spot_img
Homeజాతీయ వార్తలుపోస్టల్ బ్యాలెట్: హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బద్వేలులో వైసీపీ ఆధిక్యం

పోస్టల్ బ్యాలెట్: హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బద్వేలులో వైసీపీ ఆధిక్యం

Huzurabad and Badvel: తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో అధికార పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. పోటీ మాత్రం రెండు పార్టీల మద్యే కొనసాగింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధానమైన పోరు నడిచింది.
Huzurabad and Badvel
హుజురాబాద్ లో 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా ఇందులో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు పోలయ్యాయి. 14 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. తొలుత హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ నుంచి కౌంటింగ్ మొదలవుతుండగా చివరికి కమలాపూర్ మండలం శంభునిపల్లి తో ముగుస్తుంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.

బద్వేల్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బద్వేల్ లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 24 వేల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థి దూసుకుపోతుండటంతో ఆమెదే గెలుపు అనే అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో 2,15,240 ఓట్లుండగా 1,47,213 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీకే మెజార్టీ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

పోస్టల్ బ్యాలెట్లలో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగించింది. మొత్తం 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీంతో ఫలితాలపై అందరి అంచనాలు నిజమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆధిపత్యం కొనసాగుతోంది.

Also Read: CM KCR: ప్రకటించి రెండేళ్లాయే.. ఉద్యోగాలేవి కేసీఆర్ సారూ?

హుజురాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో మాత్రం ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై 166 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లో ఒకటే ఆలోచన వస్తోంది. హుజురాబాద్ లో గెలుపెవరిదో అనే దానిపై ప్రతి రౌండ్ లో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడేందుకు అవకాశం కలుగుతోంది. దీంతో అందరు ఫలితాల వెల్లడిపై ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Huzurabad By Poll: హుజూరాబాద్ విజేత ఎవరు? ఉత్కంఠ.. తేలేది నేడే.. కౌంటింగ్ ప్రారంభం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper