YSRCP Kapu Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తప్పును తెలుసుకుంది. మొన్నటి ఎన్నికల్లో కాపులను వదులుకొని మూల్యం చెల్లించుకుంది. అందుకే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు ఓటు బ్యాంకు ను మళ్లీ పొందేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ బాధ్యతను గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేత తోట త్రిమూర్తులకు అప్పగించారు. ఆయన కాపు నేతలకు భారీ విందు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులకు అండగా అంబటి రాంబాబు, కన్నబాబు లను అందించారు జగన్. ఈ ముగ్గురు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నేతలను సమీకరించి… వైసీపీ వైపు కాపులు టర్న్ అయ్యేలా.. కూటమిపై కాపులు తిరగబడేలా ప్లాన్ చేయనున్నారు.
* ప్రతిపక్షంలో ఉంటేనే..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపుల కోసం జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యం చేయక మానరు. 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ సమయంలో కాపుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు ముద్రగడ పద్మనాభం ను వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేయించారు. తుని రైలు విధ్వంస ఘటనతో ఆ ఉద్యమం హింసాత్మక పరిస్థితికి దారితీసింది. కాపులు టిడిపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. దాని ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించింది. అయితే అలా వైసీపీకి దగ్గరైన కాపులను అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు జగన్. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో చూసారు. కాపులు పవన్ వెంట నడిచారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేయాలని చూస్తున్నారు జగన్. ఆ బాధ్యతను వైసీపీలో ఉన్న కాపు నేతలకు అప్పగించారు.
* కాపులు లేనిదే కష్టం..
కాపులు లేనిదే రాజకీయం చేయలేనని ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంబటి రాంబాబు తో తిట్టించి ఆయన జైలుకు వెళ్లాక కాపు టైగర్ గా చిత్రీకరించారు. కాపుల విషయంలో ఏ పరిణామం జరిగినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు. తాజాగా సాయి కృష్ణ అనే కాపు యువకుడు పై క్రిమినల్ కేసు లు ఉంటే.. ఆయనను సాధారణంగా జైలుకు తీసుకెళ్లారు. తర్వాత ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. ఇలా అదృశ్యం వెనుక కూటమి ప్రభుత్వ వైఫల్యం ఉందని.. కాపుల్లో ఒక రకమైన వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో ఉన్నారు.
* తోట త్రిమూర్తులు కొత్త పాత్రలో ..
ఇప్పుడు తోట త్రిమూర్తులకు కాపుల బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకు అప్పగిస్తే గతం మాదిరిగా కాపులు నమ్మే పరిస్థితిలో లేరు. అలా నమ్మి ఉంటే కచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ మాట వినేవారు కదా ప్రజలు. అయితే ఇప్పటికీ వైసీపీ పట్ల కాపుల అభిప్రాయం మారలేదు. ఇప్పుడు తోట త్రిమూర్తులు లాంటి వారికి బాధ్యతలు కట్టబెట్టినా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
















ఒక్క హీరో కూడా నాతో అలాంటి పని చేసే సాహసం చేయలేదంటూ రోజా హాట్ కామెంట్స్..
Roja: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మన టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూ , ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమె అసలు పేరు లతా రెడ్డి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రొజాగా మార్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన ‘ప్రేమ తపస్సు ‘ అనే చిత్రం ద్వారా మన వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వంటి బడా సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రోజా. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఈమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది.
ముందుగా తెలుగు దేశం పార్టీ లో చాలా ఏళ్ళు కొనసాగింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చింది , రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీ లోకి చేరింది. మూడు సార్లు వైసీపీ పార్టీ నుండి నగరి నియోజకవర్గం నుండి పోటీ చెయ్యగా, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యింది. 2019 – 2024 వైసీపీ పాలనలో మంత్రి కూడా అయ్యింది. ఇలా రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలను చూసిన రోజా , ఇప్పటికీ రాజకీయాల్లో యాక్టీవ్ గానే కొనసాగవుతుంది. మధ్యలో కొన్ని టీవీ షోస్ లో కూడా కనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో పని చేస్తున్నప్పుడు తనకు ఎదురైనా అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది.
తనకు సినీ ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేదని, కానీ ఏ హీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేకపోయారని చెప్పుకొచ్చింది రోజా. అందుకు కారణం కెరీర్ ప్రారంభం లోనే ఈమె ప్రముఖ డైరెక్టర్ సెల్వమణి దృష్టిలో పడడం వల్లే అట. రోజా ని చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడట సెల్వమణి , అప్పటి నుండి ఆయన రోజా పట్ల స్పెషల్ కేర్ చూపించడం మొదలు పెట్టాడట, హీరోలకు సెల్వమణి తనని ప్రేమిస్తున్నాడనే విషయం అర్థం అవ్వడం వల్ల, ఎవ్వరూ తనకు లవ్ ప్రపోజల్స్ పెట్టలేదని, ఒక రోజు సెల్వమణి వచ్చి లవ్ ప్రపోజ్ చేశాడని , కొన్ని రోజులు అతనితో ట్రావెల్ చేసిన తర్వాత ఇంట్లో చెప్పి పెళ్ళికి ఒప్పించానని చెప్పుకొచ్చింది రోజా.