నేడు ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నేడు హైదరాబాద్ లో వైద్య  పరీక్షలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ లో ఆయనకు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక మెడికల్ బోర్టు, న్యాయాధికారి సమక్షంలో వైద్యులు వైద్య పరీక్షలు చేయనున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక న్యాయాధికారిని నియమించింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముగ్గురు వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : May 18, 2021 7:48 am
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నేడు హైదరాబాద్ లో వైద్య  పరీక్షలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ లో ఆయనకు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక మెడికల్ బోర్టు, న్యాయాధికారి సమక్షంలో వైద్యులు వైద్య పరీక్షలు చేయనున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక న్యాయాధికారిని నియమించింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముగ్గురు వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.