Home Blog Page 107

పెద్ది మూవీకి అంత నష్టం వచ్చిందా..? బయటికి రాని నిజాలు ఇవేనా..?

Peddi OTT
Peddi OTT

Peddi movie collections : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. ఇక ఎప్పుడైతే ఆయన ‘రంగస్థలం’ సినిమా చేశాడో అప్పటినుంచి ఆయన కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూనే భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక రీసెంట్ గా ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో కలెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్లను కలుపుతున్నప్పటికి వాటి మీద ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ సీన్లు ఎలా ఉంటాయి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ నష్టాలను తీసుకొచ్చి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా నిర్మాతల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

కాబట్టి ఈ మూవీ ఎంత మొత్తంలో కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రొడ్యూసర్లకు టేబుల్ ప్రాఫిట్ అయిన తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే ఈ సినిమాకి ఎంతో కొంత నష్టాలు వస్తాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజి గా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా చేసుకుంటున్నాడు. ఇక దానికి అనుగుణంగానే పెద్ది సినిమా ప్రమోషన్స్ లో సైతం పాల్గొంటుండటం విశేషం…

ఇక స్టార్ హీరోలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటే రామ్ చరణ్ ఇంకా ఆ ఫీట్ అయితే సాధించలేకపోతున్నాడు… రాబోయే సినిమాలతో అయిన 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా ఫైనల్ చేసే పనిలో సుకుమార్ ఉన్నాడు…

ఆ విషయంలో సీనియర్ హీరోల కంటే కుర్ర హీరోలే బెటర్..

Young Heroes Vs Senior Heroes
Young Heroes Vs Senior Heroes

Young Heroes Vs Senior Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతుంటే సీనియర్ హీరోలు తెలుగు సినిమాలకే పరిమితమవుతున్నారు. అయినప్పటికి వరుస విజయాలను సాధిస్తూ సీనియర్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటుండటం విశేషం… ఇక వీళ్ళతో పాటుగా కుర్ర హీరోలు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తమ హవా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వచ్చిన సినిమాలను వచ్చినట్టుగా చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబడుతున్నారు. ఇక సీనియర్ హీరోలు మాస్ కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. కానీ కుర్ర హీరోలు మాత్రం సాహసోపేతమైన సినిమాలను చేస్తూ ప్రయోగాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు. ఇక ఈ విషయంలో సీనియర్ హీరోల కంటే యంగ్ హీరోలే బెటర్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం యంగ్ హీరోలు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. కానీ సీనియర్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్ తోనే రంగంలోకి దిగుతున్నారు.

ఇక ఇప్పటికే చిరంజీవి ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకటేష్ సైతం గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించాడు. బాలయ్య సైతం వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు.

‘అఖండ 2’ తో కొంతవరకు నిరాశపర్చినప్పటికి అది పెద్దగా ప్రభావం చూపించలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాగార్జున సైతం ఇప్పుడు వరుసగా రెండు సక్సెస్ లను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ సీనియర్ హీరోలు సైతం డిఫరెంట్ సబ్జెక్టులను కథలుగా ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు.

కుర్ర హీరోలు చేసే ప్రయోగాలు సీనియర్ హీరోలు చేయలేకపోయిన వాళ్ళ ఏజ్ కి తగ్గ పాత్రలను పోషిస్తే బాగుంటుందనే రీతిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి… చూడాలి మరి వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తారనేది…

రాత్రిపూట చాపలు చేతిలో పట్టుకొని బీచ్ కు.. తెల్లవారుజామున ఇంటికి.. ఇంతకీ వీరు అలా ఎందుకు చేస్తున్నారంటే..

Residents Sleep On Mumbai Beach
Residents Sleep On Mumbai Beach

Residents Sleep On Mumbai Beach: అది సుప్రసిద్ధమైన సముద్రం.. అందమైన వెర్సోవా తీర ప్రాంతం.. సాయంత్రమైతే చాలు అక్కడ చాలామంది చాపలు చంకలో పట్టుకొని వెళ్తున్నారు. వెళ్లడం మాత్రమే కాదు.. రాత్రి మొత్తం అక్కడే.. తెల్లవారుజామున ఇంటికి వస్తున్నారు. వారేం చేస్తున్నారు.. ఎందుకలా చేస్తున్నారు.. మొదట్లో చాలామంది పట్టించుకోలేదు. ఇప్పుడు వారు చేస్తున్న వ్యవహారం ఏకంగా దేశంలోనే సంచలనంగా మారింది.

ఇబ్బంది పడుతున్నారు
దేశవ్యాప్తంగా వర్షాలు కురవడం లేదు. పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం లేదు. దీంతో వర్షాలు కురవడం లేదు. ఫలితంగా దేశంలో వాయవ్య ప్రాంతం మినహా మిగతా అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. చినుకు జాడలేదు. కనీసం ఇంట్లో కునుకు తీద్దామంటే అనుకూలమైన వాతావరణం లేదు. విపరీతమైన ఉక్క పోత తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది.

చాప చేతిలో పట్టుకొని..
ఇంట్లో పడుకునే అవకాశం లేకపోవడంతో మహారాష్ట్రలో చాలామంది చాపలు చేతిలో పట్టుకొని అక్కడ సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్నారు. ముఖ్యంగా మురికి వాడలలో ఉండేవారు చాపలు చంకలో పెట్టుకుని సముద్రతీరా ప్రాంతానికి వెళ్లి.. రాత్రి మొత్తం అక్కడే పడుకుంటున్నారు. దిండు.. దుప్పట్లతో అక్కడే రాత్రి మొత్తం గడిపి.. తెల్లవారుజామున ఇంటికి వస్తున్నారు..

కరెంటు కోతలు
కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కరెంటు కోతలు విపరీతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట కరెంటు కోతల వల్ల అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. మురికి వాడల ప్రదేశాలలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది.. అందువల్లేవారు రాత్రిపూట సుఖవంతమైన నిద్ర కోసం సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్నారు.. ఇటీవల జాతీయ మీడియా ప్రతినిధులు ఈ ఫోటోలు తీయడంతో.. మురికివాడల ప్రజల బాధలు వెలుగులోకి వచ్చాయి.. ఇంత జరుగుతున్నప్పటికీ మహారాష్ట్రలో కరెంటు కోతలు తగ్గకపోవడం విశేషం. వర్షాలులేకపోవడంతో కరెంట్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి సమయంలో వినియోగం ఎక్కువగా ఉంటున్నది. అందువల్లే ఈ మురికి వాడల ప్రజలు సుఖ నిద్రకోసం సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు.

తమిళ వాసనలు పోనిచ్చుకోని టీవీకే విజయ్.. ఇవే తగ్గించుకుంటే మంచిది..

Vande Mataram Song Controversy
Vande Mataram Song Controversy

Vande Mataram Song Controversy: తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాలుగా ఒక రకమైన మూర్ఖత్వం కొనసాగుతూ ఉండేది.. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నేతలు ద్రావిడ వాదాన్ని అక్కడి ప్రజల్లో నూరి పోశారు. ఫలితంగా ఆ పార్టీలు మాత్రమే అధికారంలోకి వచ్చేవి. అయితే డిఎంకె లేకుంటే అన్నా డీఎంకే మాత్రమే అక్కడ పరిపాలన సాగించేవి. హిందీకి అక్కడ వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమాన్ని ఆసరాగా చాలామంది రాజకీయంగా ఎదిగారు.

రాజకీయంగా ఎదిగినప్పటికీ
రాజకీయంగా ఆ నేతలు ఎదిగినప్పటికీ.. తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ.. హిందీ మీద వ్యతిరేకతను తగ్గించలేదు. పైగా తమిళనాడు రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేసేవారు. ఈ మూర్ఖత్వం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే.. మనదేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ మరణానికి కారణమైన ఎల్టిటిటిఈ ఉగ్రవాదులకు తమిళనాడులో షెల్టర్ ఇచ్చే అంతగా.. పైగా అన్నా డీఎంకే, డీఎంకే పైకి వేరువేరుగా కనిపించినప్పటికీ.. అంతర్గతంగా ఆ రెండు పార్టీలు ఒకటే. వాటి మూల సిద్ధాంతం కూడా ఒకటే. అయితే మీరు లేకుంటే మేము అన్నట్టుగానే వారి వ్యవహారం ఉంటుంది. మూడో పార్టీకి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఇవ్వద్దు అన్నట్టుగా వారి విధానం సాగుతూ ఉంటుంది.

విజయ్ వచ్చిన తర్వాత
విజయ్ టీవీ కే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడు రాజకీయాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ద్రావిడ వాదం లేకుండానే అక్కడి ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పును వెల్లడించారు. ఫలితంగా టీవీ కే అక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించింది.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కూడా అచ్చం ఆ ద్రావిడ పార్టీల మాదిరిగానే పరిపాలన సాగిస్తున్నారు.. ముఖ్యంగా తమిళనాడు శాసనసభ సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతర గీతాన్ని విజయ్ ప్రభుత్వం తొలగించింది. తమిళ్ తాయి వళ్లు(రాష్ట్ర గీతం), జనగణమన (జాతీయ గీతం) తో అక్కడి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వందేమాతరం గేయం దేశ ప్రజల్లో స్వాతంత్ర్య ఉద్యమకాంక్షను బలంగా చాటింది. బకించంద్ర చటర్జీ రాసిన ఆ గేయం కోట్లాదిమంది భారతీయులకు స్ఫూర్తి నింపింది. అటువంటి గేయాన్ని విజయ్ ప్రభుత్వం తొలగించడం నిజంగా మూర్ఖత్వానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.

'ఆదర్శ కుటుంబం' ఆ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుందా..? అడ్డంగా దొరికిపోయిన త్రివిక్రమ్..

Adarsha Kutumbam
Adarsha Kutumbam

Adarsha Kutumbam Remake Rumors: ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు , ఒరిజినల్ గా ఉండడం లేదు. పాత సినిమాలను రిఫరెన్స్ గా తీసుకొనే తెరకెక్కిస్తున్నాడు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత ఆయన తీసిన చిత్రాలను చూస్తే అలాగే అనిపిస్తోంది. నితిన్ తో తీసిన ‘అ ..ఆ’ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పాత సినిమా ‘మీనా’ కి అనధికారిక రీమేక్. అందరికీ అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే ఫ్రీ మేక్ అనొచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘లార్గో వించ్ ‘ కి ఫ్రీ మేక్. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు అల్లు అర్జున్ తో చేసిన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం కూడా అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన కృష్ణ ‘ఇంటిగుట్టు’ చిత్రానికి ఫ్రీ మేక్. ఇలా ఆయన పాత సినిమాలను రిఫరెన్స్ గా తీసుకొనే చేస్తూ వెళ్తున్నాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన విక్టరీ వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈసారి ఆయన పాత సినిమాలను ఫ్రీ మేక్ చేయడం లేదు, గత నెలలో విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’ ని రీమేక్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. నిన్న గాక మొన్న విడుదలైన సినిమా అది, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం షూటింగ్ మొదలై నెలలు అవుతోంది, అలాంటిది రీమేక్ అని ఎలా పిలుస్తున్నారు , ఇదొక అర్థం లేని వాదన అని అనుకోవచ్చు. కానీ చెప్పలేం కదా, బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్టోరీ ని ఎవరో ఒకరి ద్వారా విని ఉండొచ్చు , అర్జున్ సినిమాని ఇప్పుడు ఎవరు చూస్తారు?, విడుదలయ్యాక పెద్దగా ఎవ్వరూ ఆ చిత్రాన్ని పట్టించుకోరు కాబట్టి , ధైర్యం గా అదే స్టోరీ తో ‘ఆదర్శ కుటుంబం ‘ చేస్తుండొచ్చు కదా అనేది కొంతమంది విశ్లేషకుల వాదన.

అనుకోకుండా ‘బ్లాస్ట్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం , త్వరలో ఓటీటీ లో కూడా రాబోతుండడంతో , ‘ఆదర్శ కుటుంబం’ విడుదల అయ్యాక పెద్ద సమస్య ఏర్పడుతుంది అనే విషయాన్నీ గమనించి , త్రివిక్రమ్ ఇప్పుడు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు , చేర్పులు చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో చూడాలి. ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చెయ్యాలి , కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పై మండిపడుతున్న నెటిజెన్స్.. ఈ వయస్సులో ఇవేమి పనులు..

Raghavendra Rao Latest Controversy
Raghavendra Rao Latest Controversy

Raghavendra Rao Latest Controversy: టాలీవుడ్ లో పీక్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే , చిన్న పిల్లవాడు కూడా చెప్పే పేరు రాఘవేంద్ర రావు. ఎన్టీఆర్ కాలం నాటి సూపర్ స్టార్స్ నుండి , నేటి తరం సూపర్ స్టార్స్ వరకు , ప్రతీ ఒక్కరితో పని చేసి , తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ని అందించిన చరిత్ర ఆయనది. నేటి తరం లో మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వపడే రాజమౌళి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారిని పరిచయం చేసిన ఘనత ఆయనది. అలాంటి లెజెండ్ ఈమధ్య కాలంలో తరుచూ నెటిజెన్స్ నుండి తీవ్రమైన విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకు కారణం ఆయన యంగ్ హీరోయిన్స్ తో ప్రవర్తించే తీరు అని అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే నిహారిక కొణిదెల పై ఆయన చెయ్యి వేసిన తీరుపై తీవ్రమైన విమర్శలు చేసారు నెటిజెన్స్. ఆ వీడియో సోషల్ మీడియా లో పెద్ద వివాదాస్పదంగా మారింది.

ఇప్పుడు లేటెస్ట్ గా మరో వీడియో రాఘవేంద్ర రావు పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు అనిల్ రావిపూడి – విక్టరీ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు ఒక అతిథి గా విచ్చేశాడు. అయితే ఆయన ఈ ఈవెంట్ లో హీరోయిన్ కీర్తి సురేష్ , కృతి శెట్టి లపై చేతులు వేయడాన్ని నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆయన కీర్తి సురేష్ భుజం పై చేతులు వేసి , స్టైల్ గా ఫోటో దిగడం నెటిజెన్స్ కి అసలు నచ్చలేదు. ఆడవాళ్ళ పై చేతులు వేయకుండా ఉండలేవా?, ఈ వయస్సులో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

మీకు కూడా రాఘవేంద్ర రావు ఈ వయస్సులో ఇలా హీరోయిన్స్ తో వ్యవహరించడం తప్పు అనిపించిందా అనేది కామెంట్స్ రూపం లో తెలియజేయండి. అయితే రాఘవేంద్ర రావు వయస్సులో పెద్ద మనిషి కాబట్టి , కూతురి తో సమానంగా భావించి హీరోయిన్స్ పైన చెయ్యి వేసి ఉండొచ్చు కదా?, ఎందుకు ప్రతీ విషయాన్ని చెడు ఆలోచనలతో చూస్తారు? అంటూ రాఘవేంద్ర రావు ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా లాజిక్ కదా అది?, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ అనేది ఆడవాళ్లకు తెలిసిపోతుంది. బ్యాడ్ టచ్ అనిపించినప్పుడు ఆడవాళ్ళూ అసౌకర్యంగా ఫీల్ అవుతారు , నేడు వైరల్ అవుతున్న వీడియోలో హీరోయిన్స్ అసౌకర్యం గా ఫీల్ అయ్యినట్టు ఎక్కడ అనిపించడం లేదా?, మీకేమైనా అనిపించిందా?, కామెంట్ చేయండి.

రష్మిక మందాన ని లైవ్ లో కొట్టిన కృతి సనన్.. వీడియో వైరల్..

Rashmika Kriti Viral Video
Rashmika Kriti Viral Video

Rashmika Kriti Viral Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా అవకాశాలు సంపాదిస్తూ , మార్కెట్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే, అది రష్మిక మందాన మాత్రమే. ఈమెకు మన సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో, నార్త్ ఇండియా లో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో యానిమల్ , పుష్ప సిరీస్, చావా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో , తిరుగులేని స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది రష్మిక. రీసెంట్ గా ఆమె షాహిద్ కపూర్ హీరో గా నటించిన ‘కాక్ టైల్ 2’ లో ఒక హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. రేపు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ప్రొమోషన్స్ కార్యక్రమం లో మూవీ టీం పెద్ద ఎత్తున పాల్గొంటుంది.

రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో ఒక ఫన్నీ సందర్భం చోటు చేసుకుంది. షాహిద్ కపూర్ మాట్లాడుతున్న సమయం లో , రష్మిక మందాన భుజం పై కృతి సనన్ చేతులో వేసే క్రమంలో , ఆమె మోచెయ్యి రష్మిక చేతికి తగిలింది. అందుకు రష్మిక ఫన్నీ గా దెబ్బ తగిలింది అని రియాక్షన్ ఇవ్వడం తో, కృతి సనన్ ఆమెకు క్షమాపణలు చెప్పి దగ్గరకు తీసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ ఇద్దరి స్టార్ హీరోయిన్స్ మధ్య ఇంతటి స్నేహపూర్వక వాతావరణం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ఫన్నీ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే రీసెంట్ గా ఈ ముగ్గురు ఒక మ్యూజిక్ ఈవెంట్ కోసం మాల్ కి వెళ్లడం , అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే.

మాల్ కి వీళ్ళు వచ్చారనే విషయం తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులు స్టేజి మీదకు దూసుకొని రావడం తో ఈవెంట్ ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన కారణంగా రష్మిక బాగా భయపడిపోయింది. దీంతో కృతి సనన్ రష్మిక కి ఒక రక్షక కవచం లాగా మారి , దగ్గరకు తీసుకొని ఆ ఈవెంట్ నుండి జాగ్రత్తగా బయటపడేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రతీ ఒక్కరు కృతి సనన్ చూపించిన ప్రేమాభిమానాలు, కేరింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి సంఘటనల కారణంగా ఈ సినిమాకు పబ్లిసిటీ భారీగానే జరిగింది. మరి అది కలెక్షన్స్ రూపం లో మారుతుందా లేదా అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by VMJ Bollywood (@vmj_bollywood)

పిల్లల్లో ఏకాగ్రతను పెంచే ప్రత్యేకమైన యోగాసనాలు ఇవే..

Best Yoga Poses For Kids
Best Yoga Poses For Kids

Best Yoga Poses For Kids: ప్రస్తుత కాలంలో పిల్లలు చదువులు, పోటీ పరీక్షలు, డిజిటల్ పరికరాల వినియోగం వల్ల ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక యోగాసనాలు, ధ్యాన పద్ధతులు పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతను పెంపొందిస్తాయని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లలు చేయాల్సిన యోగాసాలు ఏవో చూద్దాం..

బాలాసనం:
యోగాలో ముఖ్యమైన భంగిమల్లో బాలాసనం ఒకటి. ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలోని కండరాలు రిలాక్స్ అవుతాయి. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చదువుల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. రోజూ కొన్ని నిమిషాల పాటు బాలాసనం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

త్రాటక్ ధ్యానం:
త్రాటక్ ధ్యానం అనేది ఒక వస్తువు లేదా దీప జ్యోతిని కదలకుండా చూడటం ద్వారా చేసే ధ్యాన ప్రక్రియ. ఇది కళ్ల కండరాలను బలపరచడమే కాకుండా మనసును ఒకే అంశంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఈ సాధన వల్ల పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ మెరుగుపడి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి, పరిశీలనా నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల వినియోగం పెరగడంతో చిన్న వయసులోనే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. త్రాటక్ వంటి యోగ సాధనలు కంటి కండరాలకు వ్యాయామంలా పనిచేస్తాయి. దీంతో కళ్ల అలసట తగ్గి చూపు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే చిన్నపిల్లలు త్రాటక్ ధ్యానం చేసే సమయంలో పెద్దల పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు, హోంవర్క్, ఇతర విద్యా కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఒత్తిడి పెరగడం సహజం. యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా పిల్లలు ప్రశాంతంగా ఉండటంతో పాటు భావోద్వేగాలను సులభంగా నియంత్రించగలుగుతారు. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది.

యోగాను ప్రతిరోజూ ఒకే సమయానికి చేయడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ అలవడుతుంది. శరీరంపై, మనసుపై నియంత్రణ పెరగడంతో ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడుతుంది. పాఠశాల కార్యకలాపాలు, క్రీడలు, ఇతర ప్రతిభా రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడానికి ఇది సహాయపడుతుంది.

నిపుణుల సూచనల ప్రకారం పిల్లలు రోజుకు 15 నుంచి 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం వేళల్లో స్వచ్ఛమైన గాలిలో యోగా చేయడం మరింత ప్రయోజనకరం. ప్రారంభంలో సులభమైన ఆసనాలతో మొదలుపెట్టి, క్రమంగా ఇతర యోగాభ్యాసాలను చేర్చడం మంచిదని సూచిస్తున్నారు.

గ్రాండ్ గా మొదలైన వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ..ముహూర్తం రోజే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

Venkatesh Kalyan Ram New Movie
Venkatesh Kalyan Ram New Movie

Venkatesh Kalyan Ram New Movie: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్ , కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్రర్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. వరుస బ్లాక్ బస్టర్స్ , ఇండస్ట్రీ హిట్ తర్వాత రాబోతున్న అనిల్ రావిపూడి సినిమా కాబట్టి , సాధారణంగానే ఈ చిత్రం పై అంచనాలు స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లోనే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బలమైన స్టోరీ ని రెడీ చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపేందుకు అన్ని విధాలుగా సన్నాహాలు చేసుకున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి లతో పాటుగా, హీరోయిన్స్ గా నటించబోతున్న కృతి శెట్టి , కీర్తి సురేష్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఇక సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వంటి వారు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అల్లు అరవింద్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొత్తగా, రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసి , మొదటి సన్నివేశానికి దర్శకత్వం వహించాడు. అయితే అనిల్ రావిపూడి ముహూర్తం షాట్ లోనే తన మార్క్ క్రియేటివిటీ చూపిస్తూ , ఈ సినిమా కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ ని ఆడియన్స్ కి ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ షాట్ లో వెంకటేష్ కృతి శెట్టి భుజం పై చెయ్యి వెయ్యగా, కళ్యాణ్ రామ్ కీర్తి సురేష్ భుజం పై చేతులు వేస్తాడు. అనంతరం ఒకరిని ఒకరు చూసి షాక్ కి గురై , కీర్తి సురేష్ వెంకటేష్ వైపు , కృతి శెట్టి కళ్యాణ్ రామ్ వైపు వస్తుంది.

దీన్ని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకరి ప్రేయసి తో మరొకరు ఈ చిత్రం లో ఎదో ఒక కారణం చేత కనెక్షన్ పెట్టుకుంటారని , అలాంటి సందర్భాలు ఎందుకొచ్చాయి?, దీని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కథాంశంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని పుష్కలంగా ఇచ్చే స్కోప్ ఉన్న కథ ఇది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఇలాంటి బోల్డ్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్స్ ఉండేవి. మొట్టమొదటిసారి అనిల్ రావిపూడి మన టాలీవుడ్ లోకి అలాంటి కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నాడు. ఇందులో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ బావ బావమరిది లుగా కనిపించబోతున్నారు. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. ‘జనవరి 13 న విడుదల’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు అట. సినిమాని కూడా అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి అనిల్ రావిపూడి ఈ చిత్రం తో తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తారా లేదా అనేది.

'డ్రాగన్' మూవీ లో కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడా..?

NTR Fans Anger
NTR Fans Anger

Dragon Movie Latest Updates: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘దేవర’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అలాంటి సినిమా చేయలేదు. మొత్తానికైతే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుంది అనుకున్నారు. కానీ 600 కోట్ల వరకే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఇంతేనా బాక్సాఫీస్ వద్ద ఆయన పెద్దగా మ్యాజిక్ చేయలేడా అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు… ఇక ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడు అని అందరు అనుకున్నప్పటికి ఆ సినిమా పూర్తిగా డీలే అయిపోయింది.

డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో ఆయన ఎలాగైనా సరే భారీవిజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. మొత్తానికైతే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఒక్కటే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు…

ఇక ప్రశాంత్ నీల్ సైతం బడ్జెట్ కి వెనకాడకుండా భారీ సెట్ల ను వేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమా సక్సెస్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సలార్ సినిమాలో ఎలాగైతే ఎలివేషన్స్ ను వాడుకొని భారీగా సక్సెస్ ని సాధించాడో ఈ సినిమాలో సైతం అలాంటి స్ట్రాటజీ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. సినిమా గ్లింప్స్ లో పరిచయం చేసినట్టుగానే ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమాగా కూడా తెలుస్తుంది. ఇంతవరకు ఎన్టీఆర్ దేశభక్తి కి సంబంధించిన సినిమా చేయలేదు. కాబట్టి తన నుంచి వస్తున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని ఇందులో కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు అంటూ ప్రశాంత్ నీల్ సైతం చెబుతుండడం విశేషం…

రాజమౌళి తదుపరి చిత్రం రామ్ చరణ్ తోనే.. ఈసారి ఎలాంటి స్టోరీ తో రాబోతున్నారంటే..

Ram Charan New Film
Ram Charan New Film

Rajamouli Next Movie With Ram Charan: తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ కి శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే , రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన టాలీవుడ్ ని ‘మగధీర’ కి ముందు , ‘మగధీర’ కి తర్వాత అని డివైడ్ చేయొచ్చు. ఈ చిత్రానికి ముందు మన టాలీవుడ్ డైరెక్టర్లు , నిర్మాతలు, హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి భయపడేవారు. కేవలం కమర్షియల్ సినిమాలు , లవ్ స్టోరీ సినిమాలు , ఫ్యాక్షన్ సినిమాలు మాత్రమే వచ్చేవి. ఈ సినిమా సంచలన విజయం సాధించి , మన తెలుగు సినిమాకు తిరుగులేని గుర్తింపు జాతీయ స్థాయిలో తీసుకొని రావడంతో , పెద్ద సినిమాలు రావడం మొదలయ్యాయి. నేను ‘బాహుబలి’ లాంటి సినిమా తీశానంటే , అందుకు కారణం ‘మగధీర’ ఇచ్చిన ధైర్యమే అని చెప్పుకొచ్చేవాడు రాజమౌళి.

ఇక రామ్ చరణ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి తీసిన #RRR చిత్రం వరల్డ్ వైడ్ గా ఎలాంటి సునామీ ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. మన ఇండియన్ సినిమాకు మొట్టమొదటి ఆస్కార్ అవార్డు ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మన టాలీవుడ్ కి హాలీవుడ్ లో మార్కెట్ ని ఏర్పాటు చేసిన చిత్రం కూడా ఇదే. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి రామ్ చరణ్ , రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లోపు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి అవ్వగానే రామ్ చరణ్ , రాజమౌళి కాంబినేషన్ లో సినిమా మొదలు అవ్వబోతుందని టాక్. ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యం లో ఉంటుందట.

రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘గరుడ’. బాహుబలి కి ముందే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ అప్పటికి మన టాలీవుడ్ కి మార్కెట్ ఆ స్థాయి లేకపోవడం తో , బడ్జెట్ కూడా అప్పటి మార్కెట్ స్టాండర్డ్స్ కే 500 కోట్లు రేంజ్ లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు మన టాలీవుడ్ మార్కెట్ కి అవధులు లేవు. ముఖ్యంగా రాజమౌళి క్రేజ్ కి ఇతర భాషల్లో తిరుగులేదు. ‘వారణాసి’ తో హాలీవుడ్ లో కూడా జెండా పాతేయబోతున్నాడు. తిరుగులేని మార్కెట్ ని సంపాదించుకున్న తర్వాత రామ్ చరణ్ తో ఈ సినిమా చేయబోతున్నాడు , ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయి అనేది మీరే ఊహించుకోండి.

రుషికొండ భవనాలపై తుది నిర్ణయం కష్టమే!

Rushikonda Buildings
Rushikonda Buildings

Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగం విషయంలో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఈ భవనాల వినియోగం విషయంలో ఎందుకో జాప్యం జరుగుతోంది. దీని వినియోగం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే వీటి వినియోగం విషయంలో అనేక రకాల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ఇప్పటికే దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పలు సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం విశాఖలో సమావేశం కానున్న ఈ కమిటీ తుది నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. వైసిపి హయాంలో అత్యాధునిక హక్కులతో దాదాపు 400 కోట్ల రూపాయలతో రుషికొండ భవనాలు నిర్మితమయ్యాయి. అయితే ఎందుకు నిర్మించారో కూడా జగన్ సర్కార్ బయటకు చెప్పలేక పోయింది. రెండేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కూడా ఎలా వినియోగించుకోలా తెలియక సతమతం అవుతోంది.

అప్పట్లో స్పష్టత కరువు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రుషికొండలో నిర్మాణాలు తొలగించి.. భారీ భవంతులను నిర్మించారు. కనీసం ఏ నిర్మాణాలు జరుపుతున్నారో కూడా చెప్పలేకపోయారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. పాలనా రాజధానితో పాటు సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ఈ భవన నిర్మాణ పనులు జరిపిందన్నది బహిరంగ రహస్యం. కానీ ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రకటన కూడా చేయలేకపోయింది. కేవలం అప్పటి మంత్రులు మాత్రం ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత రిషికొండ భవనాల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమయింది టిడిపి కూటమి ప్రభుత్వం.

ఏకంగా విక్రయించేందుకు..
పర్యాటకపరంగా రిషికొండ భవనాలను వినియోగించుకోవాలని చూసింది కూటమి ప్రభుత్వం. మరోవైపు ప్రపంచ దిగ్గజ సంస్థలకు లీజులకు ఇవ్వాలని కూడా చూసింది. కానీ వీటితోపాటు అదనపు భూములు కోరుతున్నాయి అంతర్జాతీయ సంస్థలు. మరోవైపు బహిరంగ వేలం ద్వారా.. ఈ భవనాలను విక్రయించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ ఎందుకో ఏ నిర్ణయము తీసుకోలేకపోతోంది. మరోవైపు రుషికొండ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారుతోంది. ఏడాదికి కోట్లాది రూపాయల వ్యయం అవుతుండడంతో ప్రభుత్వం పై అదనపు భారం పడుతుంది. గతంలో పర్యాటకపరంగా రుషికొండ ద్వారా సంవత్సరానికి 7 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఇప్పుడు ఆ ఆదాయం పోగా అనవసర ఖర్చు తప్పడం లేదు. భవనాల వినియోగం విషయంలో జరుగుతున్న జాప్యంతో తిరిగి విమర్శలకు గురవుతోంది కూటమి ప్రభుత్వం. అందుకే అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు షాక్.. సీఈవో ‘కుక్’ కామెంట్స్ తో తీవ్ర చర్చ..

Tim Cook Latest Statement
Tim Cook Latest Statement

Tim Cook Latest Statement: స్మార్ట్ ఫోన్ రంగంలో రారాజుగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు ఇది షాకింగ్ విషయమే. ఈ ఫోన్ పై ఉన్న అభిమానంతో ఎంత ధర కేటాయించినా కొనేందుకు క్యూ కడుతూ ఉంటారు. అయితే Apple కంపెనీ త్వరలో తన ఐఫోన్‌ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల తయారీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంస్థ సీఈవో Tim Cook తెలిపారు. దీంతో భవిష్యత్తులో విడుదలయ్యే ఐఫోన్ మోడళ్ల ధరలు మరింత పెరగవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా పెరుగుతాయంటే?

స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే NAND ఫ్లాష్ స్టోరేజ్, DRAM మెమరీ చిప్‌లు చాలా కీలకమైనవి. అయితే వీటి ధరలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో చిప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ఈ ప్రభావం నేరుగా స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా అధిక స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ప్రీమియం ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తి వ్యయం మరింత పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ అంశంపై స్పందించిన యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ ‘ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. వినియోగదారులపై భారం తగ్గించే మార్గాలను పరిశీలిస్తున్నాం. అదే సమయంలో కస్టమర్లను రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ప్రస్తుతం పరిస్థితి భరించలేనిదిగా మారుతోంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే ధరలను ఎంత మేర పెంచుతారు? ఏ మోడళ్లపై ప్రభావం ఉంటుందనే విషయాలను ఆయన వెల్లడించలేదు.

సాధారణంగా యాపిల్ కొత్త మోడళ్ల విడుదల సమయంలోనే ధరల సవరణలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐఫోన్ సిరీస్‌లో ధరల పెంపు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా Pro, Pro Max వంటి హైఎండ్ మోడళ్లలో స్టోరేజ్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో వాటి ధరల్లో పెరుగుదల అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

యాపిల్ ధరల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే.. భారతీయ వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే దిగుమతి సుంకాలు, పన్నులు, కరెన్సీ మార్పిడి విలువల కారణంగా భారత్‌లో ఐఫోన్‌లు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ధరలకు విక్రయమవుతున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి వ్యయం కూడా పెరిగితే కొత్త మోడళ్ల ధరలు మరింత భారంగా మారే అవకాశముంది. కొత్త ఐఫోన్ కొనాలని భావిస్తున్నవారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ధరల పెంపు అధికారికంగా ప్రకటించబడితే పాత స్టాక్‌ల ధరలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలు నిర్ణయం తీసుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం అవసరమని చెబుతున్నారు.

వైసిపి లైన్ లోనే ఆ టిడిపి మాజీ ఎంపీ!

TDP Former MP
TDP Former MP

TDP Former MP: కొంతమంది నేతల తీరు అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని పరిస్థితి కూడా అంతే. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టిడిపి నుంచి తనను బయటకు పంపించడంలో సోదరుడు చిన్ని తీరుపై పూర్తి అసహనంతో ఉన్న నాని.. ఆయన చేతిలోనే ఓడిపోయారు. దీంతో పూర్తిగా మనస్థాపానికి గురయ్యారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో అస్సలు సంబంధం లేదని తేల్చేశారు. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానన్న బాధ ఆయనలో కనిపించింది. అయితే తనకు దక్కాల్సిన గౌరవం తమ్ముడు చిన్నికి దక్కుతుండడంతో తట్టుకోలేకపోతున్నారు నాని.

తమ్ముడిని టార్గెట్ చేసుకొని..
పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కేసినేని నాని.. తరువాత క్రమంలో మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారు. తనను టిడిపి నుంచి బయట పెట్టేసిన తమ్ముడు చిన్ని పై ఓ రేంజ్ లో రాజకీయం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖలు రాస్తూ.. తన బాధ, ఆవేదన తన తమ్ముడి చిన్ని పై తప్ప చంద్రబాబుపై కానీ.. టిడిపి పై కానీ తనకు ఎటువంటి దురుద్దేశం లేదని సంకేతాలు పంపారు. తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే చేరేందుకు సిద్ధమని కూడా తన ప్రవర్తన ద్వారా తెలియజేశారు. విజయవాడలో రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అయితే అదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లోనే అని తాజాగా తెలిసిపోయింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీకి సంబంధించి విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. తద్వారా వైసిపి ముసుగు తీసి కేసినేని నాని మరోసారి రాజకీయం చేసినట్టే కనిపించారు.

ఇప్పుడు మళ్లీ వైసిపి ముసుగుతోనే..
రెండుసార్లు విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి గెలిచారు కేసినేని నాని. ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. తరువాత చంద్రబాబు పిలిచి 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు సీటు ఇచ్చారు. అక్కడ తిరుగులేని విజయం సాధించిన నాని 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత అదంతా తన వ్యక్తిగత చరిష్మ అని భావించారు. అలా క్రమేపీ పార్టీకి దూరమయ్యారు. లోకేష్ ను అడ్డం పెట్టుకొని తన తమ్ముడి చిన్ని హైకమాండ్కు దగ్గరయ్యారన్న బాధ నాని లో ఉండేది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు వచ్చాక వైసీపీతో తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ లైన్ లో రాజకీయాలు చేస్తుండడంతో ఆయన ముసుగు తీసినట్టు అయింది.

బ్యాటరీ లైఫ్ లక్ష కిలోమీటర్లు.. ప్రీమియం లుక్ తో ఉన్న ఈ స్కూటర్ ధర ఎంతో తెలుసా..

Ampere Reo VYB Electric Scooter
Ampere Reo VYB Electric Scooter

Ampere Reo VYB Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగిపోతుండడంతో చాలా మంది వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొందరు బడ్జెట్ గురించి ఆలోచిస్తుండగా.. సిటీలో ఉండేవారు స్టైలిష్ డిజైన్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్ ‘ఆంపియర్’ (Ampere) భారత మార్కెట్లోకి ఆంపియర్ రియో వివైబి (Ampere Reo VYB) ను విడుదల చేసింది. ఇది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పేర్కొంటున్నారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసేవారు, విద్యార్థులకు ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా దీని స్టైలిష్ డిజైన్ చూసి ఇంప్రెష్ అవుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే? , మరియు వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్‌ను కంపెనీ రూపొందించింది.

ఆంపియర్ రియో VYB డిజైన్ పరంగా చాలా స్పోర్టీగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ ఎప్రాన్‌పై అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డే-టైమ్ రన్నింగ్ లైట్స్ స్కూటర్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. అయితే, ఈ స్కూటర్ డిజైన్‌లో భాగంగా దీని సైడ్ బాడీ ప్యానెల్స్‌పై ఇచ్చిన ‘అంబియంట్ సైడ్ లైటింగ్’ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో కూడా ఈ స్కూటర్‌ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

ఈ స్కూటర్ డిజైన్‌ను కేవలం స్టైల్ కోసమే కాకుండా ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఏకంగా 24 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ అందించారు. దీనివల్ల కాలేజీ బ్యాగులు, హెల్మెట్ లేదా నిత్యావసర సరుకులను సరఫరా చేసుకోవచ్చు. రైడర్ల సౌకర్యం కోసం విశాలమైన సీటుతో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యాంపర్ సెటప్ ఇచ్చారు. దీనివల్ల ఇరుకైన రోడ్లపై కూడా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదనంగా, లేడీస్ ఫుట్‌రెస్ట్ కూడా కంపెనీ యాక్సెసరీగా అందిస్తోంది.

ఈ స్కూటర్ ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇందులో 250W హబ్ మోటార్‌ను ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంత తక్కువ వేగం ఉన్న స్కూటర్లను నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ గానీ అవసరం లేదు. ఇది కాలేజీ విద్యార్థులకు, ఇంటి అవసరాల కోసం తిరిగే వారికి చాలా పెద్ద ప్లస్ పాయింట్.

ఈ స్కూటర్ హార్ట్‌గా 1.44 kWh సామర్థ్యం గల లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. భారతదేశంలోని వేడి వాతావరణానికి, ట్రాఫిక్‌కు ఈ LFP బ్యాటరీలు అత్యంత సురక్షితమైనవి. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 80 కిలోమీటర్ల నిజమైన రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ సాకెట్ ద్వారా దీనిని 5 నుండి 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ బ్యాటరీ లైఫ్‌కాలం ఏకంగా 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఆంపియర్ హామీ ఇస్తోంది. వార్మ్ వైట్, పాస్టెల్ పర్పుల్, డార్క్ గ్రే, మరియు ఆక్వా మెటాలిక్ వంటి 4 ట్రెండీ కలర్ ఆప్షన్లలో లభించే దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను ₹69,499 గా నిర్ణయించారు.

ఒకే ధరలు.. ఒకే పర్ఫామెన్స్.. ఈ రెండింటిలో ఏ ఫోన్ కొనాలి..

Xiaomi 17T Vs Vivo V70 Elite
Xiaomi 17T Vs Vivo V70 Elite

Xiaomi 17T Vs Vivo V70 Elite: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో Xiaomi ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఉంటుంది. కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా Xiaomi 17T, Vivo V70 Elite మోడల్స్ ఇటీవలి ధరల పెరుగుదల తర్వాత సరికొత్త చర్చకు దారితీశాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ రెండు ఫోన్లలో ఏది వినియోగదారులకు బెస్ట్? అనే చర్చ సాగుతోంది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు, పనితీరు ఎలా ఉందో చూద్దాం.

ఇటీవల ధరలు పెరిగిన తరువాత వివో తన Vivo V70 Elite బేస్ వేరియంట్ (8GB + 256GB) ధరను రూ. 54,999 నుండి ఏకంగా రూ. 58,999 కి పెంచింది. అలాగే దీని 12GB + 256GB వేరియంట్ ధర రూ. 63,999 కి చేరింది. మరోవైపు ఈ ఫోన్ కు గట్టి పోటీగా నిలిచిన Xiaomi 17T (12GB + 256GB) వేరియంట్ ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ. 59,999 ధరతో లభిస్తోంది. ధరల పెరుగుదల తర్వాత ఈ రెండు ఫోన్లు కూడా రూ. 60,000 బడ్జెట్ శ్రేణిలో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి.

డిస్‌ప్లే పరంగా చూస్తే.. రెండు ఫోన్లు ఒకే డిస్ ప్లే 6.59 అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇవి సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. అయితే షియోమి 17T స్క్రీన్ 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుండగా.. వివో V70 ఎలైట్ కర్వ్డ్ ఎడ్జ్ డిజైన్ ఏకంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా వివో 194 గ్రాములతో కాస్త స్లిమ్‌గా ఉంటే, షియోమి 200 గ్రాముల బరువుతో క్లాసిక్ ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది.

పనితీరు విషయంలోనూ… రెండింటిలో శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లను వాడారు. Xiaomi 17Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ ఉండనుంది. దీంతో ఇది గేమింగ్ ప్రియులకు అద్భుతమైన ఎంపిక అని భావిస్తున్నారు. అలాగే Vivo V70 Elite మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. రా పర్ఫార్మెన్స్ పరంగా షియోమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, డే-టు-డే టాస్క్‌లు, పవర్ ఎఫిషియెన్సీలో స్నాప్‌డ్రాగన్ చాలా స్థిరంగా పనిచేస్తుంది.

ఈ రెండు ఫోన్లలో కెమెరా పనితీరు వేర్వేగా ఉన్నాయి. Xiaomi 17T లో ప్రసిద్ధ 50MP ప్రాథమిక కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో , మరియు 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. దూరంగా ఉన్న వస్తువులను జూమ్ చేయడానికి ఇది బెస్ట్. Vivo V70 Elite లో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇది సెల్ఫీల విషయానికి వస్తే వివో 50MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో షియోమి మెరుగైన ఫోటోలను అందిస్తుంది.

బ్యాటరీ విభాగంలో రెండింటిలోనూ భారీ 6500 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీలను అందించారు. అయితే బ్యాటరీ లైఫ్ ఆప్టిమైజేషన్ పరంగా వివో కాస్త ఎక్కువ స్క్రీన్-ఆన్ టైమ్ ఇస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఛార్జింగ్ వేగంలో మాత్రం Vivo V70 Elite 90W ఫ్లాష్‌ఛార్జ్‌తో ముందుండగా.. Xiaomi 17T కేవలం 67W టర్బో ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఈ రెండు ఫోన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో కెమెరా పనితీరు కోసం ఆలోచించేవారు Xiaomi 17T సరైన ఎంపిక అవుతుంది. ప్రీమియం కర్వ్డ్ డిజైన్, అదిరిపోయే సెల్ఫీ కెమెరా కోసం Vivo V70 Elite కొనడం బెటర్ అని టెక్ నిపుణులు అంటున్నారు.

మహేష్ బాబు ను ఇష్టపడిన హీరోయిన్.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

Mahesh Babu
Mahesh Babu

Heroine Who Liked Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే వచ్చింది… కొంతమంది వారసత్వపరంగా ఇండస్ట్రీకి వస్తే మరి కొంతమంది సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తమ సత్తా చాటుకున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లను మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు చేసిన వంశీ మూవీలో తనతో కలిసి నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనకు తెలిసిందే…

మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో అతన్ని ఒక హీరోయిన్ లవ్ చేసిందట. ఆమె మహేష్ ను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదనే కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే టక్కరి దొంగ సినిమాలో నటించిన ‘బిపాసా బసు’ కావడం విశేషం…

అప్పటికే ఆమె చాలామంది బాలీవుడ్ హీరోలతో డేటింగ్ చేసింది. మహేష్ బాబును పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోదాం అనుకున్నప్పటికి మహేష్ బాబు ఆమెను పెద్దగా పట్టించుకోలేదట. ఆమె మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. మొత్తానికైతే వంశీ సినిమాతో నమ్రత తో ప్రేమలో పడ్డ మహేష్ బాబు తనని పెళ్లి చేసుకున్నాడు…

ఇక ఇప్పుడు అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉండడం విశేషం… గౌతమ్ కృష్ణ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు… గౌతం కృష్ణ ఏ మేరకు హీరోగా రాణిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…