Priyanka Praveen Case: రోజురోజుకు సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. తాత్కాలిక సంబంధాల కోసం.. శాశ్వత అనుబంధాలను వదిలేసుకుంటున్నారు. క్షణకాలంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమె కథ కూడా ఇటువంటిదే. పైగా ఆమె ఉన్నత విద్యావంతురాలు. న్యాయవాదిగా పని చేస్తోంది. అయినప్పటికీ విచక్షణ మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కుమార్తెను తల్లి అంతం చేసింది. ఈ సంఘటన కేవలం ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రియుడితో కలిసి ఉండడానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన చాలా రోజుల క్రితమే జరిగింది. పోలీసుల కళ్ళు కప్పి ఆ తల్లి పరారీలో ఉంది. ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు హాసన ప్రాంతానికి తీసుకొచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని దావనగరి ప్రాంతానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రియాంక లాయర్ గా పనిచేస్తోంది. వీరికి 11 సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉన్నారు. వీరు కాడుగూడి ప్రాంతంలో ఉండేవారు. అప్పుడు మోహన్ అనే వ్యక్తి ఈమెని కలిశాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఆ పరిచయంతోనే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.
ప్రవీణ్ కు ఈ విషయం తెలిసింది. దీంతో వారిద్దరినీ అతడు హెచ్చరించాడు. భర్త మాటలు తట్టుకోలేక ప్రియాంక తన కుమార్తెను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మోహన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలుపెట్టింది. అంతేకాదు భర్తకు డైవర్స్ నోటీసులు కూడా పంపించింది. అయితే ఇటీవల ప్రియాంక తన కుమార్తె వెన్నెల చనిపోయిందని భర్తతో చెప్పింది. ఇదే సమాచారం తన సోదరుడికి కూడా చేరవేసింది. అంత్యక్రియల అనంతరం పోస్టుమార్టం రిపోర్ట్ భర్తకు పంపించింది. అందులో అనేక రకాల అనుమానాలు ఉండడంతో ప్రవీణ్ రిపోర్టును విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడికి పంపించాడు. ప్రవీణ్ స్నేహితుడు విదేశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఆ పోస్టుమార్టం నివేదికలో అన్ని తప్పులు ఉన్నట్టు అతడు గుర్తించాడు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా.. కీలక విషయాలు బయటకు వచ్చాయి.
వెన్నెలను ప్రియాంక, మోహన్ గొంతు నులిమి చంపేశారని తేలింది. వారిద్దరి ఏకాంతానికి అడ్డుగా ఉందని ఆమెను చంపినట్టు సమాచారం. మోహన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ప్రియాంక పరారీలో ఉంది. కొద్దిరోజులుగా ఆమె హాసన ప్రాంతంలో తలదాచుకుంటున్నది. దీంతో పోలీసులు ఆమెను గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.. మరోవైపు మోహన్ మాయమాటలు నమ్మి ప్రియాంక నిండా మునిగిపోయింది.
మోహన్ డబ్బున్న వ్యక్తి కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతకంటే కాదు. అతడు అద్దెకు ఇల్లు సమకూర్చే బ్రోకర్. ఈ విషయాన్ని తెలుసుకోలేక.. తాత్కాలిక వ్యామోహానికి అలవాటు పడి ప్రియాంక జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రియాంక వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఆమె తీరు పట్లనెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు



















మార్చురీలో ఉన్న పురుషుల ప్రైవేట్ పా** ను వదిలిపెట్టలేదు ఈ లేడీ డాక్టర్.. వెలుగులోకి దారుణం
Lady Doctor Remarks: వైద్యులను మనం దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది. మన ఎదుగుదలలో తండ్రి తోడ్పడుతుంటాడు. కానీ వైద్యులు మనకు పునర్జన్మ అందిస్తూ ఉంటారు. మనం జబ్బు పడినప్పుడు.. తిరిగి కోలుకోవడంలో సహాయపడుతుంటారు. అందువల్లే వైద్యులను కనిపించే దేవుళ్ళు అని అంటుంటాం.
ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి చాలామంది సరికొత్త వన్నె తీసుకొచ్చారు. వైద్యరంగంలో సరికొత్త మార్పులకు బీజం వేశారు. కానీ కొంతమంది వైద్యులు మాత్రం ఆ వృత్తికి తీవ్రమైన మకిలి తీసుకొస్తున్నారు. అటువంటి వారి వల్ల వైద్యులు అంటేనే సమాజం చీ కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. అయితే ఈ జాబితాలో ఈ మహిళ వైద్యురాలు అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసిన పని అంత పనికిమాలినది కాబట్టి. పైగా ఈ విషయాన్ని తనే బయటపెట్టుకుంది.
ఇటీవల కాలంలో స్టాండ్ అప్ కామెడీ షో లు పెరిగిపోయాయి. అందులో బీ గ్రేడ్ కంటెంట్ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల చాలామంది నవ్వుకుంటున్నారు గాని.. పచ్చి బూతుల వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందో మిగతా వాళ్లకు తెలుసు. ఆ వైద్యురాలు స్టాండప్ కామెడీలో లైన్ తప్పింది.. అనకూడని మాట అనేసింది.. మార్చురీలో ఉండే పురుషుల శవాల ప్రైవేట్ పార్ట్స్ పరిమాణాల మీద తాము జోకులు వేసుకుంటామని ఆ వైద్యులు చెప్పింది.. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడంతో ఆమె వెంటనే క్షమాపణ చెప్పింది..
ఇటీవల కాలంలో ఈ తరహా లేకి వ్యాఖ్యలు చేసే వారు చాలామంది పెరిగిపోతున్నారు. దానికి స్టాండ్ అప్ కామెడీ అని పేరు పెడుతున్నారు.. ఇక గురుగ్రామ్ ప్రాంతంలో ఐటీ ఇంజనీర్ గా పనిచేసే హిమాన్షు అనే వ్యక్తి.. స్టాండ్ అప్ కామెడీలో బిర్యానీ వ్యాఖ్యలు కూడా వివాదాన్ని సృష్టించాయి.”నేను ఒక అమ్మాయికి 370 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిచ్చాను.. దానికి బదులుగా ఆమె ఏమిస్తుంది.. నేను ఏం కోరుకుంటాను. శారీరక సుఖాన్నే కదా” అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడాడు.
అతడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వివాదాన్ని సృష్టించాయి. దీంతో ఆ కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. వీరు మాత్రమే కాదు అప్పట్లో కొంతమంది ఏపీ రాజకీయాల గురించి కూడా చెత్త వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ.. చంద్రబాబు మీద అడ్డగోలుగా మాట్లాడారు. వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. స్టాండప్ కామెడీ పేరుతో వీరు చేస్తున్న లేకి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి.