Dating App Fraud: మన సమాజంలో న్యాయ విభాగంలో పనిచేసే వారికి ఎక్కువ ఆలోచన శక్తి ఉంటుంది అనుకుంటాం. వారి జ్ఞానం ముందు మిగతావారు తక్కువ అని భావిస్తుంటాం. కానీ ఇతడు ఏకంగా ఒక న్యాయాధికారికే చుక్కలు చూపించాడు. ఆమె వీక్నెస్ పాయింట్ దొరకబుచ్చుకొని చుక్కలు చూపించాడు. అదే కాదు ఏకంగా 52 లక్షలకు టోపీ పెట్టాడు. ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు.
చండీగఢ్ ప్రాంతంలో ఒక మహిళ న్యాయాధికారిగా పని చేస్తోంది. ఈమెకు డేటింగ్ యాప్ టెండర్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అపరిచయం కాస్త చాలా దూరం వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగానే వ్యవహారం సాగింది. ఆమెకు అతడు స్వర్గసుఖాలు చూపించాడు. దీంతో అతడికి ఆమె సరెండర్ అయిపోయింది. ఏకంగా 52 లక్షలు ఆమె నుంచి అతడు వసూలు చేశాడు.. అతడి చేతిలో మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ న్యాయాధికారి తన అధికారాన్ని ఉపయోగించి కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు విచారణలో అసలైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ న్యాయ అధికారి తన పేరు మీద కేసు ఫైల్ చేస్తే పరువు పోతుందని భావించి.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరు మీద కేసు నమోదు చేసింది. దీంతో కేసు విచారించిన న్యాయమూర్తి మోసం చేసిన ఆ వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఇటీవల ఆ నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ సెషన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో అసలైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా మోసపోయింది పనిమనిషి కాదని.. న్యాయాధికారి అని బయటికి తేలింది. “భారీగా లాభాలు వచ్చే పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేసాడని” ఆ పనిమనిషి పిటిషన్ లో పేర్కొంది..”ముందుగా నా ఖాతా నుంచి ఐదు లక్షలు.. మా యజమాని ఖాతా నుంచి మిగతా మొత్తం నగదు అతని ఖాతాకు బదిలీ చేసాం” అని ఆ పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి విచారణ సాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంలో నిందితుడు దీపక్ వాట్స్.. 2025లో ఆ మహిళ న్యాయధికారికి డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయం అయ్యాడు. తన పేరును అభిమన్యు వశిష్ట అని మార్చుకున్నాడు.. తాను ఇండియన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. దీంతో అతని మాటలను నమ్మిన ఆ న్యాయ అధికారి అతడికి పూర్తిగా లొంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతడు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. రకరకాల మార్గాలలో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పటికే అతడికి లొంగిపోయిన ఆమె.. డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 52 లక్షలు వివిధ మార్గాల ద్వారా అతనికి బదిలీ చేసింది.
లాభాలు చూపించకపోగా.. పదేపదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ న్యాయ అధికారి తన ఇంట్లో పని చేసే దీక్ష దేవి పేరు మీద కేసు నమోదు చేసింది.. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా దీపక్ సరికొత్త విషయాలను బయటపెట్టాడు..”నన్ను ఆమె ఇష్టపడింది. నాతో కలిసి చాలా రోజులు ఉంది. ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంటుంది.. నాకు బెట్టింగ్లలో డబ్బు పెట్టమని ఆమె స్వచ్ఛందంగా ఇచ్చింది. అక్కడ నేను నష్టపోయానని” దీపక్ చెప్పాడు. దీంతో కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు.
















అప్పుడు బూతులు.. ఇప్పుడు భక్తి.. కొడాలి నాని లో ఏం మార్పు!
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ సౌండ్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీ కార్యక్రమాల్లో ఇప్పుడు పాల్గొంటున్నారు. తాజాగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరయ్యారు. అయితే ఇలా వచ్చిన క్రమంలో ఆయన సైలెంట్ గా ఉండలేదు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. వైసిపి పై గొడ్డలి పార్టీ ప్రచారంపై మండిపడ్డారు. అది పరశురాముడి గొడ్డలి అని.. శివుడు చేతిలో ఉన్న గొడ్డలి అని ఆధ్యాత్మిక ప్రబోధం చేశారు. ఆధ్యాత్మిక కామెంట్స్ చేశారు. అందులో కూడా తనదైన దూకుడు తనం చూపించారు. అయితే కొడాలి నాని అన్నింటికి తెగించినట్టు కనిపిస్తున్నారు.
* ఓటమితో ఫుల్ సైలెన్స్..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయేవారు కొడాలి నాని. కానీ అధికారానికి దూరమయ్యేసరికి ఆయన ఫుల్ సైలెన్స్ పాటించాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ తప్పకుండా జరుగుతుందన్న ప్రచారం మొదలైంది అప్పట్లో. అందుకు తగ్గట్టుగానే ఆయనపై వ్యతిరేక ఫిర్యాదులు బాగానే వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ పేరు మోసిన ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన చాలా రోజులపాటు హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఆయన విషయంలో పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు కోలుకోవడంతో బయటకు వచ్చి తిరిగి విమర్శలు చేస్తున్నారు.
* మారిన వైఖరి..
కానీ గతం కంటే కొడాలి నాని వైఖరి మారింది. గతంలో బూతులతో రెచ్చిపోయే కొడాలి నాని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారో తెలియదు కానీ.. ఆయన పుణ్యమా అని పార్టీపై బూతుల ప్రభావం కనిపించింది. తటస్తులు సైతం ఆయన వైఖరిని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన నోటి నుంచి ఆధ్యాత్మిక పలుకులు వస్తున్నాయి. ఇటీవల గొడ్డలి పార్టీ అంటూ కూటమి పార్టీ నేతలు వైసిపి పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించారు కొడాలి నాని. దేవుళ్ళ చేతిలో ఉన్న గొడ్డలిగా దానిని అభివర్ణించారు. ఇదే పాత నాని అయి ఉంటే.. నీ అమ్మ మొగుడు.. అంటూ విరుచుకు పడేవారు. ఇప్పుడు మాత్రం భక్తి మాటలు ఆడుతున్నారు. ఎంతలా కొడాలి నాని మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉంటే బూతులు.. ప్రతిపక్షంలో ఉంటే భక్తి అన్నట్టు ఉంది కొడాలి నాని పరిస్థితి.