Home Blog Page 162

ఏపీలో పతనం అంచున వామపక్షాల రాజకీయం!

Andhra Pradesh Left Politics
Andhra Pradesh Left Politics

Andhra Pradesh Left Politics: తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం కాస్తా పక్కదారి పట్టినట్టు కనిపిస్తోంది. మొన్నటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కూడా ఇది స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో వామపక్షాల నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. రాజకీయ ప్రేరేపితం అన్నట్టు వారి ప్రవర్తన ఉంది. కూటమి వచ్చిన తర్వాత వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలకు కొంత స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవం. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం నోరు తెరవ లేకపోయారు వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు. అంతలా ఉక్కు పాదం మోపారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఇస్తే.. మరోలా మాట్లాడుతున్నారు. లేనిపోని వివాదాలు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను ఎంతలా చూశారో అందరికీ తెలిసిన విషయమే.. ఇప్పుడు వారిద్దరి పార్టీలకు మైలేజ్ వచ్చేందుకు ఇదే వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రయత్నిస్తుండటం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

* సమస్యల పరిష్కార వారధి..
వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు అంటే ముందుగా గుర్తొచ్చేది సమస్యల పరిష్కారం. కార్మికులతో పాటు ఉద్యోగులు వామపక్షాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే వారు పోరాటం చేస్తే ఏదో ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందన్న ఆశ. అయితే ఇప్పుడు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ ప్రేరేపితం అనే చట్రంలో చిక్కుకుంటున్నాయి. లేనిపోని వివాదాలకు అవకాశం కల్పిస్తున్నాయి. సమస్యలకు పరిష్కారం మరిచి.. మరింత జఠిలం చేస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి.. బాధితుల పరామర్శకు వెళ్లిన.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్ పై నిలదీసినంత పని చేశారు. ఆయన సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. చనిపోయింది మీ కుటుంబాలు వారు కాదు కదా? బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ.. విరుచుకు పడే దాకా పరిస్థితి వచ్చింది.

* వైసీపీకి సహకారం..
ఇప్పుడు అనవసరంగా విశాఖకు చెందిన వామపక్షాల నేతలు ట్రోల్ అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. నాడు జగన్ సర్కార్ నోరు తెరవలేదు. కనీసం ప్రైవేటీకరణను నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బిజెపితో టిడిపి, జనసేనకు పొత్తు కుదిరిందో.. నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం యూటర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ ఆగింది. 13 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ సమకూరింది. వైసీపీ హయాంలో కొందరు వామపక్షాల నేతలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు వైసీపీ నేతలతో. కానీ ఇప్పుడు మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ఉక్కు శాఖ పర్యవేక్షిస్తుంది. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ ట్రాప్ లో పడి వామపక్షాల నేతలు సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి… తామే సమస్యలను సృష్టిస్తున్నారు. వారికి ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంటున్నారు

ఏపీలో మరో వారసురాలు.. పక్కా పొలిటికల్ ప్లాన్!

Vangaveeti Asha Kiran Political Entry
Vangaveeti Asha Kiran Political Entry

Vangaveeti Asha Kiran Political Entry: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యాలయం తో పాటు రాజకీయ అరంగేట్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపైనే పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి మోహన్ రంగా కుమార్తె. గత కొద్దిరోజులుగా రంగా రాధా మిత్రమండలి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆశాకిరణ్. గతంలో ఆ మిత్రమండలి యాక్టివ్ గా పని చేసేది. తదనంతర పరిణామాలతో ఆ యాక్టివ్ తగ్గింది. ఈ క్రమంలో ఆశా కిరణ్ మిత్రమండలి బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ప్రచారం నడిచింది. అయితే అన్నీ తెలియజేసి రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు విజయవాడలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభం తో పాటు పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

* ప్రత్యేక స్థానం..
తెలుగు రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మోహన్ రంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి విజయవాడలో అండగా నిలిచేవారు మోహన్ రంగా. ఈ క్రమంలోనే 1983 లో కాంగ్రెస్ తరపున విజయవాడ తూర్పు నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. 1988లో ఓ దీక్ష శిబిరంలో ఉండగా దారుణ హత్యకు గురయ్యారు. అటు తరువాత ఆయన భార్య రెండుసార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రంగా కుమారుడు రాధా. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నడుమ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ పదవి కానీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

