Homeఆంధ్రప్రదేశ్‌Omicron variant: ఒమిక్రాన్ పాజిటివ్.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన జగన్.. ఏపీలో మరోసారి ఆంక్షలు..?

Omicron variant: ఒమిక్రాన్ పాజిటివ్.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన జగన్.. ఏపీలో మరోసారి ఆంక్షలు..?

Omicron variant: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఏపీలోకి ఎంటర్ అయ్యింది. ఈరోజు ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కావడంతో సీఎం జగన్ యంత్రాంగాన్ని వెంటనే అలర్ట్ చేశారు. ఒమిక్రాన్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు, ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్టులకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో లాగా చేయి దాటిపోక ముందే ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఈసారి అస్సలు ఊరుకునేది లేదని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది.

Omicron variant
Omicron variant

WHO మరియు కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు ఏపీలో తప్పుకుండా అమలు కావాలన్నారు. వారంల్లో విజయవాడలో జీనో సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుందని అధికారులు చెప్పగా.. వ్యాక్సినేషన్ వీలైనంత త్వరగా రెండు డోసులు పూర్తి చేయాలన్నారు. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా గతం, ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకున్నామో ప్రజలకు చెప్పాలన్నారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణంలో కూడా వేగం పెంచి సిబ్బంది నియామకం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పూర్తి చేయాలన్నారు.

Also Read: Justice Chandru: జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు

ఇకపోతే నిరుపేదలకు వరప్రదాయిని అయిన ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రంలోని ఏయే ఆస్పత్రుల్లో అమలవుతుందో ప్రజలకు తెలిసేలా గ్రామసచివాలయాల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో ఆరోగ్య కింద ట్రీట్మెంట్ పొందాలనుకునే వారు అటు ఇటు తిరగాల్సిన పనిలేకుండా నేరుగా అక్కడకు వెళతారని చెప్పారు. క్యాన్సర్ రోగులకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం ఎక్కడ అందుతుందో క్లారిటీగా తెలియజేయాలన్నారు. విశాఖలో ఎంఐఆర్ఐ, కాకినాడలో ఎంఐఆర్ఐ, కాథ్ ల్యాబ్, కర్నూలులో కాథ్ ల్యాబ్స్ వంటి సర్వీసులను అందించాలని స్పష్టంచేశారు. ఒమిక్రాన్ వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురవకుండా అవగాహన కల్పించాలని, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ఎక్కడైతే ఒమిక్రాన్ కేసు నమోదైందో ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరిని కలిశాడో ట్రైస్ ఔట్ చేసి ఆ ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలన్నారు.

Also Read: Survey Report: సర్వే రిపోర్టు.. పుంజుకున్న టీడీపీ కానీ.. వైసీపీ గెలుస్తుందా అంటే?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version