Narendra Modi surpasses Nehru: పదవిలో నిరంతరంగా ఉండటం ఒక నాయకుడి సామర్థ్యమని కొందరు అంటారు. మరికొందరు అది ప్రజాస్వామ్యానికి విఘాతం అంటారు. నరేంద్ర మోదీ 2014లో మొదట బాధ్యతల్ని స్వీకరించినప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ జవహర్లాల్ నెహ్రూను దాటి దేశంలో ఎక్కువకాలం ఎన్నికై ప్రధాని ఉన్న రికార్డును తమ ఖాతాలో పెట్టుకోబోతున్నారు. గణాంకంగా ఇది ఒక సాధారణ విషయం కాదు. పాలనా సమర్థతపై, ప్రజాప్రతినిధ్యంపైన తీవ్రమైన చర్చలకు స్పందన. ఒకవైపు, స్థిరత్వం లభించడం నిర్దిష్ట విధానాలను కొనసాగించడానికి సౌకర్యం ఇస్తుంది.
కేంద్రం విధానాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానాలు, స్నేహపూర్వక సంక్షేమ పథకాలు, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు నిరంతర ప్రత్యేక పథకాల రూపంలో కొనసాగుతున్నాయి. ఈ పథకాలను విజయాలుగా చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించటం స్వభావికం. ముఖ్యంగా గ్రామీణ, నిర్లక్ష్యమైన వర్గాలకు చేరే ప్రభావం ఉంటే ఇదే ప్రభుత్వ వైఖరికి శక్తివంతంగా మారుస్తుంది. కానీ దీర్ఘ పాలనకు ప్రతికూలమైన పాక్షికతలను నిర్లక్ష్యం చేయరాదు. మరో ముఖ్య అంశం మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నిర్వహించిన వ్యవహారాలు, తరువాత అదే పాలసీని అన్వయించడం దేశ ప్రజలను ఆకట్టుకుంది.
నెహ్రూతో పోలిక…
జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా కొనసాగారు. మొత్తం 6,130 రోజులు పాలించారు. 1947 ఆగస్టు 15న ఆయన ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని కాదు. 1952, మే 13న జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యారు. మొత్తం 6,130 రోజులు పాలించారు. అయితే ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగు కానుంది. మోదీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి రికార్డు సృష్టించబోతున్నారు. నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా 4,398 రోజులు పాలించారు. మోదీ దానిని అధిగమించనున్నారు. 4,399 రోజులు జూన్ 10న పూర్తిచేసుకుంటారు. దీంతో నెహ్రూ రెండో స్థానానికి పడిపోతారు. మూడో స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పాలన సాగించారు.
ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం..
నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పనిచేసిన రికార్డును ఇప్పటికే సొంతం చేసుకున్నారు. సిక్కిం సీఎం పవన్కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు ప్రభుత్వాధినేతగా పనిచేయగా, మోదీ ఈ ఏడాది మార్చిలోనే దానిని అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా మోదీ పనిచేశారు.
మొత్తంగా నరేంద్రమోదీ జవహర్ లాల్ నెహ్రూ రికార్డును చెరిపేశారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. దటీజ్ మోదీ అనిపించుకున్నారు.
















అప్పుడు కెసిఆర్.. ఇప్పుడు రేవంత్.. తెలంగాణలో హిట్లర్ ఆత్మ..
Revanth Reddy Vs KCR: కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ అనే సినిమా రూపొందింది. చాలామంది ఆ టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు. చిరంజీవికి ఏమైంది.. ఇలాంటి టైటిల్ పెట్టుకున్నాడు అని అనుకున్నారు. మలయాళం లో విజయవంతమైన ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. అప్పటిదాకా వరుస పరాజయాలతో ఇబ్బందిపడిన చిరంజీవి హిట్లర్ సినిమా ద్వారా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసారు..
ఇప్పుడు హిట్లర్ గురించి ఎందుకు ప్రస్తావన.. అప్పుడప్పుడో ఆయన నియంతలాగా పరిపాలించిన దేశమే కాదనుకుంటుంది కదా.. ఆయన విగ్రహాలను కూడా నేలమట్టం చేస్తోంది కదా.. అనేకదా మీ డౌటు.. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం హిట్లర్ అవతారం ఎత్తారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. నిజమే.. ఎందుకంటే యూట్యూబ్ చూస్తుంటే నాడు కేటీఆర్ నోటి నుంచి వచ్చిన హిట్లర్ మాట ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. నాటి కాలంలో సోషల్ మీడియా అంత బలంగా లేదు కాబట్టి కెసిఆర్ హిట్లర్ అనే మాట మాట్లాడినప్పటికీ జనం పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.
పైగా అక్రమ నిర్మాణాల విషయంలో కెసిఆర్ తాను హిట్లర్ అవుతానని.. వాటిని పడగొడతానని శపథం చేశారు. ఎన్ని అక్రమ నిర్మాణాలు పడగొట్టారో తెలియదు.. ఎంతమంది అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారో తెలియదు.. కానీ కొంతమంది దర్జాగా అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్నారు. వాటి మీదికి బుల్డోజర్లు రాకుండా అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కెసిఆర్ పడగొట్టకుండా వదిలేసిన అక్రమాలు చాలానే ఉంటాయి.
నాడు తనకు తాను హిట్లర్ అనుకొని.. హిట్లర్ మాదిరిగా కెసిఆర్ మాట్లాడి.. మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించారు. అయితే ఇప్పటి కాలంలో నాడు కేసీఆర్ హిట్లర్ మాటలను జనం పెద్దగా గుర్తుంచుకోనట్టు కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే రేవంత్ ది హిందూ పత్రిక నిర్వహించిన ముఖాముఖిలో తనను తాను హిట్లర్ అని చెప్పుకున్నారో.. అక్కడే గులాబీ పార్టీ పట్టేసుకుంది.
కెసిఆర్ గతంలో హిట్లర్ అనే మాట మాట్లాడనట్టు.. తనను తాను హిట్లర్ అని చెప్పుకున్నట్టు కవరింగ్ ఇచ్చింది గులాబీ మీడియా. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలస్యంగా మేల్కొన్నారు. నాడు కేసీఆర్ మాట్లాడిన హిట్లర్ మాటలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రికి.. ఇప్పటి ముఖ్యమంత్రికి ఏమైంది అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. నిజానికి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతాను.. ఆక్రమణలను సహించను.. దుర్మార్గులను తొక్కిపడేస్తాను అనే మాటలు మాట్లాడితే ప్రజల నుంచి విజిల్స్ పడతాయి. వారు ఆ స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ ఎలివేషన్లు ఉంటాయి కాబట్టి జనం ఆ భ్రమలో బతికేస్తూ ఉంటారు. కానీ వాటిని వదిలేసి.. హిట్లర్ చుట్టూ అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి ముఖ్యమంత్రి తిరగడమే ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి హిట్లర్ అనే వ్యక్తిని ఈ ప్రపంచం ఒక నియంత లాగే చూసింది. అతడు ఒక కరుడుగట్టిన వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతీకగానే భావించింది. ఒక దుర్మార్గుడిలాగా ఇప్పటికీ ఈ ప్రపంచం చూస్తోంది. అతడు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. అతని గురించి ఇప్పటికి నెగిటివ్ చర్చ జరుగుతుందంటే.. సృష్టించిన విధ్వంసం అలాంటిది. ఈ విషయాన్ని మర్చిపోయి నాడు కెసిఆర్.. ఇప్పుడు రేవంత్ హిట్లర్ నామస్మరణ చేయడం నిజంగా అవివేకం. అత్యంత హాస్యాస్పదం.
సమాజాన్ని బాగు చేయాలంటే.. పౌరులకు మెరుగైన జీవితాన్ని అందించాలంటే.. అక్రమాలను.. ఆక్రమణలను తొక్కి పెట్టాలంటే కచ్చితంగా హిట్లర్ గానే మారాలా .. హిట్లర్ చేసింది ఇలాంటి పనులు కాదు కదా.. హిట్లర్ మొత్తం వ్యక్తులను తొక్కేశాడు కదా.. తనకు నచ్చని వారిని చంపేశాడు కదా.. ప్రపంచంలో ఘోరమైన యుద్ధం రావడానికి కారణమయ్యాడు కదా.. అటువంటి వ్యక్తిని స్మరించడం.. అతడిలాగా ఉంటానని చెప్పడం నిజంగా ఫాసిజం లక్షణాలు. సాటి మనుషులను ఇబ్బంది పెట్టాలనుకోవడం.. మూర్ఖత్వ గుణానికి. బలమైన నిదర్శనం.
ఇప్పటికైనా హిట్లర్ మాటలు కట్టిపెట్టి.. చేయాల్సిన పనులు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా హిట్లర్ అనే మాటలు మాట్లాడితే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడిన కేసీఆర్ కు ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి చూశాడు. అటువంటి గతి తనకు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది.