spot_img
Homeజాతీయ వార్తలుLock Of Funding TS Govt Schools: 32 వేల బ్యాంకు ఖాతాలు క్లోజ్.. సబితా...

Lock Of Funding TS Govt Schools: 32 వేల బ్యాంకు ఖాతాలు క్లోజ్.. సబితా ఇంద్రారెడ్డి కి ఇది సిల్లీగా అనిపించడం లేదా?

Lock Of Funding TS Govt Schools: కంపు కొట్టే మరుగుదొడ్లు.. నీళ్లు రాని నల్లాలు.. కరెంట్ ఉన్నా తిరగని ఫ్యాన్లు.. పురుగులు కనిపించే అన్నం.. ఈగలు పైకి తేలే సాంబార్.. అయ్య బాబోయ్ మేం ఈ కాలేజీలో ఉండలేం.. ఇందులో చదవలేమని బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని మొన్న విద్యార్థుల వద్దకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వాటిని చదివిన సబితాఇంద్రారెడ్డి ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

Lock Of Funding TS Govt Schools
TS Govt Schools

32 వేల బ్యాంకు ఖాతాలు క్లోజ్ చేశారు

కరోనా దెబ్బకు 15 నెలలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు మొన్ననే తెరుచుకున్నాయి. కానీ ఎప్పటి లాగానే పాఠశాలను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వం “మన ఊరు మన బడి” పేరుతో పాఠశాలను బాగు చేస్తామని చెప్పినా నిధుల మంజూరు అంతంత మాత్రంగానే ఉంది. కనీసం పాఠశాలల్లో చాక్పీసులు కొనేందుకు డబ్బులు లేక పోవడంతో ప్రధానోపాధ్యాయులే సమకూర్చుకుంటున్నారు. అసలు గతేడాది విద్యాసంవత్సరం ముగిశాక విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు చెందిన నిధులను డ్రా చేసి 32 వేల బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేశారు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో చాక్పీస్ నుంచి రిజిస్టర్ దాకా అన్నింటినీ ప్రధానోపాధ్యాయులు తమ జేబులోనుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: Secunderabad Agnipath Protests: అగ్నిపథ్ మంటలు: సికింద్రాబాద్ లో రావణకాష్టం

గ్రాంట్ ఎందుకూ సరిపోవడం లేదు

రాష్ట్రవ్యాప్తంగా 26,067 గవర్నమెంట్, లోకల్​బాడీస్​స్కూల్స్​ ఉన్నాయి. ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూళ్లకు రూ.12,500 నుంచి రూ. లక్ష వరకు, హై స్కూళ్లకు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మెయింటనెన్స్​ గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యాసంవత్సరం మొదలైనా సర్కారు నుంచి గ్రాంట్​రాలేదు. డిజిటల్​ క్లాసుల నిర్వహణ వల్ల ప్రతి స్కూల్​కు నెలనెలా తక్కువలో తక్కువ రూ. వెయ్యి నుంచి రూ.1,500 వరకు కరెంటు బిల్లులు వచ్చాయి. స్కూళ్లకిచ్చిన కరెంట్​కనెక్షన్లు కమర్షియల్​ కేటగిరీ కింద చేర్చడంతో బిల్లులు వాచిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కో స్కూలు రూ. 5 వేల నుంచి రూ.20 వేలకు పైగా ట్రాన్స్​కోకు బకాయి పడింది. కొన్నిచోట్ల బిల్లులు కట్టలేదని కనెక్షన్​ తొలగిస్తున్నారు. ఒకవేళ సర్కారు నుంచి గ్రాంట్​ విడుదల చేస్తే కరెంట్​ బిల్లులకే సరిపోతాయని హెచ్​ఎంలు చెబుతున్నారు.

స్కావెంజర్లను తొలగించారు

జీతాలివ్వలేక రాష్ట్రవ్యాప్తంగా 28,200 మంది స్కావెంజర్లను తొలగించిన ప్రభుత్వం.. స్కూళ్లలో పారిశుధ్య పనుల బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించింది. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులే తలకు మించిన భారం కావడంతో మున్సిపల్​, పంచాయతీ శానిటరీ వర్కర్లు స్కూళ్ల దిక్కు చూడడమే లేదు. దీంతో చాలా చోట్ల స్కూళ్లలో శానిటేషన్​ అధ్వానంగా మారింది. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో క్లాస్​రూములు ఊడిపిస్తూ, మరుగుదొడ్లు కడిగిస్తున్నారు.

Lock Of Funding TS Govt Schools
TS Govt Schools

హెచ్ఎంల జేబుల్లోంచే జీతాలు

కరోనా రూల్స్​ వల్ల శానిటేషన్​కు ప్రియారిటీ ఇవ్వక తప్పడం లేదు. బాత్​రూమ్​ల క్లీనింగ్​కు ఫినాయిల్, హ్యాండ్​వాష్​, శానిటైజర్ల కొనుగోలుకు తడిసి మోపడవుతోంది. పిల్లలతో గదులు ఊడిపిస్తే విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలా స్కూళ్లలో శానిటేషన్​ పనులు చేసేందుకు, బెల్​కొట్టడానికి ఒకరిద్దరు ప్రైవేట్​ వర్కర్లను పెట్టుకుంటున్నారు. వీరికి నెలకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాన్ని కొన్నిచోట్ల హెచ్​ఎంలే ఇస్తుండగా కొన్నిచోట్ల టీచర్లూ తలాకొంత వేసుకుంటున్నారు. చాక్​పీసులు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర స్టేషనరీ ఖర్చులనూ టీచర్లో.. హెచ్​ఎంనో పెట్టుకుంటున్నారు. టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నచోట గతంలో పనిచేసిన విద్యావలంటీర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయాచోట్ల క్లాసులు జరగక, విద్యాకమిటీల ఆధ్వర్యంలో ప్రైవేట్​గా వీవీలను పెట్టుకుంటున్నారు.

అసలు ఇస్తే గదా

స్కూల్ మెయింటనెన్స్ గ్రాంట్ ఈ ఏడాది ఇంకా రిలీజ్​ కాలేదు. గతంలో రూ. 20 వేల నుంచి 40 వేల వరకు గ్రాంటు వచ్చేది. లాస్ట్​ ఇయర్​ మాత్రం రూ. 80 వేలు వచ్చింది. ఇందులో రూ. 20 వేలు కరెంట్ బిల్లుకు పోగా, మిగతా అమౌంట్ చాక్​పీసులు, డస్టర్లు, హ్యాండ్ వాష్, సబ్బులు, వాటర్, బాత్రూమ్ మెయింటెనెన్స్ కు ఖర్చు చేయాలి. ఈ గ్రాంట్​ సరిపోక ఇబ్బంది పడుతున్నారు. కరోనాతో మెయింటనెన్స్ ఖర్చులు పెరిగాయి. కొంతమేరకు దాతల నుంచి తీసుకుంటున్నారు. వేసవి సెలవుల వల్ల చాలా రోజులు మూసి ఉండడం వల్ల స్కూళ్లలో తలుపులు, కిటికీలు పాడయ్యాయి. స్లాబులు పెచ్చులూడుతున్నాయి. ఊడి పడి స్టూడెంట్లకు, టీచర్లకు గాయాలవుతున్నాయి. వీటికి రిపేర్లు చేయించాలి. బళ్లలో కరోనా రూల్స్​ కఠినంగా పాటించాలని ఆఫీసర్లు చెప్పారేగానీ ఎక్కడా అమలు కావడం లేదు. మెయింటనెన్స్​ గ్రాంట్​రాక ఏ స్కూల్​లోనూ హ్యాండ్​వాష్, హ్యాండ్​శానిటైజర్స్ కొనడం లేదు. కనీసం సబ్బులనూ అందుబాటులో ఉంచట్లేదు. చాక్​పీస్​లు, రిజిస్టర్లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు అంటున్నారు. సర్కారు బళ్లలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వాపోతున్నారు.

Also Read:Corporate Power- Indian Politics: అధికారంలో ఉండేది పార్టీలు శాసించేది కార్పొరేట్లు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper