
గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్ ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఇది గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని శ్రీ జయవరధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో ఎక్కువ యువత కొవిడ్ బారిన పడుతోందని వివరించారు.