Sai Dharam Tej: మెగాస్టార్ మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే ఓ బైక్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్స్ దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డారు సాయిధరమ్. దీంతో తేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి.. పెను ప్రమాదం నుంచి తప్పించారు. నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్.. ఇటీవలే దీపావళి రోజు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో నుండే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, మెల్లగా కోలుకుంటున్న తరుణంలో మళ్లీ షూటింగ్ల్లో బజీ అవ్వాలని అనుకున్నాడేమో ఏమో కానీ.. ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తీసేందుకు తేజ్ ఒప్పుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. యాక్సిరెండ్ తర్వాత తేజ్ చాలా సన్నబడ్డారట. ఇటీవలే మెగాహీరోస్తో కలిసి తీసుకున్న ఫొటోలోనూ తేజ్ అలానే కనిపిస్తున్నారు.
చిరు మేనల్లుడిగా వెండితెరపై అడుగుపెట్టి.. పిల్లా నువ్వులేని జివితం సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన రిపబ్లిక్ సినిమాకు బాస్కాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. అయితే, కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో రాబట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమాకు దేవకట్ట దర్శకత్వం వహించారు. కాగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ జనవరి తొలివారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.