ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండిస్తున్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వ తీరుపై లోక్ సభ స్వీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలని కోరారు. జరిగిన పరిణాలను చూస్తే ఎంపీ రఘురామ రాజుకు ఉండే హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసినట్లు ఉందని అన్నారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. సీఎం జగన్ అధికార దర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.