* సెంట్రల్ నియోజకవర్గం పై ఫోకస్..
రంగా -రాధా మిత్రమండలి బలోపేతానికి రంగంలోకి దిగిన కుమార్తె ఆశాకిరణ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన సైతం టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడ గాంధీ నగర్ లో కార్యాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. అయితే ఇప్పటివరకు వంగవీటి కుటుంబం తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తూ వచ్చింది. కానీ ఆశా కిరణ్ అందుకు విరుద్ధంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోదరుడు టిడిపిలో ఉన్నారు. మరోవైపు ఆశాకిరణ్ జనసేన నుంచి కానీ.. వైసీపీ తరఫున నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.

మృణాల్ అందాలు చూడతరమా?

Mrunal Thakur photos
Mrunal Thakur photos

పాకిస్తాన్‌కు వణుకు పుట్టిస్తున్న రుద్రం–2.. రాడార్‌లను వేటాడే సరికొత్త అస్త్రం!

Rudram 2 Missile
Rudram 2 Missile

Rudram 2 Missile: భారత్‌ రక్షణ శాఖ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రుద్రం–2 యాంటీ–రేడియేషన్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్‌ శత్రువు రాడార్‌లు, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను గుర్తించి ధ్వంసం చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది.

రుద్రం–2 సామర్థ్యాలు ఇవీ…
రుద్రం–2 ప్రధానంగా శత్రువు రాడార్లు వెలువరించే రేడియేషన్‌ సిగ్నల్స్‌ను గుర్తించి, వాటిని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగిన అధునాతన మిస్సైల్‌. ఇది 300 నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పిన్‌పాయింట్‌ ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. గంటకు సుమారు 7,000 కిలోమీటర్ల వేగంతో (మాక్‌ 5.5) ప్రయాణించే ఈ మిస్సైల్‌ శత్రువుకు తక్కువ సమయంలోనే తీవ్ర నష్టం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది కేవలం రాడార్లను మాత్రమే కాకుండా, సమగ్ర ఎయిర్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లు, సర్ఫేస్‌–టు–ఎయిర్‌ మిస్సైల్‌ బ్యాటరీలు, కమాండ్‌ సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది.

పాకిస్తాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌కు సవాల్‌..
పాకిస్తాన్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను రాడార్లు, సామ్‌ మిస్సైళ్లు, ఫైటర్‌ జెట్లపై ఆధారపడి నిర్మించింది. రుద్రం–2 వంటి మిస్సైల్‌ ఈ రాడార్‌ నెట్‌వర్క్‌ను మొదట ధ్వంసం చేస్తే, శత్రువు సమగ్ర ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. రాడార్లు లేకపోతే ఫైటర్‌ జెట్లు సమర్థవంతంగా పని చేయలేవు. ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైళ్లు కూడా లక్ష్యం గుర్తించడంలో విఫలమవుతాయి. ఈ కారణంగానే రుద్రం–2ను బ్యాటిల్‌ ఫీల్డ్‌ షేపర్‌ (యుద్ధభూమిని తీర్మానించేది) అని పిలుస్తున్నారు. ఇది శత్రువు ఆకాశ ప్రాధాన్యతను కూడా దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉంది.

మూడు ప్రయోజనాలు..
రుద్రం–2 విజయవంతమైన పరీక్ష భారత్‌కు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది సీ సామర్థ్యం పెరగడం. మిషన్లలో భారత్‌ ఇప్పుడు స్వయంప్రతిపత్తి సాధించింది. శత్రువు రక్షణ వ్యవస్థలను దూరం నుంచే నాశనం చేయడం ద్వారా భారత్‌ వైమానిక దళం యొక్క ఫైటర్‌ జెట్లు సురక్షితంగా ఆపరేట్‌ చేయవచ్చు.

పాకిస్తాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి..
పాకిస్తాన్‌ రాడార్‌ నెట్‌వర్క్‌ ఎప్పుడు ధ్వంసమవుతుందో అనే భయం శత్రువు సైనికుల్లో వణుకు పుట్టిస్తుంది. ఇది దేశీయ సాంకేతికతపై ఆధారపడిన అధునాతన ఆయుధం కావడం విశేషం.

రుద్రం–2 విజయం భారత్‌ ఆక్రమణాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. యుద్ధ సమయంలో శత్రువు ఎయిర్‌ డిఫెన్స్‌ను తట్టుకోవడం ఇక ముందు చాలా కష్టమవుతుందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక మిస్సైల్‌ పరీక్ష కాదు భారత్‌ యుద్ధ వ్యూహాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

తుర్కియే తిక్క కుదిరింది భారత్ వ్యూహాత్మక షాక్ తో కాళ్ల బేరం

India Turkey Relations
India Turkey Relations

India Turkey relations: తుర్కియే దీర్ఘకాలంగా భారత్‌ వ్యతిరేక ధోరణి అవలంబించడం, పాకిస్తాన్‌కు బలమైన మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌ను చికాకు పెడుతోంది. కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు పక్షపాతం చూపడం, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం వంటి చర్యలు ఇందులో భాగం. అయినా భారత్‌ మాత్రం తుర్కియేలో భూకంపం సమయంలో మొదటి స్పందన చూపి సహాయం అందించింది. కానీ ఆ సహాయం కూడా తుర్కియే వైఖరిని మార్చలేకపోయింది.

భారత్‌ కౌంటర్‌ వ్యూహం…
ఈ నేపథ్యంలో భారత్‌ తన వ్యూహాత్మక స్పందనను మొదలుపెట్టింది. తుర్కియేకు ఉత్తరం వైపు ఉన్న ఆర్మేనియా, పశ్చిమం వైపు గ్రీస్, మధ్యధరా సముద్రంలోని సైప్రస్‌తో సత్సంబంధాలు బలోపేతం చేసుకుంది. ఈ మూడు దేశాలతో డిఫెన్స్‌ సహకారం పెంచుతూ, బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్స్‌తో సహా అధునాతన ఆయుధాలు అందించడం ప్రారంభించింది. సైప్రస్‌కు ఇప్పటికే డెలివరీలు జరిగాయి, గ్రీస్‌కు కూడా సరఫరా చేయడానికి చర్చలు జరుపుతోంది. భారత సైనికులు ఈ దేశాల్లో వెళ్లి ఆయుధాల వినియోగంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. తుర్కియే భారత్‌పై ఏదైనా ప్రతికూల చర్య తీసుకుంటే ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్‌ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలబడే స్థితి ఏర్పడింది.

అజర్‌బైజాన్‌కూ కష్టకాలం..
తుర్కియే అజర్‌బైజాన్‌కు ఆయుధాలు సరఫరా చేసి ఆర్మేనియాను ఇబ్బంది పెడుతోంది. అయితే భారత్‌ అందించే ఆయుధాలు ఈ సమీకరణాన్ని మార్చేస్తున్నాయి. అదే సమయంలో సైప్రస్‌ను తుర్కియే విభజించి సగం భాగాన్ని ఆక్రమించి, రాజధానిని కూడా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైప్రస్‌కు బ్రహ్మోస్‌ అందడం తుర్కియేకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.

తుర్కియే బ్లూ హోమ్‌ల్యాండ్‌ సిద్ధాంతం..
తుర్కియే ఇటీవల ‘బ్లూ నేషన్‌’ లేదా ‘మావీ వతన్‌’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. మధ్యధరా, బ్లాక్‌ సీ, ఏజియన్‌ సీలలోని విస్తృత జల ప్రాంతాలు తనవేనని వాదిస్తోంది. దీని వల్ల గ్రీస్, సైప్రస్‌ జల ప్రాంతాలపై ఆక్రమణ ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. ఈ సిద్ధాంతం అమలు చేయాలంటే గ్రీస్, సైప్రస్‌పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో యుద్ధ పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అలాంటి పరిస్థితిలో గ్రీస్, సైప్రస్‌ భారత్‌ అందించిన బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌ను ఉపయోగించే సామర్థ్యం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

తుర్కియే వైఖరిలో ఆకస్మిక మార్పు…
అయితే ఇటీవల తుర్కియే వైఖరిలో మార్పు కనిపించింది. జూన్‌ 2న సింగపూర్‌లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ మాట్లాడుతూ, ‘పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నంత మాత్రాన భారత్‌తో విభేదాలు లేవు. భారత్‌తో బలమైన సంబంధాలు కావాలని కోరుకుంటున్నాం’ అని ప్రకటించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు డ్రోన్లు సరఫరా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్పు వచ్చింది. అయితే భారత్‌ వైపు నుంచి స్పష్టమైన సందేశం ఉంది. పాకిస్తాన్‌ విషయంలో తుర్కియే తన వైఖరి మార్చుకోనంత వరకు భారత్‌ తన వ్యూహాత్మక ఒత్తిడిని తగ్గించదు. ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్‌తో ఏర్పడుతున్న బలమైన అక్షం తుర్కియేకు, అజర్‌బైజాన్‌కు కూడా తీవ్రమైన సవాలుగా మారుతోంది.

చంద్రబాబు సిఫారసుతో ఆమెకు కీలక పదవి!

Chandrababu
Chandrababu

Chandrababu: కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ పై మోదీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎంపికపై కూడా దృష్టి పెట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రజలకు పాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ సరైన సహకారం లేకపోవడంతో ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించేందుకు బిజెపి అంగీకరించలేదు. అందుకే 2019 తరువాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంటూ ఎవరూ లేకుండా పోయారు. పోస్టు ఖాళీగా ఉంది. అయితే ఆ పోస్ట్ ఇతర పక్షాలకు ఇవ్వకుండా తానే తీసుకోవాలని బిజెపి భావిస్తోంది. అయితే ఆ పదవి ఏపీ నుంచి ఎంపికైన బిజెపి ఎంపీ కి ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రముఖంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది.

* సీనియర్ నాయకురాలిగా..
నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు పురందేశ్వరి. చంద్రబాబుతో విభేదించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపిలో పని చేశారు. ప్రస్తుతం బిజెపిలోనే ఉన్నారు. అయితే చంద్రబాబుతో ఉన్న విభేదాలన్నీ సమసిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వెనుక పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. పొత్తులో భాగంగా ఆమె రాజమండ్రి నుండి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ దక్కలేదు. అందుకే ఇప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది.

* గౌరవప్రదమైన విరమణ..
2029 ఎన్నికల నాటికి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నారు పురందేశ్వరి. కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారు. అయితే ఇంతలోనే గౌరవప్రదమైన పదవి చేపట్టాలని చూస్తున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఏపీకి ఇస్తే మాత్రం చంద్రబాబు సైతం పురందేశ్వరి పేరు సిఫారసు చేసే ఛాన్స్ ఉంది. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఆ అనుభవంతోనే ఆమెకు బిజెపి అగ్రనాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

రాయలసీమకు నైరుతి.. ఆ జిల్లాలకు వానలే!

Southwest Monsoon Andhra Pradesh
Southwest Monsoon Andhra Pradesh

Southwest Monsoon Andhra Pradesh: ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మెల్లగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి ఉన్నాయి. ఈ వారంలోనే రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* మంగళవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. కొన్నిచోట్ల అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.
* మరి కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, పోలవరం, కాకినాడ జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు మండలాలు, కృష్ణా జిల్లాలో మూడు మండలాలు… ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర వేడిగాలులు వీచాయి.
* ఈరోజు విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీకి నేడు బాబు.. గుడ్ న్యూస్ తో తిరిగి..!

Chandrababu Delhi Visit
Chandrababu Delhi Visit

Chandrababu Delhi Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన ఆసక్తికరంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈసారి టిడిపికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసి అవకాశం ఉంది. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సైతం ఆయన హాజరవుతారు. గురువారం రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతుండడం విశేషం.
* సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. రాష్ట్రపతి భవన్ లో గురువారం ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
* సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.
* కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చిస్తారని తెలుస్తోంది.
* లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి ఏపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై కూడా చర్చించే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి గుడ్ న్యూస్ తో వస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా..

Sleeping After Dinner
Sleeping After Dinner

Sleeping After Dinner: ప్రస్తుత రోజుల్లో చాలామంది ది బిజీ జీవనశైలి. ఈ క్రమంలో రాత్రి భోజనం చేసిన వెంటనే మంచం ఎక్కేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నిద్రించడం వల్ల శరీరంలోని జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆ సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం..

మన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడానికి కొంత సమయం అవసరం. భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే శరీర కదలికలు తగ్గిపోతాయి. దీంతో ఆహారం ద్వారా వచ్చిన కేలరీలు పూర్తిగా వినియోగం కాకుండా కొవ్వు రూపంలో నిల్వ కావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. వీటితోపాటు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి కడుపులో భారంగా అనిపించడం, అసౌకర్యం కలగడం కూడా జరుగుతుంది.అలాగే కడుపులోని ఆమ్లాలు పైకి అన్నవాహికలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీని వల్ల గుండెల్లో మంట, గొంతులో మంట, నోటిలో చేదు రుచి వంటి సమస్యలు ఎదురవుతాయి. తరచూ ఇలా జరిగితే జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి కష్టపడుతున్న సమయంలో పడుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. రాత్రి మధ్యలో మేల్కొనడం, అసౌకర్యంగా అనిపించడం, ఉదయం లేచినప్పుడు అలసటగా ఉండటం వంటి సమస్యలు కనిపించవచ్చు. దీని ప్రభావం మరుసటి రోజు పనితీరుపై కూడా పడుతుంది.

వైద్యుల సూచనల ప్రకారం.. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు భోజనం చేస్తే 10 గంటల తర్వాత నిద్రపోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం చిన్న అలవాటులా కనిపించినా, దీని ప్రభావం ఆరోగ్యంపై పెద్దగా ఉంటుంది. బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలను నివారించాలంటే భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం, కనీసం రెండు గంటల తర్వాత మాత్రమే పడుకోవడం ఉత్తమమైన అలవాటు అని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈ రోజు లక్ష్మీ తాండవం.. డబ్బు కట్టలు లెక్క పెట్టాల్సిందే..

Today 10 july 2026 Horoscope
Today 10 july 2026 Horoscope

Today 10 June 2026 Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఇంట్లో ఈరోజు లక్ష్మీ తాండవం చేస్తుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన అవకాశాలు ఉండలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం. ఉద్యోగులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు కోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఎవరికీ డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. వ్యాపారులకు కొత్త అవకాశాలు అందుతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి అనుకున్న కోరికలలో ఈరోజు ఒకటి నెరవేరుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారులకు మద్దతు ఉండడంతో అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెట్టిన వాళ్ళు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా ఉద్యోగులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. అయితే ఇదే సమయంలో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వస్తువు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యక్తిగత జీవితం సంతోషంగా గడుస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. స్నేహితుల అండదండలతో అప్పుల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులను నెరవేర్చుకోవడంలో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు అపారమైన లాభాలు పొందుతారు. వ్యాపారులకు అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థుల పోటీ పరీక్షలు పాల్గొంటే రాణిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. కొందరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నట్టుండి వ్యాపారులకు ఘననీయంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

