Home Blog Page 153

ప్రియుడి మైకంలో పడి.. కన్న కూతురినే అలా చేసింది.. చివరికిలా దొరికిపోయింది..

Priyanka Praveen Case
Priyanka Praveen Case

Priyanka Praveen Case: రోజురోజుకు సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. తాత్కాలిక సంబంధాల కోసం.. శాశ్వత అనుబంధాలను వదిలేసుకుంటున్నారు. క్షణకాలంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమె కథ కూడా ఇటువంటిదే. పైగా ఆమె ఉన్నత విద్యావంతురాలు. న్యాయవాదిగా పని చేస్తోంది. అయినప్పటికీ విచక్షణ మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కుమార్తెను తల్లి అంతం చేసింది. ఈ సంఘటన కేవలం ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రియుడితో కలిసి ఉండడానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన చాలా రోజుల క్రితమే జరిగింది. పోలీసుల కళ్ళు కప్పి ఆ తల్లి పరారీలో ఉంది. ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు హాసన ప్రాంతానికి తీసుకొచ్చారు.

కర్ణాటక రాష్ట్రంలోని దావనగరి ప్రాంతానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రియాంక లాయర్ గా పనిచేస్తోంది. వీరికి 11 సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉన్నారు. వీరు కాడుగూడి ప్రాంతంలో ఉండేవారు. అప్పుడు మోహన్ అనే వ్యక్తి ఈమెని కలిశాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఆ పరిచయంతోనే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.

ప్రవీణ్ కు ఈ విషయం తెలిసింది. దీంతో వారిద్దరినీ అతడు హెచ్చరించాడు. భర్త మాటలు తట్టుకోలేక ప్రియాంక తన కుమార్తెను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మోహన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలుపెట్టింది. అంతేకాదు భర్తకు డైవర్స్ నోటీసులు కూడా పంపించింది. అయితే ఇటీవల ప్రియాంక తన కుమార్తె వెన్నెల చనిపోయిందని భర్తతో చెప్పింది. ఇదే సమాచారం తన సోదరుడికి కూడా చేరవేసింది. అంత్యక్రియల అనంతరం పోస్టుమార్టం రిపోర్ట్ భర్తకు పంపించింది. అందులో అనేక రకాల అనుమానాలు ఉండడంతో ప్రవీణ్ రిపోర్టును విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడికి పంపించాడు. ప్రవీణ్ స్నేహితుడు విదేశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఆ పోస్టుమార్టం నివేదికలో అన్ని తప్పులు ఉన్నట్టు అతడు గుర్తించాడు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా.. కీలక విషయాలు బయటకు వచ్చాయి.

వెన్నెలను ప్రియాంక, మోహన్ గొంతు నులిమి చంపేశారని తేలింది. వారిద్దరి ఏకాంతానికి అడ్డుగా ఉందని ఆమెను చంపినట్టు సమాచారం. మోహన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ప్రియాంక పరారీలో ఉంది. కొద్దిరోజులుగా ఆమె హాసన ప్రాంతంలో తలదాచుకుంటున్నది. దీంతో పోలీసులు ఆమెను గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.. మరోవైపు మోహన్ మాయమాటలు నమ్మి ప్రియాంక నిండా మునిగిపోయింది.

మోహన్ డబ్బున్న వ్యక్తి కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతకంటే కాదు. అతడు అద్దెకు ఇల్లు సమకూర్చే బ్రోకర్. ఈ విషయాన్ని తెలుసుకోలేక.. తాత్కాలిక వ్యామోహానికి అలవాటు పడి ప్రియాంక జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రియాంక వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఆమె తీరు పట్లనెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు

ఈ ఐదు లక్షల వారిపై ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం..

Today 12 June 2026 Horoscope
Today 12 June 2026 Horoscope

Today 12 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొనడానికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. రోజువారి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్దల అండదండలతో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లే ప్రయత్నం చేయొద్దు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అనేక ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల అండదండలతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా ధన లాభం ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి సపోర్ట్ ఉండటంతో కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు నాణ్యమైన సమయాన్ని స్నేహితులతో గడుపుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. శక్తి సామర్ధ్యాల మేరకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అనుకోకుండా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మార్చురీలో ఉన్న పురుషుల ప్రైవేట్ పా** ను వదిలిపెట్టలేదు ఈ లేడీ డాక్టర్.. వెలుగులోకి దారుణం

Lady Doctor Remarks
Lady Doctor Remarks

Lady Doctor Remarks: వైద్యులను మనం దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది. మన ఎదుగుదలలో తండ్రి తోడ్పడుతుంటాడు. కానీ వైద్యులు మనకు పునర్జన్మ అందిస్తూ ఉంటారు. మనం జబ్బు పడినప్పుడు.. తిరిగి కోలుకోవడంలో సహాయపడుతుంటారు. అందువల్లే వైద్యులను కనిపించే దేవుళ్ళు అని అంటుంటాం.

ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి చాలామంది సరికొత్త వన్నె తీసుకొచ్చారు. వైద్యరంగంలో సరికొత్త మార్పులకు బీజం వేశారు. కానీ కొంతమంది వైద్యులు మాత్రం ఆ వృత్తికి తీవ్రమైన మకిలి తీసుకొస్తున్నారు. అటువంటి వారి వల్ల వైద్యులు అంటేనే సమాజం చీ కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. అయితే ఈ జాబితాలో ఈ మహిళ వైద్యురాలు అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసిన పని అంత పనికిమాలినది కాబట్టి. పైగా ఈ విషయాన్ని తనే బయటపెట్టుకుంది.

ఇటీవల కాలంలో స్టాండ్ అప్ కామెడీ షో లు పెరిగిపోయాయి. అందులో బీ గ్రేడ్ కంటెంట్ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల చాలామంది నవ్వుకుంటున్నారు గాని.. పచ్చి బూతుల వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందో మిగతా వాళ్లకు తెలుసు. ఆ వైద్యురాలు స్టాండప్ కామెడీలో లైన్ తప్పింది.. అనకూడని మాట అనేసింది.. మార్చురీలో ఉండే పురుషుల శవాల ప్రైవేట్ పార్ట్స్ పరిమాణాల మీద తాము జోకులు వేసుకుంటామని ఆ వైద్యులు చెప్పింది.. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడంతో ఆమె వెంటనే క్షమాపణ చెప్పింది..

ఇటీవల కాలంలో ఈ తరహా లేకి వ్యాఖ్యలు చేసే వారు చాలామంది పెరిగిపోతున్నారు. దానికి స్టాండ్ అప్ కామెడీ అని పేరు పెడుతున్నారు.. ఇక గురుగ్రామ్ ప్రాంతంలో ఐటీ ఇంజనీర్ గా పనిచేసే హిమాన్షు అనే వ్యక్తి.. స్టాండ్ అప్ కామెడీలో బిర్యానీ వ్యాఖ్యలు కూడా వివాదాన్ని సృష్టించాయి.”నేను ఒక అమ్మాయికి 370 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిచ్చాను.. దానికి బదులుగా ఆమె ఏమిస్తుంది.. నేను ఏం కోరుకుంటాను. శారీరక సుఖాన్నే కదా” అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడాడు.

అతడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వివాదాన్ని సృష్టించాయి. దీంతో ఆ కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. వీరు మాత్రమే కాదు అప్పట్లో కొంతమంది ఏపీ రాజకీయాల గురించి కూడా చెత్త వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ.. చంద్రబాబు మీద అడ్డగోలుగా మాట్లాడారు. వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. స్టాండప్ కామెడీ పేరుతో వీరు చేస్తున్న లేకి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి.

డైరెక్టర్ గా మారిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాలో హీరో ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..

Kiran Abbavaram
Kiran Abbavaram

Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం . ‘రాజా వారు రాణి వారు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘క’, ‘k ర్యాంప్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి కానీ , చాలా తొందరగానే కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే హీరో గా తనని తానూ నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం , ఇప్పుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇది ఆయన 13 వ సినిమా అట. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.

చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈ చిత్రం లో హోటల్ ఓనర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నాడు. జాయ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం మంచిగా హీరో గా కొనసాగుతున్నాడు కదా, ఇప్పుడు ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా అని సోషల్ మీడియా లో కొంతమంది అంటున్నారు. కానీ కిరణ్ అబ్బవరం కేవలం హీరో మాత్రమే కాదు , ఒకప్పుడు రైటర్ గా కూడా పని చేశాడు. తన మొట్టమొదటి కమర్షియల్ సూపర్ హిట్ ‘SR కళ్యాణ మండపం’ కి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ రాసింది మరెవరో కాదు , కిరణ్ అబ్బవరమే. ఈ సినిమా టైటిల్స్ పడేటప్పుడు ఈ విషయాన్నీ గమనించొచ్చు. అంతే కాకుండా , హీరో అవ్వకముందు ఆయన ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే డైరెక్షన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా పై ఆడియన్స్ లో ఆయన ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇండీ కూటమిలో పేరుకే 25 పార్టీలు నిజానికి 14 మాత్రమే

India aliance

INDIA Alliance దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఇండియా (INDIA) కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూటమిలో పేరుకే 25కు పైగా పార్టీలు ఉన్నప్పటికీ, వాస్తవంగా చురుకుగా పనిచేస్తున్నవి దాదాపు 14 పార్టీలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా పార్టీలు కేవలం పేరు కోసం మాత్రమే కూటమిలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అంతేకాదు, కూటమిలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకు తమ తమ రాష్ట్రాల్లోనే ఆశించిన స్థాయిలో బలం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని పార్టీలు వరుస ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కొంటుండగా, మరికొన్ని పార్టీలు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే శక్తి ఇండియా కూటమికి ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది.

కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విధానపరమైన విభేదాలు, నాయకత్వంపై స్పష్టత లేకపోవడం, రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాల్లో తలెత్తే వివాదాలు కూడా కూటమి బలహీనతలుగా కనిపిస్తున్నాయి. ఒకే లక్ష్యం కోసం కలిసిన పార్టీలు ఎన్నికల తర్వాత కూడా ఐక్యంగా కొనసాగగలవా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.

