భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పోలీసులు భారీ మొత్తం లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో భద్రాచలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.