spot_img
Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: రాధేశ్యామ్ కు చివరి నిమిషంలో గుడ్ న్యూస్

Radhe Shyam: రాధేశ్యామ్ కు చివరి నిమిషంలో గుడ్ న్యూస్

Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదల కాబోతోంది. దీనిపై అందరికి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడేళ్ల క్రితం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో అభిమానులను పలకరించనున్నాడు. దీంతో సినిమా కోసం అభిమానులు వేచి ఉన్నారు. బాహుబలితో క్రేజీ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాలో ఏమేరకు ఆకట్టుకోనున్నాడో చూడాల్సిందే. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. దాదాపు ఏడు వేల థియేటర్లలో రాధేశ్యామ్ ఆడనుంది.

Radhe Shyam
Radhe Shyam

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులో కృష్ణంరాజు, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ తదితరులు నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. దీంతో రాధేశ్యామ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమాకు ధరలు తగ్గించిన ప్రభుత్వం రాధేశ్యామ్ కు మాత్రం పెంచుకునే అవకాశం ఇవ్వడం గమనార్హం.

Also Read:  ‘రాదేశ్యామ్’ పై రాజమౌళి రివ్యూ ఇదే

వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని గతంలో చెప్పిన విధంగానే జగన్ ప్రభుత్వం ఈ మేరకు రాధేశ్యామ్ కు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో రాధేశ్యామ్ సినిమా గట్టెక్కనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల ధరల విషయంలో చివరి క్షణంలో సినిమా పరిశ్రమకు అనుగుణంగానే జీవో జారీ చేసింది. ఐదో ఆటకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. దీంతో రాధేశ్యామ్ కు అన్ని శుభ పరిణామాలే అని తెలుస్తోంది.

Radhe Shyam
Radhe Shyam

తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ఆఫర్లతో రాధేశ్యామ్ సినిమా విజయవంతంగా ప్రదర్శించేందుకు అవకాశం ఏర్పడింది. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ కు మాత్రం ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. పవన్ కల్యాణ్ పై ఉన్న కోపంతోనే జగన్ ఇలా చేశారనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ రాధేశ్యామ్ కు మాత్రం అన్ని మార్గాలు సుగమం కావడంతో ఇక ప్రభాస్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: ‘రాధేశ్యామ్’ పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper