PM Modi Cyprus Visit: సైప్రస్ లో పర్యటిస్తోన్న భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ కరియోస్ 3 ని మోదీకి అధ్యక్షుడు నికోస్ ప్రదానం చేశాడు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరమని ప్రధాని చెప్పారు. రెండు దేశాల వసుదైక కుటుంబ భావనకు ప్రతీక అని తెలిపారు. ఈ అవార్డును ఇరు దేశాల స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.