Andhra Pradesh Left Politics: తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం కాస్తా పక్కదారి పట్టినట్టు కనిపిస్తోంది. మొన్నటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కూడా ఇది స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో వామపక్షాల నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. రాజకీయ ప్రేరేపితం అన్నట్టు వారి ప్రవర్తన ఉంది. కూటమి వచ్చిన తర్వాత వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలకు కొంత స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవం. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం నోరు తెరవ లేకపోయారు వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు. అంతలా ఉక్కు పాదం మోపారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఇస్తే.. మరోలా మాట్లాడుతున్నారు. లేనిపోని వివాదాలు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను ఎంతలా చూశారో అందరికీ తెలిసిన విషయమే.. ఇప్పుడు వారిద్దరి పార్టీలకు మైలేజ్ వచ్చేందుకు ఇదే వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రయత్నిస్తుండటం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* సమస్యల పరిష్కార వారధి..
వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు అంటే ముందుగా గుర్తొచ్చేది సమస్యల పరిష్కారం. కార్మికులతో పాటు ఉద్యోగులు వామపక్షాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే వారు పోరాటం చేస్తే ఏదో ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందన్న ఆశ. అయితే ఇప్పుడు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ ప్రేరేపితం అనే చట్రంలో చిక్కుకుంటున్నాయి. లేనిపోని వివాదాలకు అవకాశం కల్పిస్తున్నాయి. సమస్యలకు పరిష్కారం మరిచి.. మరింత జఠిలం చేస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి.. బాధితుల పరామర్శకు వెళ్లిన.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్ పై నిలదీసినంత పని చేశారు. ఆయన సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. చనిపోయింది మీ కుటుంబాలు వారు కాదు కదా? బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ.. విరుచుకు పడే దాకా పరిస్థితి వచ్చింది.
* వైసీపీకి సహకారం..
ఇప్పుడు అనవసరంగా విశాఖకు చెందిన వామపక్షాల నేతలు ట్రోల్ అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. నాడు జగన్ సర్కార్ నోరు తెరవలేదు. కనీసం ప్రైవేటీకరణను నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బిజెపితో టిడిపి, జనసేనకు పొత్తు కుదిరిందో.. నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం యూటర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ ఆగింది. 13 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ సమకూరింది. వైసీపీ హయాంలో కొందరు వామపక్షాల నేతలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు వైసీపీ నేతలతో. కానీ ఇప్పుడు మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ఉక్కు శాఖ పర్యవేక్షిస్తుంది. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ ట్రాప్ లో పడి వామపక్షాల నేతలు సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి… తామే సమస్యలను సృష్టిస్తున్నారు. వారికి ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంటున్నారు
















ఫ్యాన్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మహేష్ బాబు హాట్ కామెంట్స్ వైరల్..
Mahesh Babu: అభిమానుల ఉత్సాహం సినీ సెలబ్రిటీలపై ఒక పరిధి లో ఉంటే చాలా బాగుంటుంది , పరిధి దాటి ప్రవర్తిస్తే , తమ అభిమాన తారలకు ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవ్వలేము , చిరాకు కలిగించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా హీరోయిన్స్ ఈమధ్య కాలంలో పబ్లిక్ ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులను ఎదురుకోవాల్సి వచ్చిందో మన అందరికీ తెలిసిందే. స్త్రీలకూ మాత్రమే కాదు , పురుషులకు కూడా ఇదే స్థాయిలో అభిమానుల అత్యుత్సాహం ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులను మహేష్ బాబు ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా, ఎక్కువ కాలం ప్రైవేట్ గా ఫ్యామిలీ తో గడపాలి అని కోరుకునే వ్యక్తి .
కానీ ఆయన తన కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు , విమానాశ్రయం లో అభిమానులు మీద పడడం వంటివి తీవ్రమైన ఇబ్బందికి గురి చేశాయట. దీని పై ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో మొబైల్ ఫోన్స్ , కెమెరాలు ఉండేవి కాదు కాబట్టి , మేము బయట తిరిగినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము బయట కనిపిస్తే అభిమానులు ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అది తప్పు అని నేను అనడం లేదు . అభిమానుల ఉత్సాహం అలాగే ఉంటుంది , అది కామన్, అర్థం చేసుకోగలం , కానీ ఆ ఉత్సాహం పరిధి దాటినప్పుడే ప్రైవసీ కి భంగం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరిగితే పర్వాలేదు అనుకోవచ్చు , ప్రతీ సారీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటే ఇబ్బంది’ అంటూ మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వం లో ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కాబోతుంది. కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా, ఫారిన్ భాషల్లో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు మార్కెట్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు . ఈ ఏడాది ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.