భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. వోక్స్ వేసిన 20వ ఓవర్లో చివరి బంతికి కేఎల్ రాహుల్ ఫోర్ కొట్టాడు. అనంతరం అండర్సన్ వేసిన ఓవర్ లో పరుగులేమీ రాలేదు. వోక్స్ వేసిన 22వ ఓవర్లో చివరి బంతికి రాహుల్ మూడు పరుగులు రాబట్టాడు. తర్వాత రాబిన్సన్ వేసిన ఓవర్ లో చివరి బంతికి రాహుల్ ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం భారత్ 74/0 తో ఉంది.