Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Hari Hara Veera Mallu: పవన్.. హరిహరవీరమల్లు.. ఓ కోహినూర్.. చరిత్ర ఇదీ!

Pawan Kalyan Hari Hara Veera Mallu: పవన్.. హరిహరవీరమల్లు.. ఓ కోహినూర్.. చరిత్ర ఇదీ!

Pawan Kalyan Hari Hara Veera Mallu: మరికొద్ది గంటల్లో మన ముందుకు పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం రాబోతుంది. ఈ సినిమా కథ మొత్తం కోహినూర్ వజ్రం(Kohinoor Diamond) చుట్టూ తిరుగుతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమా టైటిల్ లోగో లోనే కోహినూర్ వజ్రం ఉంటుంది. అయితే అసలు ఈ కోహినూర్ వజ్రం ప్రస్థానం ఏమిటి?, అసలు ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఈ అంశాలన్నీ సినిమాలో చూపిస్తారో లేదో తెలియదు కానీ, అసలు ఈ కోహినూర్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ వజ్రం మన తెలుగు నేల మీద దొరికినదే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న చారిత్రాత్మక కొల్లూరు గనుల్లో ఈ వజ్రం, కాకతీయ సామ్రాజ్య పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. అక్కడి నుండి అనేక రాజ్యాలు దాటుతూ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ని తనలో దాచుకుంది.

Also Read:  పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ ఊహించని షాక్.. ఇక వీరమల్లు కష్టమే!

ఇక ఈ వజ్రం కోసం అప్పట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. కాకతీయులపై దండయాత్ర చేసి వారి పై విజయం సాధించిన ఢిల్లీ సుల్తానేట్ మాలిక్ కాఫోర్ ఈ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి చెందిన సాజాహాన్ దీనిని తన నెమలి సింహాసనం పై అలంకరించాడు. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ లో మనం ఈ నెమలి సింహాసనాన్ని చూడొచ్చు. ఇక ఆ తర్వాత 18 వ శతాబ్దం లో పర్షియా రాజ్య పాలకుడు నాదిర్ షా ఢిల్లీ మొఘల్ సామ్రాజ్య పాలకులపై దండయాత్ర చేసి ఈ కోహినూర్ వజ్రాన్ని తన కైవసం చేసుకున్నాడు. ఈ వజ్రం నుండి వస్తున్న కాంతిని చూసి నాదిర్ షా దీనికి కోహినూర్ అనే నామకరణం చేశాడు. ఇక ఆ తర్వాత ఈ కోహినూర్ వజ్రం సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మహారాజ రంజిత్ సింగ్ చేతుల్లోకి వచ్చింది. ఆయన ఈ వజ్రాన్ని మన భారత దేశానికీ తీసుకొచ్చాడు.

Also Read: ఏఎన్నార్ కి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?

ఇక ఆ తర్వాత 1849 వ సంవత్సరం లో ఆంగ్లో, సిక్కు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సిక్కు సామ్రాజ్యం దారుణంగా ఓడిపోయింది. దీంతో బ్రిటీష్ వారు అప్పట్లో పదేళ్ల వయస్సున్న దులీప్ సింగ్ తో ‘లాహోర్ ఒప్పందం’ చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రాన్ని బ్రిటీష్ సామ్రాజ్య మహారాణి విక్టోరియా కు అప్పగించాల్సి వచ్చింది. అప్పటి నుండి ఈ వజ్రం రాణి కిరీటాన్ని అలంకరిస్తూ వచ్చింది అని అందరు అంటూ ఉంటారు. ప్రస్తుతం ఇది లండన్ మ్యూజియం లో కొలువై ఉన్నది. అయితే ఇది ఒప్పందం ప్రకారం ఇచ్చింది కాదని, బ్రిటీష్ వారు దౌర్జన్యం చేసి బలవంతంగా వాళ్ళ దేశానికీ ఈ అమూల్యమైన వజ్రాన్ని పట్టుకొని వెళ్లారని మన చరిత్రకారులు అంటూ ఉంటారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version