spot_img
Homeజాతీయ వార్తలుTRS Dharna: కేంద్రంతో ఫైట్..తగ్గేదే లే అన్నట్టుగా టీఆర్ఎస్ ధర్నాలు

TRS Dharna: కేంద్రంతో ఫైట్..తగ్గేదే లే అన్నట్టుగా టీఆర్ఎస్ ధర్నాలు

TRS Dharna
TRS Dharna

TRS Dharna: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. వరి కొనుగోలుపై రెండు పార్టీలు తమ దైన శైలిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నయి. నిన్న బీజేపీ రాష్ర్ట ప్రభుత్వంపై నిరసన చేపట్టగా నేడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై యుద్ధం ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ర్టంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రం రైతులు పక్కదారి పట్టించేందుకు పూనుకుంటుందని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా గులాబీ పార్టీ ధర్నాలు చేపట్టేందుకు నిర్ణయించింది. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై పోరుబాట పట్టేందుకు కదిలి వచ్చారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వారిని విమర్శిస్తున్నారు. బీజేపీ నేతల మాటలతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారని మండిపడుతున్నారు. వరి కొనుగోలుపై కేంద్రం ఏం నిర్ణయించిందో దాన్ని వివరంగా చెప్పి రైతుల్లో ఉన్న అనుమానాలు తొలగించాలని కోరుతున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాల్లో భారీగా టీఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారు.

కేంద్రం రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని చెబుతున్నారు. వరి కొంటారా? లేదా అనే విషయంలో కేంద్రం ఓ మాట చెబుతుంటే నేతలు మరోమాట మాట్లాడుతూ ఎందుకు అనుమానాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ప్రత్యక్షంగా విమర్శలకు దిగుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం మెడలు వంచి వడ్డు కొనుగోలు చేసేలా చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ నేతల తీరుతో అన్నదాతల్లో అయోమయం నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్రం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఆ నేతలకు కేసీఆర్ హామీలు.. ఎమ్మెల్సీలపై బుజ్జగింపులు

కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి..! రేవంత్ పై ఫిర్యాదుకు సీనియర్ నేత రెడీ..?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper