
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఐఎండి కె. కన్నబాబు చెప్పారు. ఇవాళ, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 55-65కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని, సముంద్రం అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.