అందుకే రాజకీయ ప్రత్యర్థులు ఇండియా కూటమిని “అతుకుల బొంత”గా అభివర్ణిస్తున్నారు. కూటమి మనుగడ, ప్రభావం పూర్తిగా పార్టీల ఐక్యత, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం, బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించడంపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇండీ కూటమిలో పేరుకే 25 పార్టీలు నిజానికి 14 మాత్రమే దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

'ఓజీ 2' పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్.. ఊగిపోతున్న సోషల్ మీడియా..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2: పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనేది కేవలం ఒక చిత్రం కాదు , ఎమోషన్. వరుసగా రీమక్స్ చేస్తూ, పాన్ ఇండియన్ హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ లేడు , ఆయన స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదని అభిమానులు బాధపడుతున్న సమయం లో విడుదలైన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ సాధారమైనది కాదు. విడుదలకు ముందు జెన్ జీ యూత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ, అప్పట్లో జానీ సినిమాకు ఎలాంటి హైప్ ఉండేదో , ఈ సినిమాకు కూడా అదే రేంజ్ హైప్ ఏర్పడింది. అలాంటి హైప్ తో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో #RRR తో సమానమైన ఓపెనింగ్ వచ్చింది. ఓవర్సీస్ లో అయితే ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వచ్చింది.

అందులో ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ కేవలం ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. అయితే ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడం తో , కాస్త పొటెన్షియల్ తగ్గినా విషయం వాస్తవమే కానీ , సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా కేవలం తెలుగు వెర్షన్ నుండి 321 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహం అభిమానుల్లో ఉండేది. స్వయంగా పవన్ కళ్యాణ్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటికీ , ఉప ముఖ్యమంత్రి గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన షెడ్యూల్స్ ని చూసి , ఈ సినిమా ఉంటుందో లేదో అనే అనుమానం అభిమానుల్లో కలిగింది.

అంతే కాకుండా రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలకు శాశ్వతంగా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అనే టాక్ కూడా అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. సరిగ్గా ఇలాంటి సమయం లోనే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ అప్డేట్ ఒకటి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి వచ్చింది. ‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ 2 చేస్తున్నాడు. సుజిత్ ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నాడు , ఇండియా కి తిరిగి రాగానే ఇక ఓజీ 2 గురించి మాట్లాడుకుందాం’ అంటూ ఒక ట్వీట్ పడింది. అంతే ఇక, సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది , అరగంట లోపే 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టీ ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ నెల నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 మూవీస్ ఇవే..'పెద్ది' ఏ స్థానంలో ఉందంటే..

Top 5 Movies First Week Collections
Top 5 Movies First Week Collections

Top 5 Movies First Week Collections: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం విడుదలై విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం కొన్ని ప్రాంతాల్లో రీసెంట్ సూపర్ హిట్స్ దేవర , ఓజీ చిత్రాలను దాటేసింది. కొన్ని సెంటర్స్ లో అయితే #RRR రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టింది. సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలు ఏంటి?, పెద్ది ప్రస్తుతానికి ఏ స్థానం లో ఉంది అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాము.

1) #RRR : రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ , ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం విపరీతంగా నచ్చడంతో సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి మొదటి వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 187 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

2) పుష్ప 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా , కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై , మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో మొదటి వారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 158 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

3) కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ వెండితెర అద్భుతం గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 134 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

4) పెద్ది : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి , మొదటి వారం కూడా కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారం లో 125 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

5) ఓజీ : పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మొదటి వారం లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 121 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి.

అమెరికా దుర్మార్గానికి ఏపీ వాసి బలి.. ఒరేయ్ ట్రంప్ నువ్వు మట్టి కొట్టుకొని పోతావ్

US Military Attack
US Military Attack

US Military Attack: అమెరికా దుర్మార్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. గిట్టని దేశాల మీద రాళ్లు వేయడంలో.. తనకు అనుకూలంగా లేకపోతే దాడులు చేయడంలో అమెరికా సిద్ధహస్తమైన దేశం.. అమెరికా ప్రపంచ పెద్దన్నగా మారడానికి.. ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించడానికి ఎన్నో రకాల దుర్మార్గాలు చేసింది. ఇంకాను చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా చేసిన దాడి ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి జీవితంలో చీకట్లు నింపింది.

ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి చెందిన పట్నాల సురేష్ అనే వ్యక్తి మెరైన్ ఇంజనీర్. అతడు ఇండియన్ నేవీలో పని చేస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా అతడు ఇటీవల ఒమన్ వెళ్ళాడు. తన విధులు ముగించుకొని.. తిరిగి అదే ఓడలో ఇండియాకు ప్రయాణమవ్వగా.. అమెరికా దాడి చేసింది. ఒమన్ తీరంలో సురేష్ ప్రయాణిస్తున్న ఓడ మీద అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో సురేష్ తో సహా ముగ్గురు చనిపోయారు. సురేష్ కు భార్య, 13, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడు చనిపోయిన విషయాన్ని భారత నేవీ వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి.

భర్త చనిపోవడంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈనెల 24న సురేష్ వివాహ వార్షికోత్సవం ఉంది. దానిని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే సురేష్ తన భార్యతో అనేకసార్లు చెప్పాడు. ఆ ఏర్పాట్లలో భార్య నిమగ్నమై ఉంది. భర్త ఇండియాకు రాగానే.. అతనితో కలిసి ఈ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అమెరికా చేసిన దాడి వల్ల సురేష్ చనిపోయాడు. తన కుటుంబాన్ని చీకట్లో వదిలేసి వెళ్లిపోయాడు..

సురేష్ మెరైన్ ఇంజనీర్. ఇతడు విశాఖపట్నం వాసి. విధి నిర్వహణలో చురుకుగా ఉంటాడు. పై అధికారులకు ఇతడి పనితీరు అంటే చాలా ఇష్టం. అయితే దుర్మార్గపు అమెరికా చేసిన దాడి వల్ల ఇతడు చనిపోయాడు. ఇటీవల కాలంలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు చేపడుతుంది. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణనష్టానికి కూడా దారి తీస్తోంది. ఇరాన్ హార్మోజ్ సంధిని మూసివేయడంతో.. పరిస్థితి దారుణంగా మారిపోయింది. అమెరికా బలగాలు విపరీతంగా దాడులు చేస్తున్నాయి. దీంతో మధ్య ప్రాచ్యం లో మళ్లీ యుద్ధం మొదలైంది.

అమెరికా దళాలు చేసిన దాడులను అందరూ ఖండిస్తున్నారు. ఇలా దాడులు చేయడం వల్ల సురేష్ చనిపోయాడని.. ఈ దాడులకు రూపకర్త అయిన ట్రంప్ మట్టి కొట్టుకుని పోతాడని శాపనార్ధాలు పెడుతున్నారు. సురేష్ భార్య విలపిస్తున్న తీరు మాటలకు అందనిదిగా ఉంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. మరి కొద్ది రోజుల్లో తమ తండ్రి వస్తాడని భావించిన ఆ పిల్లలకు.. అతడి చివరి చూపు కూడా కరువైంది. సురేష్ మరణంతో నేవీ వర్గాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇప్పుడు లవ్.. ఖాళీ థియేటర్ లో స్టార్ట్ అయ్యి.. ఓయే రూమ్ లో ఎండ్ అవుతుంది.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

Allu Aravind Geetha Arts
Allu Aravind Geetha Arts

Allu Aravind viral comments : టాలీవుడ్ సీనియర్ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై ప్రధాన పాత్రల్లో నటించిన ‘దీవానా’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నేటి తరం ప్రేమ వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రస్తుత కాలంలో ప్రేమ ఎలా మారిందో తనదైన శైలిలో వివరించారు. “ఇప్పటి లవ్ అంటే ఖాళీగా ఉన్న థియేటర్లకు వెళ్లడం, కార్నర్ సీట్లలో కూర్చొని సినిమాలు చూడటం, తర్వాత షాపింగ్ మాల్స్ చుట్టూ తిరగడం, చివరికి ఓయో రూమ్‌లో ఎండ్ అవ్వడం” అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అరవింద్ వ్యాఖ్యల సందర్భంగా స్టేజ్‌పై ఉన్న హీరో విశ్వక్ సేన్ సరదాగా స్పందించారు. “అంటే ఏంటి సార్… నాకేమీ తెల్వదు” అంటూ అమాయకంగా ముఖం పెట్టి చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. విశ్వక్ సేన్ రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అవుతోంది.

ఇదే కార్యక్రమంలో యాంకర్ అడిగిన మరో ఆసక్తికరమైన ప్రశ్నకు అల్లు అరవింద్ తనదైన హాస్యంతో సమాధానం ఇచ్చారు. “మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా చూశారా?” అని ప్రశ్నించగా, “ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు. వాళ్లకు ఇప్పుడు పెళ్లయి మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు సరదాగా చెప్పినవే అయినప్పటికీ, నేటి యువత ప్రేమ వ్యవహారాలపై ఆయన చేసిన పరిశీలన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు ఆయన వ్యాఖ్యలను హాస్యంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం వాటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి.

ఛార్లెట్‌లో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Balakrishna Fans In Charlotte
Balakrishna Fans In Charlotte

Balakrishna Fans In Charlotte: అభిమానుల సందడితో మార్మోగిన థియేటర్ పరిసరాలు

అమెరికాలోని చార్లెట్ నగరంలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు.

Balakrishna Fans In Charlotte
Balakrishna Fans In Charlotte

తెలుగు సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా తనదైన నటన, పవర్‌ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ నేటికీ అదే ఉత్సాహంతో వరుస విజయాలను అందుకుంటున్నారని అభిమానులు పేర్కొన్నారు. ముఖ్యంగా Akhanda చిత్రం ద్వారా ప్రారంభమైన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మరింత విజయవంతమై, వరుసగా వంద కోట్ల క్లబ్ చిత్రాలతో మూడు తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని కొనియాడారు.

 

Balakrishna Fans In Charlotte
Balakrishna Fans In Charlotte

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన Samarasimha Reddy చిత్రాన్ని అభిమానులు పెద్ద ఎత్తున వీక్షించారు. థియేటర్ వద్ద నినాదాలు చేస్తూ, సంబరాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 

Balakrishna Fans In Charlotte
Balakrishna Fans In Charlotte

ఈ కార్యక్రమంలో ఛార్లెట్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

 

'పెద్ది' చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న జాన్వీ కపూర్..

Peddi Movie
Peddi Movie

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు , ఈ సినిమాని భారీ రేట్స్ పెట్టి కొనుగోలు చేసిన బయ్యర్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతున్నారు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ లో సరైన హిట్ లేదు , విడుదలైన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చాయి. బయ్యర్స్ చేతిలో ఒక్క రూపాయిల రొటేషన్ కూడా లేదు. అలాంటి సమయం లో ఎన్నో ఆశల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి 220 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, కేవలం మొదటి వారం లోనే 170 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుకి ఈ చిత్రం చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కాసేపు పక్కన పెడితే , ఈ చిత్రం లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినీ సెలబ్రిటీలు సైతం ఈ అంశంపై స్పందించారు , ఎక్కువ శాతం మంది జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిలిచారు. అయితే తనకు ఈ చిత్రం లో బోల్డ్ సన్నివేశాల్లో ఇష్టం లేకపోయినప్పటికీ డైరెక్టర్ డిమాండ్ ని బట్టే చేశానని సోషల్ మీడియా లో ఆమెకు సంబంధించిన ప్రైవేట్ చాట్ ఒకటి లీకైంది. ఇది నిజమా ?, అబద్దమా అనేది పక్కన పెడితే , ‘పెద్ది’ మూవీ మాత్రం జాన్వీ కపూర్ కి చాలా గొప్ప మేలు చేసింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ఈ చిత్రం లో నటించేందుకు ఆమె 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కి ఒప్పుకుంది. కానీ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో , మేకర్స్ ఆమెకు 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. రీసెంట్ గానే ఈ అమౌంట్ ని సెటిల్ చేసినట్టు తెలుస్తోంది.

ఒక విధంగా చెప్పాలంటే జాన్వీ కపూర్ మీద జరిగిన నెగెటివ్ పబ్లిసిటీ , ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ జాన్వీ కపూర్ ని ఈ స్థాయిలో విమర్శిస్తున్నారు, అంతలా ఆమె ఏమి చేసిందో చూద్దాం అని ఈ చిత్రానికి కదిలినవాళ్లు చాలా మంది ఉన్నారు. అలా ఆమె ఫ్యాక్టర్ ఈ సినిమాకు ఒక రేంజ్ పబ్లిసిటీ మెటీరియల్ గా మారడంతో మేకర్స్ ఆమెకు అదనంగా రెమ్యూనరేషన్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి , పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ నెల 19న తెలంగాణ లో పవన్ కళ్యాణ్ మరో సంచలనం సృష్టించబోతున్నాడా ..? సైలెంట్ గా ఉన్నోడిని గెలికేసారుగా..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan Telangana Visit: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత యాక్టీవ్ గా ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకపక్క పాలన పరంగా తనదైన మార్కు తో ముందుకు వెళ్తూ , మరోపక్క జనసేన పార్టీ ని బలోపేతం చెయ్యడానికి అన్ని విధాలుగా ప్లానింగ్ చేస్తున్నాడు. జనసేన పార్టీ ని కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రమే పరిమితం చేయకుండా, తెలంగాణ ప్రాంతానికి కూడా విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించిన అలజడి ఎలాంటిదో కళ్లారా చూసాము. కావాలని ఆయన్ని టార్గెట్ చేస్తూ , కాంగ్రెస్ పార్టీ జనసేన క్యాడర్ ని , జనసేన నాయకులను తెలంగాణ వ్యాప్తంగా యాక్టీవ్ అయ్యేలా చేసింది. ఒకపక్క తెలంగాణ పై తన ఫోకస్ ప్రస్తుతానికి లేదని పవన్ కళ్యాణ్ చెప్తూనే , మరోపక్క అక్కడ ఆ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాడు.

అందులో భాగంగా ఈ నెల 19 న ఆయన తెలంగాణ లో జనసేన పార్టీ పీకార్యాలయాన్ని గ్రాండ్ గా ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఏ ప్రాంతం లో ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాడు అనేది ప్రస్తుతానికి తెలియదు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం తెలంగాణ మీద ఆసక్తి లేకపోయినప్పటికీ,జనసేన పార్టీ క్యాడర్ మాత్రం ఒప్పుకోవడం లేదు , ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ లో జనసేన పార్టీ ని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాల్సిందే అని పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే వాళ్ళ కోసం ఆయన ఇకపై తెలంగాణ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆయన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం చూస్తుంటే , రాబోయే రోజుల్లో ఆయన అధికార కాంగ్రెస్ ని చాలా గట్టిగానే టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

ధోని వచ్చాడు.. పూనకాలు తెచ్చాడు.. వైరల్ వీడియో

MS Dhoni
MS Dhoni

MS Dhoni: ధోని.. ఈ రెండు అక్షరాల పదం టీమిండియా క్రికెట్ చరిత్రను మొత్తం మార్చేసింది. ధోనికి ముందు ధోని తర్వాత అన్నట్టుగా చేసింది.. అగ్రెసివ్ ఆట తీరును టీమిండియా కు సరికొత్తగా పరిచయం చేసింది. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని నేలమట్టం చేసింది. దక్షిణాఫ్రికా దూకుడును.. న్యూజిలాండ్ వేగాన్ని తగ్గించింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. అందువల్లే ధోని టీమ్ ఇండియాలో అద్భుతమైన ఆటగాడిగా.. అనితర సాధ్యమైన సారథిగా నిలిచిపోయాడు.

ధోని జాతీయ జట్టు నుంచి నిష్క్రమించినప్పటికీ.. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో చెన్నై జట్టు గొప్పగా ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్లో ఆడతాడు అనుకున్నప్పటికీ.. అతడు ఒక మ్యాచ్లో కూడా కనిపించలేదు. పైగా గాయాల వల్ల ధోని మైదానంలో కనీసం అడుగు కూడా పెట్టలేదు.. ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ.. అవి కేవలం అభిమానులకు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇచ్చాయి.

ఇటీవల ipl సీజన్లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత చెన్నై జట్టు ప్లేయర్లు అభిమానులకు అభివాదం చేశారు. అందులో ధోని కూడా ఉన్నాడు. అభిమానులతో ఫోటోలు దిగాడు. జట్టు ప్లేయర్లతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. చిరునవ్వుతో కనిపించాడు. అతడు మైదానంలోకి దిగడమే ఆలస్యం చెన్నై అభిమానులు కేరింతలు కొట్టారు. ఒకవేళ అతడు గనుక బ్యాట్ పట్టుకొని రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో.

అభిమానులు తన రాక గురించి విపరీతంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో చిరుకానుక అందించాడు ధోని. ప్రస్తుతం ఝార్ఖండ్ t20 లీగ్ నడుస్తోంది. ఆట్రోఫీలో భాగంగా ధోని మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టాస్ ప్రక్రియలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు నిర్వాహకులతో మాట్లాడాడు. ఆయా జట్ల ప్లేయర్లతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. చివరికి భార్య.. కుమార్తెతో కలిసి మైదానంలో సందడి చేశాడు. ఆ తర్వాత రాంచి మైదానంలో కూర్చొని మ్యాచ్ చూసాడు.. ధోని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో రాంచీ మైదానం హోరెత్తిపోయింది. అంతేకాదు ధోని వస్తున్నాడని ముందుగానే నిర్వాహకులు చెప్పడంతో టికెట్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు మైదానం కూడా ప్రేక్షకులతో కిటకిటలాడింది.

కవిత చేతిలో టిఆర్ఎస్.. గుంజుకోవడానికి సిద్ధంగా కెసిఆర్.. తెలంగాణలో ఏం జరుగుతోంది..

K Kavitha TRS Row
K Kavitha TRS Row

K Kavitha TRS Row: జాతీయస్థాయిలో చక్రాలు తిప్పాలని.. మోడీని గద్దె దించాలని అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మస్తు కలలుగా కన్నాడు కదా.. గాలి మోటార్లలో పంజాబ్, తమిళనాడు, కేరళ, బీహార్, ఉత్తర ప్రదేశ్ మొత్తం తిరిగి వచ్చాడు కదా.. రైతులకు చెక్కులు (తెలంగాణ సొమ్ము) కూడా ఇచ్చాడు కదా. ఏకంగా తెలంగాణ ప్రజలు చెల్లించిన సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయంగా సలహాదారుడిని కూడా నియమించుకున్నాడు కదా.. ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటే.. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కారు చక్రాలు విరిగిపోయాయి. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లు రావడంతో కారు షెడ్డు కి వెళ్లాల్సి వచ్చింది.

ఇక్కడితోనే కారు పార్టీ పరిస్థితి అయిపోలేదు. కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. కారు పార్టీ అధినేత కుమార్తె కవిత బయటికి వచ్చేసారు. ఏకంగా రాజకీయ పార్టీని పెట్టేశారు. దానికి తెలంగాణ రక్షణ సేన అని నామకరణ చేశారు. తన తండ్రి కాదనుకున్న టిఆర్ఎస్ ను తనకు సొంతమయ్యేలా చేసుకున్నారు. ఫలితంగా టిఆర్ఎస్ అధినేత్రి అయిపోయారు.

నాడు దేశంలో గత్తర లేపాలి అనుకున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో గెలవ లేకపోవడంతో.. మళ్లీ ఫామ్ హౌస్ లోకి వచ్చేసారు. భారత రాష్ట్ర సమితి గా పార్టీ పేరును మార్చి తప్పు చేశామని గతంలోనే కేటీఆర్ అనేక సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరును మార్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పేరు ఎవరికి కేటాయించకుండా ఉండడానికి ఎన్నికల సంఘాన్ని కలిచే ఆలోచనలో గులాబీ పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కవిత ఆమధ్య టిఆర్ఎస్ పార్టీ ప్రకటనను గులాబీ పార్టీ నేతలు తప్పు పట్టారు. దీనిపై 600 అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి వెళ్ళాయి. మరోవైపు మహారాష్ట్రలో సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమాజ సేవా సంస్థ.. టిఆర్ఎస్ పేరును ఎవరికి కేటాయించకూడదని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎన్నికల సంఘాన్ని కలవడానికి కవిత వెళ్తున్నట్టు తెలుస్తోంది.

మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిగా ఇప్పుడు టిఆర్ఎస్ కోసం కొట్లాడుతోంది. మొన్నటిదాకా జాగృతి పేరుతో కార్యకలాపాలు సాగించిన కవిత టిఆర్ఎస్ పేరును తనకు మాత్రమే సొంతం అయ్యేలా కదుపుతున్నారు.. మధ్యలో మహారాష్ట్ర వాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ అనే పదాన్ని దేశ రాజకీయాల కోసం పక్కన పెట్టిన వాళ్ళు… ఈరోజు సొంత రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి మళ్లీ తెలంగాణ అనే పదాన్ని అక్కున చేర్చుకోవడానికి ప్రయత్నించడం నిజంగా హాస్యాస్పదం. మళ్లీ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ గురించి.. తెలంగాణ భావోద్వేగం గురించి
.. తెలంగాణ మట్టి గురించి మాట్లాడతారు.

డైరెక్టర్ బుచ్చి బాబు పై జగపతి బాబు ఫైర్..నాది నాకు ఇచ్చేయండి అంటూ హాట్ కామెంట్స్..

Jagapathi Babu fires on Buchi Babu
Jagapathi Babu fires on Buchi Babu

Jagapathi Babu fires on Buchi Babu: ఒక పక్క కళ్ళు చెదిరే వసూళ్లు , మరోపక్క వివాదాలతో ‘పెద్ది’ చిత్రం ప్రయాణం సాగుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయాయి. కర్ణాటక , తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఓపెనింగ్స్ సంగతి పక్కన పెడితే , తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం లాంగ్ రన్ ని చూస్తుంటే గతం లో ‘రంగస్థలం’ లాంగ్ రన్ గుర్తుకొస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా హీరోల సినిమాలు ఒక్కసారి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే, ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరని , ‘పెద్ది’ చిత్రం లాంగ్ రన్ లో కచ్చితంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ఎంత గొప్ప పేరొచ్చిందో , జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్రకు కూడా అదే రేంజ్ పేరొచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జగపతి బాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. తన పాత్రకు సంబంధించిన అనేక సన్నివేశాలను డైరెక్టర్ బుచ్చి బాబు తొలగించాడని , ఈ విషయం లో నేను అతనితో పెద్దగా గొడవ పడ్డానని చెప్పుకొచ్చాడు జగపతి బాబు. ఆయన మాట్లాడుతూ ‘పెద్ది , అప్పలసూరి పాత్రలకు మధ్య , అద్భుతమైన బాండింగ్ ఉన్న సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే పెద్ది చిత్రాన్ని చూసిన చాలా మంది నాతో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్న సన్నివేశాలు ఇంకా కొన్ని ఉండుంటే బాగుండేది అనిపించిందని అన్నారు. సినిమా నిడివి దృష్ట్యా బుచ్చి బాబు వాటిని తొలగించినట్టు నాతో చెప్పాడు. కానీ నేను అతని మాటలకు ఏకీభవించలేదు , కచ్చితంగా ఆ సన్నివేశాలు అతనికి నచ్చి ఉండవు , అందుకే తీసేసి ఉంటాడు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘గతం లో నేను ఏ సినిమాకు కూడా ఇలా మాట్లాడలేదు. కేవలం నాకు సంబంధించిన పాత్రకు న్యాయం చేశానా ?, లేదా ? అని మాత్రమే చూసుకునేవాడిని. కానీ పెద్ది లో నాకు చాలా మంచి సన్నివేశాలు పడ్డాయి. నటుడిగా నాకు పూర్తి స్థాయి సంతృప్తి ని ఇచ్చిన చిత్రమిది. కానీ నా సన్నివేశాలు కట్ చేయడం తో నాకు కోపం వచ్చింది. నా సన్నివేశాలు నాకు ఇచ్చేయండి , నేను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టుకుంటాను అని బుచ్చి బాబు కి చెప్పాను. కానీ బుచ్చి బాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. అయితే జగపతి బాబు గొడవ చేయడం వల్లో ఏమో తెలియదు కానీ , ఈ సన్నివేశాలను ఈ శనివారం నుండి సినిమాలో జత చేయనున్నారు. వీటికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

ద్రావిడ్ కుమారుడికి బీసీసీఐ బంపర్ ఆఫర్

BCCI offer to Dravid son
BCCI offer to Dravid son

BCCI offer to Dravid son: రాహుల్ ద్రావిడ్.. టీమిండియా టెస్ట్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిన ఆటగాడు ఇతడు.. ఆటగాడిగా మాత్రమే కాకుండా.. శిక్షకుడిగా కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు ద్రావిడ్. ఇతడి శిక్షణలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ t20 వరల్డ్ కప్ అందుకుంది.

రాహుల్ ద్రావిడ్ గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వైభవ్ సూర్య వంశీని రాజస్థాన్ జట్టులోకి తీసుకువచ్చింది ఇతడే. అతడికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఈ స్థాయిలో బ్యాటింగ్ చేసే విధంగా రూపొందించింది కూడా ఇతడే. అదే విషయాన్ని సూర్య వంశీ అనేక సందర్భాల్లో చెప్పాడు. తాను లావు తగ్గడానికి రాహుల్ ద్రావిడ్ సార్ ఇచ్చిన శిక్షణ ఉపకరించిందని సూర్య వంశీ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. అదే అతని కుమారుడికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు విపరీతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అతడి కుమారుడికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారత అండర్ 19 జట్టు త్వరలో శ్రీలంకలో పర్యటించబోతోంది. భారత జట్టుకు యష్ వర్ధన్ సింగ్ చౌహన్ నాయకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ జట్టులో రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కు చోటు లభించినట్టు తెలుస్తోంది.. భారత జట్టుకు ఇతడు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తాడు. ఇతడి వయసు 16 సంవత్సరాలు.

అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ఒక ఆటగాడిని కూడా ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఈ పర్యటనలో కొత్తజట్టును తీర్చిదిద్దడానికి బీసీసీఐ సన్నాహకాలు చేపట్టిందని తెలుస్తోంది. ఆల్ రౌండర్లకే మేనేజ్మెంట్ పెద్దపీట వేసింది. గత ఏడాది అన్వయ్ అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.. ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 జట్టుతో నాడు భారత బీ జట్టు ఆడింది. అప్పుడు భారత బీ జట్టులో అతడు కీలక ఆటగాడు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన ఈ సిరీస్లో అన్వయ్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అమీరి చేతిలో తొలి బంతికే అవుట్ అయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం ఇతడు సత్తా చూపిస్తున్నాడు. వికెట్ కీపర్ గా.. బ్యాటర్ గా అదరగొడుతున్నాడు.

జట్టు వివరాలు ఇవే

ఇషాన్ సూద్, సాగర్, రాయచందాని, చౌహన్, వినీత్, అర్జున్, కుషాగ్ర, రజత్, అన్వయ్, అన్మోల్జిత్ సింగ్, యశ్వీర్, రోహిత్, కావ్య పరేష్, మోహిత్ ఉల్వ.

ఈ సిరీస్లో భాగంగా 3 వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరుగుతాయి. హంబన్ టోటా వేదికగా భారత్ 3 వన్డేలు ఆడుతుంది. గాలి వేదికగా జూలై 13 నుంచి 16, కొలంబ వేదికగా జూలై 20 నుంచి 23 మధ్య రెండు యూత్ టెస్టులు జరుగుతాయి.

వన్డేలు, టి20 లు సరే.. మరి దాని సంగతేంటి.. అందులో అగ్రస్థానం ఎప్పుడు..

India Test cricket ranking
India Test cricket ranking

India Test cricket ranking: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం టీమిండియా టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అది చాలా రోజులపాటు కొనసాగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి జట్లు ఉన్నప్పటికీ భారత్ ఆధిపత్యాన్ని అవి అడ్డుకోలేకపోయాయి.

కాలం మారింది. టీమ్ ఇండియా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. 2024, 2026 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లు టీమిండియా సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ట్రోఫీ దక్కించుకునే క్రమంలో మధ్యలోనే ఓటమి వల్ల తన ప్రయాణాన్ని ముగించింది.

వన్డేలపరంగా, టి20 లపరంగా టీమ్ ఇండియాకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు టీమ్ ఇండియా అత్యంత బలంగా కనిపిస్తోంది. యంగ్ ప్లేయర్లు వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొడుతున్నారు. పరుగుల వరద పారిస్తున్నారు. ఐపీఎల్ లో సత్తా చూపించిన ప్లేయర్లకు మేనేజ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో వారు వాటిని అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాదు అద్భుతమైన ఆట తీరితో అదరగొడుతున్నారు.

వైట్ బాల్ ఫార్మాట్లో టీమిండియా దుమ్ము రేపుతున్న నేపథ్యంలో టాప్ ర్యాంకును సుస్థిరం చేసుకుంటున్నది. పైగా ఈ ఫార్మాట్లలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ అదరగొడుతున్నది. న్యూజిలాండ్ వల్ల కానిది.. ఆస్ట్రేలియా చేయలేనిది.. దక్షిణాఫ్రికా కలలో కూడా ఊహించలేనిది.. భారత్ చేసి చూపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రెడ్ బాల్ విషయంలోనే భారత్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.

టెస్ట్ విషయానికి వచ్చేసరికి టీమిండియా ప్లేయర్లు తడబడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేకపోతున్నారు. రోజుల తరబడి క్రికెట్ ఆడలేక పోతున్నారు. ప్రస్తుతం టీమిండియా రెడ్ బాల్ ఫార్మాట్ లో మూడో స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో రెండుసార్లు టీం ఇండియా ఫైనల్స్ వెళ్ళింది. రెండుసార్లు కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఒకసారి న్యూజిలాండ్, మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది. గత సీజన్లో కనీసం ఫైనల్ కూడా వెళ్లలేకపోయింది.

స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో.. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. అంతకుముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమిపాలైంది. ఇవన్నీ కూడా టీమిండియా టెస్ట్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అంతేకాదు డబ్ల్యూటీసి పాయింట్ల జాబితాలో టీమిండియా ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి బంగ్లాదేశ్ కూడా మనకంటే పై స్థానంలో ఉంది. శ్రీలంక కూడా అప్పర్ హ్యాండ్ లో కొనసాగుతోంది. వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే టీమిండియా ప్లేయర్లు సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడాలి. టి20 ఫార్మాట్ నుంచి బయటికి రావాలి.. డిఫెన్స్ బ్యాటింగ్ ను ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే టీమ్ ఇండియా తెలుపు, ఎరుపు విభాగాలలో మొదటి స్థానంలో ఉంటుంది.