Jr NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్న విషయం చాలా సార్లు స్పష్టమైంది. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయలేదు, ఇక అతన్ని కలవడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు.
దానివల్ల ఇద్దరి మధ్య కొన్ని విభేదాలైతే ఉన్నాయి అనే వార్తలైతే బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ ఈవెంట్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళ మధ్య ఉన్న గొడవలు ఇప్పుడు అప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు గెలుపుని ఉద్దేశిస్తూ ఎన్టీయార్ ఒక ట్వీట్ అయితే చేశాడు. అప్పుడు చాలామంది వీళ్ళ మధ్య విభేదాలు ఏమీ లేవు అంతా కలిసిపోతున్నారు అనుకున్నారు.
కానీ ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇవ్వడం అనేది నిజంగా ప్రతి ఒక్క నందమూరి అభిమానిని తీవ్రంగా కలిచివేస్తుందనే చెప్పాలి. అయితే ఎన్టీయార్ ఈ ఈవెంట్ కి రాకపోవడానికి కారణం ఆయన దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు అనే వార్తలు వస్తున్నప్పటికీ అవి అంత నమ్మశక్యం గా లేవు అంటూ నందమూరి ఫ్యాన్స్ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఫ్యామిలీ మొత్తానికి దూరం గా ఉంటూ ఎన్టీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: Allu Arjun : అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు…కారణం ఏంటి..?
ఇక బాలయ్య బాబు, చంద్రబాబు నాయుడు లు ఏ కార్యక్రమాలు చేపట్టిన కూడా ఎన్టీఆర్ వాటికి హాజరు కాలేకపోతున్నాడు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే నందమూరి ఫ్యామిలీలోనే చీలీకలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి వీళ్ళు ఫ్యూచర్ లో అయిన కలిసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది…ఇక ఇదిలా ఉంటే ఎన్టీయార్ ప్రస్తుతం దేవర, వార్ 2 అనే సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు…