Homeఆంధ్రప్రదేశ్‌మత సమ్మేళనాలకు దూరంగా ఉండండి: గవర్నర్ విజ్ఞప్తి

మత సమ్మేళనాలకు దూరంగా ఉండండి: గవర్నర్ విజ్ఞప్తి


రాష్ట్రంలోఅన్ని రకాల మత సమ్మేళనాలను పూర్తిగా నిలిపివేయాలని, శారీరక దూరం పాటించాలనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూశన్ హరిచందన్ తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే కరోనావైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడంలో పరిపాలనకు మద్దతుగా ఇతర మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కోవిడ్ -19 మొత్తం మానవాళికి తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది అంగీకరించబడిన ఆరోగ్య ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఐక్య పద్ధతిలో అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజల సహకారం ముఖ్య మన్నారు. కేవలం సహకారంతో మాత్రమే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు అని పేర్కొన్నారు. 24 x 7 గంటలు పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి ప్రజలు సంఘీభావం తెలుపుతూ వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో సహాయపడాలని గవర్నర్ అన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ నిఘా పెట్టడం, గుర్తించడం, పరీక్షించడం మరియు బాధిత వ్యక్తులను వేరుచేయడం వంటి వాటిలో ప్రజలు వైద్య సిబ్బందికి తమ సహాయాన్ని అందించాల్సి ఉందన్నారు. వైద్య సేవలను దుర్వినియోగం చేయడం లేదా హింస చర్యలకు పాల్పడటం మానుకోవాలని శ్రీ హరిచందన్ తెలియచేసారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular