spot_img
Homeజాతీయ వార్తలుWater Crisis In India: గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న బాలికలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న...

Water Crisis In India: గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న బాలికలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Water Crisis In India: ఈ జీవికైనా సరే పీల్చేగాలి తర్వాత తాగే నీరు అత్యంత ముఖ్యం. అందువల్లే నీరు ఉన్నచోటే ఈ భూమండలం మీద సంస్కృతులు ఏర్పడ్డాయి. నగరాలు నిర్మాణమయ్యాయి. జీవజాతులు అభివృద్ధి చెందాయి. నీరు లేని చోట ఇప్పటికీ నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే జలాన్ని జగతికి బలం అని పిలుస్తుంటారు.

ఈ భూమండలంలో సముద్రాలు ఎక్కువగా ఉంటాయి. చాలా తక్కువ శాతం లో తాగునీటి వనరులు అందుబాటులో ఉంటాయి. తాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఇష్టానుసారంగా వాడితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నీటిని విచ్చలవిడిగా వాడటం.. జల వనరులను పరిరక్షించుకోకపోవడంతో ఈ ప్రపంచంలో చాలామంది తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పైగా అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేయడంవల్ల వర్షాలు అంతగా కురవడం లేదు. పైగా కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవడంతో భూమిలోకి నీరు ఇంకడం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్లే నీటి కొరత తీవ్రంగా ఉంటున్నది.

మనదేశంలో కూడా నీటి కొరతతో ఇబ్బంది పడే రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ఆమధ్య మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి ప్రత్యేక రైలు భోగిలలో నీటిని తరలించారు. సైనికుల పహార మధ్య నీటిని సరఫరా చేశారు. దీనినిబట్టి నీటి కొరత ఏర్పడితే జనజీవనం ఏ స్థాయిలో అవస్థ పడుతుందో ఇది కళ్లకు కట్టింది. ఇప్పుడు ఇటువంటి కష్టాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ పూర్తిగా అటవీ రాష్ట్రం. ఇక్కడ చాలా గ్రామాలు దూరం గా ఉంటాయి. ఈ గ్రామాలలో ప్రస్తుతం తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోనే జిల్లాలోని భగవాన్య గ్రామపంచాయతీ పరిధిలోని సర్బాద్ అనే గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ తాగునీటి కోసం ప్రజలు నరకం చూస్తున్నారు. సర్బాద్ గ్రామంలో తాగునీటి కోసం బాలికలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు నీటిని సేకరిస్తున్నారు. బావిలో కనీసం తాడు కూడా లేదు. గుడ్డలను తాడుగా మార్చుకొని.. ఆ బాలికలు బావిలో నీటిని తీసుకొని పైకి ఎక్కుతున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా సరే బాలికలు గాయపడడం ఖాయం. ఈ వీడియో పట్ల నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిలియన్ డాలర్ల ఎకనామి కాదని.. ప్రజలకు గుక్కెడు తాగునీళ్లు ఇవ్వాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper