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రేపు ఎన్ డి ఏ పక్ష సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు..
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు రేపు ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. నీతి ఆయోగ్ తో పాటు ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని చర్చిస్తారు. అయితే ప్రధానితో జరిగే భేటీలో చంద్రబాబుకు ఆయన గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. ఒక సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేస్తారని సమాచారం.
మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు జనసేనకు ఇద్దరు.. బిజెపికి మరో ముగ్గురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రం నుంచి. తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్రమంత్రి పదవులను కేటాయించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ కు క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి ఇచ్చి.. సహాయ మంత్రిగా మరొకరికి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ సైతం చాలా రోజులుగా ఖాళీ ఉంది. దానిని సైతం ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టిడిపికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
















బెంగళూరు విజయంపై మౌనం.. ఇన్నాళ్లకు కోహ్లీ స్పందించాడు.. వైరల్ వీడియో..
Virat Kohli reacts to Bengaluru victory: ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు 2024 వరకు దరిద్రం వైఫై లాగా ఉండేది. అనేక పర్యాయాలు ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీ ఆదుకోలేకపోయింది. ఇకపై ఎప్పటికీ ట్రోఫీ అందుకోలేదా.. బెంగళూరు జట్టుకు ఆ యోగం లేదా అని చాలామంది కామెంట్ చేసేవారు. ఇక అభిమానులైతే తీవ్రంగా కలత చెందేవారు. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది.
గత ఏడాది బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించింది. తద్వారా తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ ఏడాది కూడా బెంగళూరు అదరగొట్టింది. ప్రారంభం నుంచి విజేతగా నిలిచే వరకు సత్తా చూపించింది. ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టను వారి సొంత మైదానంలో ఓడించి సత్తా చూపించింది. తద్వారా వరుసగా రెండవసారి ట్రోఫీ అందుకొని సరికొత్త చరిత్రను లిఖించింది.
బెంగళూరు సాధించిన విజయం పట్ల ఆ జట్టు ఆటగాళ్లు రకరకాలుగా స్పందించారు. కోహ్లీ తీన్మార్ డాన్స్ వేసినప్పటికీ.. తన అసలైన ప్రతిస్పందన మాత్రం తెలియజేయలేదు. దీంతో అభిమానుల్లో ఏదో ఒక కలత ఉండేది. అనుమానం కూడా ఉండేది. అయితే వాటన్నింటిని విరాట్ కోహ్లీ పటా పంచలు చేశాడు. ఒక స్పెషల్ వీడియోతో అభిమానులను ఆకట్టుకున్నాడు..
“ఈ సీజన్ ను సానుకూల దృక్పథంతో ప్రారంభించాం.. చివరికి విజేతగా నిలిచి దానిని ముగించాం.. వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలవడం చాలా గొప్ప విషయం. బెంగళూరు దీనిని సాధించింది.. విజయాలు సాధ్యమయ్యాయి. ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టింది. అడ్డంకులు కూడా అవరోధాలు కలిగించాయి. ఇవన్నీ కూడా ఫాన్స్ సపోర్ట్ వద్దు పారిపోయాయి. అని భావోద్వేగాలను జట్టుగా కలిసి అనుభవించాం. బెంగళూరు జట్టు నాకు ఇల్లు లాంటిది.. ఈ అభిమానాన్ని మర్చిపోలేనని.. ఈ ట్రోఫీ సాధించడానికి గొప్పగా భావిస్తున్నానని” విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఏకంగా 675 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ చివరి వరకు నిలబడి సొంత జట్టును గెలిపించి.. విజేతగా నిలబడేలా చేశాడు. గత సీజన్ ఫైనల్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తనను రన్ మిషన్ అని ఎందుకంటారో.. చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. కాగా విరాట్ కోహ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.