రజినీకాంత్ ని చూసి నా కెరీర్ ని నాశనం చేసుకున్నా.. స్టూడియో మూతపడింది - మాధవన్

R Madhavan
R Madhavan

R Madhavan: తమిళనాడు లో ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రంగనాథన్ మాధవన్. ముఖ్యంగా లేడీస్ లో ఈయనకి ఉన్నటువంటి ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇప్పటికీ మంచి సినిమా తీస్తే ఆయన భారీ బ్లాక్ బస్టర్ ని అందుకునే అవకాశం ఉంది . తమిళం తో పాటు తెలుగు , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో హీరో గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు మాధవన్. రీసెంట్ గా ‘ధురంధర్’ సిరీస్ లో ఆయన చేసిన పాత్రకు ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము . ఇలాంటి సంచలనాత్మక పాత్రలతో నేటి తరం ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మాధవన్. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఒకానొక సమయం లో కొంతమంది విశ్లేషకులు నా దగ్గరకు ఒక డేటా తో వచ్చారు. మీకు A సెంటర్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది , కానీ బీ , సి సెంటర్స్ లో లేదు , అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయకపోతే మీరు రజినీకాంత్ లాగా అవ్వలేరు అని చెప్పారు. గ్రామీణ ప్రేక్షకులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆదరించినప్పుడే మరో రజినీకాంత్ కాగలరు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సలహాలు తీసుకొనే , నాకు సరిపోయే ఒక కథ కు ఒకే చెప్పను . అందులో నా పాత్ర చాలా వీక్ గా ఉంటుంది. తనని తానూ పోషించుకోవడానికి కూడా చాలా కష్టపడేలా ఉంటుంది. పైగా చదువు లేదు , క్రికెట్ లో రాణించాలి అనే గొప్ప కల ఉన్న యువకుడి కథ అది. ఎన్నో ఆశలతో సినిమా తీస్తే , అది పెద్ద ఫ్లాప్ అయ్యింది , దెబ్బకు స్టూడియో ని కూడా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ మాధవన్ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు .

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆ దెబ్బతో నా కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలు గుడ్డిగా తీసుకోవడం మానేసాను , నాకు నచ్చితేనే సినిమాలు చేయడం మొదలు పెట్టాను , పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే రీసెంట్ గా మాధవన్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం లో హనుమంతుడి క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి తట్టుకోలేక ట్వీట్స్ డిలీట్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ..

Rahul Ramakrishna
Rahul Ramakrishna

Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఎంత వయొలెంట్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గురించి చిన్న మాట అన్నా తీసుకోలేరు , రక్తం వచ్చేలా రక్కేస్తారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎవరైనా పొరపాటున నోరు జారితే అయిపోయినట్టే. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తూ కొన్ని ట్వీట్లు వేశాడు . సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 4.1 (B) ప్రకారం పారదర్శకత , ముందస్తు సమాచార వెల్లడి గురించి పవన్ కళ్యాణ్ ని ఆయన నిలదీశాడు , ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఈ హామీ సంగతేంటి అని నిలదీస్తూ , చివర్లో జై తెలంగాణ అంటూ ట్వీట్ వేశాడు . రాహుల్ రామకృష్ణ వేసిన ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అభిమానులు ఈ స్థాయిలో రాహుల్ పై సైబర్ దాడి చేయడం తో ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాదు’ అంటూ ట్వీట్ చేశాడు . ఆ తర్వాత కాసేపటికి ఆయన నటించిన ‘జాతి రత్నాలు’ చిత్రం లోని ఫేమస్ డైలాగ్ , నా వల్లే ప్రోబ్లం అంటే వెళ్ళిపోతా మావా ఇక్కడి నుండి అంటూ ట్వీట్ వేసాడు. అయితే చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు రాహుల్ కిందకు దిగాక తప్పలేదు , పవన్ కళ్యాణ్ మీద వేసిన ట్వీట్స్ అన్నిటిని డిలీట్ చేశాడు . రాహుల్ రామకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు , తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా , నిర్మొహమాటంగా చెప్తుంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై కూడా ఇలాగే ట్వీట్లు వేసాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని తెలంగాణ లో యాక్టీవ్ చేయడం తో , ఇప్పుడు ఆయన మీద ఇలాంటి ట్వీట్లు వేసాడు. ఇలాంటి నోటి దూల కారణంగానే , ఆయనకు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ , ఈమధ్య కాలం లో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మహేష్ బాబు హాట్ కామెంట్స్ వైరల్..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: అభిమానుల ఉత్సాహం సినీ సెలబ్రిటీలపై ఒక పరిధి లో ఉంటే చాలా బాగుంటుంది , పరిధి దాటి ప్రవర్తిస్తే , తమ అభిమాన తారలకు ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవ్వలేము , చిరాకు కలిగించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా హీరోయిన్స్ ఈమధ్య కాలంలో పబ్లిక్ ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులను ఎదురుకోవాల్సి వచ్చిందో మన అందరికీ తెలిసిందే. స్త్రీలకూ మాత్రమే కాదు , పురుషులకు కూడా ఇదే స్థాయిలో అభిమానుల అత్యుత్సాహం ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులను మహేష్ బాబు ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా, ఎక్కువ కాలం ప్రైవేట్ గా ఫ్యామిలీ తో గడపాలి అని కోరుకునే వ్యక్తి .

కానీ ఆయన తన కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు , విమానాశ్రయం లో అభిమానులు మీద పడడం వంటివి తీవ్రమైన ఇబ్బందికి గురి చేశాయట. దీని పై ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో మొబైల్ ఫోన్స్ , కెమెరాలు ఉండేవి కాదు కాబట్టి , మేము బయట తిరిగినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము బయట కనిపిస్తే అభిమానులు ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అది తప్పు అని నేను అనడం లేదు . అభిమానుల ఉత్సాహం అలాగే ఉంటుంది , అది కామన్, అర్థం చేసుకోగలం , కానీ ఆ ఉత్సాహం పరిధి దాటినప్పుడే ప్రైవసీ కి భంగం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరిగితే పర్వాలేదు అనుకోవచ్చు , ప్రతీ సారీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటే ఇబ్బంది’ అంటూ మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వం లో ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కాబోతుంది. కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా, ఫారిన్ భాషల్లో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు మార్కెట్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు . ఈ ఏడాది ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర లో 'పెద్ది' ప్రభంజనం.. ఈ రికార్డుని అందుకోవడం 'వారణాసి' కి కూడా కష్టమే..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీ ని చూస్తుంటే , ఈ చిత్రం లాంగ్ రన్ రంగస్థలం ని మించి ఉంటుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి వర్కింగ్ డే ఈ రేంజ్ షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రావడం చూసి దాదాపుగా రెండేళ్లు అయ్యింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లు వర్ణనాతీతం. ఈమధ్య కాలం లో ఉత్తరాంధ్ర ప్రాంతం సంక్రాంతి సీజన్ లో మాత్రమే సినిమాలకు అనుకూలంగా ఉంటూ వచ్చింది.

మిగిలిన సీజన్స్ లో ఈ ప్రాంతం నుండి వసూళ్లు పెద్దగా నమోదు అవ్వలేదు. కానీ ‘పెద్ది’ చిత్రానికి సంక్రాంతికి సీజన్ ని మించిన వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదు అవుతున్నాయి. 5 వ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రానికి 1 కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా 6 వ రోజు కూడా ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే వరుసగా 6 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాబట్టిన అరుదైన సినిమాల్లో ఒకటిగా ‘పెద్ది’ చిత్రం నిలిచిపోతుంది. ప్రస్తుతానికి అయితే 5 రోజుల్లో ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది ‘దేవర’, ‘ఓజీ’ ఉత్తరాంధ్ర ప్రాంతం క్లోజింగ్ తో సమానం అట.

ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా ప్రతిష్టాత్మక 20 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని , ఫుల్ రన్ లో ఆల్ టైం రికార్డు ని నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా ఉత్తరాంధ్ర లో ఈ రేంజ్ సునామీ ని క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం , ఈ చిత్రం ఉత్తరాంధ్ర యాసలో తెరకెక్కడమే అని అంటున్నారు విశ్లేషకులు. రాయలసీమ , తెలంగాణ యాసలో ఇది వరకు గతం లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి , కానీ ఉత్తరాంధ్ర యాసలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. ‘పెద్ది ‘ చిత్రం ఆ యాసలో తెరకెక్కడం వల్ల, ఈ ప్రాంతం నుండి కాసుల కనకవర్షం కురిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ రికార్డు ని భవిష్యత్తులో వారణాసి కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు.

అప్పుడే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసిన 'దృశ్యం 3'.. ఎందులో చూడాలంటే..

Drishyam 3 OTT Release
Drishyam 3 OTT Release

Drishyam 3 OTT Release: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం 3’. మలయాళం తో పాటు , తెలుగు లో కూడా ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి క్రేజ్ ఉండేది. ఎందుకంటే తెలుగు లో వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం తో ఆడియన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ సినిమాకు కమర్షియల్ గా కాసుల కనకవర్షం భారీగానే కురిసింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ కేవలం 30 కోట్ల రూపాయలకే అమ్మారు. బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రం బయ్యర్స్ కి డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.

తెలుగు వెర్షన్ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఇలాంటి సమయం ల్లో ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. విడుదలకు ముందు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. గతం లో తెలుగు , మలయాళం , హిందీ వెర్షన్స్ కి సంబంధించిన దృశ్యం సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3’ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 18 వ తారీఖున లేదా, 25 తారీఖున స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు . ఈ వారం లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

అయితే ఈ చిత్రం హిందీ బాషా మినహా, మిగిలిన అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. హిందీ లో ఎందుకు స్టెమ్మింగ్ అవ్వడం లేదంటే , ఈ సినిమా హిందీ లో గ్రాండ్ గా తెరకెక్కుతుంది కాబట్టి . అజయ్ దేవగన్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు. మొదటి రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించిన శ్రియ శరన్ ఈ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ , ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది. ఇక మలయాళం వెర్షన్ విషయానికి వస్తే , థియేటర్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ రాబోతుందో చూడాలి.

రోజ్ సర్దానా అందాలు చూడతరమా?

Rose Sardana photos
Rose Sardana photos

నా చావుకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చాడు అంటూ హాట్ కామెంట్స్ చేసిన జగపతి బాబు..

Jagapathi Babu
Jagapathi Babu

Jagapathi Babu: ప్రస్తుతం జగపతి బాబు పేరు ఇండస్ట్రీ లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో మన కళ్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కీలక పాత్ర పోషించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతే కాకుండా నటన పరంగా రామ్ చరణ్ తర్వాత, ఆ స్థాయి రెస్పాన్స్ జగపతి బాబు కే వచ్చింది. హీరో క్యారెక్టర్స్ నుండి విలన్ మరియు క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిన జగపతి బాబు కి , పాన్ ఇండియా లెవెల్ లో టాప్ డైరెక్టర్స్, స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కింది. పాజిటివ్ , నెగెటివ్ క్యారెక్టర్స్ తో ఆయన అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనే చెప్పొచ్చు.

అయితే ఈమధ్య కాలం లో జగపతి బాబు జోరు కాస్త తగ్గింది. ముఖ్యంగా టాలీవుడ్ లో గత రెండు సంవత్సరాలుగా జగపతి బాబు స్థాయి కి తగ్గ పాత్రలు దక్కలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సమయం లో ఆయనకు ‘పెద్ది’ చిత్రం ద్వారా దొరికిన ఈ అప్పలసూరి క్యారెక్టర్ , మంచి బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. లెజెండ్ చిత్రం తో నెగెటివ్ రోల్ ద్వారా ఆయన ఎలాంటి ప్రభావం చూపించాడా , ‘పెద్ది’ చిత్రం లో పాజిటివ్ క్యారెక్టర్ ద్వారా ఆయన అలాంటి ప్రభావమే చూపించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రీసెంట్ గా జగపతి బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , సోషల్ మీడియా లో జరిగే ఫేక్ వార్తల ప్రచారాల పై , ఫేక్ థంబ్ నెయిల్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా ఈమధ్య కాలం లో దారుణంగా తయారైంది , నేను చనిపోయానంటూ కొన్ని వార్తలు కూడా ఈ సోషల్ మీడియా లో ప్రచారమయ్యాయి. నా మృత దేహం పక్కన జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతర నటీనటులు కూడా నిల్చొని ఏడుస్తున్నట్టు కొన్ని థంబ్ నెయిల్స్ ఎడిట్ చేశారు. కానీ అలాంటి వాటి గురించి నేను ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు , స్పందించాలని అనుకోలేదు, మరణించానని చెప్పినా, నిజాయితితో జీవిస్తున్నాను’ అంటూ జగపతి బాబు తన స్టైల్ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ‘పెద్ది’ లో జగపతి బాబు సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో , ఎడిటింగ్ లో తొలగించబడిన జగపతి బాబు , రామ్ చరణ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను ఈ చిత్రం లో జత చేయబోతున్నారు. ఈ వారం నుండే ఈ కొత్త సన్నివేశాలను థియేటర్స్ లో ఆడియన్స్ చూడొచ్చు.