
తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. భూముల విక్రయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దళితులకు ఇవ్వడానికి లేని భూమి.. అమ్మకానికి ఎక్కడిది అని ప్రశ్నించారు. తెలంగాణ సీడ్ బౌల్ అని కేసీఆర్ పదే పదే చెప్పారని కానీ రాష్ట్రంలో కల్తీ విత్తనాల అమ్మకాలు పతాకస్థాయికి చేరాయని ప్రభాకర్ ఆరోపించారు. ఏడేళ్లలో నకిలీ విత్తనాల దళారులను పట్టుకొని శిక్షించిన దాఖలాలు లేవు అని చెప్పారు.