spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ పక్కా వ్యూహం.. టీడీపీకి ఎన్టీఆర్ దూరం..!

జగన్ పక్కా వ్యూహం.. టీడీపీకి ఎన్టీఆర్ దూరం..!


ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు అవుతాయనే నానుడి ప్రస్తుత ఏపీ రాజకీయాలకు కరెక్టుగా సరిపోతుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐదేళ్లలోనే చంద్రబాబు పరిస్థితి పూర్తి రివర్స్ అయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ జోరుగా టీడీపీ బొక్కబోర్లా పడింది. టీడీపీ గతంలో ఎన్నడూ చూడని దారుణ పరాభవాన్ని చవిచూసింది. కేవలం 23సీట్లను టీడీపీ దక్కించుకోగా అందులో చాలామంది ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

సీఎంగా జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టీడీపీకి గడ్డుకాలం మొదలైంది. ఆ పార్టీలో నేతలంతా ఒక్కొక్కరుగా జగన్ కు జై కొడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాములను జగన్ సర్కార్ బయటికి తీసి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన నేతలను జైళ్లకు పంపిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు అరెస్టయి జైళ్లకు వెళ్లగా మరికొందరిని పంపించేందుకు జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.

ఇప్పటికే బలహీనంగా మారిన టీడీపీని మరింత దెబ్బతీసేందుకు జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును జగన్ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న దివంగత ఎన్టీఆర్ ఓటుబ్యాంకును వైసీపీ తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని పని జగన్ సర్కార్ చేయనుంది. దీనివల్ల చంద్రబాబుకు చెక్ పెట్టడంతోపాటు ఎన్టీఆర్ అభిమానులు జగన్ పేరును ఎల్లప్పుడు గుర్తుంచుకుంటారు.

గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

ఒకవేళ ఇది జరిగితే చంద్రబాబు ఎన్టీఆర్, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే బాబు ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచారనే అపవాదును మోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారనే నిందనే ఆయన జీవితాంతం మోయాల్సి రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారనుంది.

మరోవైపు బాలకృష్ణ సైతం హిందూపురాన్ని జిల్లా చేయాలని కోరాడే తప్ప తన తండ్రి పేరును జిల్లాకు పెట్టాలని సీఎం జగన్ ను ఆయన కోరలేదు. ఇదికూడా జగన్ కు కలిసొచ్చింది. ఎన్టీఆర్ నిజమైన వారసుడు జగన్ అనేలా వైసీపీ నేతలు ఇప్పటికే చెప్పుకుంటున్నాయి. దీంతో ఇప్పటివరకు టీడీపీకి మద్దతుగా ఉన్న ఎన్టీఆర్ వీరాభిమానులు జగన్ సర్కార్ జై కొట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీకి ఇది మరింత ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version