బీహార్లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీపై సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే కోరిన సమాచారం మేరకు ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది. ఎన్నికల మెనిఫెస్టోలో పార్ట్-8లో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత వ్యాక్సిన్ హామీ ఉల్లంఘించడంల లేదని ఈసీ వివరించింది. ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఎలాంటి హామీలైనా మెనిఫెస్టోలో చేర్చవచ్చని గుర్తు చేసింది. అయితే ఈసీ వివరణపై గోఖలే అసంతృప్తి వ్యక్తం చేశారు.