spot_img
Homeజాతీయ వార్తలుపోస్టల్ బ్యాలెట్: హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బద్వేలులో వైసీపీ ఆధిక్యం

పోస్టల్ బ్యాలెట్: హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బద్వేలులో వైసీపీ ఆధిక్యం

Huzurabad and Badvel: తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో అధికార పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. పోటీ మాత్రం రెండు పార్టీల మద్యే కొనసాగింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధానమైన పోరు నడిచింది.
Huzurabad and Badvel
హుజురాబాద్ లో 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా ఇందులో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు పోలయ్యాయి. 14 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. తొలుత హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ నుంచి కౌంటింగ్ మొదలవుతుండగా చివరికి కమలాపూర్ మండలం శంభునిపల్లి తో ముగుస్తుంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.

బద్వేల్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బద్వేల్ లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 24 వేల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థి దూసుకుపోతుండటంతో ఆమెదే గెలుపు అనే అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో 2,15,240 ఓట్లుండగా 1,47,213 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీకే మెజార్టీ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

పోస్టల్ బ్యాలెట్లలో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగించింది. మొత్తం 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీంతో ఫలితాలపై అందరి అంచనాలు నిజమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆధిపత్యం కొనసాగుతోంది.

Also Read: CM KCR: ప్రకటించి రెండేళ్లాయే.. ఉద్యోగాలేవి కేసీఆర్ సారూ?

హుజురాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో మాత్రం ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై 166 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లో ఒకటే ఆలోచన వస్తోంది. హుజురాబాద్ లో గెలుపెవరిదో అనే దానిపై ప్రతి రౌండ్ లో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడేందుకు అవకాశం కలుగుతోంది. దీంతో అందరు ఫలితాల వెల్లడిపై ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Huzurabad By Poll: హుజూరాబాద్ విజేత ఎవరు? ఉత్కంఠ.. తేలేది నేడే.. కౌంటింగ్ ప్రారంభం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
Oktelugu Epaper