Homeఎంటర్టైన్మెంట్Paruchuri Gopala Krishna- Mahesh Babu: మహేష్ సంతోషాన్ని ఆమె దూరం చేసింది... సంచలనం రేపుతున్న...

Paruchuri Gopala Krishna- Mahesh Babu: మహేష్ సంతోషాన్ని ఆమె దూరం చేసింది… సంచలనం రేపుతున్న పరుచూరి కామెంట్స్!

Paruchuri Gopala Krishna- Mahesh Babu: సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరో మహేష్ గురించి ఆయన కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే క్రమంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ కొన్నాళ్లుగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. పరుచూరి పాఠాలు పేరుతో లేటెస్ట్ మూవీస్ పై తన విశ్లేషణ అందిస్తున్నారు. అలాగే తన శిష్యులు అడిగే సినిమా సందేహాలకు సమాధానం ఇస్తున్నారు. తాజాగా ఆయన మహేష్ తల్లిగారైన ఇందిరాదేవి మరణం గురించి స్పందించారు. కృష్ణ ఫ్యామిలీతో ఆయన అనుబంధం ఈనాటిది కాదన్నారు.

Paruchuri Gopala Krishna- Mahesh Babu
Paruchuri Gopala Krishna- Mahesh Babu

దశాబ్దాలుగా కృష్ణ గారి కుటుంబంతో మా కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. కృష్ణ, ఆదిశేషగిరిరావు, రమేష్ బాబు, మహేష్ లతో నాకు సాన్నిహిత్యం ఉంది. తరచుగా మా కుటుంబాలు కలుసుకుంటూ ఉండేది. నేను ఇందిరాదేవి గారి చివరి చూపుకు నోచుకోలేకపోయాను, ఆమె కన్నుమూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అందుకే ఇందిరాదేవి దశదిన కర్మకు హాజరయ్యాను. ఆరోజు మహేష్ ని చూస్తే చాలా బాధేసింది. ఆయన ముఖంలో చిరునవ్వు లేదు. ఏకాదశ రోజు ఆయన్ని అలా చూడటం బాధేసింది.

తల్లి ఇందిరా దేవి మరణం మహేష్ ని బాగా కృంగదీసినట్లు తెలుస్తుంది. మహేష్ డల్ గా కనిపించారు. కోపంతో ఉన్నా, బాధతో ఉన్నా మహేష్ ముఖంపై చిరునవ్వు చెరగదు. కానీ తల్లి మరణం తర్వాత మహేష్ లో అది కనిపించలేదు. ఇందిరాదేవి లేరన్న వార్త మహేష్ సంతోషాన్ని, చిరునవ్వును దూరం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. పరుచూరి మాటలు మహేష్ మానసికంగా ఎంత ఆవేదన చెందుతున్నాడో తెలియజేసింది.

Paruchuri Gopala Krishna- Mahesh Babu
Paruchuri Gopala Krishna

సెప్టెంబర్ 28వ తేదీన ఇందిరాదేవి అనారోగ్యంతో మరణించారు. కొన్నాళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో మహేష్ తల్లి ఇందిరాదేవి చేతి కాపీ నాకు ప్రసాదంతో సమానం అన్నారు. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో తల్లి వద్దకు వెళ్లి ఆమెతో కాపీ పెట్టించుకు తాగుతాను. నాకు అదొక సెంటిమెంట్. ఆ విధంగా ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటానని చెప్పారు. తల్లి మరణం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేష్ త్వరలో త్రివిక్రమ్ మూవీ సెకండ్ షెడ్యూల్ షూట్ లో పాల్గొననున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular