Home Blog Page 137

తుని పాపకు ఏమైంది? ఎందుకు దొరకడం లేదు? ఎలా మిస్ అయింది?

Tuni Missing Girl
Tuni Missing Girl

Tuni Child Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులు దాటుతున్న ఎటువంటి క్లూ లభించడం లేదు. ఆ చిన్నారి కోసం వందలాది మంది పోలీసులు గట్టిగానే గాలిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయినా సరే ఆచూకీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ.. రోజుకో కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే చివరకు పూర్తి కిడ్నాప్ కోణంలోని ఈ ఘటన జరిగినట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పెంపుడు కుక్కకు జిపిఆర్ఎస్ అమర్చి వెతుకులాట ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు కుటుంబ కలహాల అనుమానాల నేపథ్యంలో తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇలా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఏది కూడా కొలిక్కి రావడం లేదు. చిన్నారి ఆచూకీ దొరకడం లేదు.

* తల్లి ఇచ్చిన వాంగ్మూలంతో…
చిన్నారి తల్లి భవాని ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో పెద్ద గొడవ జరిగిందని ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి తన భర్తను చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని ఆయన పేర్కొన్నారు. అక్కడ కొద్ది రోజులకే మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని ఆమె తెలిపారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇంకోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాధారణంగా ఎంత చిన్న వయసున్న చిన్నారులు పూర్తిగా పరిచయం ఉన్న వారితోనే వెళ్తారు. అందుకే ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక తెలిసిన వారి పని అయి ఉంటుందన్న పోలీస్ అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల కాల్ డేటా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

* దొరకని ఆనవాళ్లు..
పాప అదృశ్యమైన మొదటి రెండు నుంచి మూడు గంటల సమయాన్ని పోలీసులు గట్టిగా గమనిస్తున్నారు. గ్రామంలో సిసి పుటేజీలు పరిశీలిస్తున్నారు. కానీ ఎక్కడ చిన్నారి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడైనా దాచారా? లేకుంటే గ్రామాన్ని దాటించేసారా అనే కోలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీయడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

* తండ్రిని ప్రశ్నిస్తున్న పోలీసులు..
మరోవైపు చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆకస్మాత్తుగా వచ్చిన ఆ కుక్క కళ్ళలో భయం కనిపించింది. కానీ పోలీసులతో పాటు అక్కడ ఉన్న వారిని చూసి కొంత భయపడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకుల సహాయంతో చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో, రౌద్రంగా కనిపిస్తోంది ఆ కుక్క. అయితే ఆ కుక్కకు జిపిఎస్ పరికరాన్ని అమర్చి పోలీసులు మళ్లీ అడవిలోకి ఆ కుక్కను వదిలారు. అయితే కొంత దూరం వెళ్లిన ఆ కుక్క తిరిగి మళ్ళీ చిన్నారి ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయింది. దీంతో పోలీసులు రూటు మార్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా ఘటన జరిగి ఉంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వారం రోజులు దాటుతున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

డ్రైవర్ గా మారిన విజయ్.. సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారు..

CM Vijay
CM Vijay

Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతిరోజు విజయ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు.. పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అందువల్లే మీడియా మొత్తం విజయ్ నామస్మరణ చేస్తోంది. గతంలో జాతీయ మీడియా తమిళ రాజకీయాలను అంతగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు తమిళనాడుకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. దీనిని బట్టి విజయ్ తమిళ పాలిటిక్స్ ను ఏ విధంగా మార్చారో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ అన్ని మతాలను సమానంగా ఆచరిస్తారు. క్రైస్తవుడు అయినప్పటికీ తన తల్లి కోరిక కోసం తమిళనాడులో సాయిబాబా ఆలయాన్ని కట్టించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయిబాబా ఆలయానికి ఆయన వెళ్లారు. అంతేకాదు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో మూకాంబిక ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అకస్మాత్తుగా విజయ్ అక్కడికి ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నలు తమిళనాడు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కావేరి నది మీద కర్ణాటక ప్రభుత్వం డ్యాం కడుతోంది. దీనిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ కర్ణాటక వెళ్లడం ఒకరకంగా చర్చకు దారి తీసింది.

మూకాంబిక ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో ఉంటుంది. ఇది మంగళూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ముకాంబిక ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు తన సీఎం కాన్వాయ్ లోని కారును నడుపుకుంటూ వెళ్లిపోయారు. అంతేకాదు మధ్యలో ఒక అభిమాని విజయ్ ని గుర్తుపట్టి చెయ్యి ఊపారు. దానికి విజయ్ కూడా బదులుగా అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సంచలనం కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్న విజయ్.. ఇప్పుడు ఏకంగా 130 కిలోమీటర్ల పాటు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విజయ్ కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందువల్లే అతడు తన కాన్వాయ్ లోని కారును ఇలా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. చాలా కాలం తర్వాత కారు స్టీరింగ్ పట్టిన విజయ్.. స్వేచ్ఛగా డ్రైవింగ్ చేశాడు. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఉల్లాసంగా కనిపించాడు. సూటు.. బూటు.. చేతిలో స్టీరింగ్ అదిరిపోయిందయ్యా విజయ్ అంటూ తమిళ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సీఎం పదవి పక్కన పెట్టి విజయ్ డ్రైవర్ గా మారిపోయారని.. ఆస్థానంలో ఆయనకు నచ్చిన మహిళను కూర్చోబెడతారేమోనని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం..

Today 22 June 2026 Horoscope
Today 22 June 2026 Horoscope

Today 13 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు స్నేహితుల సహాయంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి పనులన్నీ ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అనుకున్న కోరికలను ఈరోజు నెరవేరుస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సీనియర్ల మద్దతు ఉండడంతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దుబార ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విహారయాత్రలకు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా నడుస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని గ్రహాల అనుకూలతతో మనోధైర్యం పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాలు అందుతాయి. కొత్త బాధ్యతలు అందే అవకాశం ఉంది. వ్యాపారులు అనుకోకుండా ఆదాయం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని అవసరాల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ప్రాజెక్టులు పూర్తికావడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు తమ తెలివిని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించని లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. స్నేహితుల నుంచి సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త బాధ్యతలను చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది.

మరోసారి వాయిదాపడిన అఖిల్ 'లెనిన్' చిత్రం..? ఈసారి కారణం ఏంటంటే..

Lenin Movie Collections
Lenin Movie Collections

Lenin Release Date: ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత , బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్, ‘లెనిన్’ చిత్రం తో ఈ నెల 25 న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ లో బోలెడన్ని ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. అంతే కాకుండా అఖిల్ ఈ చిత్రం లో చాలా అద్భుతంగా నటించాడని , ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి అఖిల్ ఈ సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోబోతున్నాడని, ఇక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదని అంటున్నారు. అలాంటి సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఈ చిత్రాన్ని మే డే సందర్భంగా ‘మే 1’ న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 30 న ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుందని అప్పటికే ఆ చిత్ర మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం తో , అఖిల్ కి రామ్ చరణ్ తో ఉన్నటువంటి అనుబంధానికి విలువ ని ఇస్తూ, మా ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 25 కి వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు నిర్మాతలు. కానీ అసలు నిజం అది కాదు, సినిమా ఇంకా పూర్తి కాకపోవడం వల్లే వాయిదా పడిందని ఇప్పుడు అర్థం అవుతోంది. ట్రేడ్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా జూన్ 25 న కూడా విడుదల కావడం లేదట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా సమయం తీసుకుంటుందని , కొన్ని VFX షాట్స్ డెలివరీ అవ్వాల్సిన అవసరం ఉందని , ఇప్పటి వరకు అవి డెలివరీ అవ్వలేదని అంటున్నారు.

అంతే కాకుండా ఎడిటింగ్ వర్క్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదట. కేవలం ఫస్ట్ హాఫ్ ని మాత్రమే ఇప్పటి వరకు లాక్ చేసినట్టు సమాచారం. రీ రికార్డింగ్ వర్క్ కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని జులై కి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా , అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణం లో భాగం పంచుకుంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడం తో , ఆమె స్థానంలోకి భాగ్యశ్రీ ని తీసుకున్నారు. ఈ చిత్రం లో అఖిల్ గుడ్డివాడిగా నటించబోతున్నాడని టాక్.

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'రావు బహదూర్' ట్రైలర్.. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా అంటే సాహసమే..

Rao Bahadur Trailer
Rao Bahadur Trailer

Rao Bahadur Trailer: విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సత్యదేవ్. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై, ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ లో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ చిత్రాలు ఏమి లేవు కానీ , పర్వాలేదు , అద్భుతమైన నటుడు , డిఫరెంట్ తరహా సినిమాలు చేస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా ఆయన ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేష్ మహా తో ‘రావు బహదూర్’ అనే సినిమా చేశాడు . ఈ చిత్రానికి నిర్మాత మరెవరో కాదు , సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫస్ట్ లుక్ , గ్లింప్స్ వీడియో దగ్గర నుండే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఎప్పటి లాగానే సత్య దేవ్ మరో డిఫరెంట్ జానర్ సినిమా చేసాడు అనిపించుకున్నాడు.

అయితే నేడు విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే, సత్యదేవ్ ఈసారి కమర్షియల్ గా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో మాత్రమే కాదు , ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక సినిమా కూడా తెరకెక్కలేదు. క్యాన్సర్ చివరి స్టేజి లో ఉన్న రావు బహదూర్ , అన్నేళ్లు ఎలా బ్రతికాడు?, ఇతను సామాన్యుడు కాదు , ‘మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్’ అంటూ డాక్టర్లు సైతం చెప్తుంటారు ఈ టీజర్లో. అదే విధంగా ఈ టీజర్ లో హీరో సత్యదేవ్ ని గతం వెంటాడుతున్నట్టు కూడా చూపించారు. కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా ఆడియన్స్ కి అర్థం అయ్యేలా ఈ టీజర్ ని కట్ చేయలేదు కానీ , కచ్చితంగా సినిమాలో వావ్ అనిపించే మూమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది.

వెంకటేష్ మహా దర్శకత్వం లో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో వచ్చే ట్విస్ట్ ఒకటి ఆడియన్స్ ని మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ ట్విస్టులలో ఇది ఒకటి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక నేడు టీజర్ లాంచ్ ఈవెంట్ లో ‘రావు బహదూర్’ గురించి హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ ని చూసే ఆ రేంజ్ లో షాక్ కి గురయ్యారు. ఇక ఈ చిత్రం లో వచ్చే ట్విస్టులు , స్క్రీన్ ప్లే ని చూసి మీరంతా ఏమైపోతారో అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా , ఈ టీజర్ ని చూసి థ్రిల్ కి గురై కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు . ఆ పోస్టు ని మీరు క్రింద చూడొచ్చు.

కేరళం మోడల్.. స్టైల్ గా ఫ్లైట్ దిగింది.. అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేస్తే..

Kerala Model Arrest
Kerala Model Arrest

Kerala Model Arrest: ఆ మధ్య కర్ణాటకలో రన్యా రావు అనే ఓ నటి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. తనకున్న సెలబ్రిటీ హోదా వాడుకుంటూ బంగారాన్ని అక్రమంగా దుబాయ్ ప్రాంతం నుంచి తీసుకురావడం మొదలుపెట్టింది. కొద్దిరోజులపాటు ఈ దందా సక్రమంగానే సాగింది. ఆ తర్వాత తనిఖీలలో అధికారులకు దొరికిపోయింది. జైలు శిక్ష కూడా అనుభవించింది. ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటికి వచ్చింది. కేవలం ఈమె మాత్రమే కాదు. సెలబ్రిటీలలో చాలామంది ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు . ఇప్పుడు ఈ జాబితాలో కేరళం మోడల్ కూడా చేరిపోయింది. కాకపోతే ఆమె బంగారం స్మగ్లింగ్ చేయలేదు.. అంతకు మించిన వ్యవహారంలో పీకల లోతు మునిగిపోయింది.

ఆమె పేరు హర్షా సన్నీ. మోడల్ గా కొనసాగుతోంది. మిస్ కేరళం 2026 లో రెండవ స్థానంలో నిలిచింది. సెలబ్రిటీగా సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన ఈమె దారి తప్పింది. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయింది. పైగా వాటిని తాగి మత్తులో ఉండిపోయింది. గురువారం రాత్రి బ్యాంకాక్ నుంచి ఆమె ముంబై విమానాశ్రయానికి వచ్చింది. ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులను చూసిన ఆమె కంగారు పడింది. దీంతో వారిలో అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే ఆమె బ్యాగును పరిశీలించారు. అందులో ఏకంగా వ్యాక్యూమ్ సీల్ చేసి ఉన్న 11 కేజీల మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వాటి విలువ ఏకంగా 11.8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు.

కొంతకాలంగా హర్షా మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తూ.. ఇక్కడ ఏకంగా వ్యాపారం మొదలు పెట్టినట్టు సమాచారం. ఖరీదైన నగరాలలో వీటిని ఆమె విక్రయిస్తోంది. ఈమె వెనక కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. ఈమె ద్వారా మత్తు పదార్థాలు తెప్పించి.. హై ప్రొఫైల్ వ్యక్తులకు వాటిని విక్రయిస్తున్నారు. ఇలా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. వీరి వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హర్ష మోడలింగ్లో ఉన్నప్పుడే మత్తు పదార్థాలకు బానిసగా మారినట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ వ్యాపారం లోకి ఆమె ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తాయి. ఏకంగా 11 కిలోల మత్తు పదార్థాలను ఆమె అక్రమంగా తీసుకొస్తుంది అంటే.. ఆమె వెనుక ఎంతటి పెద్ద నెట్వర్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ 11.82 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మాత్రమే ఈమె ఈ స్థాయిలో మత్తు పదార్థాలు తీసుకువచ్చిందా.. గతంలో కూడా ఇటువంటి వ్యవహారాలకు ఏమైనా పాల్పడిందా.. అనే కోణాలలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

సెలబ్రిటీ హోదాలో ఉండి సమాజానికి ఒక మార్గదర్శకమైన వ్యక్తి లాగా ఉండాల్సిన హర్ష ఇలా మత్తు పదార్థాలకు బానిస కావడం.. మత్తు పదార్థాలను రవాణా చేయడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వారి వల్లే యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆరోపిస్తున్నారు. రిమాండ్లో ఆమెను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆమె చెప్పే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా?

Anaira Gupta
Anaira Gupta

ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లిన 'ఓజీ 2'..ఇదేమి క్రేజ్ బాబోయ్..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా?, ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఇక సినిమాలకు దాదాపుగా రిటైర్మెంట్ ఇచ్చినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో , నిన్న సోషల్ మీడియా లో ఒక అను బాంబు పేలింది. ‘ఓజీ 2’ చిత్రం ఆన్ ది ట్రాక్ ఉందని , సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ ఒక్క ప్రకటన సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు, ఈ ఒక్క ట్వీట్ కి దాదాపుగా 76 లక్షల వ్యూస్ కేవలం 24 గంటల్లో వచ్చాయి , ట్విట్టర్ మొత్తం ఓజీ 2 గురించే చర్చ, ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ చూసిన ‘ఓజీ 2’ మేనియా తో నిండిపోయింది.

దీని గురించి కేవలం టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మాత్రమే కాదు , ఏకంగా హాలీవుడ్ కూడా చర్చించుకోవడం గమనార్హం. హాలీవుడ్ లో పాపులర్ మ్యాగజైన్ ‘వెరైటీ’ అనే సంస్థ , ‘ఓజీ 2’ గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఈ చిత్రం నవంబర్ నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని , మొదటి భాగం ప్రపంచవ్యాతంగా 35 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందని , ఇది కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించిన వసూళ్లు మాత్రమే అని, ఓవర్సీస్ ప్రీమియర్స్ లో హాలీవుడ్ క్రేజీ సినిమాలను సైతం ఓజీ డామినేట్ చేసిందని అంటూ ఒక సంచలనాత్మక ఆర్టికల్ రాశారు. దీనిని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఓజీ 2 గురించి చర్చలు నడిచాయి , ఈ సినిమాకు ఉన్న క్రేజ్, హైప్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డబ్బుకు విలువుండదు... ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. ప్రపంచ కుబేరుడి జోష్యం!

Elon Musk Prediction
Elon Musk Prediction

Elon Musk Prediction: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఎలాన్‌ మస్క్‌. త్వరలోనే మొదటి ట్రిలియనీర్‌గా (సుమారు రూ. కోటి కోట్ల విలువ గల ఆస్తి) అవతరించేందుకు చాలా దగ్గరగా ఉన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ వంటి కంపెనీల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ గొప్ప సంపదను సాధించిన మస్క్, డబ్బు గురించి చాలా ఆసక్తికరమైన, భవిష్యత్తును సూచించే వ్యాఖ్యలు చేశారు.

డబ్బుకు విలువ ఉండదట..
రానున్న రోజుల్లో డబ్బుకు ఇప్పటి విలువ ఉండదని మస్క్‌ పేర్కొన్నారు. కారణం కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోలు అనేక రకాల వస్తువులను సులభంగా తయారు చేస్తాయని తెలిపారు. అవి మనుషులు చేసే అనేక సేవలను కూడా అందిస్తాయని వెల్లడించారు. ఫలితంగా మనుషులకు చేయడానికి పనులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని జోష్యం చెప్పారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పని, ఆదాయం, డబ్బు అనే మౌలిక భావనలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేశారు.

ఏఐ, రోబోలతో ఆర్థిక విప్లవం..
మస్క్‌ చెప్పిన ఈ దృశ్యం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లు పని చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో వస్తువులు కొనడం అనే చక్రం మారిపోతుంది. ఏఐ, రోబోలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీంతో వస్తువుల కొరత తగ్గి, సమృద్ధి పెరుగుతుంది. దీంతో డబ్బు అనే విలువ క్రమంగా తగ్గిపోతుందని మస్క్‌ భావిస్తున్నారు.

భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్థ ట్రాష్‌..
ఎలాన్‌ మస్క్‌ ఇలా చెప్పడం ఆయన సాధారణ ఆలోచన కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయనే డబ్బుకు విలువ లేని రోజులు రానున్నాయని చెప్పడం ఆసక్తికరం. ఇది ఒక విధంగా పోస్ట్‌–స్కార్సిటీ ఎకానమీ (కొరత లేని ఆర్థిక వ్యవస్థ) గురించి ఆయన చేస్తున్న అంచనా. ఏఐ, ఆటోమేషన్‌ వల్ల మనుషులు చేసే పనులు తగ్గిపోతాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ అనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి నెలవారీగా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా చూడాలని మస్క్‌ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది కేవలం సానుకూల వైపు మాత్రమే కాదు. పని లేకపోతే మనుషులకు జీవితంలో ఉత్సాహం తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు, ఏఐ వల్ల వచ్చే సమృద్ధిని సరిగ్గా పంపిణీ చేయగలిగితే మానవజాతి మరింత సుఖంగా జీవించే అవకాశం ఉంది.

మస్క్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వైపు ఆయన టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని చెబుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సంపద, విలువ, పని అనే భావనలు పూర్తిగా మారిపోతాయని సూచిస్తున్నాయి. ట్రిలియనీర్‌ అవ్వబోయే వ్యక్తి కూడా డబ్బు అనేది శాశ్వతం కాదని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పడం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.

ఏఐ వచ్చేసింది.. మేనేజ్మెంట్లు తొలగిస్తున్నాయి.. జర్నలిస్టుల బతుకులు నడిరోడ్డు మీద..

AI Impact On Journalism
AI Impact On Journalism

AI Impact On Journalism: వచ్చేది అంతంత మాత్రం జీతం. పైగా బండెడు చాకిరి.. సెలవులు ఉండవు.. చెప్పుకునే స్థాయిలో ప్రయోజనాలు ఉండవు.. తప్పదు కాబట్టి చాలామంది ఆ ఫీల్డ్ లో ఉంటారు. నమస్తే లకు అలవాటు పడి.. వేరే పనులు చేయడానికి కూడా ఇష్టపడరు. అలా ఉంటుంది జర్నలిస్ట్ జీవితం. ఫీల్డ్ లెవెల్ జర్నలిస్ట్ పరిస్థితి ఇలా ఉంటే.. డెస్క్ లెవెల్ లో మరింత దారుణంగా ఉంటుంది.. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా పనిచేస్తూనే ఉండాలి.. కొన్ని సందర్భాలలో ఆరోగ్యాలు కూడా సహకరించవు. మేనేజ్మెంట్లు ఉదారత చూపించవు.

అసలే పెనం మీద ఉన్న జర్నలిస్టుల బతుకులు… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పొయ్యిలో పడ్డాయి. చాలావరకు మేనేజ్మెంట్ సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. దీంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇప్పటికే చాలా వరకు సంస్థలు గ్రాఫిక్స్ భాగంలో పని చేస్తున్న వారిని పక్కన పెట్టాయి. పెద్ద అనే పేరున్న ఓ ఛానల్ దాదాపు 60 మంది దాకా ఉద్యోగులను తొలగించేసింది. వీరిలో స్క్రిప్ రైటర్లు.. కంటెంట్ క్రియేటర్లు.. డిజిటల్ విభాగంలో పనిచేసేవారు.. గ్రాఫిక్స్ విభాగంలో పని చేసేవారు ఉన్నారు. ఒక్కో విభాగంలో దాదాపు మూడు నుంచి నలుగురు వరకు ఉద్యోగులను తొలగించింది ఆ ఛానల్.

ఆ చానల్ బాటలో పదవ నెంబర్ సంఖ్య పేరుతో ప్రసారాలు చేపడుతున్న ఛానల్ కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా ఇప్పటికే 30 మంది ఉద్యోగులను తొలగింపు జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. వారిని వచ్చే నెల నుంచి రావద్దని చెప్పినట్టు సమాచారం. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను సెటిల్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని చానల్స్ లో గ్రాఫిక్ విభాగాలలో డిజైనర్లతో అవసరం లేకుండా పోయింది.. స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెంటనే పూర్తవుతోంది.

ఈ నేపథ్యంలోనే మేనేజ్మెంట్లు ఈ అంశాలను కారణాలుగా చూపిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తొలగింపు జాబితాలోని ఉద్యోగుల్లో ఎక్కువ వేతనం.. సీనియర్లే ఉండడం విశేషం. అయితే ఈ రెండు చానల్స్ మాత్రమే కాకుండా.. మిగతా చానల్స్ కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఉద్యోగుల తొలగింపు చేపట్టకుండా.. దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏఐ రాకతో.. ఎలక్ట్రానిక్ మీడియా రంగం మొత్తం కుదుపులకు గురవుతోంది. ఇది ఎక్కడదాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది.

సంచలనం రేపుతున్న గోపిచంద్ 'సింగా' టీజర్.. ఇలాంటి లుక్ లో అసలు ఊహించలేదు..

Gopichand Singa Teaser
Gopichand Singa Teaser

Gopichand Singa Teaser: విలన్ గా ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని , ఆ తర్వాత అదే ఆడియన్స్ తో హీరో గా కూడా మెప్పించుకోవడం అనేది , సాధారణమైన టాస్క్ కాదు, గతం లో చిరంజీవి , రజినీకాంత్ , కృష్ణం రాజు, మోహన్ బాబు వంటి వారు ముందుగా విలన్స్ గా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హీరోలుగా మారి పెద్ద స్టార్స్ అయ్యారు. నేటి తరం లో అలా గోపీచంద్ ఒక్కడే రాణించాడు. మొదట్లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు, పెద్దగా సక్సెస్ అవ్వలేదు , ఆ తర్వాత విలన్ గా మారి , తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న తర్వాత , హీరో గా రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా విజయాలను అందుకుంటూ మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

ఒకప్పుడు గోపీచంద్ చిత్రానికి స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ వచ్చేవి, కానీ ఆ తర్వాత ఎందుకో ఆయన నేటి తరం ఆడియన్స్ కి తగ్గ సినిమాలు చేయడం మానేసాడు. ఒకే మూస సినిమాలు తీస్తూ, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన డిఫరెంట్ తరహా సినిమాలు చేస్తూ , బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ‘భరత వర్ష’ అనే డిఫరెంట్ జానర్ సినిమాని ప్రకటించి , టీజర్ ని విడుదల చేశాడు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నుండి మరో చిత్రం రాబోతున్నట్టు అధికారికంగా ఒక గ్లింప్స్ వీడియో ద్వారా ప్రకటించాడు. ఈ చిత్రం పేరు సింగా. ఇందులో గోపీచంద్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి , ఈమధ్య కాలం లో ఆయన ఇలాంటి గెటప్ లో కనిపించలేదు.

ఈ గ్లింప్స్ వీడియో సౌండింగ్ ఎఫెక్ట్స్ ని చూస్తుంటే , ఇది హారర్ థ్రిల్లర్ జానర్ సినిమా అనిపిస్తోంది. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ నుండి కళ్ళు చూపించిన విధానం నిజంగా గూస్ బంప్స్ రప్పించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. గతం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పని చేసిన వీ వెంకట్ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారాడు. సామ్ సి ఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.

 

 

'కుకూ విత్ జాతి రత్నాలు 2' నుండి ఎలిమినేట్ అయిన మరో 3 టాప్ కంటెస్టెంట్స్..ఇలా అయితే కష్టమే..

Kooku With Jathi Ratnalu 2 Winner
Kooku With Jathi Ratnalu 2 Winner

Kooku With Jathiratnalu 2 Elimination: ‘ ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన స్టార్ మా ఛానల్ లో , విహాయవంతంగా నడుస్తున్న ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’. మొదటి సీజన్ లాగానే, రెండవ సీజన్ కూడా బంపర్ హిట్ అయ్యింది. ఈ రెండవ సీజన్ లో కుక్స్ గా కొనసాగుతున్న వారు ప్రస్తుతం 8 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం శ్రీకాంత్ అయ్యంగార్ , కళ్యాణ్ పడాల మాత్రమే ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. గత వారం మరో ఎలిమినేషన్ జరగాల్సింది కానీ , ఎందుకో యాజమాన్యం ఎలిమినేషన్ వైపు వెళ్ళలేదు. అయితే రీసెంట్ గానే ఈ షో నుండి మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యిందట.

చాలా మంది చెప్తున్నది ఏమిటంటే , ఈ షో నుండి తనూజ ఎలిమినేట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ లో ఈమె టాప్ 6 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యింది , కానీ ఈ సీజన్ లో ఇంకా ముందే ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే విధంగా ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన మరో టాప్ కంటెస్టెంట్ పల్లవి రామస్వామి. ఈ షో లో మొత్తం ఇద్దరు పల్లవి లు ఉన్నారు. ఒక పల్లవి మొదట్లో కాస్త తడబడింది , కానీ ఇప్పుడు మాత్రం టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతుంది. ఇక రెండవ పల్లవి మాత్రం మొదట్లో బాగా చేసేది కానీ , ఇప్పుడు కాస్త తడబడుతూ తక్కువ స్కోర్ తెచ్చుకోవడం వల్ల , ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్ గా తేజశ్వని గౌడ పేరు బలంగా వినిపిస్తోంది.

అమర్ దీప్ సతీమణి గా ఈమెకు ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక పక్క సీరియల్స్ చేస్తూనే, మరోపక్క ఇలాంటి షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఇది వరకు ఏ షో లో పాల్గొన్న టాప్ మోస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తూ వచ్చేది. కానీ ఈ షో లో ఎందుకో గత రెండు వారాలుగా ఈమె బాగా వెనకబడింది. ఆరంభం లో టాప్ 2 లేదా టాప్ 3 రేంజ్ మార్కులు సంపాదించుకుంటూ వచ్చిన తేజస్విని , ఇప్పుడు వరుసగా డేంజర్ జోన్ లోకి రావడం మొదలు పెట్టింది , ఈ క్రమంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

విదేశాల నుంచి ఆపరేటింగ్.. కూటమి మీద విషం.. బయటపడిన వైసీపీ కుతంత్రం

YSRCP Foreign Bots
YSRCP Foreign Bots

YSRCP Foreign Bots: అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ కచ్చితంగా నిరసనలు చేపట్టాలి. ధర్నాలు చేయాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. ఇది ప్రతిపక్ష పార్టీకి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. దీనిని ఎవరూ కాదనడానికి లేదు. కానీ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అధికార పక్షం మీద విమర్శలు చేయడం.. బలవంతంగా ధర్నాలు చేయడం వంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్థితి ఉంది.

2019 ఎన్నికల్లో గెలిచిన వైసిపి.. భారీగా స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. విజయ గర్వం తలకెక్కి వైసిపి అరాచకమైన పరిపాలన చేసింది. నొక్కుడు పథకాలకు ప్రజలను అలవాటు పడేలా చేసి.. ఏపీ రాష్ట్రంలో అభివృద్ధిని తొక్కిపడేసింది. పరిశ్రమలను తన్ని తరిమేసింది. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో తిక్కరేగిన ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే వైసీపీని పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. ప్రజల్లో ఉన్న ఈ ఆగ్రహాన్ని చూసి వైసిపి నేతలు మారాలి. ప్రజలకు అనుకూలంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. కానీ అవి వారికి. ఒంట పట్టడం లేదు. అధికారానికి దూరమయ్యామనే బాధలో ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతే బాగుండు అనే ఆలోచన వారి మదిలో ఉంది. అధినేత నుంచి మొదలుపెడితే దిగువ స్థాయి కార్యకర్తల వరకు ఇదే ధోరణి ఉంది.

తాజాగా వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి, బిజెపి, జనసేన నాయకులు వేడుకలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. విదేశాలలో ఉండి ట్విట్టర్ బాట్లు కొనుగోలు చేసి.. #2 years for TDP back stabbing అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తోంది. అయితే ఈ ఖాతాలు మొత్తం విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. పైగా వీరంతా కూడా దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కామెంట్లు చేస్తున్నారు. వైసిపి చేసిన ప్రదర్శనలను.. ఇతర వ్యవహారాలను విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా ఈ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది.. ఈ కథనం రాసే సమయం వరకు అది ఏడవ స్థానంలో ఉంది. తిరుపతిలో కూటమి ప్రభుత్వం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ట్యాగ్ ఏకంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ కావడం విశేషం.

గతంలో భారత రాష్ట్ర సమితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదే తరహాలో విదేశాల నుంచి బాట్లు కొనుగోలు చేసి.. సోషల్ మీడియాలో కృత్రిమ ఉద్యమాలను కొనసాగించేది. ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా అపోహలు కల్పించేది. ఇప్పుడు వైసీపీ కూడా గులాబీ పార్టీ తోవను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అది కూడా విదేశాల నుంచి బాట్లు కొనుగోలు చేసి.. విదేశీ ఖాతాల ద్వారా కృత్రిమ ఉద్యమాలను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ఇటీవల కాలంలో కాక్రోచ్ పార్టీ గురించి జగన్ ప్రస్తావించిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు కాక్రోచ్ జనసేన పార్టీ పేరుతో ఖాతాలు ఓపెన్ చేయడం విశేషం. అందులో జగన్ ఫోటోలు.. వైసిపి పార్టీకి సంబంధించిన వివరాలను పోస్ట్ చేయడం గమనార్హం.

మీ ఫోన్ పై గ్రీన్ డాట్ కనిపిస్తోందా.. వెంటనే వీటిని మార్చండి..

IPhone Green Dot Meaning
IPhone Green Dot Meaning

IPhone Green Dot Meaning: స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, మనం డిజిటల్ ప్రపంచంలో ఎంత వేగంగా దూసుకుపోతున్నామో.. అంతే స్థాయిలో మన వ్యక్తిగత గోప్యత (Privacy) కూడా ప్రమాదంలో పడుతోంది. మన స్మార్ట్ ఫోన్లో కొన్ని యాప్స్ మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో కెమెరా, మైక్రోఫోన్‌లను వాడుతూ మన డేటాను సేకరిస్తున్నాయనే ఆందోళనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను అలర్ట్ చేయడానికి యాపిల్ సంస్థ తన ఐఫోన్లలో ఒక అద్భుతమైన ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఫీచర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ స్క్రీన్ పైభాగంలో కనిపించే చిన్న రంగు చుక్కల ద్వారా ప్రైవసీ సురక్షితంగా ఉందో లేదో క్షణాల్లో కనిపెట్టేయవచ్చు. ఐఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ కుడివైపు పైభాగంలో (నెట్‌వర్క్ సిగ్నల్స్ ఉండే చోట)గ్రీన్ కలర్ చుక్క కనిపిస్తే, ప్రస్తుతం మీ ఫోన్‌లోని ఏదో ఒక యాప్ కెమెరాను ఉపయోగిస్తోందని అర్థం. కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఫోటోలు తీస్తున్నప్పుడు ఈ గ్రీన్ లైట్ రావడం సహజం.కానీ, మీరు ఏ కెమెరా ఫీచర్‌ను వాడనప్పుడు కూడా ఈ గ్రీన్ చుక్క స్క్రీన్‌పై కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. మీకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక యాప్ మీ అనుమతి లేకుండా కెమెరా ద్వారా మిమ్మల్ని గమనిస్తోందని దానికి అర్థం.

ఐఫోన్ స్క్రీన్‌పై ఆరెంజ్ (నారింజ) లేదా ఎల్లో (పసుపు) రంగు చుక్క ప్రత్యక్షమైతే, ఫోన్‌లోని మైక్రోఫోన్ యాక్టివ్‌గా ఉందని గ్రహించాలి. ఎవరికైనా ఫోన్ కాల్ చేసినప్పుడు, వాయిస్ రికార్డర్ వాడుతున్నప్పుడు లేదా వాయిస్ మెసేజ్ పంపుతున్నప్పుడు ఈ చుక్క కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎలాంటి ఆడియో ఫీచర్లు వాడకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ ఆరెంజ్ చుక్క కనిపిస్తే, ఏదో ఒక థర్డ్-పార్టీ యాప్ మీ మాటలను నిశ్శబ్దంగా రికార్డ్ చేస్తోందని అర్థం చేసుకోవాలి. మన వ్యక్తిగత సంభాషణలు లీక్ అవ్వడానికి ఇలాంటి యాప్స్ కారణమవుతుంటాయి.

ఏ యాప్ రికార్డ్ చేస్తోందో ఎలా తెలుసుకోవాలి?
స్క్రీన్‌పై చుక్కలు కనిపించినప్పుడు, అసలు ఏ యాప్ మీ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను వాడుతుందో తెలుసుకోవడం చాలా సులభం. స్క్రీన్‌పై గ్రీన్ లేదా ఆరెంజ్ చుక్క కనిపించిన వెంటనే, స్క్రీన్ పైనుంచి కిందికి స్వైప్ చేసి కంట్రోల్ సెంటర్ (Control Center) ఓపెన్ చేయాలి. కంట్రోల్ సెంటర్ పైభాగంలో ఏ యాప్ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను వాడుతోందో ఆ యాప్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు: WhatsApp, Recently లేదా Instagram, Recentlyఅని చూపిస్తుంది.

ఈ సెట్టింగ్స్ మార్చండి

అనుమతి లేకుండా మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ తీసుకుంటున్న యాప్స్ నియంత్రించడానికి వెంటనే ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.యాప్ పర్మిషన్స్ చెక్ చేయండి. మీ ఐఫోన్ `Settings` లోకి వెళ్లి, అక్కడ `Privacy & Security` ఆప్షన్‌ను ఎంచుకోండి.అక్కడ ఉన్న `Camera` `Microphone` విభాగాలపై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లో ఉన్న ఏయే యాప్స్‌కు ఈ పర్మిషన్స్ ఉన్నాయో అక్కడ లిస్ట్ కనిపిస్తుంది. అనుమానంగా ఉన్న లేదా అవసరం లేని యాప్స్‌కు కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్లను వెంటనే టాగుల్ ఆఫ్ (Off) చేయడం ద్వారా సేఫ్ గా ఉండవచ్చు.. అయితే కేవలం ఐ.ఫోన్లలోనే కాకుండా, ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇప్పుడు ఇలాంటి గ్రీన్ ప్రైవసీ డాట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ఏదైనా, స్క్రీన్‌పై వచ్చే ఇలాంటి రంగు గుర్తులను గమనిస్తూ అలర్ట్‌గా ఉండటం ఎంతో ముఖ్యం.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా...

Type 1 Diabetes In Children
Type 1 Diabetes In Children

Type 1 Diabetes In Children: ఇటీవల కాలంలో పిల్లల్లో టైప్-1 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సాధారణంగా చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్)లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫలితంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. అందుకే తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడం ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏవో చూద్దాం..

అసాధారణ దాహం:
టైప్-1 డయాబెటిస్‌కు ప్రధాన సంకేతాల్లో ఒకటి అధిక దాహం. పిల్లలు సాధారణం కంటే ఎక్కువసార్లు నీరు తాగాలని కోరుకుంటారు. నీరు తాగిన కొద్దిసేపటికే మళ్లీ దాహం వేస్తుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో కూడా పదే పదే నీరు అడిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

తరచూ మూత్ర విసర్జన:
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు శరీరం వాటిని మూత్రం ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో పిల్లలు పగలు, రాత్రి తరచుగా టాయిలెట్‌కు వెళ్తుంటారు. ఇంతకుముందు బెడ్ వెట్టింగ్ సమస్య లేకపోయినా అకస్మాత్తుగా రాత్రిపూట మంచం తడపడం ప్రారంభిస్తే అది కూడా హెచ్చరిక సంకేతంగా భావించాలి.

ఎల్లప్పుడూ నీరసం:
తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నప్పటికీ పిల్లలు ఎప్పుడూ నీరసంగా కనిపించడం కూడా టైప్-1 డయాబెటిస్ లక్షణం కావచ్చు. శరీరానికి అవసరమైన శక్తి కోసం గ్లూకోజ్‌ను కణాలు ఉపయోగించలేకపోవడంతో పిల్లల్లో అలసట, బలహీనత, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపించవచ్చు

అకస్మాత్తుగా బరువు తగ్గడం:
పిల్లలు బాగా తింటున్నప్పటికీ వేగంగా బరువు తగ్గడం చాలా ముఖ్యమైన హెచ్చరిక. శరీరానికి ఇన్సులిన్ అందకపోవడంతో గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేక కొవ్వు, కండరాలను వినియోగించడం ప్రారంభిస్తుంది. దీంతో కొద్ది రోజులు లేదా వారాల్లోనే పిల్లలు సన్నబడిపోతారు.
వీటితో పాటు కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఎక్కువ ఆకలి వేయడం, చూపు మసకబారడం, చిరాకు పెరగడం, వాంతులు, కడుపునొప్పి, శ్వాసలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. టైప్-1 డయాబెటిస్‌ను పూర్తిగా నివారించే మార్గం ప్రస్తుతం లేకపోయినా, ప్రారంభ దశలో గుర్తిస్తే పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలరు. ఇన్సులిన్ చికిత్స, సరైన ఆహారం, క్రమం తప్పని రక్తంలో చక్కెర పరీక్షలతో వ్యాధిని నియంత్రించవచ్చు.

నేను చరణ్ ని అలా అన్నందుకు చిరంజీవి ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాడు - జగపతి బాబు

Jagapathi Babu
Jagapathi Babu

Jagapathi Babu Comments on Chiranjeevi: ఇండస్ట్రీ లో ముక్కు సూటి తనంతో , ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే హీరోలలో ఒకరు జగపతి బాబు. ఈయన ప్రసంగాల్లో ఒక నిజాయితీ ఉంటుంది , ఎలాంటి డ్రామా ఉండదు. ఇండస్ట్రీ లో సీనియర్ హీరోల దగ్గర నుండి , నేటి తరం స్టార్ హీరోల దగ్గర వరకు ప్రతీ ఒక్కరితో జగపతి బాబు కి ఉన్నటువంటి సాన్నిహిత్యం సాధారణమైనది కాదు. నేటి తరం స్టార్ హీరోలతో ఆయన ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో కలిసి నటించేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రీసెంట్ గానే ‘పెద్ది’ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన అప్పలసూరి అనే పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో రామ్ చరణ్ తో ఆయన ‘రంగస్థలం’ అనే చిత్రం చేశాడు . ఈ రెండు సినిమాల్లో చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి , అదే విధంగా పెద్ది మూవీ విశేషాల గురించి డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు బుచ్చి బాబు.

ఈ ఇంటర్వ్యూ లో ఆయన గతంలో చరణ్ విషయం లో చిరంజీవి తో తనకు ఎదురైన ఒక సందర్భం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , రామ్ చరణ్ మొట్టమొదటి సారి అద్బుతమగా నటించాడని అన్నాను. అందుకు చిరంజీవి గారు ఫీల్ అయ్యారు , అదేంటి జగపతి బాబు అలా అనేసావు అన్నాడు. నిజంగా నాకు అనిపించిందే చెప్పాను సార్ అన్నాను. కానీ రామ్ చరణ్ కెరీర్ అక్కడి నుండి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. నటుడిగా ఆయన ఎవ్వరూ చూడనంత పీక్ రేంజ్ ని చూసేసాడు. ఈరోజు చెప్తున్నాను , పెద్ది చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే నెంబర్ 1 పెర్ఫార్మన్స్ గా నిలిచిపోతుంది. అంత అద్భుతంగా నటించాడు. చిరంజీవి గారి అబ్బాయిని ఇంత కష్టపెట్టిన డైరెక్టర్ బహుశా ఇండియా లో నువ్వేనేమో’ అంటూ జగపతి బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లోనే అప్పలసూరి క్యారెక్టర్ టాప్ 5 లో ఒకటిగా ఉంటుంది. ఇండస్ట్రీ కి చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ ఫోన్ చేసి నాతో ఒక మాట అన్నాడు. ఇదే అప్పలసూరి క్యారెక్టర్ ఇతర భాషలకు సంబంధించిన టాప్ నటీనటులు చేసుంటే , పొగడ్తలతో ముంచి ఎత్తేవారు , వేరే లెవెల్ లో లేపేవాళ్లు, కానీ తెలుగు వాడు అవ్వడం వల్ల , ఈ పాత్ర గురించి రివ్యూయర్స్ ప్రత్యేకంగా మాట్లాడడం లేదు. తెలుగు ఆర్టిస్టుగా పుట్టడం మీ దురదృష్టకరం అని అన్నాడు’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు.