Homeజాతీయ వార్తలుMaoism decline in India: కాడివదిలేస్తున్న మావోయిస్టులు.. మావోయిజానికి ఇక దేశంలో సమాధి

Maoism decline in India: కాడివదిలేస్తున్న మావోయిస్టులు.. మావోయిజానికి ఇక దేశంలో సమాధి

Maoism decline in India: అన్నలు.. అలియాస్‌.. నక్సలైట్లు.. అలియాస్‌ మావోయిస్టులు.. పేరు ఏదైనా.. పిలిచేది ఎలా అయినా.. వారి పంథా మాత్రం ఒక్కటే. పాలకుల వ్యతిరేక ఉద్యమం.. రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమం. దళిత, బహుజన, పీడిత వర్గాల కోసమే పోరాడుతాన్నామంటున్న మావోయిస్టులు.. దళితుడు డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలు దేశంలో అజ్ఞాతంలో ఉంటూ ప్రభుత్వాలకు సమాంతర పాలన సాగించే ప్రయత్నం చేశారు. అడ్డు చెప్పిన వారిని అంతం చేశారు. పేదల […]

Maoism decline in India: అన్నలు.. అలియాస్‌.. నక్సలైట్లు.. అలియాస్‌ మావోయిస్టులు.. పేరు ఏదైనా.. పిలిచేది ఎలా అయినా.. వారి పంథా మాత్రం ఒక్కటే. పాలకుల వ్యతిరేక ఉద్యమం.. రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమం. దళిత, బహుజన, పీడిత వర్గాల కోసమే పోరాడుతాన్నామంటున్న మావోయిస్టులు.. దళితుడు డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలు దేశంలో అజ్ఞాతంలో ఉంటూ ప్రభుత్వాలకు సమాంతర పాలన సాగించే ప్రయత్నం చేశారు. అడ్డు చెప్పిన వారిని అంతం చేశారు. పేదల పక్షాన నిలిచినా.. ఇన్‌ఫార్మర్ల పేరుతో పేద గిరిజనులను చంపేశారు. పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. మన శత్రు దేశాలతో చేతులు కలిపి ఆయుధాలు పొందుతున్నారు. అయితే ఇప్పుడు పెరిగిన సాంకేతికత మావోయిస్టుడ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యాంగేతర శక్తుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టింది. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా ఈ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. వందల మంది భయంతో లొంగుబాట పడుతున్నారు.

శాంతి మంత్రం..
ఇన్నాళ్లూ ఎర్రజెండాయే మా ఊపిరి అని ఉద్యమం సాగించిన మావోయిస్టులు ఆపరేషన్‌ కగార్‌ దెబ్బకు తెల్ల జెండా పట్టుకుని శాంతి మంత్రం జపిస్తున్నారు. తాజాగా మావోయిస్టు కీలక నేత అనంతర్‌ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఆయుధాలను వదిలించి సాయుధ పోరాటాన్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రతీ మావోయిస్టు ఒకేసారి లొంగిపోయే ఈ నిర్ణయం, గతంలో మల్లోజుల, ఆశన్న వంటి అగ్రనేతల లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్లతో పార్టీ బలహీనమయ్యింది అనే వాస్తవాలను ప్రతిబింబిస్తోంది.

పార్టీలో బలహీనత, కేంద్ర విజ్ఞప్తుల ప్రభావం
ఒకప్పుడు మావోయిస్టులకు ప్రజలు అండగా నిలిచేవారు. కానీ ఇప్పుడు మద్దతు దాదాపుగా లేదు. ఇక వరుస ఎన్‌కౌంటర్లతో పార్టీ బలహీనపడింది. సిద్ధాంతాలు కనుమరుగయ్యాయి. కేంద్రం కూడా లొంగిపోవాలని పదే పదే పిలుపునిస్తోంది. మావోయిస్టు ఉద్యమ నాయకుల అనుమతితో పునరావాసం, సమాజంలోతో కలసే దిశలోకి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మావోయిజానికి సమాధి?
ఈ నిర్ణయం భారతీయ దేశంలో దీర్ఘకాలంగా కొనసాగిన మావోయిస్టు యుద్ధానికి ఒక మలుపుగా భావించవచ్చు. ప్రాంతీయ రాజకీయాలు, సైనిక చర్యల మధ్య పాదదండనలు, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల కారణంగా ఈ ఉద్యమం స్వచ్ఛందంగా తేలికపడి ఉండవచ్చు. జనజీవనంలో మిళితమవుతూ సామాజిక సహకారంతో మావోయిస్టుల అంతరిక్షంలో సమాధి వస్తుందని దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం లొంగిపోయేవారి పునరాలోచనలు, పునరావాసంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మావోయిస్టులు సూచించారు. ఇది సుస్థిర శాంతి ఏర్పడటానికి ప్రాధాన్యత కలిగిన అంశం. మొత్తంగా చాలా ఆపరేషన్లు, అగ్రనేతుల వదిలిపోవడం మావోయిస్టు ఉద్యమ నిర్ధారణలో సమాధి మార్గం మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper