spot_img
Homeఆంధ్రప్రదేశ్‌బ్లాక్‌లో శ్రీవారి ప్రసాదం.. భక్తుల ఆగ్రహం

బ్లాక్‌లో శ్రీవారి ప్రసాదం.. భక్తుల ఆగ్రహం

Dwaraka tirumala
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారా తిరుమల ఆలయంలో ప్రసాదాల వివాదం కలకలం రేపుతోంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదాలను బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ ఓ భక్తుడు రిలీజ్‌ చేసిన వీడియో సంచలనమైంది. ఆలయంలో ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయా..? అని భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. కనీసం తినే ప్రసాదాన్ని సైతం వదలడం లేదని ఫైర్‌‌ అవుతున్నారు.

Also Read: షర్మిల పార్టీతో జగన్‌కు మరిన్ని విభేదాలు వచ్చినట్లేనా..?

ఈనెల 21న ఓ భక్తుడు ద్వారకా తిరుమలలో చిన వెంకన్నను దర్శించుకున్నాడు. మొక్కులు తీర్చుకున్న అనంతరం.. ఆలయ తూర్పు గోపురం సమీపంలో ఉన్న ప్రసాదాల కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రసాదాలు ఉన్నా ఇవ్వకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ఉన్న భక్తులు కూడా కౌంటర్లో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను విస్మరించి.. డబ్బు కోసం ప్రసాదాలను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపించారు. ఇలాంటి వారి వల్లే హిందూయిజం నశిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయ సిబ్బందిపై దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొద్దిసేపటి తర్వాత సిబ్బంది కౌంటర్ వద్దకు వచ్చి భక్తులకు ప్రసాదం అందించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే.. ఈ వివాదంపై ఆలయ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. వీడియోలో ఆరోపణలు చేసిన భక్తుడు.. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రసాదాల కౌంటర్లోకి వచ్చారని.. పులిహోర, చక్కెర పొంగలి అడిగిరాని తెలిపారు. అప్పటికే జారీ చేసిన టోకెన్ల వరకే ప్రసాదం ఉందని వివరించారు. కొత్తగా తయారు చేసిన ప్రసాదం వచ్చేలోగానే భక్తులు వివాదం చేసినట్లు తెలిపారు.

Also Read: తిరుపతి, సాగర్‌‌ ఎన్నికలకు మార్చి 7న షెడ్యూల్‌..!

పైగా పులిహోర, చక్కెర పొంగలి మధ్యాహ్నం 3 గంటల వరకే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయన్నారు. పులిహోర, చక్కెర పొంగలి త్వరగా చెడిపోయే అవకాశమున్నందున పరిమితంగానే తయారవుతుందని.. భక్తుల రద్దీని బట్టి మళ్లీ తయారు చేస్తారని తెలిపారు. భక్తుల కోసం నిత్యం 10 వేల లడ్డూలు అందుబాటులో ఉంటాయని ప్రసాదం కొరత వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆలయంలో బ్లాక్ లో ప్రసాదం విక్రయిస్తున్నట్లు భక్తులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఇప్పటికే విజయవాడ ఆలయంలో వివాదం మరువకముందే మినీ తిరుమలలో ఈ వివాదం చోటుచేసుకోవడం చర్చకు దారితీసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper