Homeజాతీయ వార్తలుGovernment ID card fees list: 20, 30, 50.. అంకెలు కాదు.. ఆధార్, ఓటర్‌...

Government ID card fees list: 20, 30, 50.. అంకెలు కాదు.. ఆధార్, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డు రేట్లు!

Government ID card fees list: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. బంగ్లాదేశ్‌ నుంచి వలసలను ప్రోత్సహిస్తూ మమతా బెనర్జీ వరుసగా మూడు పర్యాయాలు సీఎం అయ్యారు. వలస వచ్చిన వారికి స్థానికంగా ఆధార్, ఓటర్‌ ఐడీ, చివరకు రేషన్‌ కార్డు కూడా ఇవ్వడంతో వలసవాదులు మమతకు మద్దతుగా నిలిచారు. అయితే ఎన్నికల సంఘం బెంగాల్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌తో 90 లక్షల నకిలీ ఓటర్లను గుర్తించారు. వారిని తొలగించారు. మరోవైపు టీఎంసీ నేతల అరాచకాలు పెరగడంతో మమత పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దీంతో ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. బీజేపీకి పట్టం కట్టారు. సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు టీఎంసీ అరాచకాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.

డాక్యుమెంటుకో రేటు..
ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన మినార్‌ ఖాన్‌ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీఎంసీ నాయకురాలు సుల్తానా కొలకత్తా మెటియాబ్రుజ్‌ ప్రాంతంలో అక్రమంగా భారతీయ డాక్యుమెంట్లు సమకూర్చేవారని ఆయన ఆరోపించారు. ఆధార్‌ కార్డుకు రూ.20 వేలు, ఓటర్‌ ఐడీకి రూ.30 వేలు, రేషన్‌ కార్డుకు రూ.50 వేలు వసూలు చేసేవారని తెలిపాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి, రాజకీయ వేడిని మరింత పెంచాయి. దీనిని బీజేపీ ఆయుధంగా మార్చుకుంది.

బెంగాల్‌లో అక్రమ వలసలు..
పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలు చాలా కాలంగా చర్చనీయాంశమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా లోపాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఆర్థిక లాభాలు – ఇవన్నీ ఈ సమస్యకు కారణాలుగా చెబుతారు. ఇటీవల కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త పాలన, సర్వేలు, డీపార్టేషన్‌ ప్రక్రియలు మొదలవడంతో అనేక మంది అక్రమ వలసదారులు తమ స్వదేశానికి తిరిగి వెళ్తున్నారని నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మినార్‌ ఖాన్‌ వ్యాఖ్యలు వచ్చాయి.

ఆరోపణలపై విచారణ..
మినార్‌ ఖాన్‌ ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక నాయకురాలి సమస్య కాదు. ఇది వ్యవస్థాగత అవినీతి, జాతీయ భద్రతకు ముప్పు. ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితంగా అక్రమ వలసదారులకు భారతీయ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల సరిహద్దు భద్రత, స్థానిక ఉపాధి, సామాజిక సమతుల్యం దెబ్బతినవచ్చు.

ఆరోపణలను ఖండించిన టీఎంసీ..
మినార్‌ఖాన్‌ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. ఎప్పటికప్పుడు రాజకీయ ప్రేరితమని, ఎన్నికల సమయంలో విపక్షాలు రేపే అభియోగాలుగా తోసిపుచ్చింది. ఆరోపణలు నిజమైతే, ఇది సరిహద్దు నిర్వహణ, ఆధార్, ఓటర్‌ ఐడీ వంటి కీలక డాక్యుమెంట్ల జారీ వ్యవస్థలో లోపాలను బయటపెడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ భద్రత, సమాజ స్థిరత్వం కంటే ఓటు బ్యాంకును ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరం. అయితే, ఈ ఆరోపణలు నిరూపణ చేయాల్సిన బాధ్యత చట్ట అమలు సంస్థలది. అదే సమయంలో అక్రమ వలసలను అరికట్టడానికి కఠిన చర్యలు, సరిహద్దు భద్రత బలోపేతం, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలు కూడా అనివార్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular