spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: చివరకు క్రిస్టియన్లకూ ఏపీలో అసంతృప్తియేనా?

AP Politics: చివరకు క్రిస్టియన్లకూ ఏపీలో అసంతృప్తియేనా?

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై అసమ్మతి పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల్లోనే కాదు సొంత ఇంటిలో కూడా వేరు కుంపటి రగులుతోంది. ఇన్నాళ్లు జగన్ కు చేదోడు వాదోడుగా ఉన్న బావ బ్రదర్ అనిల్ అసంతృప్తితో రగిలిపోతున్నారు.క్రైస్తవ సమాజం మొత్తం జగన్ వెంట ఉన్నా ఆయన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో పరిణామాలు మారేలు కనిపిస్తున్నాయి.

AP Govt
AP CM Jagan

ఇన్నాళ్లు జగన్ కు అండగా నిలిచిన క్రైస్తవులు ఇకపై మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఏరు దాటేదాక ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లు జగన్ వ్యవహారం సాగుతోంది. దీంతోనే వారు జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కు సొంత ఇంటిలోనే వేరు కుంపటి రగిలించినట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్ని కల్లో ఇంకా రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయో తెలియడం లేదు.

Also Read: మోడీ వ్యూహాలు రాష్ట్రాల్లో పనిచేయవా?

మరోవైపు తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల ఏపీలో కూడా పార్టీ పెడతారనే వాదన రాజకీయ విశ్లేషకుల్లో వస్తోంది. ఇప్పటికే అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు రావడంతో జగన్ వ్యవహారంలో అందరు బాధ్యులే అవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగన్ పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని పార్టీ వర్గాల్లోనే నిరాశ నిస్ర్పహలు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఆలోచిస్తున్నారు.

బ్రదర్ అనిల్ పరోక్షంగా జగన్ పై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. సొంత పార్టీ పెడతామనే సంకేతాలు ఇస్తున్నారు. సోదరి షర్మిలతో కలిసి ఏపీలో మరో పార్టీ వస్తుందేమోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ మేరకు వారి మాటల్లో అంతరార్థం కూడా అలాగే ఉండటంతో ఇక జగన్ కు తలనొప్పులు తప్పవేమోనని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత జఠిలంగా మారే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Vasantha Krishna Prasad-Jagan
CM YS Jagan

వచ్చే ఎన్నికల్లో మరిన్ని పరిణామాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సొంత కుటుంబంలోనే మరో పార్టీ వస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని జగన్ ఆలోచనలో పడుతున్నారు. ఎలాగైనా కుటుంబంలో నెలకొన్న విభేదాలను తొలగించుకోవాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జగన్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి జగన్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper