Pranitha Subhash Seemantham: ఈ మధ్య హీరోయిన్లు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. అలాగే తల్లిగా మారుతున్నారు. పైగా పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాబు బొమ్మ ప్రణీత సుభాష్ కూడా పెళ్లి చేసుకుంది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. కాగా తాజాగా తన సీమంతాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది.
Pranitha Subhash Seemantham
హోమ్లీ హీరోయిన్ ప్రణీత సుభాష్ కి అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికీ మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు. చాలా కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రణీత. గత ఏడాది పెళ్లి కూడా చేసుకొంది ఈ హోమ్లీ బ్యూటీ. అయితే.. తాజాగా సీమంతం ఫోటోలతో ప్రణీత వార్తల్లో నిలిచింది.
Also Read: Ravela Kishore Babu: బీజేపీకి రావెల గుడ్ బై.. అసలు కథేంటి?
ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. గత కొంత కాలంగా ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్న ప్రణీత.. మొత్తానికి తల్లిగా ప్రమోట్ అవ్వబోతుంది. ఇక టాలీవుడ్ లోకి ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ ఆమె సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం కాకపోవడం కారణంగా ఆమెకు పెద్దగా పెద్ద సినిమాలు రాలేదు.
Pranitha Subhash Seemantham
పవన్ కళ్యాణ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆ సినిమా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత కూడా ప్రణీత చాలా చిత్రాల్లో నటించింది. కానీ.. ఏ చిత్రం ప్రణీత కెరీర్ ను టర్న్ చేయలేకపోయింది. ఎలాగూ సినీ కెరీర్ బాగాలేదు కాబట్టే.. ఆమె నితిన్ రాజును పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
ప్రణీత పెళ్లి ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత.. సీమంతం విషయాన్ని చెప్పింది. పసుపు పచ్చని చీరలో ప్రణీత సుభాష్ మెరిసిపోతుంది.
Also Read:Vijay Devarakonda- Samantha: నిజంగానే విజయ్ దేవరకొండ – సమంత ఆకట్టుకున్నారు !
Recommended Videos: