spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: ఏపీ రాజకీయాలను మార్చే వ్యక్తిని దించబోతున్న బిజెపి

AP BJP: ఏపీ రాజకీయాలను మార్చే వ్యక్తిని దించబోతున్న బిజెపి

AP BJP: ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ పునరాలోచనలో పడిందా? టీడీపీతో పొత్తులండవని రాష్ట్ర బీజేపీ నేతలతో చెప్పిస్తునే..మరో ఆలోచన చేస్తున్నారా? ఢిల్లీ పెద్దల ఆలోచన మరోలా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బ్యాక్ స్టెప్ వేయడంతో రకరకా చర్చలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తరుపున పార్టీ వ్యవహారాలు చూసే శివప్రకాష్ జీ కలిసిన తరువాతే కన్నా లక్ష్మీనారాయణ స్వరం మార్చుకోవడం, ధీమాగా కనిపించడంతో ఢిల్లీ నుంచి ఏదో సంకేతం వచ్చిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

AP BJP
AP BJP

కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. పలుమార్లు జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కన్నాతో భేటీ కావడంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న టాక్ నడిచింది. మొన్నటికి మొన్న రిపబ్లిక్ డే వేడుకల అనంతరం పవన్ సమక్షంలో జనసేనలో చేరతారన్న ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే కన్నా అనుచరులు పార్టీకి రాజీనామా చేసి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికీ తాము బీజేపీ స్నేహం కోరుకుంటున్నామని పవన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికలలను రిపీట్ చేద్దామని భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి నడవాలని సంకేతాలు పంపించారు. అయితే జనసేన వరకూ ఒకే కానీ.. టీడీపీతో మాత్రం కలవడానికి బీజేపీ ఇష్టపడడం లేదు. పవన్ మాత్రం చివరి వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో బీజేపీనేత కన్నాను పార్టీలోకి తీసుకుంటే రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే కన్నా చేరికను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

AP BJP
AP BJP

ఇటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ తరుపున పార్టీ వ్యవహారాలు చూసే శివప్రకాష్ జీ కన్నాతో రెండు గంటల పాటు చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడున్నపరిస్థితుల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తే ఓట్లు, సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే చాలామంది నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. కీలక నాయకులు తప్పించి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని భావించే నాయకులెవరూ పార్టీలో కొనసాగరని.. ఇప్పటికే చాలామంది ఆర్థికంగా నష్టపోయారని కన్నా శివప్రకాష్ జీకి వివరించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై శివప్రకాష్ జీ ఎటువంటి భరోసా ఇచ్చారో తెలియదు కానీ.. కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తాను బీజేపీలో కొనసాగుతానని ప్రకటించడం వెనుక విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

ఏపీలో అధికార వైసీపీ సర్కారు హిందుత్వ వ్యతిరేకి అని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అది అత్యంత ప్రమాదకరమన్న భావనకు వచ్చింది. బీజేపీ హైకమాండ్ కు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. అటు రాష్ట్రంలో జనసేన, టీడీపీలతో కలిసి వెళ్లకుంటే పార్టీ మరింత ఉనికి కోల్పోయే ప్రమాదముందని నిఘా వర్గాలు సైతం కేంద్రానికి నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నేతను రంగంలోకి దించి పార్టీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే కన్నాకు ఏం లెక్కలు వేసి అడ్డుకట్ట వేశారో తెలియదు కానీ.. త్వరలో ఓ కీలక నిర్ణయం కేంద్రం నుంచి వెలువడే అవకాశముందన్న సంకేతాలు మాత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper