Home Blog Page 161

పాకిస్తాన్ ముర్దాబాద్.. ప్రజల్లో ఎందుకు ఈ వ్యతిరేకత.. పిఓకే లో ఏం జరుగుతోంది..

PoK Protests
PoK Protests

PoK Protests: మామూలు హింస కాదు అది.. ఇంటర్నెట్ లేదు. సోషల్ మీడియా లేదు. బయటికి ప్రపంచంతో సంబంధం లేదు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతంలో దిగింది. ప్రజలను బయటికి రాకుండా అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆగడం లేదు. బయటికి వస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. తుపాకీ బుల్లెట్లు శరీరాన్ని దూసుకొని వెళ్తున్నప్పటికీ లెక్కచడం లేదు. పైగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది.. ఎందువల్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఈ స్థాయిలో వ్యక్తమవుతోంది..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాదాపు 45 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 12 సీట్లను పాకిస్తాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఈ స్థానాలను పాకిస్థాన్లో స్థిరపడ్డ కాశ్మీరీ శరణార్థులకు కేటాయించాలని 1947 లోనే తీర్మానం చేశారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ దీనికి చరమగీతం పాడింది. ఈ స్థానాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి రావలపిండి, ఇస్లామాబాద్, కరాచీ ఇతర నగరాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే అక్కడవారిని పాకిస్తాన్ రాజకీయ పార్టీలు ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి.

దీనివల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఆధిపత్యం పెరిగిపోయింది. 12 స్థానాలలో తనకు నచ్చిన వారిని నియమించుకోవడం మొదలుపెట్టింది. ప్రజాస్వామ్యం అనే విధానానికి చరమగీతం పాడింది. ఫలితంగా ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు చాలామంది చనిపోయారు. అయినప్పటికీ భారతదేశంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి విలువైన వనరులు ఇతర ప్రాంతాలకు తరలించకూడదని స్పష్టం చేస్తున్నారు. మా ప్రాంతం.. మా వనరులు.. మాకు మాత్రమే సొంతం అన్నట్టుగా ఇక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారి మీద ఉక్కు పాదం మోపుతోంది… మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జాయింట్ అవామి యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతోంది.

ఈ ఆందోళనలు తీవ్రహింసాత్మకంగా మారిపోయాయి. పాకిస్తాన్ ఆర్మీ, ప్రజల మధ్య జరిగిన గొడవల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పిల్లలు, గర్భిణీలు కూడా ఉన్నారు. వారిపై పాకిస్థాన్ ఆర్మీ దారుణంగా కాల్పులు జరుపుతోంది. ఫైరింగ్ లో 19 చిన్నారులు.. ఏడుగురు గర్భిణులు చనిపోయారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ మారణకాండ పై విచారణకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ డిమాండ్ చేసింది.

చాటు పని కోసం మాటుగా.. చీకట్లో చితక్కొట్టుడుకు ఇంత ముఖం వాచి ఉన్నారా..

Dating App Fraud
Dating App Fraud

Secret Dating Apps: అసలు ఆ పని ఒక చండాలం. అత్యంత దారుణం.. పరమ నీచాతి నీచం. అటువంటి దానికోసం భారతీయులు ముఖం వాచిపోయి ఉన్నారు. అందువల్లే దిగజారి పోతున్నారు. కనీసం విలువలకు మంగళం పాడేస్తున్నారు. వలువలు ఎప్పుడు ఇప్పుదామంటూ కుతూహలంగా ఉన్నారు.

మన దేశంలో ఇటీవల కాలంలో సీక్రెట్ డేటింగ్ ట్రెండ్ అనేది పెరిగిపోయింది. ఇది ఎంతలా ఉందంటే రోజురోజుకు ఈ తరహా యాప్స్ లో చాలామంది ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య దాదాపు 6 కోట్ల ఒక లక్ష వరకు చేరుకుంది. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆ యాప్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో దందా సాగిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉంటే.. గత ఏడాది 1.6 కోట్లమంది చేరడం ఆందోళన కలిగిస్తోంది.

ఇందులో చేరిన వారిలో బ్యాచిలర్లు ఎక్కువగా ఉంటున్నారు. అదే సమయంలో పెళ్లయిన వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. వివాహితులు కూడా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో చేరిన వారు ఎక్కువగా వివాహేతర సంబంధాల వైపు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూజర్ల బలహీనతను యాప్ నిర్వాహకులు కూడా క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీటి ఆధారంగా కోట్ల వ్యాపారం జరుగుతోంది.

కొన్ని యాప్స్ నిర్వాహకులు ఏకంగా ప్రీమియం అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. నచ్చిన అబ్బాయిని లేదా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం.. ఆ తర్వాత ఓయో రూములలో ఎంజాయ్ చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఈ తరహా యాప్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. మొదట్లో లక్షల కు మాత్రమే పరిమితమైన వీటి వ్యాపారం.. ఇప్పుడు కోట్లకు చేరుకుంది. ఈ తరహా యాప్స్ చాలావరకు మసాజ్ సెంటర్లు.. స్పా సెంటర్లతో లింక్ అయి ఉన్నాయని తెలుస్తోంది. దీనిని బట్టి చీకటి వ్యాపారానికి వెలుతురు కోణం ఇచ్చినట్టు అర్థమవుతుంది.

ఈ తరహా యాప్స్ ద్వారా వ్యవహారాలు సాగించడం ప్రమాదకరమని.. ఆ తర్వాత అనేక రకాల కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇటువంటి బంధాలకు దూరంగా ఉండాలని.. ఇటువంటి యాప్స్ వాడకూడదని అంటున్నారు. అయితే వీటిపై కూడా నిషేధం విధిస్తే చాలా వరకు యువత దారి తప్పకుండ ఉండాలని నిపుణులు అంటున్నారు.

మారిన 'తల్లికి వందనం' ముహూర్తం.. ఎప్పుడు పడుతాయంటే..

Talliki Vandanam
Talliki Vandanam

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్ వచ్చింది. పథకం అమలు తేదీ పై ఒక క్లారిటీ వస్తోంది. అదే రోజున తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఒక్కో నిర్ణయం తీసుకుంటోంది. ఈనెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజుల విరామం తర్వాత పాఠశాలలు తెరవనున్నాయి. అయితే ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన రోజు తల్లికి వందనం నిధులు జమ అవుతాయని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కిట్ల పంపిణీకి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పాఠశాలలు మాత్రం యధావిధిగా ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి.

* ఎప్పటి నుంచో కసరత్తు…
తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటినుంచో కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. సచివాలయాల వారీగా సర్వే కూడా చేసింది. విద్యాశాఖకు వచ్చిన వివరాలను సచివాలయాల వారీగా సరిపోల్చుతూ ఈ సర్వే కొనసాగింది. హౌస్ మ్యాపింగ్ తో పాటు ఇతరత్రా వివరాలను అందులో సరిపోల్చారు. ఈ ప్రక్రియ జాప్యం జరగడంతో ఈ నెల 19న తల్లికి వందనం నిధులు జమ చేస్తారని అంతా భావించారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అదే రోజు నిధులు జమకు ఆలోచన జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా నిధుల జమ జూలై మొదటి వారంలో చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఈ పథకం అమలు చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం వచ్చే నెల మొదటి వారంలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* పెరిగిన లబ్ధిదారులు..
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా… ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఎంత మంది చదువుకుంటే అంత మందికి ఈ పథకం అమలు చేస్తున్నారు. గత ఏడాది మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే ఈ ఏడాది కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నిధులు వేరువేరుగా అందజేయనుంది. ఈ పథకానికి గాను సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రకారం ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా సెలవులు పొడిగిస్తారు అన్న ప్రచారం సాగింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా విజ్ఞప్తి చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12నే బడులు తెరవాలని ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు యుద్ధం కారణంగా విద్యార్థి మిత్ర కిట్ల తయారీలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పంపిణీ పై పడింది.

పాక్, చైనా వెన్నులో వణుకు.. మోడీ చేసిన అద్భుతమిదీ

Zojila Tunnel
Zojila Tunnel

Zojila Tunnel: ఇది మోడీ చేసిన అద్భుతం. మంచుకొండల్లో మానవ మహా నిర్మితం. ఇంతవరకు ఏ పాలకులు ఆలోచించలేదు. కనీసం అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. నరేంద్ర మోడీ ఇదంతా గుర్తించి.. మంచుకొండల్లో సరికొత్త చరిత్రను సృష్టించారు. కొండలను తొలచి సరికొత్త సొరంగం నిర్మించారు. ఇది కాస్త చైనాలో.. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ నరేంద్ర మోడీ చేసిన ఆ అద్భుతం ఏంటంటే..

శ్రీనగర్ నుంచి లద్ధాక్ వరకు దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 1 నిర్మించారు. ఇక్కడ శ్రీనగర్ నుంచి లద్ధాక్ వరకు ప్రయాణం సాగించాలంటే 13 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ వెళ్లాలి. అత్యంత శీతల వాతావరణం లో ప్రయాణం సాగించాలి. సుమారు 12 నుంచి 14 వరకు ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. శీతకాలంలో అయితే ఆరు నెలల పాటు ఈ రోడ్డు మూసి ఉంటుంది.

ముఖ్యంగా సోనా మార్గ్ ప్రాంతంలోని బాల్తాల్ నుంచి కార్గిల్ జిల్లా మీనా మార్గ్.. మధ్యలో కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. కానీ మంచు వల్ల ఈ ప్రయాణానికి నాలుగు గంటల వరకు పడుతుంది. ఏడాదిలో సగం రోజుల వరకు ఈ రోడ్డు మూతపడుతుంది. దీనికి ప్రధాన కారణం మంచు. దీనివల్ల పాకిస్తాన్, చైనాతో కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. యుద్ధాలు.. భారత సైన్యం సక్రమంగా వ్యవహారాలు సాగించడానికి వీలు లేకుండా పోవడం వల్ల అనేక రకాల కార్యకలాపాలు ఆగిపోతుంటాయి.

ఈ పరిస్థితిని గమనించిన నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో ఒక సొరంగాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా 6, 808 కోట్ల రూపాయల కేటాయించారు. సుమారు 13.15 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించారు. దీనికి జోజిలా పాస్ అని నామకరణ చేశారు. ఇది కార్గిల్, జోజిలా, ద్రాస్ ప్రాంతాలకు ఏడాది పాటు రాకపోకలు సాగేలా చేస్తుంది. 2020 అక్టోబర్ 1న ఫస్ట్ స్టేజి పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా ఇందులో అంతర్గతంగా రోడ్లు నిర్మించాలి. సైడ్ డ్రైనేజీలు నిర్మించాలి. నిఘా కెెమెరాలు.. మరో ఏడాదిలో ఈ పూర్తవుతాయి.

బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్, కార్గిల్ ప్రాంతంలో మీనా మార్గం తూర్పు పోర్టల్ వరకు ఈ టన్నెల్ విస్తరించి ఉంది.. ఈ ప్రాంతాలతో పాటు శ్రీనగర్, లద్ధాక్ ప్రాంతాలకు ఏడాదిపాటు ప్రయాణం సాగించవచ్చు. సముద్రమట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు.. ఇది ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన బై డైరెక్షనల్ సొరంగం. ఇది గనుక అందుబాటులోకి వస్తే బాల్తాల్ నుంచి మీనా మార్క్ ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం అయితే నాలుగు గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో డిఫెన్స్ ఆపరేషన్లు చేపట్టడానికి భారత సైన్యానికి ఈ మార్గం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

15 ఏళ్ల కొడుకు మొబైల్ కు బానిసయ్యాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. తర్వాత ఏమైందంటే..

Mobile Addiction In Teenagers
Mobile Addiction In Teenagers

Mobile Addiction In Teenagers: నేటి కాలంలో చరవాణి అనేది వ్యసనం లాగా మారిపోయింది. మొబైల్ లేకుండా పూట కూడా గడిచే పరిస్థితి లేకుండా పోయింది. రాత్రి కూడా మొబైల్ పక్కన పెట్టుకొని పడుకునే వాళ్ళు చాలామంది. అర్ధరాత్రి దాకా మొబైల్ చూస్తూ.. ఎప్పుడో తెల్లవారుజామున కునుకు తీసేవారు చాలామంది ఉన్నారు. మొబైల్ వ్యసనాన్ని తట్టుకోలేక.. మొబైల్ వాడకాన్ని మానుకోలేక చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు.

మొబైల్ ద్వారా మాటలు మాత్రమే కాదు ప్రతి ఒక్క పని జరుగుతున్న నేపథ్యంలో చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ల వరకు మొబైల్ లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. పక్క వాళ్ళతో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఎదుటివాళ్ళు కనపడినా సరే పలకరించడం లేదు. మొబైల్ లోనే చూస్తూ.. మొబైలే లోకంగా వివరిస్తూ బతికిస్తున్నారు. స్క్రీన్ టైమ్ పెరిగిపోయి చాలామంది దృష్టిలోపాలతో బాధపడుతున్నారు. ఫలితంగా నేత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యాధులకు గురయ్యేవారు పెరిగిపోతున్నారు.

ముఖ్యంగా పిల్లలకు ఫోన్ అనేది వ్యసనంగా మారిపోయింది. కోవిడ్ లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు కొనియాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఫోన్లే లోకంగా పిల్లలు బతికేస్తున్నారు. సోషల్ మీడియా చూడటం.. ఇంకా ఇతర వ్యవహారాలకు పాల్పడటంతో పిల్లలు ఫోన్లకు బానిసలు అయిపోయారు. కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం లేదు. ఫోన్ లోనే విహరిస్తూ.. అదే లోకంగా విహరిస్తున్నారు. రాత్రి మొత్తం మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. సోషల్ మీడియా చూస్తున్నారు. పగటి సమయంలో నిద్ర పోతున్నారు. పిల్లలు ఏకాంతంగా గడపడం.. ఎవరితోనూ మాట్లాడకపోవడం వల్ల వారిలో భావోద్వేగాలు నియంత్రించుకోలేని స్థాయికి దిగజారి పోతున్నాయి.

రాత్రి మొత్తం మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడటం.. సోషల్ మీడియా చూడటం.. పగలు మొత్తం నిద్రపోవడం.. ఇవి అలవాటుగా మార్చుకున్నాడు ఒక 15 సంవత్సరాల బాలుడు. ఇది తప్పని తల్లిదండ్రులు చెబితే.. వారిని దూషిస్తున్నాడు. చివరికి దాడి చేసే స్థాయికి అతడి మొబైల్ వ్యసనం దిగజారిపోయింది. ఈ సంఘటన ఏలూరులో జరిగింది. తట్టుకోలేక తల్లిదండ్రులు భయపడ్డారు. తల్లి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ముందుగా అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డి అడిక్షన్ సెంటర్లో చేర్పించారు.

సూర్యతో ముంబై ఇండియన్స్ చర్చలు.. ఎగ్జిట్ వేళ కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్‌ సూర్యకుమరా యాదవ్‌పై సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే బీసీసీఐ ఆయనను కెప్టెన్సీతోపాటు జట్టు నుంచి కూడా తప్పించింది. ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ ఆటతీరుపై అసంతృప్తి, ముంబై ఇండియన్స్‌ జట్టును నడిపించడంలోనూ విఫలమైన తీరు ఆధారంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌(ఎస్‌కేవై) భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే క్రమంలో స్కై ముంబై జట్టు నుంచి కూడా తప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్, సూర్కకుమార్‌ యదావ్‌ మధ్య జరిగిన 3 గంటల సుదీర్ఘ సమావేశం ఐపీఎల్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ముంబై జట్టును అన్‌ఫాలో..
కొన్ని రోజులుగా సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఐ సంబంధిత పోస్టులు తీసివేయడం, ఫ్రాంచైజీని అన్‌ఫాలో చేయడం వంటి చర్యలతో ట్రాన్స్‌ఫర్, ఎగ్జిట్‌ రూమర్లు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ 3 గంటల మీటింగ్‌లో ఫ్రాంచైజీ యాజమాన్యం సూర్యను ఒప్పించడంలో విజయం సాధించింది.

మీటింగ్‌లో చర్చింని అంశాలు..
సమావేశంలో ముఖ్యంగా మూడు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సూర్యకుమార్‌ దీర్ఘకాలిక రోల్, రాబోయే సీజన్లలో అతనికి ఏ స్థానం ఇవ్వాలి? జట్టు లీడర్‌షిప్‌ గ్రూప్‌లో అతని భవిష్యత్‌ పాత్ర
ఫ్రాంచైజీ భవిష్యత్‌ ప్రణాళికలు, ఐపీఎల్‌ 2027 – ఐ్కఔ 2027 మెగా ఆక్షన్‌ ముందు జట్టు వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఫ్రాంచైజీ యాజమాన్యం సూర్యకు స్పష్టమైన హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక సీజన్‌ కాంట్రాక్టు కంటే మించి, దీర్ఘకాలిక అనుబంధానికి సంకేతాలు ఇచ్చింది.

రూమర్లకు కారణం ఏంటి?
ఈ సంవత్సరం ఐపీఎల్‌ 2026లో సూర్య ఆటతీరు అందరినీ నిరాశపర్చింది. ఫ్యాన్స్, విశ్లేషకుల్లో అనుమానాలు రేకెత్తించింది. అంతేకాకుండా ఇటీవల భారత టీ20 కెప్టెన్‌ పదవి కోల్పోవడం
జాతీయ జట్టు నుంచి డ్రాప్‌ కావడం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఐ సంబంధిత కంటెంట్‌ తొలగించడం పుకార్లకు కారణమైంది. సూర్య ఎంఐని వదిలేస్తాడు అనే రూమర్లకు బలం చేకూర్చాయి. కొన్ని మీడియా రిపోర్టులు కూడా అతనిని కేకేఆర్, పంజాబ్‌ లాంటి జట్లతో లింక్‌ చేశాయి.

ఎంఐకి కీలక ఆటగాడు..
సూర్య 2018 నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. 360 డిగ్రీ బ్యాటింగ్‌ స్టైల్‌తో ప్రపంచ గుర్తింపు సాధించాడు టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. మిడిల్‌ ఓవర్లలో అత్యంత ప్రముఖ ఫినిషర్‌లలో ఒకరు. జట్టుకు కేవలం బ్యాటింగ్‌ బలం మాత్రమే కాదు యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడు, ఫీల్డింగ్‌ స్టాండర్డ్‌ను ఎత్తైన స్థాయిలో ఉంచేవాడు. అందుకే తాజా సమావేశం ఫలితంగా సూర్య ముంబైతోనే కొనసాగడం ఫ్రాంచైజీకి పెద్ద ఊరట.

3 గంటల మీటింగ్‌ కేవలం ఒక ఆటగాడిని నిలుపుకోవడం కాదు … ఇది ముంబై ఇండియన్స్‌ భవిష్యత్‌ను స్థిరపరచే కీలక నిర్ణయం. సూర్యకుమార్‌ యాదవ్‌ నీలం–గోల్డ్‌ జెర్సీలోనే తన మ్యాజిక్‌ చూపించడం క్రికెట్‌ ప్రేమికులందరికీ సంతోషకరమైన వార్త. ఇక రూమర్లు ముగిసాయి. ఇకపై ఆట మాత్రమే మాట్లాడాల్సిన సమయం ఇది!

తాగుడు, వాగుడు.. క్రికెటర్ ను తన్ని తరిమేస్తారని తెలిసి రిటైర్మెంట్ ప్రకటించాడు

Ben Stokes Retirement
Ben Stokes Retirement

Ben Stokes Retirement: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఇందులో ఆడే ఆటగాళ్లు జెంటిల్మెన్ మాదిరిగానే ఉండాలి. చిల్లర విహారాలు వేస్తే ఆటకున్న విలువ పోతుంది. అటువంటి ఆటగాళ్లు ఉండకూడదు. క్రికెట్ ఆడకూడదు. ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్లోకి చాలామంది ఆటగాళ్లు వచ్చారు… ఆ ఆటకు విలువ తీసుకొచ్చారు. కానీ కొంతమంది మాత్రం దారుణంగా ప్రవర్తించారు. వీధి రౌడీల కంటే హీనంగా వ్యవహరించారు. అటువంటివారు కెరియర్ మధ్యలోనే వెళ్లిపోయారు. కొందరైతే అనామకంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేసారు. అందులో ఇతడికి మొదటి స్థానం ఉంటుందేమో.

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో. అటువంటి ఇంగ్లాండు జట్టుకు చెందిన బెన్ స్టోక్స్ దాదాపు రిటైర్మెంట్ ప్రకటించినట్టే. ఇంగ్లాండ్ జట్టు సారధిగా ఇతడు ఎన్నో వివాదాలకు కారణమయ్యాడు. తాగడం.. వాగడం వంటివి ఇతడికి పరిపాటి. క్లబ్లో దూరడం.. పనికిమాలిన పనులు చేయడం.. గొడవలకు దిగడం వంటివి ఇతడికి అలవాటు. అనేక సందర్భాలలో ఇతడు అలా చేసినప్పటికీ మేనేజ్మెంట్ మాటలతోనే సరిపుచ్చింది. ఇప్పుడు ఆ మాటలు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఇతడికి తాగడం అలవాటుగా మారింది. తాగిన మైకంలో గొడవలకు దిగడం పరిపాటిగా మారింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ పరువు పోతోంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఇతడిని తన్ని తరిమియడానికి సిద్ధమైంది. కాకపోతే ఆ అవకాశం ఇవ్వకుండా ఇతడే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఒక క్లబ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ విపరీతంగా తాగాడు. తాగిన మైకంలో గొడవకు దిగాడు. ఇది వెస్ట్రన్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. ఇది ఒక రకంగా ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ తల వంపులకు కారణమైంది. అందువల్లే స్టోక్స్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడు వన్డే ఫార్మాట్.. టి 20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆడింది. అంత గొప్పగా ప్రదర్శన చేయలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఒక మ్యాచ్లో గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఒక క్లబ్ లోకి వెళ్ళింది. అక్కడ స్టోక్స్ పీకల దాకా మద్యం తాగి రచ్చ రచ్చ చేశాడు. ఈ వ్యవహారం మొత్తం మీడియాలో ప్రసారమైంది. అప్పుడే ఇతడి మీద ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ వేటు వేస్తుందని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ.. మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే విషయంలో వెనుకడుగు వేసింది. దానిని ఆసరాగా తీసుకున్న స్టోక్స్ మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చివరికి మేనేజ్మెంట్ కన్నెర్ర చేయడంతో రిటైర్మెంట్ తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీరులో అంతర్యుద్ధ పరిస్థితులు

PoK protests

PoK protests : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడికి పోతోంది. అంత్యరుద్ధం రీతీలో అక్కడి పరిస్థితులు అదుపుతప్పాయి. ఏదైతే కశ్మీరీలు మేము మతం పరంగా పాక్ లో చేరాలని చూశారా వాళ్లకు ఇది పెద్ద గుణపాఠం.. నిన్న ముజఫరాబాద్ లో ఆస్పత్రి దగ్గర నిరసనలు చేపట్టిన ఒక వ్యక్తిని చంపేస్తే
ఆయన అంతిమ యాత్ర జరిగే సమయంలో మళ్లీ సైన్యం జోక్యం చేసుకొని మరో 30 మంది ని చంపేశారని సమాచారం. పోలీసులు, సెక్యూరిటీ వాళ్లు ఏడుగురిని నిరసనకారులు చంపేశారట.. చనిపోయిన వారు , 450 మందిని నిర్బంధించారని సమాచారం.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ లో సపరేట్ ప్రభుత్వం ఉంటుంది. ముజఫరా ఒప్పందాన్ని అమలు చేయాలని జాక్ అనే కమిటీ నిరసనకారులు కోరుతున్నారు. 2025న చేసుకున్న ఒప్పందంలో కరెంట్ చార్జీలు తగ్గించాలి. మొత్తం పాకిస్తాన్ కు కరెంట్ మేమే సరఫరా చేస్తున్నా మాకు కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సబ్సిడీ ధరకు గోధుమలు ఇవ్వాలి. మా దగ్గర నుంచే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నుంచి కరెంట్ పోతున్నది మాకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

పీఓకే అసెంబ్లీలో మొత్తం 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇందులో ఒక విచిత్రమైన, వివాదాస్పదమైన నిబంధన ఉంది. మొత్తం స్థానాల్లో 12 సీట్లను 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ శరణార్థులు పీఓకేలో కాకుండా పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. వారు తాము నివసిస్తున్న నగరాల నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటూ పీఓకే అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఇదే ఇప్పుడు స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మొత్తం ఇవీ పీవోకేను అగ్నిగుండంగా మరిచి నిరసనలకు కారణమైంది.

పాక్ ఆక్రమిత కాశ్మీరులో అంతర్యుద్ధ పరిస్థితులు.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఏపీలో పతనం అంచున వామపక్షాల రాజకీయం!

Andhra Pradesh Left Politics
Andhra Pradesh Left Politics

Andhra Pradesh Left Politics: తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం కాస్తా పక్కదారి పట్టినట్టు కనిపిస్తోంది. మొన్నటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కూడా ఇది స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో వామపక్షాల నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. రాజకీయ ప్రేరేపితం అన్నట్టు వారి ప్రవర్తన ఉంది. కూటమి వచ్చిన తర్వాత వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలకు కొంత స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవం. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం నోరు తెరవ లేకపోయారు వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు. అంతలా ఉక్కు పాదం మోపారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఇస్తే.. మరోలా మాట్లాడుతున్నారు. లేనిపోని వివాదాలు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను ఎంతలా చూశారో అందరికీ తెలిసిన విషయమే.. ఇప్పుడు వారిద్దరి పార్టీలకు మైలేజ్ వచ్చేందుకు ఇదే వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రయత్నిస్తుండటం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

* సమస్యల పరిష్కార వారధి..
వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు అంటే ముందుగా గుర్తొచ్చేది సమస్యల పరిష్కారం. కార్మికులతో పాటు ఉద్యోగులు వామపక్షాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే వారు పోరాటం చేస్తే ఏదో ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందన్న ఆశ. అయితే ఇప్పుడు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ ప్రేరేపితం అనే చట్రంలో చిక్కుకుంటున్నాయి. లేనిపోని వివాదాలకు అవకాశం కల్పిస్తున్నాయి. సమస్యలకు పరిష్కారం మరిచి.. మరింత జఠిలం చేస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి.. బాధితుల పరామర్శకు వెళ్లిన.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్ పై నిలదీసినంత పని చేశారు. ఆయన సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. చనిపోయింది మీ కుటుంబాలు వారు కాదు కదా? బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ.. విరుచుకు పడే దాకా పరిస్థితి వచ్చింది.

* వైసీపీకి సహకారం..
ఇప్పుడు అనవసరంగా విశాఖకు చెందిన వామపక్షాల నేతలు ట్రోల్ అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. నాడు జగన్ సర్కార్ నోరు తెరవలేదు. కనీసం ప్రైవేటీకరణను నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బిజెపితో టిడిపి, జనసేనకు పొత్తు కుదిరిందో.. నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం యూటర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ ఆగింది. 13 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ సమకూరింది. వైసీపీ హయాంలో కొందరు వామపక్షాల నేతలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు వైసీపీ నేతలతో. కానీ ఇప్పుడు మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ఉక్కు శాఖ పర్యవేక్షిస్తుంది. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ ట్రాప్ లో పడి వామపక్షాల నేతలు సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి… తామే సమస్యలను సృష్టిస్తున్నారు. వారికి ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంటున్నారు

ఏపీలో మరో వారసురాలు.. పక్కా పొలిటికల్ ప్లాన్!

Vangaveeti Asha Kiran Political Entry
Vangaveeti Asha Kiran Political Entry

Vangaveeti Asha Kiran Political Entry: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యాలయం తో పాటు రాజకీయ అరంగేట్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపైనే పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి మోహన్ రంగా కుమార్తె. గత కొద్దిరోజులుగా రంగా రాధా మిత్రమండలి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆశాకిరణ్. గతంలో ఆ మిత్రమండలి యాక్టివ్ గా పని చేసేది. తదనంతర పరిణామాలతో ఆ యాక్టివ్ తగ్గింది. ఈ క్రమంలో ఆశా కిరణ్ మిత్రమండలి బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ప్రచారం నడిచింది. అయితే అన్నీ తెలియజేసి రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు విజయవాడలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభం తో పాటు పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

* ప్రత్యేక స్థానం..
తెలుగు రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మోహన్ రంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి విజయవాడలో అండగా నిలిచేవారు మోహన్ రంగా. ఈ క్రమంలోనే 1983 లో కాంగ్రెస్ తరపున విజయవాడ తూర్పు నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. 1988లో ఓ దీక్ష శిబిరంలో ఉండగా దారుణ హత్యకు గురయ్యారు. అటు తరువాత ఆయన భార్య రెండుసార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రంగా కుమారుడు రాధా. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నడుమ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ పదవి కానీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

* సెంట్రల్ నియోజకవర్గం పై ఫోకస్..
రంగా -రాధా మిత్రమండలి బలోపేతానికి రంగంలోకి దిగిన కుమార్తె ఆశాకిరణ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన సైతం టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడ గాంధీ నగర్ లో కార్యాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. అయితే ఇప్పటివరకు వంగవీటి కుటుంబం తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తూ వచ్చింది. కానీ ఆశా కిరణ్ అందుకు విరుద్ధంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోదరుడు టిడిపిలో ఉన్నారు. మరోవైపు ఆశాకిరణ్ జనసేన నుంచి కానీ.. వైసీపీ తరఫున నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.

మృణాల్ అందాలు చూడతరమా?

Mrunal Thakur photos
Mrunal Thakur photos

పాకిస్తాన్‌కు వణుకు పుట్టిస్తున్న రుద్రం–2.. రాడార్‌లను వేటాడే సరికొత్త అస్త్రం!

Rudram 2 Missile
Rudram 2 Missile

Rudram 2 Missile: భారత్‌ రక్షణ శాఖ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రుద్రం–2 యాంటీ–రేడియేషన్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్‌ శత్రువు రాడార్‌లు, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను గుర్తించి ధ్వంసం చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది.

రుద్రం–2 సామర్థ్యాలు ఇవీ…
రుద్రం–2 ప్రధానంగా శత్రువు రాడార్లు వెలువరించే రేడియేషన్‌ సిగ్నల్స్‌ను గుర్తించి, వాటిని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగిన అధునాతన మిస్సైల్‌. ఇది 300 నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పిన్‌పాయింట్‌ ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. గంటకు సుమారు 7,000 కిలోమీటర్ల వేగంతో (మాక్‌ 5.5) ప్రయాణించే ఈ మిస్సైల్‌ శత్రువుకు తక్కువ సమయంలోనే తీవ్ర నష్టం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది కేవలం రాడార్లను మాత్రమే కాకుండా, సమగ్ర ఎయిర్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లు, సర్ఫేస్‌–టు–ఎయిర్‌ మిస్సైల్‌ బ్యాటరీలు, కమాండ్‌ సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది.

పాకిస్తాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌కు సవాల్‌..
పాకిస్తాన్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను రాడార్లు, సామ్‌ మిస్సైళ్లు, ఫైటర్‌ జెట్లపై ఆధారపడి నిర్మించింది. రుద్రం–2 వంటి మిస్సైల్‌ ఈ రాడార్‌ నెట్‌వర్క్‌ను మొదట ధ్వంసం చేస్తే, శత్రువు సమగ్ర ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. రాడార్లు లేకపోతే ఫైటర్‌ జెట్లు సమర్థవంతంగా పని చేయలేవు. ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైళ్లు కూడా లక్ష్యం గుర్తించడంలో విఫలమవుతాయి. ఈ కారణంగానే రుద్రం–2ను బ్యాటిల్‌ ఫీల్డ్‌ షేపర్‌ (యుద్ధభూమిని తీర్మానించేది) అని పిలుస్తున్నారు. ఇది శత్రువు ఆకాశ ప్రాధాన్యతను కూడా దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉంది.

మూడు ప్రయోజనాలు..
రుద్రం–2 విజయవంతమైన పరీక్ష భారత్‌కు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది సీ సామర్థ్యం పెరగడం. మిషన్లలో భారత్‌ ఇప్పుడు స్వయంప్రతిపత్తి సాధించింది. శత్రువు రక్షణ వ్యవస్థలను దూరం నుంచే నాశనం చేయడం ద్వారా భారత్‌ వైమానిక దళం యొక్క ఫైటర్‌ జెట్లు సురక్షితంగా ఆపరేట్‌ చేయవచ్చు.

పాకిస్తాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి..
పాకిస్తాన్‌ రాడార్‌ నెట్‌వర్క్‌ ఎప్పుడు ధ్వంసమవుతుందో అనే భయం శత్రువు సైనికుల్లో వణుకు పుట్టిస్తుంది. ఇది దేశీయ సాంకేతికతపై ఆధారపడిన అధునాతన ఆయుధం కావడం విశేషం.

రుద్రం–2 విజయం భారత్‌ ఆక్రమణాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. యుద్ధ సమయంలో శత్రువు ఎయిర్‌ డిఫెన్స్‌ను తట్టుకోవడం ఇక ముందు చాలా కష్టమవుతుందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక మిస్సైల్‌ పరీక్ష కాదు భారత్‌ యుద్ధ వ్యూహాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

తుర్కియే తిక్క కుదిరింది భారత్ వ్యూహాత్మక షాక్ తో కాళ్ల బేరం

India Turkey Relations
India Turkey Relations

India Turkey relations: తుర్కియే దీర్ఘకాలంగా భారత్‌ వ్యతిరేక ధోరణి అవలంబించడం, పాకిస్తాన్‌కు బలమైన మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌ను చికాకు పెడుతోంది. కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు పక్షపాతం చూపడం, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం వంటి చర్యలు ఇందులో భాగం. అయినా భారత్‌ మాత్రం తుర్కియేలో భూకంపం సమయంలో మొదటి స్పందన చూపి సహాయం అందించింది. కానీ ఆ సహాయం కూడా తుర్కియే వైఖరిని మార్చలేకపోయింది.

భారత్‌ కౌంటర్‌ వ్యూహం…
ఈ నేపథ్యంలో భారత్‌ తన వ్యూహాత్మక స్పందనను మొదలుపెట్టింది. తుర్కియేకు ఉత్తరం వైపు ఉన్న ఆర్మేనియా, పశ్చిమం వైపు గ్రీస్, మధ్యధరా సముద్రంలోని సైప్రస్‌తో సత్సంబంధాలు బలోపేతం చేసుకుంది. ఈ మూడు దేశాలతో డిఫెన్స్‌ సహకారం పెంచుతూ, బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్స్‌తో సహా అధునాతన ఆయుధాలు అందించడం ప్రారంభించింది. సైప్రస్‌కు ఇప్పటికే డెలివరీలు జరిగాయి, గ్రీస్‌కు కూడా సరఫరా చేయడానికి చర్చలు జరుపుతోంది. భారత సైనికులు ఈ దేశాల్లో వెళ్లి ఆయుధాల వినియోగంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. తుర్కియే భారత్‌పై ఏదైనా ప్రతికూల చర్య తీసుకుంటే ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్‌ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలబడే స్థితి ఏర్పడింది.

అజర్‌బైజాన్‌కూ కష్టకాలం..
తుర్కియే అజర్‌బైజాన్‌కు ఆయుధాలు సరఫరా చేసి ఆర్మేనియాను ఇబ్బంది పెడుతోంది. అయితే భారత్‌ అందించే ఆయుధాలు ఈ సమీకరణాన్ని మార్చేస్తున్నాయి. అదే సమయంలో సైప్రస్‌ను తుర్కియే విభజించి సగం భాగాన్ని ఆక్రమించి, రాజధానిని కూడా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైప్రస్‌కు బ్రహ్మోస్‌ అందడం తుర్కియేకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.

తుర్కియే బ్లూ హోమ్‌ల్యాండ్‌ సిద్ధాంతం..
తుర్కియే ఇటీవల ‘బ్లూ నేషన్‌’ లేదా ‘మావీ వతన్‌’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. మధ్యధరా, బ్లాక్‌ సీ, ఏజియన్‌ సీలలోని విస్తృత జల ప్రాంతాలు తనవేనని వాదిస్తోంది. దీని వల్ల గ్రీస్, సైప్రస్‌ జల ప్రాంతాలపై ఆక్రమణ ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. ఈ సిద్ధాంతం అమలు చేయాలంటే గ్రీస్, సైప్రస్‌పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో యుద్ధ పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అలాంటి పరిస్థితిలో గ్రీస్, సైప్రస్‌ భారత్‌ అందించిన బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌ను ఉపయోగించే సామర్థ్యం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

తుర్కియే వైఖరిలో ఆకస్మిక మార్పు…
అయితే ఇటీవల తుర్కియే వైఖరిలో మార్పు కనిపించింది. జూన్‌ 2న సింగపూర్‌లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ మాట్లాడుతూ, ‘పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నంత మాత్రాన భారత్‌తో విభేదాలు లేవు. భారత్‌తో బలమైన సంబంధాలు కావాలని కోరుకుంటున్నాం’ అని ప్రకటించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు డ్రోన్లు సరఫరా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్పు వచ్చింది. అయితే భారత్‌ వైపు నుంచి స్పష్టమైన సందేశం ఉంది. పాకిస్తాన్‌ విషయంలో తుర్కియే తన వైఖరి మార్చుకోనంత వరకు భారత్‌ తన వ్యూహాత్మక ఒత్తిడిని తగ్గించదు. ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్‌తో ఏర్పడుతున్న బలమైన అక్షం తుర్కియేకు, అజర్‌బైజాన్‌కు కూడా తీవ్రమైన సవాలుగా మారుతోంది.

చంద్రబాబు సిఫారసుతో ఆమెకు కీలక పదవి!

Chandrababu
Chandrababu

Chandrababu: కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ పై మోదీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎంపికపై కూడా దృష్టి పెట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రజలకు పాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ సరైన సహకారం లేకపోవడంతో ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించేందుకు బిజెపి అంగీకరించలేదు. అందుకే 2019 తరువాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంటూ ఎవరూ లేకుండా పోయారు. పోస్టు ఖాళీగా ఉంది. అయితే ఆ పోస్ట్ ఇతర పక్షాలకు ఇవ్వకుండా తానే తీసుకోవాలని బిజెపి భావిస్తోంది. అయితే ఆ పదవి ఏపీ నుంచి ఎంపికైన బిజెపి ఎంపీ కి ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రముఖంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది.

* సీనియర్ నాయకురాలిగా..
నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు పురందేశ్వరి. చంద్రబాబుతో విభేదించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపిలో పని చేశారు. ప్రస్తుతం బిజెపిలోనే ఉన్నారు. అయితే చంద్రబాబుతో ఉన్న విభేదాలన్నీ సమసిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వెనుక పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. పొత్తులో భాగంగా ఆమె రాజమండ్రి నుండి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ దక్కలేదు. అందుకే ఇప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది.

* గౌరవప్రదమైన విరమణ..
2029 ఎన్నికల నాటికి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నారు పురందేశ్వరి. కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారు. అయితే ఇంతలోనే గౌరవప్రదమైన పదవి చేపట్టాలని చూస్తున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఏపీకి ఇస్తే మాత్రం చంద్రబాబు సైతం పురందేశ్వరి పేరు సిఫారసు చేసే ఛాన్స్ ఉంది. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఆ అనుభవంతోనే ఆమెకు బిజెపి అగ్రనాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

రాయలసీమకు నైరుతి.. ఆ జిల్లాలకు వానలే!

Southwest Monsoon Andhra Pradesh
Southwest Monsoon Andhra Pradesh

Southwest Monsoon Andhra Pradesh: ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మెల్లగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి ఉన్నాయి. ఈ వారంలోనే రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* మంగళవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. కొన్నిచోట్ల అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.
* మరి కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, పోలవరం, కాకినాడ జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు మండలాలు, కృష్ణా జిల్లాలో మూడు మండలాలు… ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర వేడిగాలులు వీచాయి.
* ఈరోజు విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీకి నేడు బాబు.. గుడ్ న్యూస్ తో తిరిగి..!

Chandrababu Delhi Visit
Chandrababu Delhi Visit

Chandrababu Delhi Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన ఆసక్తికరంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈసారి టిడిపికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసి అవకాశం ఉంది. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సైతం ఆయన హాజరవుతారు. గురువారం రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతుండడం విశేషం.
* సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. రాష్ట్రపతి భవన్ లో గురువారం ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
* సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.
* కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చిస్తారని తెలుస్తోంది.
* లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి ఏపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై కూడా చర్చించే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి గుడ్ న్యూస్ తో వస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా..

Sleeping After Dinner
Sleeping After Dinner

Sleeping After Dinner: ప్రస్తుత రోజుల్లో చాలామంది ది బిజీ జీవనశైలి. ఈ క్రమంలో రాత్రి భోజనం చేసిన వెంటనే మంచం ఎక్కేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నిద్రించడం వల్ల శరీరంలోని జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆ సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం..

మన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడానికి కొంత సమయం అవసరం. భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే శరీర కదలికలు తగ్గిపోతాయి. దీంతో ఆహారం ద్వారా వచ్చిన కేలరీలు పూర్తిగా వినియోగం కాకుండా కొవ్వు రూపంలో నిల్వ కావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. వీటితోపాటు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి కడుపులో భారంగా అనిపించడం, అసౌకర్యం కలగడం కూడా జరుగుతుంది.అలాగే కడుపులోని ఆమ్లాలు పైకి అన్నవాహికలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీని వల్ల గుండెల్లో మంట, గొంతులో మంట, నోటిలో చేదు రుచి వంటి సమస్యలు ఎదురవుతాయి. తరచూ ఇలా జరిగితే జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి కష్టపడుతున్న సమయంలో పడుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. రాత్రి మధ్యలో మేల్కొనడం, అసౌకర్యంగా అనిపించడం, ఉదయం లేచినప్పుడు అలసటగా ఉండటం వంటి సమస్యలు కనిపించవచ్చు. దీని ప్రభావం మరుసటి రోజు పనితీరుపై కూడా పడుతుంది.

వైద్యుల సూచనల ప్రకారం.. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు భోజనం చేస్తే 10 గంటల తర్వాత నిద్రపోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం చిన్న అలవాటులా కనిపించినా, దీని ప్రభావం ఆరోగ్యంపై పెద్దగా ఉంటుంది. బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలను నివారించాలంటే భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం, కనీసం రెండు గంటల తర్వాత మాత్రమే పడుకోవడం ఉత్తమమైన అలవాటు అని వైద్యులు సూచిస్తున్నారు.