Homeజాతీయ వార్తలుTRS MLAs Purchase Case: విచారణ మళ్లీమళ్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ మరింత పట్టు

TRS MLAs Purchase Case: విచారణ మళ్లీమళ్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ మరింత పట్టు

TRS MLAs Purchase Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరింత పట్టు బిగిస్తోంది. బిజెపి అగ్ర నాయకులను హైదరాబాద్ కు రప్పించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. కెసిఆర్ లక్ష్యం అదే కాబట్టి.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కూడా అదే స్థాయిలో నడుచుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.. వారిని పలుమార్లు విచారించి కీలకమైన ఆధారాలు రాబట్టామని పోలీసులు అంటున్నారు.. ఇదే సమయంలో మీడియాకు పలు లీకులు ఇచ్చారు.. అయితే ఆ ముగ్గురు నిందితుల ఫోన్ కాల్ డేటా, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

మళ్లీ పిలిచారు

బండి సంజయ్ బంధువైన అడ్వకేట్ శ్రీనివాస్ ను ఈరోజు సిట్ అధికారులు మరోసారి విచారించారు. నందకుమార్ భార్య చిత్రలేఖ కు, అంబర్ పేట కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కూడా విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు జారీ చేయగా… ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒక నిందితుడుగా ఉన్న నంద కుమార్ తో ప్రతాప్ గౌడ్ పలు లావాదేవీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. సింహ యాజి స్వామితో అనేక సందర్భాల్లో ప్రయాణం చేసినట్టు సెట్ అధికారులు గుర్తించారు.. ఇదే సమయంలో ప్రతాప్ గౌడ్ కు, నిందితులకు ఉన్న సంబంధాలను, వారి మధ్య జరిగిన లావాదేవీలను మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారులు అతడిని విచారణకు పిలిపించారు. అయితే దీనిపై ప్రతాప్ గౌడ్ హైకోర్టుకు వెళ్లారు. సింహయాజి స్వామితో పూజలు జరిపించుకున్నంత మాత్రాన వారితో తనకు సంబంధం అంటగట్టడం ఎంతవరకు న్యాయమని ప్రతాప్ గౌడ్ వాపోతున్నారు. అయితే హైకోర్టు విచారణకు హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని, అయితే ప్రతాప్ గౌడ్ ను అరెస్టు చేయకూడదని సిట్ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది.

లావాదేవీలపై ఆరా

ఈ కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ భార్య సతీమణి చిత్రలేఖ కూడా విచారణకు హాజరుకానున్నారు. నందకుమార్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలను అడిగి తెలుసుకునేందుకు సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే నందకుమార్ చిత్రలేఖ పేరు మీదనే పలు లావాదేవీలు నిర్వహించడంతో గుర్తించిన సిట్ అధికారులు ఆమెను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ ఉదయం నుంచి విచారణ కొనసాగించిన సీట్ అధికారులు ఎలాంటి ఆధారాలు రాబట్టారో అనేది తేలాల్సి ఉంది.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

లుక్ ఔట్ నోటీసులు

ఈ కేసులో సిట్ అధికారులు బిజెపి కీలక నేత బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చారు. లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న విచారణకు రావాలని ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు బిఎల్ సంతోష్ కు 41 ఏ నోటీసులు జారీ చేసిన సిట్…వాటిని ఆయనకు మెయిల్ ద్వారా పంపింది. 26 లేదా 28న సంతోష్ విచారణకు రావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని రోజులు సిట్ విచారణ నిర్వహిస్తున్నప్పటికీ .. ఒక కీలక ఆధారం కూడా బయట పెట్టకపోవడంతో ఈ కేసు స్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper