Home Blog Page 136

‘ఆరుసెకన్ల’ఈ ప్రయోగంతో మైండ్ రిఫ్రెష్..

Relationship
Relationship

Relationship Tips: ‘ నేటి వేగవంతమైన జీవనశైలిలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు గడిపే సమయం చాలా తగ్గిపోయింది. ఉదయం ఆఫీసుకు వెళ్లే హడావుడి, సాయంత్రం పనిభారం, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి కారణాలతో భావోద్వేగ అనుబంధం క్రమంగా బలహీనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాంపత్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘ఆరు సెకన్ల ముద్దు’ అనే సులభమైన పద్ధతిని రిలేషన్‌షిప్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆరు సెకన్ల పాటు కిస్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

సాధారణంగా చాలా మంది ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యకు లేదా భర్తకు త్వరత్వరగా ‘బై’ చెప్పి వెళ్లిపోతుంటారు. అయితే నిపుణుల ప్రకారం.. కేవలం ఒక క్షణం ఆగి భాగస్వామిని దగ్గరకు తీసుకుని, కళ్లలోకి ప్రేమగా చూస్తూ కనీసం ఆరు సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలి. ఈ సమయంలో ఆఫీసు పనులు, సమావేశాలు లేదా ఇతర ఆలోచనల గురించి ఆలోచించకుండా పూర్తిగా ఆ క్షణాన్ని ఆస్వాదించాలని వారు సూచిస్తున్నారు.ఇలా చేస్తే కొత్త ఎనర్జీ వచ్చినట్లు అవుతుందని తెలుపుతున్నారు.

ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది అలసటతో నేరుగా సోఫాలో కూర్చోవడం లేదా మొబైల్‌లో మునిగిపోవడం చేస్తుంటారు. కానీ ఇంటికి వచ్చిన వెంటనే చిరునవ్వుతో భాగస్వామిని పలకరించి, మరోసారి ఆరు సెకన్ల పాటు ప్రేమగా ముద్దాడితే రోజంతా ఉన్న ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

మనిషి ప్రేమగా కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం సమయంలో శరీరంలో ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆరు సెకన్ల పాటు కొనసాగే ముద్దు ఈ హార్మోన్ విడుదలకు మరింత అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిన్న ప్రేమపూర్వక చర్య దంపతులకు భావోద్వేగ శక్తిని అందిస్తుంది. ఎలా ఒక ఎనర్జీ డ్రింక్ శరీరానికి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుందో, అలాగే ఆరు సెకన్ల ముద్దు మనసుకు ఆనందాన్ని, సానుకూల భావాలను అందిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న అపార్థాలు, ఒత్తిడులు, పనిబారాలు సహజం. అయితే ప్రతిరోజూ కొన్ని సెకన్ల పాటు అయినా ప్రేమను వ్యక్తపరచడం వల్ల ఒకరిపై మరొకరికి ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. కమ్యూనికేషన్ మెరుగుపడటంతో పాటు భావోద్వేగ దూరం తగ్గే అవకాశం ఉంటుంది.

ఏపీకి ఇలాంటి భారీ బహుమానం వస్తుందని ఊహించలేదు

16th Finance Commission Funds
16th Finance Commission Funds

16th Finance Commission Funds: ఏపీకి మరోసారి తీపి కబురు చెప్పింది కేంద్రం. స్థానిక సంస్థలకు భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో బేసిక్ గ్రాండ్ రూ.13,302 కోట్లు, పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026 – 27 నుంచి ఐదేళ్లపాటు అంటే 2030-31 వరకు ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,800 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం లో అదనంగా రూ.3,827 కోట్లు కేటాయించింది.

* ఐదేళ్ల పాటు నిధులు..
ఐదేళ్లపాటు 16వ ఆర్థిక సంఘం కొనసాగనుంది. అయితే ఈసారి ఖర్చు విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పైడ్ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది. 10% అన్ టైడ్ నిధుల నుంచి రోడ్ల నిర్మాణ పనులకు ఖర్చులు చేయాలని తెలిపింది. మిగిలిన నిధులను ఇతర అవసరాలకు కేటాయించాలని సూచించింది. ఇకనుంచి ఆర్థిక సంఘం నిధులను సిబ్బంది జీతభత్యాలకు వినియోగించకూడదు. కాగా ఈ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామపంచాయతీలకు 70%, జిల్లా పరిషత్తులకు 15%, మండల పరిషత్తులకు మిగిలిన 15% నిధులను కేటాయించనున్నారు.

* సరికొత్త మార్గదర్శకాలు…
ఈసారి ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉంచాలి. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేయాలి. నిధుల ఖర్చు వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల సాయం ఏపీకి అదనంగా అందుతుండడం మాత్రం శుభపరిణామం. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏపీకి రూ.7700 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

సాన్య అందాల విందు

Sanya Malhotra red look
Sanya Malhotra red look

 

మొన్న పాకిస్తాన్.. నిన్న బంగ్లాదేశ్.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఎందుకీ దుస్థితి..

Bangladesh vs Australia Series
Bangladesh vs Australia Series

Bangladesh vs Australia Series: క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఆస్ట్రేలియా జట్టుకు ప్రథమ స్థానం ఉంటుంది. ఇంగ్లాండ్లో క్రికెట్ పుట్టినప్పటికీ.. ఆ క్రీడలో ఆస్ట్రేలియా జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో సరికొత్త ప్రమాణాలను ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పింది. వన్డే వరల్డ్ కప్ లను ఏకంగా ఆరుసార్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియా జట్టు.

అద్భుతమైన ప్లేయర్లతో నిండి ఉండే ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు తడబడుతోంది. కనీసం తమ జట్టు పేరును కూడా కలలో కూడా కలవరించడానికి భయపడే జట్ల చేతిలో ఊడిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఏమైంది అనే చర్చ మొదలైంది. ఆస్ట్రేలియా జట్టు 2023లో వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీలలో ఆ స్థాయిలో సత్తా చూపించలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చూపించలేకపోయింది. టి20 వరల్డ్ కప్ లో కూడా తన జోరు కొనసాగించలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా క్రికెట్ మీద రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ ఇలా సాగుతుండగానే ఆస్ట్రేలియా జట్టు దారుణమైన ఓటములను మూట కట్టుకోవాల్సి వస్తోంది.

ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మేట్ లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. అది కూడా పాకిస్తాన్ దేశంలో.. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏమాత్రం సత్తా చూపించలేదు ఆ సిరీస్లో. చివరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ తొలిసారిగా ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ వన్డే సిరీస్ ట్రోఫీని అందుకుంది.. ఆస్ట్రేలియాపై దాదాపు 21 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ జట్టు తొలి వన్డే సిరీస్ దక్కించుకుంది.. ఆస్ట్రేలియా జట్టు చేతిలో గతంలో ఆడిన 4 వన్డే సిరీస్ లను బంగ్లాదేశ్ కోల్పోయింది. 2005లో ఇంగ్లాండ్ లో జరిగిన ట్రై సిరీస్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. 2021లో టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద బాంగ్లాదేశ్ విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తొలి వన్డే సిరీస్ విజయాన్ని అందుకుంది.

బంగ్లాదేశ్ సిరీస్ ను ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అందువల్లే మామూలు ప్లేయర్లను ఈ సిరీస్ కు పంపించింది. అయితే ఈ సిరీస్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు కట్టుదిట్టంగా ఆడారు. ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్.. బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా తలవంచక తప్పలేదు. తొలి వన్డేలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. రెండవ వన్డేలో కూడా ఓటమిపాలైంది. ఫలితంగా అనామకమైన బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టు ఇటీవల పాకిస్తాన్ చేతిలో.. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోవడం ఆ జట్టు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వన్డే ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియా ఇలా ఆడటాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్డీఏతో జగన్ ది స్నేహమా? వైరమా?

YS Jagan Politics
YS Jagan Politics

YS Jagan Politics: జగన్మోహన్ రెడ్డి రాజకీయం వింతగా ఉంది. శత్రువు భాగస్వాములను మిత్రులుగా చూస్తున్నారు. నేను ఎన్డీఏ కూటమితో ఫైట్ చేయను. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయను. నా శత్రువు కేవలం చంద్రబాబు మాత్రమే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. చంద్రబాబును ప్రధాన శత్రువుగా ఫిక్స్ చేసి.. ఆయనకు మద్దతుగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి.. వీరిద్దరికీ సహకారం అందిస్తున్న బిజెపిని మాత్రం పెద్దన్నగా ఊహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ రాజకీయం చూసి జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అంతెందుకు సొంత కేడర్ కు సైతం జగన్ చర్యలు విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం? శత్రువు ఎవరు? అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే జగన్ వైఖరి సొంత పార్టీ శ్రేణులతో పాటు జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలకు సైతం ఆశ్చర్యం కలగక మానదు.

* వారు వద్దంటున్నా..
ఏపీలో అధికారంలో ఉన్నది టిడిపి, జనసేన, బిజెపి లతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం. కానీ అదే జాతీయస్థాయి ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి. పరస్పర రాజకీయ ప్రయోజనాలు అందుకుంటున్నాయి ఆ మూడు పార్టీలు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ద్వేష భావంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి వారితో భాగస్వాములుగా ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాల పట్ల మాత్రం గొప్ప గౌరవభావంతో మెలుగుతున్నారు. ఇదేం రాజకీయమో చెప్పలేం. నీ స్నేహం వద్దు రా బాబు అంటూ కేంద్ర పెద్దలు పక్కన పెట్టిన జగన్ మాత్రం వారి వెంట పడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వింత రాజకీయం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

* అంతా సిల్లీ రాజకీయం..
రాష్ట్ర రాజకీయాలను సిల్లీ రాజకీయాలుగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏదో గ్రామస్థాయి రాజకీయం అన్నట్టు కూటమిలతో పనిలేదు, సిద్ధాంతాలతో పనిలేదు, భావాలతో పనిలేదు అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి అయినా.. ఇప్పుడు చంద్రబాబు అయినా ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాలతో పాటు వారి భాగస్వామ్య పక్షాలపై రాజీలేని పోరాటం చేసేవారు. కనీసం ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విధులు పై గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. పైగా కేంద్రానికి అవసరం అయినప్పుడు రాజకీయ సహకారం అందించారు.

* పోరాడితేనే గుర్తింపు..
చంద్రబాబును వ్యతిరేకిస్తాను కానీ మోదీతో పాటు అమిత్ షాను ప్రేమిస్తాను అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. కేంద్ర పెద్దలు క్లియర్ కట్ గా తేల్చేశారు. తాము చంద్రబాబుతో సుదీర్ఘ పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా గళం ఎత్తితేనే జగన్మోహన్ రెడ్డికి విలువ ఉంటుంది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే ఎన్డీఏకు మద్దతు ఇవ్వమని పిలుపునిస్తారే కానీ.. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పగలరా. ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని సొంత పార్టీ వారే ఆవేదనతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి వైఖరి వల్లే జగన్ దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. నాడు జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి ప్రజలు గుర్తించారు. 2019 నుంచి 2024 మధ్య బిజెపితో స్నేహం చేశారు కాబట్టి ఆయన పోరాట పటిమ తగ్గి ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేయకుండా.. చంద్రబాబును మాత్రమే వ్యక్తిగతంగా ప్రత్యర్థిగా చూస్తానంటే ప్రజలు గుర్తించే పరిస్థితి ఉండదు.

ఇండియాను ఓడించారు.. లంకను పడుకోబెట్టారు.... ఇంగ్లండ్ అమ్మాయిలు ఈసారి కప్ కొట్టేలా ఉన్నారే..

England vs Sri Lanka Women
England vs Sri Lanka Women

England vs Sri Lanka Women: మహిళల t20 ప్రపంచ కప్ 2009లో ప్రారంభమైంది. ప్రారంభ సీజన్లో ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీ అందుకుంది. బలమైన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా జట్లు పోటీలో ఉన్నప్పటికీ.. వాటన్నింటిని అధిగమించి ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలి సీజన్లో విజేతగా నిలిచి అదరగొట్టింది.

2009 తర్వాత ఇంతవరకు ఇంగ్లాండ్ మరోసారి t20 ప్రపంచ కప్ అందుకోలేదు. కొన్ని సందర్భాలలో గెలుచుకునే అవకాశం వచ్చినప్పటికీ చివరి అంచెలో ఓడిపోయింది. అయితే ఈసారి ఇంగ్లాండ్ గడ్డమీద టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మహిళల జట్టు ఈసారి ఎలాగైనా సరే విజేతగాని నిలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే t20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టు మీద అద్భుతమైన గెలుపును అందుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ డైని వైట్ హాడ్జ్ 105* పరుగులు చేసింది. కేవలం 62 బంతుల్లోనే ఆమె ఈ స్థాయిలో పరుగులు చేయడం విశేషం. ఆమె జోన్స్ 28 బంతుల్లో 53, బ్రాంట్ 22 బంతుల్లో 46 పరుగులు చేసింది.

అనంతరం ఈ టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. నీలాక్షిక 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెంపు నాలుగు వికెట్లు, డీన్ రెండు వికెట్లు, సోఫీ రెండు వికెట్లు తీసుకున్నారు. దాదాపు 87 పరుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవల భారత మహిళలతో జరిగిన టి20 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత మహిళల జట్టుకు చుక్కలు చూపించింది. ఏ దశలో కూడా భారత మహిళలు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు టి20 వరల్డ్ కప్ కంటే ముందు ఇండియాలో జరిగిన సిరీస్లో ట్రోఫీని అందుకుంది. అదే ఉత్సాహాన్ని t20 వరల్డ్ కప్ లో కూడా ప్రదర్శిస్తోంది ఇంగ్లాండ్ జట్టు.

భారత మహిళల జట్టును ఓడించి ట్రోఫీని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు.. టి20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లోనే దుమ్మురేపింది. మొత్తంగా ఈసారి సొంత గడ్డమీద జరుగుతున్న టి20 వరల్డ్ కప్లోఫియా అందుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది. అందువల్లే ప్రారంభ మ్యాచ్ లోనే 219 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి జట్లకు ఇంగ్లాండ్ మహిళలు గట్టి హెచ్చరికలు పంపించారు. తదుపరి మ్యాచ్లలో ఇంగ్లాండ్ మహిళలు ఏ స్థాయిలో అదరగొడతారో.. ఏ రేంజ్ లో పరుగులు చేస్తారో చూడాల్సి ఉంది.

వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో డైనమైట్.. తట్టుకోవడం కష్టమే

Vaibhav Suryavanshi Family
Vaibhav Suryavanshi Family

Vaibhav Suryavanshi Family: వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ ఇంతవరకు జట్టులోకి అడుగుపెట్టలేదు. ఐర్లాండ్ సిరీస్ ద్వారా అతడు టీమిండియాలోకి ప్రవేశించాలి. కానీ ఐర్లాండ్లో జరుగుతున్న నిరసనల వల్ల అతడు జాతీయ జట్టులోకి ఆగమనం చేసే వ్యవహారం ఇంకా కాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. జాతీయ జట్టులో అడుగుపెట్టే విషయంలో ఆలస్యమైనప్పటికీ సూర్య వంశీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఖాయం.

సూర్య వంశీ తను ఏంటో అండర్ 19 క్రికెట్లో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా అదరగొట్టాడు.. గొప్ప గొప్ప బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని పడుకోబెట్టాడు. సునామిస్థాయిలో పరుగులు సాధించి సంచలనం కలిగించాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని తిరుగులేని రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. సూర్య వంశీ ప్రస్తుత క్రికెట్లో సంచలనం అనుకుంటే.. అతని కుటుంబం నుంచి మరొక వ్యక్తి క్రికెట్లోకి వచ్చేసాడు. పదిహేను సంవత్సరాల వయసులోనే సూర్య వంశీ రికార్డులు బద్దలు కొడుతుంటే.. అతడు వచ్చి రాగానే వీరలెవల్లో బ్యాటింగ్ చేశాడు. సూర్యవంశీ ని మించి తనలో టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు.

సూర్యవంశీ కుటుంబం నుంచి వచ్చిన మరొక ఆటగాడు మరెవరో కాదు, అతడి తమ్ముడు ఆశీర్వాద్ సూర్య వంశీ. ఇతడికి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఇతడు లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. తాజ్ పూర్ క్రికెట్ అకాడమీ తరఫున ఏకంగా 87 బంతుల్లో ఒక సిక్సర్.. 20 ఫోర్ల సహాయంతో 103 పరుగులు సాధించాడు. సూర్య వంశీ మాదిరిగా కాకుండా.. సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. తద్వారా సెంచరీ కొట్టేశాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆశీర్వాద్ మాట్లాడాడు. అన్న మాదిరిగానే తనకు క్రికెట్ అంటే ఇష్టమని.. క్రికెటర్ కావాలనుకున్నట్టు వెల్లడించాడు. దానికి తగ్గట్టుగానే ఆశీర్వాద్ సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టాడు.. 10 సంవత్సరాల వయసులోనే ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తే.. ఇక వచ్చే రోజుల్లో అంతకుమించి అనే రేంజ్ లో అతడు పరుగులు సాధించే అవకాశం ఉంది.

సూర్య వంశీ మాదిరిగానే ఆశీర్వాద్ కూడా బలంగా కనిపిస్తున్నాడు. ఇతడికి కూడా క్రికెట్ మీద విపరీతమైన మక్కువ ఉన్నట్టుంది.. అందువల్లే ఈ స్థాయిలో పరుగులు చేస్తున్నారు. బంతిని చూడగానే బలంగా కొడుతున్నాడు. వికెట్ల మధ్య చిరుత పులి మాదిరిగా పరుగులు పెడుతున్నాడు. అలుపు సొలుపు అనేది లేకుండా ఆడుతున్నాడు. ఇతడికి సరైన ట్రైనింగ్ ఇస్తే వైభవ్ సూర్య వంశీని కచ్చితంగా మించిపోతాడు.

చావును ముందే ఊహించి సెల్ఫీ వీడియో.. ఏపీలో పరువు *హ*త్య!

TekkalI Mandal Incident
TekkalI Mandal Incident

TekkalI Mandal Incident: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హ*త్య* చేసింది. పరువు పోతుందనే భయంతో హైదరాబాదు నుంచి రప్పించి మరి ఈ ఘాతుకానికి పాల్పడింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు సైతం పూర్తి చేశారు. అయితే ఈ పరిణామాలను గమనించిన మృతురాలు ముందుగానే అప్రమత్తం అయ్యింది. ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసింది.. ఆ వీడియో శక్తి యాప్ ద్వారా పోలీసులకు చేరడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లో హరిణి అనే మహిళ *హ*త్య కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

* మేనమామతో వివాహం..
శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లకు చెందిన దుంపల హరిణికి 2020లో టెక్కలి మండలం సోర్లిగాం గ్రామానికి చెందిన ఆమె మేనమామ దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. హరి నీ వివాహం తర్వాత డిగ్రీ పూర్తి చేసింది. గ్రూప్ వన్ పరీక్షల కోసం హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటోంది. ఈ తరుణంలో హైదరాబాదులో నాగేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. భర్తకు విడాకులు ఇచ్చి నాగేంద్ర ను పెళ్లి చేసుకోవాలని భావించింది. కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు అభ్యంతరం తెలిపారు. తనను నిర్బంధించి దాడి చేశారని హైదరాబాద్ బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హరిణి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ కేసు ఇలానే నడుస్తూ ఉంది.

* హ*త్యకు ముందే ప్రణాళిక..
హైదరాబాదులో ఉన్న హరిణికి గత నెలలో తల్లి ఫోన్ చేసింది. భర్తతో విడాకుల గురించి మాట్లాడాలని రమ్మని పిలిచింది. గత నెల 30న హైదరాబాదులో బయలుదేరి 31న సోర్లిగాం చేరుకుంది హరిణి. అప్పటికే హరిణిని మట్టుబెట్టాలని కుటుంబ సభ్యులు ప్రణాళిక రూపొందించుకున్నారు. భర్త దంతీశ్వరరావును సినిమాకు పంపారు.. ఆమె మంచం పై నిద్రపోతున్న సమయంలో తల్లి ఇనుప రాడ్డుతో గట్టిగా కొట్టి *హ*త్య చేసింది. పక్కన హరిణి తాతయ్య కూడా ఉన్నారు. కేకలు వేయకుండా నోరు నొక్కి చనిపోయిన తర్వాత భర్తకు ఫోన్ చేసి చెప్పారు. హరిణి గుండెపోటుతో చనిపోయినట్లు అందర్నీ నమ్మించారు. ఆమెకు గుండెపోటు రావడం ఏంటని ప్రశ్నిస్తే ఆత్మహత్యగా నమ్మించారు. మృతదేహాన్ని హడావిడిగా అర్ధరాత్రి స్మశాన వాటికలో దహనం చేశారు.

* ముందుగానే గ్రహించి..
అయితే ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించారు హరిణి. తన కుటుంబ సభ్యులు తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్లే సమయంలో ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు. తనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయని.. తాను జూన్ 5 లోగా తిరిగి హైదరాబాద్ జరగకపోతే.. తన మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తే.. తనకు ఏదో జరిగిందని భావించి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆ వీడియోను నాగేంద్రకు పంపించింది. అయితే ఆమె ఊహించినట్టే అంతా జరిగింది. హరిణి హైదరాబాద్ తిరిగి రాకపోవడం.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆ రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆ మరుసటి రోజు శక్తి యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగేంద్ర. ఏపీ శక్తి యాప్ కంట్రోల్ రూమ్ నుంచి శ్రీకాకుళం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు సొర్లిగాం గ్రామంలో ఆర్ఆర్ తీస్తే అప్పటికే హరిణి చనిపోయినట్లు తేలింది. *హ*త్యకు పాల్పడిన తల్లితోపాటు తాత, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తుని పాపకు ఏమైంది? ఎందుకు దొరకడం లేదు? ఎలా మిస్ అయింది?

Tuni Missing Girl
Tuni Missing Girl

Tuni Child Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులు దాటుతున్న ఎటువంటి క్లూ లభించడం లేదు. ఆ చిన్నారి కోసం వందలాది మంది పోలీసులు గట్టిగానే గాలిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయినా సరే ఆచూకీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ.. రోజుకో కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే చివరకు పూర్తి కిడ్నాప్ కోణంలోని ఈ ఘటన జరిగినట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పెంపుడు కుక్కకు జిపిఆర్ఎస్ అమర్చి వెతుకులాట ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు కుటుంబ కలహాల అనుమానాల నేపథ్యంలో తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇలా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఏది కూడా కొలిక్కి రావడం లేదు. చిన్నారి ఆచూకీ దొరకడం లేదు.

* తల్లి ఇచ్చిన వాంగ్మూలంతో…
చిన్నారి తల్లి భవాని ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో పెద్ద గొడవ జరిగిందని ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి తన భర్తను చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని ఆయన పేర్కొన్నారు. అక్కడ కొద్ది రోజులకే మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని ఆమె తెలిపారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇంకోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాధారణంగా ఎంత చిన్న వయసున్న చిన్నారులు పూర్తిగా పరిచయం ఉన్న వారితోనే వెళ్తారు. అందుకే ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక తెలిసిన వారి పని అయి ఉంటుందన్న పోలీస్ అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల కాల్ డేటా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

* దొరకని ఆనవాళ్లు..
పాప అదృశ్యమైన మొదటి రెండు నుంచి మూడు గంటల సమయాన్ని పోలీసులు గట్టిగా గమనిస్తున్నారు. గ్రామంలో సిసి పుటేజీలు పరిశీలిస్తున్నారు. కానీ ఎక్కడ చిన్నారి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడైనా దాచారా? లేకుంటే గ్రామాన్ని దాటించేసారా అనే కోలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీయడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

* తండ్రిని ప్రశ్నిస్తున్న పోలీసులు..
మరోవైపు చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆకస్మాత్తుగా వచ్చిన ఆ కుక్క కళ్ళలో భయం కనిపించింది. కానీ పోలీసులతో పాటు అక్కడ ఉన్న వారిని చూసి కొంత భయపడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకుల సహాయంతో చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో, రౌద్రంగా కనిపిస్తోంది ఆ కుక్క. అయితే ఆ కుక్కకు జిపిఎస్ పరికరాన్ని అమర్చి పోలీసులు మళ్లీ అడవిలోకి ఆ కుక్కను వదిలారు. అయితే కొంత దూరం వెళ్లిన ఆ కుక్క తిరిగి మళ్ళీ చిన్నారి ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయింది. దీంతో పోలీసులు రూటు మార్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా ఘటన జరిగి ఉంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వారం రోజులు దాటుతున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

డ్రైవర్ గా మారిన విజయ్.. సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారు..

CM Vijay
CM Vijay

Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతిరోజు విజయ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు.. పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అందువల్లే మీడియా మొత్తం విజయ్ నామస్మరణ చేస్తోంది. గతంలో జాతీయ మీడియా తమిళ రాజకీయాలను అంతగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు తమిళనాడుకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. దీనిని బట్టి విజయ్ తమిళ పాలిటిక్స్ ను ఏ విధంగా మార్చారో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ అన్ని మతాలను సమానంగా ఆచరిస్తారు. క్రైస్తవుడు అయినప్పటికీ తన తల్లి కోరిక కోసం తమిళనాడులో సాయిబాబా ఆలయాన్ని కట్టించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయిబాబా ఆలయానికి ఆయన వెళ్లారు. అంతేకాదు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో మూకాంబిక ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అకస్మాత్తుగా విజయ్ అక్కడికి ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నలు తమిళనాడు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కావేరి నది మీద కర్ణాటక ప్రభుత్వం డ్యాం కడుతోంది. దీనిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ కర్ణాటక వెళ్లడం ఒకరకంగా చర్చకు దారి తీసింది.

మూకాంబిక ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో ఉంటుంది. ఇది మంగళూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ముకాంబిక ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు తన సీఎం కాన్వాయ్ లోని కారును నడుపుకుంటూ వెళ్లిపోయారు. అంతేకాదు మధ్యలో ఒక అభిమాని విజయ్ ని గుర్తుపట్టి చెయ్యి ఊపారు. దానికి విజయ్ కూడా బదులుగా అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సంచలనం కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్న విజయ్.. ఇప్పుడు ఏకంగా 130 కిలోమీటర్ల పాటు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విజయ్ కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందువల్లే అతడు తన కాన్వాయ్ లోని కారును ఇలా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. చాలా కాలం తర్వాత కారు స్టీరింగ్ పట్టిన విజయ్.. స్వేచ్ఛగా డ్రైవింగ్ చేశాడు. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఉల్లాసంగా కనిపించాడు. సూటు.. బూటు.. చేతిలో స్టీరింగ్ అదిరిపోయిందయ్యా విజయ్ అంటూ తమిళ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సీఎం పదవి పక్కన పెట్టి విజయ్ డ్రైవర్ గా మారిపోయారని.. ఆస్థానంలో ఆయనకు నచ్చిన మహిళను కూర్చోబెడతారేమోనని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం..

Today 22 June 2026 Horoscope
Today 22 June 2026 Horoscope

Today 13 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు స్నేహితుల సహాయంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి పనులన్నీ ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అనుకున్న కోరికలను ఈరోజు నెరవేరుస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సీనియర్ల మద్దతు ఉండడంతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దుబార ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విహారయాత్రలకు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా నడుస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని గ్రహాల అనుకూలతతో మనోధైర్యం పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాలు అందుతాయి. కొత్త బాధ్యతలు అందే అవకాశం ఉంది. వ్యాపారులు అనుకోకుండా ఆదాయం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని అవసరాల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ప్రాజెక్టులు పూర్తికావడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు తమ తెలివిని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించని లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. స్నేహితుల నుంచి సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త బాధ్యతలను చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది.

మరోసారి వాయిదాపడిన అఖిల్ 'లెనిన్' చిత్రం..? ఈసారి కారణం ఏంటంటే..

Lenin Movie Collections
Lenin Movie Collections

Lenin Release Date: ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత , బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్, ‘లెనిన్’ చిత్రం తో ఈ నెల 25 న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ లో బోలెడన్ని ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. అంతే కాకుండా అఖిల్ ఈ చిత్రం లో చాలా అద్భుతంగా నటించాడని , ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి అఖిల్ ఈ సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోబోతున్నాడని, ఇక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదని అంటున్నారు. అలాంటి సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఈ చిత్రాన్ని మే డే సందర్భంగా ‘మే 1’ న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 30 న ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుందని అప్పటికే ఆ చిత్ర మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం తో , అఖిల్ కి రామ్ చరణ్ తో ఉన్నటువంటి అనుబంధానికి విలువ ని ఇస్తూ, మా ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 25 కి వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు నిర్మాతలు. కానీ అసలు నిజం అది కాదు, సినిమా ఇంకా పూర్తి కాకపోవడం వల్లే వాయిదా పడిందని ఇప్పుడు అర్థం అవుతోంది. ట్రేడ్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా జూన్ 25 న కూడా విడుదల కావడం లేదట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా సమయం తీసుకుంటుందని , కొన్ని VFX షాట్స్ డెలివరీ అవ్వాల్సిన అవసరం ఉందని , ఇప్పటి వరకు అవి డెలివరీ అవ్వలేదని అంటున్నారు.

అంతే కాకుండా ఎడిటింగ్ వర్క్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదట. కేవలం ఫస్ట్ హాఫ్ ని మాత్రమే ఇప్పటి వరకు లాక్ చేసినట్టు సమాచారం. రీ రికార్డింగ్ వర్క్ కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని జులై కి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా , అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణం లో భాగం పంచుకుంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడం తో , ఆమె స్థానంలోకి భాగ్యశ్రీ ని తీసుకున్నారు. ఈ చిత్రం లో అఖిల్ గుడ్డివాడిగా నటించబోతున్నాడని టాక్.

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'రావు బహదూర్' ట్రైలర్.. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా అంటే సాహసమే..

Rao Bahadur Trailer
Rao Bahadur Trailer

Rao Bahadur Trailer: విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సత్యదేవ్. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై, ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ లో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ చిత్రాలు ఏమి లేవు కానీ , పర్వాలేదు , అద్భుతమైన నటుడు , డిఫరెంట్ తరహా సినిమాలు చేస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా ఆయన ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేష్ మహా తో ‘రావు బహదూర్’ అనే సినిమా చేశాడు . ఈ చిత్రానికి నిర్మాత మరెవరో కాదు , సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫస్ట్ లుక్ , గ్లింప్స్ వీడియో దగ్గర నుండే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఎప్పటి లాగానే సత్య దేవ్ మరో డిఫరెంట్ జానర్ సినిమా చేసాడు అనిపించుకున్నాడు.

అయితే నేడు విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే, సత్యదేవ్ ఈసారి కమర్షియల్ గా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో మాత్రమే కాదు , ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక సినిమా కూడా తెరకెక్కలేదు. క్యాన్సర్ చివరి స్టేజి లో ఉన్న రావు బహదూర్ , అన్నేళ్లు ఎలా బ్రతికాడు?, ఇతను సామాన్యుడు కాదు , ‘మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్’ అంటూ డాక్టర్లు సైతం చెప్తుంటారు ఈ టీజర్లో. అదే విధంగా ఈ టీజర్ లో హీరో సత్యదేవ్ ని గతం వెంటాడుతున్నట్టు కూడా చూపించారు. కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా ఆడియన్స్ కి అర్థం అయ్యేలా ఈ టీజర్ ని కట్ చేయలేదు కానీ , కచ్చితంగా సినిమాలో వావ్ అనిపించే మూమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది.

వెంకటేష్ మహా దర్శకత్వం లో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో వచ్చే ట్విస్ట్ ఒకటి ఆడియన్స్ ని మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ ట్విస్టులలో ఇది ఒకటి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక నేడు టీజర్ లాంచ్ ఈవెంట్ లో ‘రావు బహదూర్’ గురించి హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ ని చూసే ఆ రేంజ్ లో షాక్ కి గురయ్యారు. ఇక ఈ చిత్రం లో వచ్చే ట్విస్టులు , స్క్రీన్ ప్లే ని చూసి మీరంతా ఏమైపోతారో అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా , ఈ టీజర్ ని చూసి థ్రిల్ కి గురై కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు . ఆ పోస్టు ని మీరు క్రింద చూడొచ్చు.

కేరళం మోడల్.. స్టైల్ గా ఫ్లైట్ దిగింది.. అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేస్తే..

Kerala Model Arrest
Kerala Model Arrest

Kerala Model Arrest: ఆ మధ్య కర్ణాటకలో రన్యా రావు అనే ఓ నటి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. తనకున్న సెలబ్రిటీ హోదా వాడుకుంటూ బంగారాన్ని అక్రమంగా దుబాయ్ ప్రాంతం నుంచి తీసుకురావడం మొదలుపెట్టింది. కొద్దిరోజులపాటు ఈ దందా సక్రమంగానే సాగింది. ఆ తర్వాత తనిఖీలలో అధికారులకు దొరికిపోయింది. జైలు శిక్ష కూడా అనుభవించింది. ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటికి వచ్చింది. కేవలం ఈమె మాత్రమే కాదు. సెలబ్రిటీలలో చాలామంది ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు . ఇప్పుడు ఈ జాబితాలో కేరళం మోడల్ కూడా చేరిపోయింది. కాకపోతే ఆమె బంగారం స్మగ్లింగ్ చేయలేదు.. అంతకు మించిన వ్యవహారంలో పీకల లోతు మునిగిపోయింది.

ఆమె పేరు హర్షా సన్నీ. మోడల్ గా కొనసాగుతోంది. మిస్ కేరళం 2026 లో రెండవ స్థానంలో నిలిచింది. సెలబ్రిటీగా సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన ఈమె దారి తప్పింది. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయింది. పైగా వాటిని తాగి మత్తులో ఉండిపోయింది. గురువారం రాత్రి బ్యాంకాక్ నుంచి ఆమె ముంబై విమానాశ్రయానికి వచ్చింది. ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులను చూసిన ఆమె కంగారు పడింది. దీంతో వారిలో అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే ఆమె బ్యాగును పరిశీలించారు. అందులో ఏకంగా వ్యాక్యూమ్ సీల్ చేసి ఉన్న 11 కేజీల మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వాటి విలువ ఏకంగా 11.8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు.

కొంతకాలంగా హర్షా మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తూ.. ఇక్కడ ఏకంగా వ్యాపారం మొదలు పెట్టినట్టు సమాచారం. ఖరీదైన నగరాలలో వీటిని ఆమె విక్రయిస్తోంది. ఈమె వెనక కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. ఈమె ద్వారా మత్తు పదార్థాలు తెప్పించి.. హై ప్రొఫైల్ వ్యక్తులకు వాటిని విక్రయిస్తున్నారు. ఇలా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. వీరి వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హర్ష మోడలింగ్లో ఉన్నప్పుడే మత్తు పదార్థాలకు బానిసగా మారినట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ వ్యాపారం లోకి ఆమె ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తాయి. ఏకంగా 11 కిలోల మత్తు పదార్థాలను ఆమె అక్రమంగా తీసుకొస్తుంది అంటే.. ఆమె వెనుక ఎంతటి పెద్ద నెట్వర్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ 11.82 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మాత్రమే ఈమె ఈ స్థాయిలో మత్తు పదార్థాలు తీసుకువచ్చిందా.. గతంలో కూడా ఇటువంటి వ్యవహారాలకు ఏమైనా పాల్పడిందా.. అనే కోణాలలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

సెలబ్రిటీ హోదాలో ఉండి సమాజానికి ఒక మార్గదర్శకమైన వ్యక్తి లాగా ఉండాల్సిన హర్ష ఇలా మత్తు పదార్థాలకు బానిస కావడం.. మత్తు పదార్థాలను రవాణా చేయడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వారి వల్లే యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆరోపిస్తున్నారు. రిమాండ్లో ఆమెను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆమె చెప్పే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా?

Anaira Gupta
Anaira Gupta

ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లిన 'ఓజీ 2'..ఇదేమి క్రేజ్ బాబోయ్..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా?, ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఇక సినిమాలకు దాదాపుగా రిటైర్మెంట్ ఇచ్చినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో , నిన్న సోషల్ మీడియా లో ఒక అను బాంబు పేలింది. ‘ఓజీ 2’ చిత్రం ఆన్ ది ట్రాక్ ఉందని , సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ ఒక్క ప్రకటన సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు, ఈ ఒక్క ట్వీట్ కి దాదాపుగా 76 లక్షల వ్యూస్ కేవలం 24 గంటల్లో వచ్చాయి , ట్విట్టర్ మొత్తం ఓజీ 2 గురించే చర్చ, ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ చూసిన ‘ఓజీ 2’ మేనియా తో నిండిపోయింది.

దీని గురించి కేవలం టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మాత్రమే కాదు , ఏకంగా హాలీవుడ్ కూడా చర్చించుకోవడం గమనార్హం. హాలీవుడ్ లో పాపులర్ మ్యాగజైన్ ‘వెరైటీ’ అనే సంస్థ , ‘ఓజీ 2’ గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఈ చిత్రం నవంబర్ నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని , మొదటి భాగం ప్రపంచవ్యాతంగా 35 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందని , ఇది కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించిన వసూళ్లు మాత్రమే అని, ఓవర్సీస్ ప్రీమియర్స్ లో హాలీవుడ్ క్రేజీ సినిమాలను సైతం ఓజీ డామినేట్ చేసిందని అంటూ ఒక సంచలనాత్మక ఆర్టికల్ రాశారు. దీనిని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఓజీ 2 గురించి చర్చలు నడిచాయి , ఈ సినిమాకు ఉన్న క్రేజ్, హైప్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డబ్బుకు విలువుండదు... ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. ప్రపంచ కుబేరుడి జోష్యం!

Elon Musk Prediction
Elon Musk Prediction

Elon Musk Prediction: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఎలాన్‌ మస్క్‌. త్వరలోనే మొదటి ట్రిలియనీర్‌గా (సుమారు రూ. కోటి కోట్ల విలువ గల ఆస్తి) అవతరించేందుకు చాలా దగ్గరగా ఉన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ వంటి కంపెనీల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ గొప్ప సంపదను సాధించిన మస్క్, డబ్బు గురించి చాలా ఆసక్తికరమైన, భవిష్యత్తును సూచించే వ్యాఖ్యలు చేశారు.

డబ్బుకు విలువ ఉండదట..
రానున్న రోజుల్లో డబ్బుకు ఇప్పటి విలువ ఉండదని మస్క్‌ పేర్కొన్నారు. కారణం కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోలు అనేక రకాల వస్తువులను సులభంగా తయారు చేస్తాయని తెలిపారు. అవి మనుషులు చేసే అనేక సేవలను కూడా అందిస్తాయని వెల్లడించారు. ఫలితంగా మనుషులకు చేయడానికి పనులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని జోష్యం చెప్పారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పని, ఆదాయం, డబ్బు అనే మౌలిక భావనలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేశారు.

ఏఐ, రోబోలతో ఆర్థిక విప్లవం..
మస్క్‌ చెప్పిన ఈ దృశ్యం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లు పని చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో వస్తువులు కొనడం అనే చక్రం మారిపోతుంది. ఏఐ, రోబోలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీంతో వస్తువుల కొరత తగ్గి, సమృద్ధి పెరుగుతుంది. దీంతో డబ్బు అనే విలువ క్రమంగా తగ్గిపోతుందని మస్క్‌ భావిస్తున్నారు.

భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్థ ట్రాష్‌..
ఎలాన్‌ మస్క్‌ ఇలా చెప్పడం ఆయన సాధారణ ఆలోచన కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయనే డబ్బుకు విలువ లేని రోజులు రానున్నాయని చెప్పడం ఆసక్తికరం. ఇది ఒక విధంగా పోస్ట్‌–స్కార్సిటీ ఎకానమీ (కొరత లేని ఆర్థిక వ్యవస్థ) గురించి ఆయన చేస్తున్న అంచనా. ఏఐ, ఆటోమేషన్‌ వల్ల మనుషులు చేసే పనులు తగ్గిపోతాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ అనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి నెలవారీగా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా చూడాలని మస్క్‌ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది కేవలం సానుకూల వైపు మాత్రమే కాదు. పని లేకపోతే మనుషులకు జీవితంలో ఉత్సాహం తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు, ఏఐ వల్ల వచ్చే సమృద్ధిని సరిగ్గా పంపిణీ చేయగలిగితే మానవజాతి మరింత సుఖంగా జీవించే అవకాశం ఉంది.

మస్క్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వైపు ఆయన టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని చెబుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సంపద, విలువ, పని అనే భావనలు పూర్తిగా మారిపోతాయని సూచిస్తున్నాయి. ట్రిలియనీర్‌ అవ్వబోయే వ్యక్తి కూడా డబ్బు అనేది శాశ్వతం కాదని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పడం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.