T.G. Viswa Prasad : పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రనిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. నిన్ననే ‘బ్రో’ టీజర్ రిలీజ్ చేసి ఆనందంగా ఉన్న వేళ ఆయన ఇంట్లో తీరని శోకం అలుముకుంది. ఊహించని ఘటనపై టాలీవుడ్ లో అందరూ సంతాపం తెలుపుతున్నారు.
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాలకు శివైక్యం చెందారు.

గత కొంత కాలంగా అస్వస్థతతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు.
గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ గారు పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.
తన చిత్ర నిర్మాత.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తల్లి మృతికి పవన్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.