spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagarjuna Mass Movie: నాగార్జున మాస్ సినిమా గురించి మీకు ఈ విషయాలు తెలుసా..

Nagarjuna Mass Movie: నాగార్జున మాస్ సినిమా గురించి మీకు ఈ విషయాలు తెలుసా..

Nagarjuna Mass Movie: అక్కినేని వారసుడిగా వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్‌గా వెలుగొందుతున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున. కెరీర్ కొత్తలో క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. వరుస హిట్లతో అక్కినేని వారసుడిగా, స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అతని తరం హీరోలకు పోటీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే ప్రతి మనిషి జీవితంలో గెలుపు ఉన్నట్టే ఓటమి కూడా ఉంటుంది. మరి నాగార్జున జీవితంలో కూడా ఓటమి లేకపోలేదు. తన జీవితాన్ని డౌన్‌ట్రెండ్‌లో చూడక తప్పలేదు.

Nagarjuna Mass Movie
Nagarjuna Mass Movie

అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జున 2000వ సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలను విడుదల చేశాడు. అందులో నిన్నే ప్రేమిస్తా, అధిపతిలాంటి గెస్ట్ అప్పియరెన్స్ సినిమాలు హిట్ సాధించగా, తరువాత వచ్చిన నువ్వు వస్తావని సినిమా కూడా హిట్ సాధించింది. అయితే ఆ తరువాత వచ్చిన ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, ఆకాశ వీధుల్లో, స్నేహమంటే ఇదేరా సినిమాలు వరుసగా ఘోరమైన అపజయాలు మూటగట్టుకున్నాయి. తరువాత వెంటవెంటనే సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను సినిమాలతో సక్సెస్ బాట పట్టాడు.

Nagarjuna Mass Movie
Nagarjuna

అప్పుడప్పుడే కుదుటపడుతున్న తన మార్కెట్‌ను కాపాడుకోవడానికి నాగార్జున సినిమాల విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో రాఘవ లారెన్స్ తన దగ్గర కథ ఉందని, తాను డైరెక్టర్ కావాలని అనుకుంటున్నానని చెప్పడంతో కథ చెప్పమని అడిగాడు నాగ్. దీంతో కథ చెప్పడం మొదలు పెట్టాడు రాఘవ. సినిమా ఎలా తీయాలని అనుకుంటున్నాడో కళ్ళకు కట్టినట్టు వివరించాడు. దీంతో రాఘవ కథను మెచ్చిన నాగ్.. అక్కడిక్కడే తన సొంత నిర్మాణ సంస్థలో రాఘవతో తన తరువాతి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.

Also Read: తెలుగు తెర పై అత్యంత దారుణమైన విలన్ ఆయనే !

ఈ సినిమాకు మ్యూజిక్ దేవి ప్రసాద్‌ను తీసుకున్నారు. మాటల రచయితగా పరుచూరి బ్రదర్స్‌ను తీసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న శ్యామ్ కే నాయుడుని కెమెరామెన్‌గా, ఛార్మి, జ్యోతికలకు హీరోయిన్లుగా, సునీల్, వేణుమాధవ్ లాంటి కామిడీయనట్లు తీసుకొని సినిమా మొదలు పెట్టారు. అంతా అనుకున్నట్టు సినిమా పూర్తి చేశారు. ఆ సినిమాకు ‘మాస్’ అని టైటిల్ పెట్టారు. కట్ చేస్తే సినిమా రిలీజ్, అసలే మాస్ అని టైటిల్ పెట్టడంతో ఎలా ఉంటుందో అన్న ఆతృతతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ టాక్‌తో బయటికి వచ్చారు. దీంతో రాఘవలోని దర్శకుడికి మంచి మార్కులు పడడంతో పాటు, నాగార్జున నిర్మాతగానూ, హీరోగానూ మంచి విజయాలు అందుకున్నాడు. కాగా ఆరు పదుల వయసులోనూ నాగార్జున తన మార్కెట్ తగ్గిపోకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమాను విడుదల చేసి హిట్ అందుకున్నాడు నాగార్జున.

Also Read: హీరోలందు పవన్ కళ్యాణ్ వేరయా !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper