spot_img
Homeఅంతర్జాతీయంIndia- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?

India- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?

India- America:  రష్యా ఉక్రెయిన్ యుద్దంతో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. రష్యాను అదుపు చేసే ఉద్దేశంతో అన్ని దేశాలను తన వైపు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియాను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ భారత్ మాత్రం అమెరికా చర్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినా ఇండియా మాత్రం తన పట్టు జారనివ్వడం లేదు. ఉక్రెయిన్ కు మద్దతు తెలపాలని డిమాండ్ చేసినా లెక్కచేయడం లేదు.

India- America
India- America

రష్యా భారత్ కు చిరకాల మిత్ర దేశం అనడంలో సందేహం లేదు. 1971లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రపంచంలోని 18 దేశాలు భారత్ పైకి ఎదురుదాడికి దిగినప్పుడు రష్యా వాటిని అదుపు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఎప్పుడైనా ఆపదలు వచ్చే సమయంలో రష్యా మనకు సాయం చేస్తూనే ఉంటుంది. అలాంటి దేశానికి వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తే బాగుండదనే ఉద్దేశంతో రష్యాకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించడం లేదు.

అలాగని చైనా దురాక్రమణ చేస్తే రష్యా మద్దతిస్తుందా? అని అమెరికా వేసిన ప్రశ్నకు ఔననే సంకేతాలు ఇస్తోంది. ఎప్పుడైనా భారత్ కు ఆపద వస్తే ఖచ్చితంగా రష్యా తన వంతు సాయం చేస్తుందనేది నిర్వివాదాంశమే. అందుకే అమెరికా ఆంక్షలను సైతం భారత్ తిప్పికొడుతోంది. రష్యా విషయంలో ఎవరెన్ని చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే అమెరికా ఒంటికాలిపై లేస్తోంది. భారత్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

అంతర్జాతీయంగా వస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భారత్ తన అవసరాలను తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోగా ఏ దేశం కూడా దానికి సాయం చేయడం లేదు. అలాంటి పరిస్థితులు వస్తే భారత్ కు వెన్నుదన్నుగా నిలిచేది మాత్రం రష్యానే. దీంతోనే రష్యాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదురు చెప్పకుండా తటస్థంగా వ్యవహరిస్తోంది. అలాగని ఉక్రెయిన్ పై యుద్ధం చేయమని కూడా చెప్పడం లేదు.

India- America
India- America

అసలు భారత్ పై అమెరికా ఎందుకు దృష్టి సారిస్తోంది. యుద్ధం విషయంలో భారత్ నే ఎందుకు నిందిస్తోంది. రష్యా తన సైనిక చర్య ద్వారా ఉక్రెయిన్ ను దారికి తీసుకురావాలని చూస్తోంది. దానిపై ఆంక్షలు విధించి తన వంతు పాత్ర పోషిస్తున్నా ఇండియాపై ఎందుకు కక్ష పెంచుకుంటోంది. రష్యాతో భారత్ కు ఉన్న సంబంధం నేపథ్యంలోనే అమెరికా ఇండియాను నిందిస్తోంది. రష్యా చర్యలను ఖండించాలని పట్టుపడుతోంది. దీనికి మనదేశం మాత్రం ససేమిరా అంటోంది.

అమెరికా తీరుపై పాకిస్తాన్ కూడా మండిపడుతోంది. ఈమేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా చర్యలను ఖండిస్తున్నారు. భారత్ వైఖరిని ప్రశంసిస్తున్నారు. భారత్ లాంటి దేశం అమెరికా మాట వినకుండా రష్యాతో మైత్రి కొనసాగించడం మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఉద్దేశాలను తప్పుబట్టారు. ఇండియా వైఖరికి ఓటు వేస్తున్నారు. దీంతో అమెరికా చర్యలను ఇండియా మాత్రం లెక్కపెట్టడం లేదు. దీనిపై భవిష్యత్ లో కష్టాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేయడం విశేషం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper