spot_img
Homeజాతీయ వార్తలుMunugode Bypoll: తులం బంగారం అన్నారు. ఇచ్చేది మూడు వేలేనా?; అట్లుంటది మునుగోడు ఓటర్లతోని

Munugode Bypoll: తులం బంగారం అన్నారు. ఇచ్చేది మూడు వేలేనా?; అట్లుంటది మునుగోడు ఓటర్లతోని

Munugode Bypoll: ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడేదే ప్రజాస్వామ్యం అని.. అబ్రహం లింకన్ ఎప్పుడో నిర్వచించాడు.. కానీ ఆయన నిర్వచించిన ప్రజాస్వామ్యం ఇప్పుడు పూర్తి ధన స్వామ్యమైంది. డబ్బు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉండేలా పొందుపరిచారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అది కాదు. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ప్రకటన, గురువారం జరిగే పోలింగ్ వరకు ప్రతి విషయంలోనూ డబ్బు కట్టలు తెంచుకుంది. మద్యం ఏరులై పారింది. ఎక్కడికక్కడ అధికార దర్పం బుసలు కొట్టింది. ఇలాంటి స్థితిలో రేపటి తరానికి ఇదీ ప్రజాస్వామ్యం గొప్పతనం ఎలా చెప్పాలి? వెనుకటి విలువలను ఎలా కాపాడాలి? ఇలాంటి డబ్బుతో కూడిన రాజకీయాలు చేస్తూ నాయకులు ఇస్తున్న సందేశం ఏమిటి?

Munugode Bypol
Munugode Bypol

మాకు డబ్బులు ఇవ్వరా?

మునుగోడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బహుశా దేశంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక ఇదే కాబోలు. వేలం వెర్రిగా డబ్బులు పంపకం, ఇష్టానుసారంగా మద్యం పంపిణీ, అధికార దుర్వినియోగం.. వెరసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించాయి. గురువారం పోలింగ్ నేపథ్యంలో బుధవారం రాత్రి వరకు పంపకాలు జోరుగా సాగాయి. చాలా ప్రాంతాల్లో ఓటర్లు మాకు డబ్బులు ఇవ్వరా అంటూ నాయకులను ప్రశ్నించారు. తులం బంగారం అన్నారు. ద్విచక్ర వాహనాలు ఇస్తామన్నారు. ఇంతా తీస్తే ఇచ్చేది కేవలం మూడు వేలేనా అంటూ నిట్టూర్చారు. పైగా ఎక్కడికక్కడ నేతలను నిలదీశారు. సంస్థాన్ నారాయణపురం, చండూరు, మర్రిగూడ మండలాల్లో అయితే ఓటర్లు రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. మరో ప్రధాన పార్టీ ఓటుకు నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తే.. అధికార పార్టీ కేవలం 3000 ఇస్తుండడంతో ఓటర్లు నారాజ్ గా ఉన్నారు.

Munugode Bypol
Munugode Bypol

ఖర్చు అదిరిపోయింది

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఇందు కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టాయి. మూడు ప్రధాన పార్టీలు ఖర్చు మూడంకెల కోట్లను మించిపోయింది. ఒకవేళ గనుక ఈ డబ్బులనే ప్రజల కోసం ఖర్చు పెట్టి ఉంటే మునుగోడు భవిత మరో మాదిరి ఉండేది. కానీ అధికారమే పరమావధిగా భావించిన నాయకులు డబ్బులను ఓట్లు కొనుగోలు చేసేందుకు మాత్రమే ఖర్చు పెట్టారు. ఫలితంగా మునుగోడు ఉప ఎన్నికలను అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మార్చారు. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. గెలుపుపై ఎవరి ఆశలు వారే పెట్టుకున్నారు. గురువారం ఉదయం కూడా అక్కడక్కడ డబ్బులు పంచుతూ కనిపించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper